బడి.. నిర్వహణ కొరవడి
నాడు-నేడుతో పాఠశాలల రూపురేఖలు మార్చేశాం అని గొప్పలు చెబుతున్న సర్కారు బడిలో సుద్దముక్కలకి కూడా సొమ్ములు ఇవ్వడం లేదు.
రెండేళ్లుగా నిధులు ఎరగని పాఠశాలలు
సుద్దముక్కలకు సొమ్ముల్లేవు.. కుట్టు ఛార్జీలకు కాసుల్లేవు!
ఈనాడు, అనకాపల్లి, న్యూస్టుడే, నక్కపల్లి
నాడు-నేడుతో పాఠశాలల రూపురేఖలు మార్చేశాం అని గొప్పలు చెబుతున్న సర్కారు బడిలో సుద్దముక్కలకి కూడా సొమ్ములు ఇవ్వడం లేదు. రెండేళ్లుగా స్కూల్ గ్రాంట్లు విడుదల చేయనేలేదు. ప్రధానోపాధ్యాయులే పాఠశాల నిర్వహణ ఖర్చులు భరించాల్సి వస్తోంది. మరోవైపు విద్యా కానుకగా ఏకరూప దుస్తుల (యూనిఫాం) వస్త్రాన్ని ఇస్తున్నా వాటి కుట్టు ఛార్జీలు మాత్రం చెల్లించడం లేదు. రెండేళ్లుగా ఈ డబ్బులు తల్లుల ఖాతాలకు చేరడం లేదు. వారికిచ్చే అరకొర సొమ్ములను అందివ్వడంలో తీవ్ర జాప్యం చేస్తున్నారు. నాడు-నేడు పేరుతో రూ.వందల కోట్లు ఖర్చుచేస్తున్నా పాఠశాలల్లో కనీస అవసరాలకు పైసలు విదల్చకుండా మీనమేషాలు లెక్కిస్తున్నారు.
ఉమ్మడి జిల్లాలో 3.23 లక్షల మంది విద్యార్థులు చదువుతున్నారు. గతంలో తరగతుల వారీగా విద్యార్థులకు కుట్టించి ఇచ్చేవారు. గత నాలుగేళ్లుగా పిల్లల తల్లిదండ్రులకు ఏకరూప దుస్తులకు అవసరమైన వస్త్రాన్ని అందజేస్తున్నారు. ఇదివరకు రెండు జతలు ఇస్తే ఇప్పుడు ఒక్కో విద్యార్థికి మూడు జతల వస్త్రాన్ని ఇస్తున్నారు. అయితే వారిచ్చే వస్త్రం రెండు జతలకే సరిపోతోంది.
కుట్టుకూలి ఛార్జీలుగా ఒకటి నుంచి ఎనిమిది తరగతుల ఒక్కో జతకు రూ.40 చొప్పున రూ.120 ఇవ్వాలి. తొమ్మిది, పది విద్యార్థులకు రూ.80 చొప్పున మూడు జతలకు రూ.240 తల్లుల ఖాతాల్లో జమచేయాలి. వరుసగా రెండో విద్యా సంవత్సరం ముగుస్తున్నా ఒక్క విద్యార్థి తల్లి ఖాతాలోనూ కుట్టు ఛార్జీలు జమకాలేదు.
విద్యార్థులకు ఇచ్చిన వస్త్రం
రూ.8.84 కోట్లు బకాయిలు..
ఉమ్మడి జిల్లాలో 3,23,341 మందికి జగనన్న విద్యా కానుక కిట్లు అందించారు. వీరిలో 2,77,573 మంది ఒకటి నుంచి ఎనిమిది తరగతులు విద్యార్థులున్నారు. వీరికి రూ.120 చొప్పున రూ.3.33 కోట్లు విద్యార్థుల తల్లుల ఖాతాల్లో జమచేయాలి. అలాగే తొమ్మిది, పది విద్యార్థులు 45,768 మంది ఉన్నారు. వీరికి రూ.240 చొప్పున రూ.1.09 కోట్లు సాయం అందాలి. మొత్తంగా రూ.4.42 కోట్ల నిధులు కుట్టు ఛార్జీలు రూపంలో ఉమ్మడి జిల్లాకు ఇవ్వాలి. గతేడాదికి సంబంధించిన నిధులు విడుదల చేసినట్లే చేసి మరలా వెనక్కి తీసుకున్నారు. ఆ సొమ్ములు ఇప్పటి వరకు ఇవ్వలేదు. ఈ ఏడాది ఇవ్వాల్సిన నిధులు కలిపి లెక్కిస్తే రూ.9 కోట్లకు పైగా బకాయిలు విద్యార్థుల తల్లిదండ్రులకు అందాల్సి ఉంది. ప్రభుత్వం ఇచ్చేది తక్కువ మొత్తమే అయినా కుట్టు ఛార్జీల్లో కొంతవరకైనా ఖర్చులు కలిసి వస్తాయని లబ్ధిదారులు ఆశిస్తున్నారు.
భారం పెరిగిపోయింది..
నాడు-నేడు తర్వాత తరగతి గదుల నిర్వహణ పెరిగింది. స్మార్ట్ టీవీలు, ఐఎఫ్టీ ప్యానళ్లు, ఆర్వోప్లాంట్, మరుగుదొడ్లకు నీటి వసతి కోసం విద్యుత్తు ఎక్కువగా వినియోగించాల్సి వస్తోంది. గతంలో రూ.వందల్లో బిల్లులు వస్తే ఇప్పడవి రూ.వేలల్లోకి చేరిపోయాయి. వీటిని ప్రభుత్వం చెల్లిస్తుందని చెప్పినా డిమాండ్ నోటీసులు పాఠశాలలకు పంపిస్తున్నారు. మిగతా బోధనకు అవసరమైన సామగ్రి, గ్రంథాలయం, ప్రయోగశాలలు, స్టేషనరీ, పరీక్షల ఖర్చులని నెలకు కనీసం రూ.3 వేల వరకు ప్రధానోపాధ్యాయుడి చేతి డబ్బులు పెట్టాల్సి వస్తోంది. విద్యార్థుల సంఖË్య ఆధారంగా రూ.10 వేల నుంచి రూ. లక్ష వరకు ఇవ్వాలి. గతేడాది గ్రాంట్లు ఇప్పటికీ విడుదల కాలేదు. ఎన్నికల కోడ్ ఉండడంతో ఇప్పట్లో గ్రాంట్లు విడుదల చేసే అవకాశం లేదని గురువులు గగ్గోలు పెడుతున్నారు.
ఒక్క ఏడాది కూడా..: మూడేళ్లగా పిల్లలిద్దరూ ప్రభుత్వ బడిలోనే చదువుతున్నారు. యూనిఫాం ఇచ్చినప్పుడు కుట్టుకూలి ఇస్తారని చెప్పారు. ఒక్కో జతకు బయట రూ. 400లు చెల్లించాం. ఇప్పటికి మూడేళ్లు కావస్తోంది, ఒక్కసారీ కుట్టుకూలి రాలేదు. బకాయిలన్నీ కలిపి వస్తే ఎంతో కొంత మేలు జరిగేది.
బి.సూర్యకుమారి
ఎప్పుడిచ్చేది చెప్పడం లేదు..: పాఠశాలలో ముగ్గురు పిల్లలకు వస్త్రం ఇచ్చినప్పుడు జతకు రూ. 40లు చొప్పున ప్రభుత్వం చెల్లింస్తుందన్నారు. మా ముగ్గురు పిల్లలకు దుస్తుల నిమిత్తం చాలా ఖర్చయ్యింది. ఖాతాలోకి పైసా రాలేదు. ఎప్పుడిస్తారో లేదో తెలియడం లేదు.
వి.మణి
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఎన్నికల వేళ...‘కూపన్ల’ ఎర..!
[ 27-04-2024]
ప్రజాదరణ కోల్పోయిన అధికార పార్టీ అభ్యర్థుల ఎన్నికల ప్రచారాలు, ర్యాలీలు జనం లేక వెలవెలబోతున్నాయి. -
పింఛనుదారులకు జగన్ వంచన
[ 27-04-2024]
మలివయసులో కృష్ణా, రామా అనుకుంటూ ప్రశాంతంగా గడపాల్సిన పింఛన్దారులకు హక్కుగా రావాల్సిన భత్యాలతోపాటు పెన్షన్ సొమ్ములూ సకాలంలో ఇవ్వకుండా ముప్పతిప్పలు పెడుతున్నారు. -
అరకులోయ వైకాపాలో వర్గపోరు
[ 27-04-2024]
అరకులోయ నియోజకవర్గ వైకాపాను వర్గపోరు వెంటాడుతోంది. క్యాడర్ను అభ్యర్థి సమన్వయం చేసుకోవడం లేదు. -
పరిశోధనల సిరికి జగన్ ఉరి
[ 27-04-2024]
వ్యవసాయ శాస్త్రవేత్తలు ఎన్నో పరిశోధనలు చేస్తూ ఉంటారు. వాటిలో కొన్ని విజయవంతం అవుతుంటాయి. అవి రైతుల దరికి చేరితే తక్కువ ఖర్చుతో అధిక దిగుబడులు సాధించడం వీలవుతుంది. -
కలిసికట్టుగా కూటమిని గెలిపించండి
[ 27-04-2024]
వైకాపాకు ఓటుతో బుద్ధి చెప్పి రాష్ట్రం నుంచి పారదోలుదామని పాడేరు అసెంబ్లీ నియోజకవర్గం కూటమి అభ్యర్థి గిడ్డి ఈశ్వరి పిలుపునిచ్చారు. -
కళ్ల ముందే దుంగలు..ఎవరు దొంగలు?
[ 27-04-2024]
ఏజెన్సీ ప్రాంతంలో అటవీ సిబ్బంది అండదండలతో విలువైన టేకు, మారుజాతి దుంగలను అక్రమార్కులు తరలించుకుపోతున్నారు. -
జిల్లాలో 63 నామినేషన్లకు ఆమోదం
[ 27-04-2024]
అల్లూరి జిల్లాలో 68 మంది అభ్యర్థులు 103 నామినేషన్లు దాఖలు చేశారు. -
జనావాసాల్లో ఆసుపత్రి వ్యర్థాలు
[ 27-04-2024]
ప్రతిపక్ష కౌన్సిలర్లు ప్రాతినిధ్యం వహిస్తున్న వార్డుల అభివృద్ధికి నిధుల కేటాయింపులో పుర పాలకవర్గం వివక్ష చూపుతోంది. -
రెండు కిలోమీటర్ల రోడ్డు.. వంద గుంతలు
[ 27-04-2024]
పర్యటక పాంతం, ప్రముఖ పుణ్యక్షేత్రమైన రంప గ్రామానికి రోడ్డు వేయాలని అయిదేళ్లగా అధికారులకు, ప్రజాప్రతినిధులకు గిరిజనులు మొరపెట్టుకొన్నారు. -
వైకాపా రాక్షస పాలనకు చరమగీతం పాడాలి
[ 27-04-2024]
ప్రజలు తమ విలువైన ఓటుతో వైకాపా రాక్షస పాలనకు చరమగీతం పాడాలని సినీనటుడు హైపర్ ఆది పిలుపునిచ్చారు. -
నేడు వైఎస్ షర్మిల పర్యటన
[ 27-04-2024]
పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల శనివారం జిల్లాలో పర్యటించనున్నారు. -
శ్రీకాకుళం రోడ్- తిరుపతి ప్రత్యేక రైళ్లు
[ 27-04-2024]
వేసవిలో ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని పలు ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు వాల్తేరు సీనియర్ డీసీఎం కె.సందీప్ తెలిపారు. -
‘విశాఖ- మలేసియా’ విమాన సర్వీసు ప్రారంభం
[ 27-04-2024]
విమాన ప్రయాణికులకు మెరుగైన సేవలు అందిస్తామని విమానాశ్రయం డైరెక్టర్ ఎస్.రాజారెడ్డి తెలిపారు.
తాజా వార్తలు (Latest News)
-
హాలీవుడ్కు వెళ్లాక భయపడ్డా.. ఆ భావన మనసును కుంగదీసింది: ప్రియాంక చోప్రా
-
ఆర్చరీ వరల్డ్ కప్లో అదరగొట్టిన భారత్.. మూడు స్వర్ణాలు కైవసం
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
ఐదు రోజులుగా టీవీ నటుడు మిస్సింగ్.. కిడ్నాప్ అనుమానాలు..!
-
ఓటీటీలోకి ‘మంజుమ్మల్ బాయ్స్’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే
-
ఆ సమయంలో 32 కిలోల బరువు పెరిగాను: సోనమ్ కపూర్