logo

యువత కూటమికి మద్దతివ్వాలి

నిరుద్యోగ యువతను మోసం చేసిన వైకాపాను తరిమికొట్టి.. ఎన్డీఏ కూటమి అభ్యర్థులకు ఓటు వేయాలని నిరుద్యోగ జేఏసీ రాష్ట్ర కన్వీనర్‌ సిద్దిఖి పిలుపునిచ్చారు.

Published : 09 May 2024 02:40 IST

అరకులోయ, న్యూస్‌టుడే: నిరుద్యోగ యువతను మోసం చేసిన వైకాపాను తరిమికొట్టి.. ఎన్డీఏ కూటమి అభ్యర్థులకు ఓటు వేయాలని నిరుద్యోగ జేఏసీ రాష్ట్ర కన్వీనర్‌ సిద్దిఖి పిలుపునిచ్చారు. జేఏసీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న నిరుద్యోగ బస్సుచైతన్య యాత్ర బుధవారం అరకులోయ చేరుకుంది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. యువతకు అన్యాయం చేసిన వైకాపా ప్రభుత్వానికి వ్యతిరేకంగా అనంతపురం నుంచి శ్రీకాకుళం వరకు బస్సు చైతన్య యాత్ర నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ ప్రభుత్వం ఉద్యోగ నోటిఫికేషన్‌లు ఇస్తామని కాలం వెళ్లదీసిందన్నారు. నిరుద్యోగ భృతి సైతం కల్పించలేదన్నారు. రాష్ట్రంలో ఉపాధి లేక యువత తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. కూటమి మ్యానిఫెస్టోలో నిరుద్యోగ భృతి నెలకు రూ. 3 వేలు, ఉద్యోగ నోటిఫికేషన్లు ఇస్తామని ప్రకటించిందని గుర్తుచేశారు. యువత కూటమికి మద్దతు పలకాలని కోరారు. చంద్రబాబు ముఖ్యమంత్రి అయితేనే ఉద్యోగాలు వస్తాయని చెప్పారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని