మోదీ సభకు సర్వం సిద్ధం
ప్రధాని నరేంద్ర మోదీ విజయభేరి సభకు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. తాళ్లపాలెం సమీపంలోని సభాస్థలి ఏర్పాట్లను కూటమి నాయకులు దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు.
సభా ప్రాంగణాన్ని పరిశీలిస్తున్న మాధవ్, దాడి రత్నాకర్ తదితరులు
కశింకోట, న్యూస్టుడే: ప్రధాని నరేంద్ర మోదీ విజయభేరి సభకు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. తాళ్లపాలెం సమీపంలోని సభాస్థలి ఏర్పాట్లను కూటమి నాయకులు దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. ఆదివారం సభా ప్రాంగణాన్ని బాంబ్ స్క్వాడ్ తనిఖీ చేసింది. సభకు హాజరయ్యే ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా ఎక్కడికక్కడ ఏర్పాట్లు చేస్తున్నారు. నాయకులు, కార్యకర్తలు చేరుకోవడానికి, వాహనాల పార్కింగ్ స్థలాలు సిద్ధమయ్యాయి. పార్లమెంటు అభ్యర్థి సీఎం రమేశ్ ఆధ్వర్యంలో ఏర్పాట్లను భాజపా జాతీయ కార్యవర్గ సభ్యులు పొన్నగంటి అప్పారావు, నాయకులు పర్యవేక్షించారు.
కశింకోట, న్యూస్టుడే: అనకాపల్లి పార్లమెంట్ అభ్యర్థి సీఎం రమేశ్ను బలపరిచేందుకు ప్రధాని మోదీ మన ప్రాంతానికి రావడం గర్వించదగ్గ విషయమని మాజీ ఎమ్మెల్సీ పీవీఎన్ మాధవ్, తెదేపా నేత దాడి రత్నాకర్ అన్నారు. ఆదివారం సాయంత్రం సభాస్థలాన్ని వీరు పరిశీలించిన అనంతరం విలేకరులతో మాట్లాడారు. ఉత్తరాంధ్ర జిల్లాల పార్లమెంట్ అభ్యర్థులు, ఎమ్మెల్యే అభ్యర్థులు హాజరయ్యే కార్యక్రమానికి 7 నియోజకవర్గాల నుంచి జనాలు తరలివస్తారన్నారు. భాజపా జిల్లా అధ్యక్షులు ద్వారపురెడ్డి పరమేశ్వరరావు, పొన్నగంటి అప్పారావు తదితరులు పాల్గొన్నారు.
ట్రాఫిక్ మళ్లింపు
అనకాపల్లి పట్టణం, కశింకోట, న్యూస్టుడే: తాళ్లపాలెం వద్ద ప్రధాని బహిరంగ సభ నేపథ్యంలో ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా మళ్లిస్తున్నట్లు ఎస్పీ కె.వి.మురళీకృష్ణ తెలిపారు. సోమవారం మధ్యాహ్నం ఒంటి గంట నుంచి సాయంత్రం 6 గంటల వరకు జాతీయ రహదారిపై భారీ వాహనాలను మళ్లిస్తామన్నారు. విశాఖ నుంచి తుని వెళ్లే వాహనాలు లంకెలపాలెం కూడలి నుంచి, సబ్బవరం జాతీయ రహదారి మీదగా వచ్చే వాహనాలు అనకాపల్లి మీదగా లంకెలపాలెం కూడలి వచ్చి మరలాలని తెలిపారు. చోడవరం నుంచి తుని వెళ్లే వాహనాలు అనకాపల్లి, మునగపాక. అచ్యుతాపురం మీదగా రేగుపాలెం కూడలి నుంచి ఎలమంచిలి వైపు వెళ్లాలని ఎస్పీ సూచించారు.
