logo

జగన్‌ పాలనలో రాష్ట్రం సర్వనాశనం

ఒక్క ఛాన్స్‌ అంటూ అధికారంలోకి వచ్చిన జగన్‌ రాష్ట్రాన్ని అన్ని విధాలా సర్వనాశనం చేశారని పాడేరు నియోజకవర్గ కూటమి అభ్యర్థి కిల్లు వెంకట రమేశ్‌నాయుడు ఆరోపించారు.

Published : 16 Apr 2024 02:13 IST

బందపొలంలో కూటమి అభ్యర్థి కిల్లు వెంకట రమేశ్‌నాయుడి ప్రచారం

పాడేరు, న్యూస్‌టుడే: ఒక్క ఛాన్స్‌ అంటూ అధికారంలోకి వచ్చిన జగన్‌ రాష్ట్రాన్ని అన్ని విధాలా సర్వనాశనం చేశారని పాడేరు నియోజకవర్గ కూటమి అభ్యర్థి కిల్లు వెంకట రమేశ్‌నాయుడు ఆరోపించారు. సోమవారం పాడేరు మండలం వనుగపల్లి బందపొలం, మోదపల్లి పంచాయతీ మోదపల్లి గ్రామాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. రానున్న ఎన్నికల్లో తెదేపాను గెలిపించాలని కోరారు. తెదేపాతోనే గిరిజన ప్రాంత అభివృద్ధి సాధ్యమన్నారు. గతంలో ఎన్నికల ముందు కూడా కోడి కత్తి నాటకాలు ఆడారని, ఈసారి మళ్లీ సానుభూతి పొందేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. ప్రజలు ఈసారి నమ్మడానికి సిద్ధంగా లేరన్నారు. వైకాపా పాలనలో విద్యుత్తు, బస్సు ఛార్జీలు, పెట్రోలు, డీజిల్‌, నిత్యావసర సరకులు ధరలు పెంచి ప్రజలను ఇబ్బందులకు గురిచేశారన్నారు. తెదేపా అధికారంలోకి వచ్చిన వెంటనే గిరిజన నిరుద్యోగులకు ప్రత్యేక డీఎస్సీ ప్రకటిస్తామని పేర్కొన్నారు. తెదేపా, జనసేన, భాజపా నాయకులు సల్ల రామకృష్ణ, ఎంపీటీసీ మాజీ సభ్యుడు నర్సింహమూర్తి, ఉల్లి రామారావు తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని