జగన్ పాలనలో పరిశ్రమలు పోయాయ్
ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి పాలనలో ఒక్క పరిశ్రమ రాలేదని, ఉన్నవి పోయాయని సినీ హీరో నారా రోహిత్ ఆరోపించారు. యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు రావాలంటే కూటమి అభ్యర్థులను గెలిపించాలన్నారు.
మాట్లాడుతున్న రోహిత్, పక్కన దాడి రత్నాకర్
అనకాపల్లి, న్యూస్టుడే: ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి పాలనలో ఒక్క పరిశ్రమ రాలేదని, ఉన్నవి పోయాయని సినీ హీరో నారా రోహిత్ ఆరోపించారు. యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు రావాలంటే కూటమి అభ్యర్థులను గెలిపించాలన్నారు. పట్టణంలో శనివారం రాత్రి ఆయన రోడ్ షో నిర్వహించారు. పూడిమడక రహదారి నుంచి ప్రారంభమైన ఈ ప్రదర్శన నాలుగురోడ్లు, వేల్పులవీధి, చింతావారి వీధి, వేగివీధి, అగ్గి మర్రిచెట్టు, దిబ్బవీధి, సంతోషిమాత కోవెల మీదుగా పరమేశ్వరి ఉద్యానం కూడలికి చేరుకుంది. ఇక్కడ నిర్వహించిన సమావేశానికి తెదేపా రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి దాడి రత్నాకర్ అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా రోహిత్ మాట్లాడుతూ వైకాపా పాలనలో అరాచకాలు మినహా ఎక్కడా అభివృద్ధి లేదన్నారు. చంద్రబాబునాయుడుకు పదవులు కొత్త కాదన్నారు. సినిమాలలో ఎంతో బిజీగా ఉన్న పవన్కల్యాణ్ ప్రజల కోసం జనంలోకి వచ్చారన్నారు. పిల్లలకు మంచి భవిష్యత్తు ఉండాలంటే ఎంపీగా సీఎం రమేశ్, ఎమ్మెల్యేగా కొణతాల రామకృష్ణను గెలిపించాలన్నారు. తెదేపా రాష్ట్ర కార్యదర్శి కోట్ని బాలాజీ, పొలిమేర నాయుడు, వైకాపా నాయకులు కాండ్రేగుల శ్రీరామ్, త్రివేణి, కాండ్రేగుల జోగేంద్ర పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నమోదును మించి.. పోలింగుకు పోటెత్తి
[ 18-05-2024]
సార్వత్రిక సమరంలో గతానికి భిన్నంగా ఈసారి ఓటర్లు పోటెత్తారు. ఎప్పుడూ పోలింగ్ బూత్ మొహం ఎరగని వారు కూడా ఈసారి ఓటెత్తారు. ఫలితంగానే రికార్డు స్థాయిలో 83.94 శాతం పోలింగ్ జరిగింది. -
ఓట్ల వేళ.. ఓటి పనులు!!
[ 18-05-2024]
ఎన్నికలకు ముందు ఓటర్లను ప్రభావితం చేసేందుకు వైకాపా ప్రభుత్వం అభివృద్ధి పనుల పేరిట గాలం వేసింది. నాలుగేళ్లుగా పట్టించుకోకుండా ఎన్నికల వేళ హడావుడి అధికార పాలకవర్గం జీవీఎంసీ పరిధిలో పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టింది. -
అక్రమార్కులకు అధికార పార్టీ అండ
[ 18-05-2024]
చీడికాడ మండలంలో గ్రావెల్ అక్రమ తరలింపు పెద్దఎత్తున జరుగుతోంది. అక్రమార్కులకు అధికార పార్టీ అండదండలు పుష్కలంగా ఉండటంతో అధికారులు చూసీచూడనట్లు వదిలేస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. -
సికెల్సెల్ ఎనీమియాతో గిరి యువతి మృతి
[ 18-05-2024]
సికెల్సెల్ ఎనీమియాతో గిరిజన యువతి మృతి చెందింది. బాధితురాలి కుటుంబసభ్యులు అందించిన వివరాల ప్రకారం.. చింతపల్లి మండలం మారుమూల బలపం పంచాయతీ తూరుమామిడి గ్రామానికి చెందిన కోరాబు భూమిక (18) పాడేరు డిగ్రీ కళాశాలలో మొదటి సంవత్సరం పూర్తి చేసింది. -
కర్షకుల కడగండ్లు కనిపించవా ?
[ 18-05-2024]
పెద్దేరు జలాశయం ఆయకట్టు పరిధిలోని రైతులను సాగునీటి కష్టాలు వెంటాడుతున్నాయి. ఆయకట్టు పరిధిలో ఉన్నా సాగునీటికి కటకట తప్పడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. -
కాలనీల్లోనే ఉంటున్నారా?
[ 18-05-2024]
జగనన్న కాలనీల్లో ఇళ్ల నిర్మాణం పూర్తయిన చోట లబ్ధిదారులు నివాసం ఉంటున్నారా లేదా అన్నది ఆరా తీయాలని గృహనిర్మాణ సంస్థ ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలొచ్చాయి. -
వెంకన్న కల్యాణోత్సవాలపై సందిగ్ధం
[ 18-05-2024]
అరకులోయ వేంకటేశ్వరస్వామి కల్యాణోత్సవాల నిర్వహణపై సందిగ్ధం నెలకొంది. ఆలయ, ఉత్సవ కమిటీ నిర్ణయం మేరకు స్వామివారి కల్యాణోత్సవాలు శనివారం నుంచి ఆరంభం కావాల్సి ఉంది.
తాజా వార్తలు (Latest News)
-
టీ20 వరల్డ్ కప్ ఫైనల్లో దాయాదుల పోరు చూడాలనుంది: కైఫ్
-
జగన్ విధానాలపై ప్రశ్నిస్తే.. వేధిస్తారా?: ఎన్ఆర్ఐ వైద్యుడు లోకేశ్
-
హైదరాబాద్లో భారీ వర్షం.. వనస్థలిపురం వద్ద భారీగా వరదనీరు
-
దేవాలయాల్లో లైబ్రరీలు..ఆసక్తికర సూచన చేసిన ఇస్రో ఛైర్మన్
-
50ఎంపీ సెల్ఫీ కెమెరాతో టెక్నో నుంచి రెండు కొత్త మొబైల్స్
-
పుతిన్, జిన్పింగ్ ఆలింగనంపై.. వైట్హౌస్ జోకులు