కూటమి కూర్పులో స్వల్ప మార్పు
సార్వత్రిక ఎన్నికల బరిలో నిలిపే అభ్యర్థుల విషయంలో అధికార, విపక్ష పార్టీలు ఎత్తుకు పైఎత్తులు వేస్తున్నాయి.
అరకులోయ అసెంబ్లీ కమలానికి..
పాడేరులో మళ్లీ సైకిల్ పరుగులు
ఈనాడు, పాడేరు, న్యూస్టుడే, అరకులోయ, పాడేరు
సార్వత్రిక ఎన్నికల బరిలో నిలిపే అభ్యర్థుల విషయంలో అధికార, విపక్ష పార్టీలు ఎత్తుకు పైఎత్తులు వేస్తున్నాయి. సామాజిక సమీకరణాలు, పొత్తుల్లో భాగంగా కొన్ని స్థానాల్లో ముందుగా ప్రకటించిన అభ్యర్థులను ఇరుపార్టీలు మార్చుతున్నాయి. అధికార వైకాపా అరకులోయ అసెంబ్లీకి సమన్వయకర్తగా ముందు ఎంపీ గొడ్డేెటి మాధవిని ప్రకటించింది. తర్వాత హుకుంపేట జడ్పీటీసీ సభ్యుడు రేగం మత్స్యలింగాన్ని నియమించింది. ఆయనకే టికెట్ ఇస్తామని ప్రకటించింది. తాజాగా తెదేపా కూడా అనూహ్యంగా అరకులోయ అభ్యర్థిని మార్చింది. ముందు తెదేపా నుంచి సియ్యారి దొన్నుదొరను బరిలో నిలుపుతున్నట్లు ప్రకటించింది. తర్వాత తెదేపా, జనసేన, భాజపా కూటమి సీట్ల సర్దుబాటులో మార్పులు చేర్పులు చోటుచేసుకుంటున్నాయి. దీంతో అరకులోయ స్థానం నుంచి భాజపా అభ్యర్థి పాంగి రాజారావును పోటీలో దించుతున్నామని ప్రకటించింది.
ఈ మేరకు భాజపా జాతీయ నాయకులు బుధవారం దిల్లీలో ప్రకటన విడుదల చేశారు. ముందు పాడేరు స్థానాన్ని భాజపాకు కేటాయించినట్లు ప్రచారం జరిగింది. ఆ పార్టీ నేతలు అరకులోయే కావాలని డిమాండ్ చేశారు. దీంతో ఈమేరకు మార్పు చేయాల్సి వచ్చింది. ఇన్నాళ్లూ దొన్నుదొర తెదేపా శ్రేణులను ముందుకు నడిపించినా దివంగత ఎమ్మెల్యే సోమా కుమారుడు, ఎస్టీ కమిషన్ మాజీ సభ్యుడు సివేరి అబ్రహం అసమ్మతి స్వరం వినిస్తున్నారు. తాజాగా రాజారావును రంగంలోకి దించుతామని ప్రకటించడం, ఆయన కూడా మన్యంలో బలమైన నేత కావడంతో కూటమి మద్దతుతో విజయం సాధించగలరని విశ్వాసం ఆయన వర్గీయుల్లో వ్యక్తమవుతోంది.
ఉపాధ్యాయునిగా.. గిరిజన సంఘం నేతగా..
పాంగి రాజారావు ప్రభుత్వ ఉపాధ్యాయునిగా పనిచేసిన సమయంలో జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారం అందుకున్నారు. తెదేపా ప్రభుత్వ హయాంలో దళిత రత్న (రాష్ట్ర స్థాయి) అవార్డు కూడా దక్కించుకున్నారు. విద్యార్థి దశ నుంచి ఉద్యోగం వచ్చేవరకు గిరిజన విద్యార్థి సంఘం (జీఎస్యూ)లో కీలక పాత్ర పోషించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అన్ని గిరిజన సంఘాలతో కలిసి పనిచేసిన నేపథ్యం ఉంది. 1997-1998 వరకు జీఎస్యూ అధ్యక్షుడిగా పనిచేసిన అనుభవం ఉంది. ఉపాధ్యాయుడిగా ఉంటూ గిరిజన ఉద్యోగుల సంఘంలో కీలకంగా ఎదిగి ఆ సంఘానికి అధ్యక్షునిగానూ పనిచేశారు. 2008లో ఉపాధ్యాయ ఉద్యోగానికి రాజీనామా చేసి ప్రత్యక్ష రాజకీయాల్లోకి ప్రవేశించారు. అదే క్రమంలో 2009లో బీఎస్పీ నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసి 13,302 ఓట్లు సాధించారు.
భాజపా నేత బయోడేటా
- పేరు: పాంగి రాజారావు
- విద్యార్హతలు: ఎంఏ (హిందీ)
- వయసు: 50 సంవత్సరాలు
- స్వస్థలం : లకేపుట్టు గ్రామం, సీతగుంట పంచాయతీ, పెదబయలు మండలం
- కులం/ ఉపకులం: ఎస్టీ (కొండదొరŸ)
- వృత్తి : హిందీ ఉపాధ్యాయులు (రాజకీయాల్లోకి రాకముందు)
2019లో రాజారావునుజనసేన అధ్యక్షులు అరకు ఎంపీగా పోటీ చేయాలని కోరారు. కొన్ని కారణాల వల్ల నిరాకరించి స్వతంత్ర అభ్యర్థిగా అరకులోయ అసెంబ్లీకి పోటీ చేశారు. 10,875 ఓట్లు సాధించారు. 2020లో భారతీయ జనతా పార్టీలో చేరి అతి తక్కువ సమయంలో జిల్లా అధ్యక్ష బాధ్యతలు చేపట్టారు.
అభ్యర్థి ఎవరైనా గెలిచి చూపిస్తాం..
తెలుగుదేశం పార్టీ రెండు విడతల్లో మెజారిటీ అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించేసింది. ఏజెన్సీలో పాడేరు స్థానాన్ని భాజపాకి కేటాయించినట్లు ప్రచారం జరిగింది. ఆ మేరకు అక్కడ అభ్యర్థిని కూడా ఇప్పటి వరకు ప్రకటించలేదు. దీంతో భాజపానే బరిలోకి దిగుతుందని భావించారు. తెదేపా నుంచి టికెట్ ఆశించిన గిడ్డి ఈశ్వరి, ఆమె మద్దతుదారులు భాజపాకి కేటాయించొద్దని ర్యాలీలు చేశారు. అనూహ్యంగా భాజపానే పాడేరుకు బదులు అరకులోయనే కోరుకోవడంతో పాడేరు తెదేపా శ్రేణులు ఊపిరి పీల్చుకున్నాయి. నిన్న మొన్నటి వరకు సైలెంట్గా ఉన్న పార్టీ నేతలంతా ఒక్కసారిగా ఆనందంలో మునిగిపోయారు. అభ్యర్థి ఎవరైనా సరే తెదేపా నుంచి బరిలోకి దిగి గెలిచి చూపిస్తామంటున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఎన్నికల వేళ...‘కూపన్ల’ ఎర..!
[ 27-04-2024]
ప్రజాదరణ కోల్పోయిన అధికార పార్టీ అభ్యర్థుల ఎన్నికల ప్రచారాలు, ర్యాలీలు జనం లేక వెలవెలబోతున్నాయి. -
పింఛనుదారులకు జగన్ వంచన
[ 27-04-2024]
మలివయసులో కృష్ణా, రామా అనుకుంటూ ప్రశాంతంగా గడపాల్సిన పింఛన్దారులకు హక్కుగా రావాల్సిన భత్యాలతోపాటు పెన్షన్ సొమ్ములూ సకాలంలో ఇవ్వకుండా ముప్పతిప్పలు పెడుతున్నారు. -
అరకులోయ వైకాపాలో వర్గపోరు
[ 27-04-2024]
అరకులోయ నియోజకవర్గ వైకాపాను వర్గపోరు వెంటాడుతోంది. క్యాడర్ను అభ్యర్థి సమన్వయం చేసుకోవడం లేదు. -
పరిశోధనల సిరికి జగన్ ఉరి
[ 27-04-2024]
వ్యవసాయ శాస్త్రవేత్తలు ఎన్నో పరిశోధనలు చేస్తూ ఉంటారు. వాటిలో కొన్ని విజయవంతం అవుతుంటాయి. అవి రైతుల దరికి చేరితే తక్కువ ఖర్చుతో అధిక దిగుబడులు సాధించడం వీలవుతుంది. -
కలిసికట్టుగా కూటమిని గెలిపించండి
[ 27-04-2024]
వైకాపాకు ఓటుతో బుద్ధి చెప్పి రాష్ట్రం నుంచి పారదోలుదామని పాడేరు అసెంబ్లీ నియోజకవర్గం కూటమి అభ్యర్థి గిడ్డి ఈశ్వరి పిలుపునిచ్చారు. -
కళ్ల ముందే దుంగలు..ఎవరు దొంగలు?