ఆవగింజలతో ప్రధాని ముఖచిత్రం
మాకవరపాలెం: నేడు జిల్లాకు రానున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి స్వాగతం పలుకుతూ తూటిపాల సూక్ష్మకళాకారుడు బి.రవికుమార్ 888 ఆవగింజలతో ప్రధాని ముఖచిత్రాన్ని రూపొందించారు. 9 గంటలపాటు శ్రమించి ఈ చిత్రాన్ని రూపొందించినట్లు ఆయన తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నమోదును మించి.. పోలింగుకు పోటెత్తి
[ 18-05-2024]
సార్వత్రిక సమరంలో గతానికి భిన్నంగా ఈసారి ఓటర్లు పోటెత్తారు. ఎప్పుడూ పోలింగ్ బూత్ మొహం ఎరగని వారు కూడా ఈసారి ఓటెత్తారు. ఫలితంగానే రికార్డు స్థాయిలో 83.94 శాతం పోలింగ్ జరిగింది. -
ఓట్ల వేళ.. ఓటి పనులు!!
[ 18-05-2024]
ఎన్నికలకు ముందు ఓటర్లను ప్రభావితం చేసేందుకు వైకాపా ప్రభుత్వం అభివృద్ధి పనుల పేరిట గాలం వేసింది. నాలుగేళ్లుగా పట్టించుకోకుండా ఎన్నికల వేళ హడావుడి అధికార పాలకవర్గం జీవీఎంసీ పరిధిలో పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టింది. -
అక్రమార్కులకు అధికార పార్టీ అండ
[ 18-05-2024]
చీడికాడ మండలంలో గ్రావెల్ అక్రమ తరలింపు పెద్దఎత్తున జరుగుతోంది. అక్రమార్కులకు అధికార పార్టీ అండదండలు పుష్కలంగా ఉండటంతో అధికారులు చూసీచూడనట్లు వదిలేస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. -
సికెల్సెల్ ఎనీమియాతో గిరి యువతి మృతి
[ 18-05-2024]
సికెల్సెల్ ఎనీమియాతో గిరిజన యువతి మృతి చెందింది. బాధితురాలి కుటుంబసభ్యులు అందించిన వివరాల ప్రకారం.. చింతపల్లి మండలం మారుమూల బలపం పంచాయతీ తూరుమామిడి గ్రామానికి చెందిన కోరాబు భూమిక (18) పాడేరు డిగ్రీ కళాశాలలో మొదటి సంవత్సరం పూర్తి చేసింది. -
కర్షకుల కడగండ్లు కనిపించవా ?
[ 18-05-2024]
పెద్దేరు జలాశయం ఆయకట్టు పరిధిలోని రైతులను సాగునీటి కష్టాలు వెంటాడుతున్నాయి. ఆయకట్టు పరిధిలో ఉన్నా సాగునీటికి కటకట తప్పడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. -
కాలనీల్లోనే ఉంటున్నారా?
[ 18-05-2024]
జగనన్న కాలనీల్లో ఇళ్ల నిర్మాణం పూర్తయిన చోట లబ్ధిదారులు నివాసం ఉంటున్నారా లేదా అన్నది ఆరా తీయాలని గృహనిర్మాణ సంస్థ ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలొచ్చాయి. -
వెంకన్న కల్యాణోత్సవాలపై సందిగ్ధం
[ 18-05-2024]
అరకులోయ వేంకటేశ్వరస్వామి కల్యాణోత్సవాల నిర్వహణపై సందిగ్ధం నెలకొంది. ఆలయ, ఉత్సవ కమిటీ నిర్ణయం మేరకు స్వామివారి కల్యాణోత్సవాలు శనివారం నుంచి ఆరంభం కావాల్సి ఉంది.
తాజా వార్తలు (Latest News)
-
భారత బలగాలకు ద్రోహం చేసిన చరిత్ర కాంగ్రెస్ది: ప్రధాని మోదీ
-
మీ కార్యాలయానికే వస్తాం.. ధైర్యముంటే అరెస్టు చేసుకోండి: కేజ్రీవాల్ సవాల్
-
కాకతీయ వర్సిటీ వీసీ రమేశ్పై విజిలెన్స్ విచారణకు ఆదేశం
-
ఎన్నికల తనిఖీల్లో.. రూ.8,889 కోట్ల సొత్తు స్వాధీనం: ఈసీ
-
పెట్స్పై ప్రేమ.. సమంత ఇలా.. జాన్వీ కపూర్ అలా!
-
దీదీతో పొత్తుపై హైకమాండ్ నిర్ణయం తీసుకోవాలి.. అధీర్ కాదు: ఖర్గే