నీలాద్రి గుమ్మం నుంచే నిజరూప దర్శనం
సింహాద్రి అప్పన్న చందనోత్సవానికి పక్కాగా ఏర్పాట్లు చేశామని జిల్లా కలెక్టర్ మల్లికార్జున వెల్లడించారు. బుధవారం సాయంత్రం కలెక్టరేట్లో నగర పోలీసు కమిషనర్ రవిశంకర్తో కలిసి ఉత్సవానికి చేసిన ఏర్పాట్లను వివరించారు.
చందనోత్సవానికి పక్కాగా ఏర్పాట్లు
విశాఖపట్నం, న్యూస్టుడే: సింహాద్రి అప్పన్న చందనోత్సవానికి పక్కాగా ఏర్పాట్లు చేశామని జిల్లా కలెక్టర్ మల్లికార్జున వెల్లడించారు. బుధవారం సాయంత్రం కలెక్టరేట్లో నగర పోలీసు కమిషనర్ రవిశంకర్తో కలిసి ఉత్సవానికి చేసిన ఏర్పాట్లను వివరించారు. నిజరూప దర్శనం రోజున అంతరాలయ దర్శనాలను రద్దు చేశామన్నారు. రూ.300, రూ.వెయ్యి, రూ.1500 టికెట్లు కొనుగోలు చేసిన వారికి నీలాద్రి గుమ్మం నుంచే దర్శనాలను కల్పిస్తామని తెలిపారు. తెల్లవారుజాము 3.30 గంటల నుంచి 4.30గంటల సమయంలో అనువంశిక ధర్మకర్తల కుటుంబసభ్యులు, న్యాయ, దేవాదాయశాఖ నుంచి పట్టువస్త్రాలు సమర్పించే వారికి మాత్రమే అంతరాలయ దర్శనాలు కల్పిస్తామన్నారు. సాయంత్రం 3 నుంచి 4గంటల సమయంలో సేవకులు, 4 నుంచి 5గంటల మధ్య విభిన్న ప్రతిభావంతులకు అవకాశం కల్పిస్తామని చెప్పారు. దర్శనాల కోసం 6 కిలోమీటర్ల మేర బారికేడ్లు ఏర్పాటు చేసినట్లు చెప్పారు.
తెల్లవారుజాము నుంచే దర్శనాలు ప్రారంభం
ఈనెల 10వ తేదీ తెల్లవారు జామున 3.30గంటల నుంచే రూ.1000, రూ.300 టికెట్లు, ఉచిత దర్శనాలు ప్రారంభమవుతాయని చెప్పారు. సుమారు 1.50లక్షల మంది భక్తులు వస్తారని అంచనా వేస్తున్నామన్నారు. 29,500 మంది భక్తులకు నీడనిచ్చేలా షామియానాలు వేశామన్నారు. పదిచోట్ల టికెట్ల స్కానర్లు ఏర్పాటు చేశామన్నారు. నిష్క్రమణ ద్వారం వద్ద రివర్స్ ఎంట్రీ లేకుండా చూస్తామన్నారు. 160 ప్రదేశాల్లో తాగునీటి శిబిరాలు, 250 చోట్ల టాయిలెట్లు, 60 వైద్య శిబిరాలను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. 20వేల టికెట్లను అందుబాటులో ఉంచగా వీటిలో రూ.1500 టికెట్లు 5 వేల వరకు ఉన్నాయని తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
తేలని భూసారం.. సాగు నిస్సారం..!
[ 20-05-2024]
భూసారం అనుగుణంగానే పంటల సాగు, దాన్లో ఎరువుల వినియోగం జరగాలి. లేకపోతే దిగుబడులపై ప్రభావం చూపుతుంది. -
గెలిచేది తెదేపా కూటమే
[ 20-05-2024]
రాష్ట్రంలో ఈ నెల 13న జరిగిన పోలింగ్లో ప్రజలు స్వచ్ఛందంగా వచ్చి ఓట్లు వేశారని, గెలిచేది తెదేపా కూటమేనని పాడేరు నియోజకవర్గ అభ్యర్థి, మాజీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి అన్నారు. -
రెండు నెలలు.. రూ. 3.89 కోట్లు
[ 20-05-2024]
రెండు నెలలు.. రూ. 3.89 కోట్లుఎన్నికల పేరు చెబితే అందరికీ గుర్తుకు వచ్చేది రాజకీయ నాయకుల ప్రచారాలు, ప్రలోభాలు. ఇందుల్లో ప్రలోభాలకు అడ్డుకట్ట వేయడానికి ఎన్నికల సంఘం ఆదేశాలతో జిల్లాలో రెండు నెలలపాటు ఏర్పాటు చేసిన చెక్ పోస్టులు, ఇతర ప్రదేశాల్లో చేసిన తనిఖీల ద్వారా అధికారులు వందల కొద్ది కేసులు పెట్టి, రూ. కోట్ల విలువైన సొత్తు పట్టుకున్నారు. -
సెలవుల్లో ఆడుతూ.. పాడుతూ!
[ 20-05-2024]
వేసవి సెలవుల్లో పిల్లలు విద్యకు దూరం కాకూడనే ఉద్దేశంతో విద్యాశాఖ ఆధ్వర్యంలో ప్రత్యేక శిక్షణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. -
మోదకొండమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు
[ 20-05-2024]
మన్యం ప్రజల ఆరాధ్య దైవం పాడేరు మోదకొండమ్మ అమ్మవారి దర్శనానికి ఆదివారం భక్తులు పోటెత్తారు. -
ఎగువగుడ్డిలో తాగునీటి ఎద్దడి
[ 20-05-2024]
మంచినీటి సౌకర్యం కల్పించాలని రొంపల్లి పంచాయతీ ఎగువగుడ్డి గ్రామస్థులు ఆదివారం ఖాళీ బిందెలతో మెకాళ్లపై నిల్చుని ఆందోళన చేపట్టారు. -
వైభవోపేతంగా కల్యాణోత్సవం
[ 20-05-2024]
అరకులోయలో వేంచేసిన అలివేలు మంగా పద్మావతి సమేత వేంకటేశ్వరస్వామి కల్యాణ మహోత్సవం ఆదివారం ఘనంగా నిర్వహించారు. -
సెలవుల్లో సరిగమలు.. బుడతల సరాగాలు
[ 20-05-2024]
ఏడాదంతా పుస్తకాలతో కుస్తీ పట్టిన విద్యార్థులు వేసవి సెలవుల్లో సంగీత శిక్షణపై మక్కువ చూపుతున్నారు. సెలవులను వృథా చేసుకోకుండా తమకు నచ్చిన రంగంలో శిక్షణ పొందేందుకు మక్కువ చూపుతున్నారు. -
ఉపాధి హామీ పనులపై వివాదం
[ 20-05-2024]
గోవాడ గ్రామంలో ఉపాధి హామీ పనుల్లో అవకతవకలు జరిగాయంటూ ఇచ్చిన ఫిర్యాదు ఇరువర్గాల మధ్య వివాదాన్ని రేపింది. -
9 నెలలుగా జీతాల్లేవ్!
[ 20-05-2024]
అనకాపల్లి జిల్లా ఆసుపత్రిలోని వ్యసన విముక్తి కేంద్రం (డీ ఎడిక్షన్ సెంటర్)లో విధులు నిర్వహిస్తున్న సిబ్బందికి తొమ్మిది నెలల నుంచి జీతాలు రాలేదు. -
పోలీసులు అప్రమత్తంగా ఉండాలి
[ 20-05-2024]
సార్వత్రిక ఎన్నికల ఫలితాలు వస్తున్న నేపథ్యంలో జిల్లాలోని పోలీస్ సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని జిల్లా ఎస్పీ కేవీ మురళీకృష్ణ తెలిపారు. -
సినీ ఫక్కీలో రూ.10 లక్షల నగదు తస్కరణ
[ 20-05-2024]
అనకాపల్లి జిల్లా మామిడిపల్లికి చెందిన గుత్తేదారు ఎన్.మణికంఠ నుంచి కొందరు వ్యక్తులు పొలీసులమని చెప్పి సినీ ఫక్కీలో రూ.10 లక్షల నగదు తస్కరించిన ఘటన సారవకోట మండలం ధర్మలక్ష్మీపురంలో శనివారం చోటుచేసుకుంది. -
కేజీహెచ్కు డెంగీ కేసుల తాకిడి
[ 20-05-2024]
కేజీహెచ్కు డెంగీ కేసుల తాకిడి పెరిగింది. ఇటీవల కురిసిన వర్షాలతో వాతావరణంలో మార్పు వచ్చింది. డెంగీ దోమలు విజృంభిస్తున్నాయి.