[ 27-04-2024]
ఏజెన్సీ ప్రాంతంలో అటవీ సిబ్బంది అండదండలతో విలువైన టేకు, మారుజాతి దుంగలను అక్రమార్కులు తరలించుకుపోతున్నారు. -
జిల్లాలో 63 నామినేషన్లకు ఆమోదం
[ 27-04-2024]
అల్లూరి జిల్లాలో 68 మంది అభ్యర్థులు 103 నామినేషన్లు దాఖలు చేశారు. -
జనావాసాల్లో ఆసుపత్రి వ్యర్థాలు
[ 27-04-2024]
ప్రతిపక్ష కౌన్సిలర్లు ప్రాతినిధ్యం వహిస్తున్న వార్డుల అభివృద్ధికి నిధుల కేటాయింపులో పుర పాలకవర్గం వివక్ష చూపుతోంది. -
రెండు కిలోమీటర్ల రోడ్డు.. వంద గుంతలు
[ 27-04-2024]
పర్యటక పాంతం, ప్రముఖ పుణ్యక్షేత్రమైన రంప గ్రామానికి రోడ్డు వేయాలని అయిదేళ్లగా అధికారులకు, ప్రజాప్రతినిధులకు గిరిజనులు మొరపెట్టుకొన్నారు. -
వైకాపా రాక్షస పాలనకు చరమగీతం పాడాలి
[ 27-04-2024]
ప్రజలు తమ విలువైన ఓటుతో వైకాపా రాక్షస పాలనకు చరమగీతం పాడాలని సినీనటుడు హైపర్ ఆది పిలుపునిచ్చారు. -
నేడు వైఎస్ షర్మిల పర్యటన
[ 27-04-2024]
పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల శనివారం జిల్లాలో పర్యటించనున్నారు. -
శ్రీకాకుళం రోడ్- తిరుపతి ప్రత్యేక రైళ్లు
[ 27-04-2024]
వేసవిలో ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని పలు ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు వాల్తేరు సీనియర్ డీసీఎం కె.సందీప్ తెలిపారు. -
‘విశాఖ- మలేసియా’ విమాన సర్వీసు ప్రారంభం
[ 27-04-2024]
విమాన ప్రయాణికులకు మెరుగైన సేవలు అందిస్తామని విమానాశ్రయం డైరెక్టర్ ఎస్.రాజారెడ్డి తెలిపారు.
తాజా వార్తలు (Latest News)
-
ఈ 20 ఏళ్లలో నా జుట్టు కూడా మారింది కానీ..: సుందర్ పిచాయ్
-
హాలీవుడ్కు వెళ్లాక భయపడ్డా.. ఆ భావన మనసును కుంగదీసింది: ప్రియాంక చోప్రా
-
ఆర్చరీ వరల్డ్ కప్లో అదరగొట్టిన భారత్.. మూడు స్వర్ణాలు కైవసం
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
ఐదు రోజులుగా టీవీ నటుడు మిస్సింగ్.. కిడ్నాప్ అనుమానాలు..!
-
ఓటీటీలోకి ‘మంజుమ్మల్ బాయ్స్’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే