logo

జగన్‌ పాలనలో అన్నివర్గాలకూ ఇక్కట్లే

అయిదేళ్ల జగన్‌ పాలనలో అన్నివర్గాల వారూ ఇక్కట్లపాలయ్యారని అరకు ఎంపీ కూటమి అభ్యర్థిని కొత్తపల్లి గీత పేర్కొన్నారు. పలు గ్రామాల్లో ఎమ్మెల్యే అభ్యర్థిని మిరియాల శిరీషాదేవితో కలసి ర్యాలీ నిర్వహించారు.

Published : 09 May 2024 02:42 IST

రాజవొమ్మంగి, న్యూస్‌టుడే: అయిదేళ్ల జగన్‌ పాలనలో అన్నివర్గాల వారూ ఇక్కట్లపాలయ్యారని అరకు ఎంపీ కూటమి అభ్యర్థిని కొత్తపల్లి గీత పేర్కొన్నారు. పలు గ్రామాల్లో ఎమ్మెల్యే అభ్యర్థిని మిరియాల శిరీషాదేవితో కలసి ర్యాలీ నిర్వహించారు. చెరుకుంపాలెం నుంచి జడ్డంగి, సింగంపల్లి, వట్టిగెడ్డ, దూసరపాము మీదుగా రాజవొమ్మంగి వరకు రోడ్‌ షో, భారీ ర్యాలీ నిర్వహించారు. గీత మాట్లాడుతూ నియోజకవర్గంలో ఒక్క రహదారికి కూడా రాష్ట్ర ప్రభుత్వం నిధులు ఇవ్వలేదన్నారు.

గిరిజనులు, గిరిజనేతరులను మోసం చేసిన ఒక సైకో రంపచోడవరంలోనే ఉన్నాడని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. వట్టిగెడ్డ జలాశయం పొర్లు కాలువపై శాశ్వత వంతెన నిర్మించాలని, కిర్రాబు వద్ద ఆనకట్ట నిర్మించాలని, పోతురాజు గండి వరకు తారు రోడ్డు నిర్మించాలని స్థానికులు కోరారు. గెలవగానే పరిష్కారానికి కృషిచేస్తామని హామీ ఇచ్చారు. శిరీషాదేవి మాట్లాడుతూ ఎమ్మెల్సీ అనంత బాబుపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. జడ్పీటీసీ సభ్యురాలు జ్యోతి, మండల తెదేపా, జనసేన, భాజపా అధ్యక్షులు జి.పెద్దిరాజు, బి.త్రిమూర్తులు, టి.సూరిబాబు, నాయకులు డి.శివరామచంద్రరాజు, ఎం.సావిత్రిదేవి, కేశవ్‌ తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని