logo

అనంత బాబు ఆటలు సాగనీయం

వైకాపా ప్రభుత్వంలో ప్రజలు చాలా కష్టాలు పడుతున్నారని రాష్ట్రం బాగుపడాలంటే తెదేపా ప్రభుత్వం రావాల్సిందే అని రంపచోడవరం అసెంబ్లీ కూటమి అభ్యర్థిని మిరియాల శిరీషాదేవి అన్నారు.

Published : 05 May 2024 01:48 IST

కూటమి అభ్యర్థిని శిరీషాదేవి

ఫజుల్లాబాద్‌ వద్ద ఎన్నికల ప్రచారంలో శిరీషాదేవి

దేవీపట్నం, న్యూస్‌టుడే: వైకాపా ప్రభుత్వంలో ప్రజలు చాలా కష్టాలు పడుతున్నారని రాష్ట్రం బాగుపడాలంటే తెదేపా ప్రభుత్వం రావాల్సిందే అని రంపచోడవరం అసెంబ్లీ కూటమి అభ్యర్థిని మిరియాల శిరీషాదేవి అన్నారు. దేవీపట్నం మండలం ఫజుల్లాబాద్‌ నుంచి ఇందుకూరుపేట మీదుగా పోతవరం, దేవారం, శరభవరం వరకు శనివారం ర్యాలీ నిర్వహించారు. ఎన్నికల సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే వంతల రాజేశ్వరి, విశ్వహిందూ ధర్మ పరిరక్షణ రామసేన అధ్యక్షులు కంబాల శ్రీనివాస్‌ ర్యాలీలో పాల్గొన్నారు. శిరీషా మాట్లాడుతూ ఎమ్మెల్సీ అనంత బాబు చేసే అక్రమాలు ఇక్కడి ప్రజలందరికీ తెలుసన్నారు. రాబోయే రోజుల్లో ఆయన ఆటలు సాగనీయమని, వారంతా ఎంత తగ్గి ఉంటే అంత మంచిదని శిరీషాదేవి హెచ్చరించారు. పునరావాస కాలనీల్లో నిర్వాసితుల సమస్యలను తెలుసుకున్నారు.  మరిశెట్ల వెంకటేశ్వరరావు, మట్టా మెహర్‌బాబాగౌడ్‌, మాగాపు బాబూరావు, కారం పోశమ్మ, గోళ్ల చంటిబాబు తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని