కోఢీ
సంప్రదాయం పేరుతో సంక్రాంతి పండగను పురస్కరించుకుని సాగిన కోడిపందేలు, జూదక్రీడల్లో నగదు పెద్దమొత్తంలో చేతులు మారింది. పోలీసుల హెచ్చరికలను సైతం పక్కనపెట్టి భారీ స్థాయిలో బరులు ఏర్పాటు చేశారు. కత్తులు కట్టి నిర్వహించిన పోటీల్లో
నెత్తురోడిన బరులు
పెడన మండలంలో పందేనికి కోళ్లను సిద్ధం చేస్తున్న దృశ్యం
చెదురుమదురుగా ఘర్షణలు: కొన్ని బరుల్లో చిన్నచిన్న ఘర్షణలు తలెత్తాయి. పెడన బైపాస్లో ఏర్పాటు చేసిన బరి వద్ద శనివారం ఒక యువకుడు మద్యం సీసాను పగులగొట్టి విధ్వంసం చేశాడు. చెన్నూరు, నందమూరు, కాకర్లమూడి, నందిగామ, నడుపూరు గ్రామాల్లోనూ ఘర్షణలు జరిగాయి. కొంకేపూడిలో రెండు వర్గాల మధ్య బరుల విషయమై తలెత్తిన వివాదంతో పోటీలను నిలిపివేశారు.
బంటుమిల్లి: మండలంలోనూ బరులు ఏర్పాటు చేసి కోడి పందేలు నిర్వహించారు.రాత్రిళ్లు జూదక్రీడలు నిర్వహించారు.
ముదినేపల్లి: గ్రామగ్రామాన కోడిపందేలు జోరుగా సాగాయి. మహిళలు సైతం ఆసక్తిగా తిలకించారు. పేరూరు, అన్నవరం, దేవపూడి, చినవాడవల్లిలో బరుల వద్ద ఘర్షణలు చోటుచేసుకున్నాయి. బరుల వద్ద ఎవరూ ఫొటోలు తీయకుండా నిర్వాహకులు యువకులను నియమించుకున్నారు.
కలిదిండి: మండలంలో కోడిపందేలు, పేకాట శిబిరాలు మూడు రోజులపాటు యథేచ్ఛగా సాగాయి. పండగ ప్రారంభానికి ముందురోజు పోలీసులు మొక్కుబడిగా నిర్వహించిన దాడుల్లో కొన్నిచోట్ల శిబిరాలను కూల్చివేశారు. అసలు జూదాలు మొదలైన తరవాత చూసీచూడనట్లుగా వదిలేశారనే విమర్శలు వినిపించాయి.
తిరువూరు: తిరువూరు నియోజకవర్గంలో కోడిపందేలకు పెద్ద సంఖ్యలో ప్రజలు తరలివచ్చారు. మహిళలు సైతం రావడం విశేషం.బరుల పక్కనే పేకాట, గుండాట, నంబర్లాట జోరుగా సాగింది. ఫ్లడ్లైట్లు, గ్యాస్ లైట్ల వెలుగులో అర్ధరాత్రి వరకు జూదాలు కొనసాగాయి. బరులన్నీ జనాలతో కిటకిటలాడుతూ కొన్నిచోట్ల జాతరను తలపించింది. వాహనాల యజమానుల నుంచి కొన్నిచోట్ల ప్రైవేట్ వ్యక్తులు పార్కింగ్ ఫీజు వసూలు చేశారు.బరిని బట్టి రూ.20 వేల నుంచి రూ.లక్ష వరకు ఒప్పందం చేసుకోగా, పై పందేలు పెద్దఎత్తున కాశారు. తిరువూరు మండలం మల్లేలలో జరిగిన కోడిపందేలకు ఎమ్మెల్యే కె.రక్షణనిధి, విస్సన్నపేట మండలంలో తెదేపా నియోజకవర్గ ఇన్ఛార్జి ఎస్.దేవదత్ హాజరయ్యారు.
గంపలగూడెం: మండలంలో నిర్వహించిన పందేలను తిలకించేందుకు తెలంగాణ నుంచి సుడా ఛైర్మన్ బచ్చు విజయ్కుమార్, పలువురు డైరెక్టర్లు, ఖమ్మం నగరపాలక సంస్థకు చెందిన పలువురు కార్పొరేటర్లు ఆదివారం వచ్చారు. నెమలి సమీపంలో ఏర్పాటు చేసిన పందేలను ఆసక్తిగా తిలకించారు. జూదం(కోసు), చిత్తులాట (పట్టాలాట) లో పెద్దమొత్తంలో చేతులు మారాయి. బరుల వద్ద మద్యం అమ్మకాలూ జోరుగా సాగాయి. పలు గ్రామాల్లో ప్రధాన రహదారుల వెంట ట్రాఫిక్ నిలిచిపోయింది. మద్యం మత్తులో పలువురు యువకులు వాహనాలను వేగంగా నడిపి ప్రమాదానికి గురయ్యారు.
కొత్తగా బుల్లెట్ పందేలు: ఈ ఏడాది బుల్లెట్ పందేల పేరుతో కొత్త సంప్రదాయానికి నిర్వాహకులు తెరతీశారు. ఈ ప్రాంతంలో ఇది కొత్తగా ఉండటంతో పందెం ప్రియులు ఆసక్తి చూపారు.
గూడూరు: మండలంలోని బరుల వద్ద కోలాహల వాతావరణం నెలకొంది. కోడిపందేల మాటున పేకాట శిబిరాలు ఏర్పాటు చేశారు. బరుల వద్ద తినుబండారాల దుకాణాలు వెలిశాయి.
కైకలూరు గ్రామీణం: మండలంలోనూ కోళ్లకు కత్తులు కట్టి పందేలు నిర్వహించారు. వాటి మాటున గుండాట, కోతాట కొనసాగించారు. మండల వ్యాప్తంగా రూ.లక్షలు చేతులు మారాయి. రాత్రివేళ ఆటంకం లేకుండా ఫ్లడ్లైట్లు, జనరేటర్లను ఏర్పాటు చేశారు.
మండవల్లి, న్యూస్టుడే: యథేచ్ఛగా కోడిపందేలను నిర్వహించారు. రూ.5వేల నుంచి రూ.5లక్షల వరకు పందేలు కాశారు. వీటిని తిలకించేందుకు ఇతర జిల్లాల నుంచి వచ్చిన వాళ్లతో శిబిరాలు కిక్కిరిసిపోయాయి. కొల్లేరు లంక గ్రామాల్లో పశ్చిమగోదావరి జిల్లా నుంచి వచ్చిన బెట్టింగ్రాయుళ్లు పాల్గొన్నారు.
విస్సన్నపేట: మండలంలో విస్సన్నపేట, కొర్లమండ, వేమిరెడ్డిపల్లి, నూతిపాడు, వేమిరెడ్డిపల్లి తండా, తెల్లదేవరపల్లి గ్రామాల్లో పెద్దఎత్తున కోడిపందేలు, జూదం కొనసాగాయి. పుట్రేల, మల్లేల గ్రామాల నడుమ మామిడితోటల్లో నిర్వాహకులు తాత్కాలిక షెడ్లు, షామియానాలు ఏర్పాటు చేశారు.
చింతపాడులో నిర్వహిస్తున్న కోడిపందేలు
గంపలగూడెం మండలంలో మూడుముక్కలాట
బంటుమిల్లి: పందెం బరి వద్ద గుండాట
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మచిలీపట్నంలో వైకాపా అభ్యర్థి పేర్ని కిట్టు అనుచరుల వీరంగం
[ 02-05-2024]
కృష్ణా జిల్లా మచిలీపట్నంలో వైకాపా అభ్యర్థి పేర్ని కిట్టు అనుచరులు వీరంగం సృష్టించారు. -
ఏమైనా ఇచ్చేస్తాం.. ఎంతైనా కొనేస్తాం!.. ఓట్ల కొనుగోలుకు బరితెగించిన వైకాపా
[ 02-05-2024]
ఆ నియోజకవర్గంలో ఓ సామాజిక వర్గం వారు తెదేపాకు మద్దతివ్వాలని నిర్ణయించారు. ఇది తెలిసిన వైకాపా ప్రజాప్రతినిధి అక్కడ వాలిపోయారు. అప్పటికప్పుడు రూ.10 లక్షల చెక్కు, రూ.3 లక్షలు నగదు ఇచ్చారు. తర్వాత ఓటుకు ఇంతని ఇస్తానని హామీ ఇచ్చారు. -
జనం గొంతులో.. జగన్ గరళం..!
[ 02-05-2024]
ప్రజారోగ్యం ప్రమాదంలో పడ్డప్పుడు పాలకులు ఏం చేయాలి? తాగునీరే గరళమై.. జనం ప్రాణాలనే బలి తీసుకుంటుంటే ఏం చర్యలు తీసుకోవాలి? -
నాడు జోరుమీదొచ్చారు.. నేడు జారుకున్నారు
[ 02-05-2024]
ఎన్నిక ప్రకటన ముందు ప్రజలను మభ్యపెట్టేందుకు జోగి రమేష్ పోరంకి ద్వారకా రెసిడెన్సీలో ప్రజాదర్బార్ నిర్వహించారు. ప్రజల నుంచి స్వీకరించిన వినతులు బుట్టదాఖలయ్యాయి. ఆన్లైన్లో నమోదు చేసి రశీదులు ఇచ్చినా ఒక్క సమస్య కూడా పరిష్కారం కాలేదు. -
పేరు రక్షితం.. నీరు కలుషితం
[ 02-05-2024]
ప్రజలకు రోజూ స్వచ్ఛమైన తాగునీరు అందిస్తున్నామని పాలకులు చెబుతున్నా క్షేత్రస్థాయిలో మాత్రం అది అమలు కావడం లేదు. చాలాచోట్ల డ్రెయిన్ల వెంబడి పైపులైన్లు ఉండడం.. లీకైన వాటిని మరమ్మతులు చేపట్టకపోవడంతో మురుగునీరు సరఫరా అవుతుందని ప్రజలు మొరపెట్టుకుంటున్నారు. -
ప్రతి పథకమూ దోపిడీ కోసమే
[ 02-05-2024]
రాష్ట్రంలో ఐదేళ్లలో అమలు చేసిన ప్రతి పథకాన్నీ తన దోపిడీకి అనుగుణంగా మార్చుకున్న జగన్, అతని టీంకు మే 13న జరిగే ఎన్నికల్లో ప్రజలు బుద్ధి చెప్పి ఎన్డీయే కూటమి అభ్యర్థులను గెలిపించాలని ఎన్టీఆర్ తనయుడు నందమూరి రామకృష్ణ కోరారు. -
ఈ ప్రశ్నకు జవాబు చెప్పు?
[ 02-05-2024]
‘నాడు-నేడు కింద ప్రభుత్వ పాఠశాలల్లో అభివృద్ధి చేస్తున్నాం.. విద్యార్థులకు ఆంగ్లమాధ్యమంలో బోధనతో పాటు, టోఫెల్, స్లాష్, క్లాస్రూం ఎస్సెస్మెంట్ పరీక్షలు చేపడుతూ వారి సామర్థ్యాన్ని ఏ ప్రభుత్వం చేయలేని పద్ధతిలో పెంపొందిస్తున్నాం’ -
‘రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిన జగన్’
[ 02-05-2024]
మూడు రాజధానుల పేరుతో రాష్ట్ర అభివృద్ధిని సర్వనాశనం చేసిన ఘనుడు జగన్మోహన్రెడ్డి అని మాజీ మంత్రి, తెదేపా పొలిట్బ్యూరో సభ్యుడు యనమల రామకృష్ణుడు ధ్వజమెత్తారు. -
వైకాపా ప్రభుత్వాన్ని సాగనంపుదాం
[ 02-05-2024]
వైకాపా ప్రభుత్వాన్ని ప్రజలు సాగనంపాలని కూటమి అభ్యర్థి కాగిత కృష్ణప్రసాద్ పిలుపునిచ్చారు. బుధవారం మండలంలోని శింగరాయపాలెం, బల్లిపర్రు, కాకర్లమూడి, మడక, అచ్చయ్యవారిపాలెం, పుల్లపాడు తదితర గ్రామాల్లో ఆయన రోడ్ షో నిర్వహించారు. -
చీకటి పాలన నుంచి విముక్తులవుదాం: కొల్లు
[ 02-05-2024]
ఐదేళ్ల చీకటి పాలన నుంచి విముక్తులయ్యేందుకు అన్ని వర్గాల ప్రజలు సిద్ధంగా ఉండాలని మాజీ మంత్రి, తెదేపా అభ్యర్థి కొల్లు రవీంద్ర కోరారు. -
దళిత వ్యతిరేకి జగన్: జవహర్
[ 02-05-2024]
దళిత వ్యతిరేకి జగన్మోహన్రెడ్డికి తగు రీతిన బుద్ధి చెప్పేందుకు అందరూ సంఘటితం కావాలని మాజీ మంత్రి, తెదేపా నాయకులు కేఎస్ జవహర్ కోరారు. -
సంక్షేమ పాలన తెదేపాతోనే సాధ్యం
[ 02-05-2024]
కూటమి విజయాన్ని ఎవరూ ఆపలేరని ఎన్టీఆర్ తనయుడు నందమూరి రామకృష్ణ అన్నారు. పెడన మండలం నందమూరు, జింజేరు, జింజేరు గౌడపాలెం గ్రామాల్లో బుధవారం -
తెదేపా అభ్యర్థులకు ఘన స్వాగతం
[ 02-05-2024]
పెనమలూరు తెదేపా అభ్యర్థి బోడే ప్రసాద్, బందరు జనసేన ఎంపీ అభ్యర్థి వల్లభనేని బాలశౌరిల విజయాన్ని కాంక్షిస్తూ బుధవారం రాత్రి వరకు ఉయ్యూరులో బైక్ ర్యాలీ జరిగింది. -
వైకాపా కుక్కర్ కూపన్ల కేసు కంచికే..!
[ 02-05-2024]
అజిత్సింగ్నగర్ తోటవారివీధిలోని లక్కీ క్వాలిటీ ప్రింటర్స్లో ఎన్నికల అధికారులు స్వాధీనం చేసుకున్న వైకాపా కుక్కర్ కూపన్ల కేసు.. కంచికి చేరింది. -
వైద్యుడి కుటుంబం మృతి కేసులో విచారణ వేగవంతం
[ 02-05-2024]
పటమట పరిధిలో వైద్యుడు శ్రీనివాస్ కుటుంబం మృతి కేసులో విచారణను పోలీసులు వేగవంతం చేశారు. ఈ కేసును సీపీ స్వయంగా పర్యవేక్షిస్తుండంతో పోలీసులు పలు కోణాల్లో దర్యాప్తును ముమ్మరం చేసి కీలక సమాచారం రాబట్టినట్లు తెలుస్తోంది. -
వెలంపల్లికి చేదు అనుభవం
[ 02-05-2024]
సెంట్రల్ నియోజకవర్గ వైకాపా అభ్యర్థి వెలంపల్లి శ్రీనివాసరావుకు మద్యం మత్తులో ఉన్న వ్యక్తి నుంచి చేదు అనుభవం ఎదురైంది. బుధవారం ఆయన 23, 62 డివిజన్లలో పర్యటించారు. -
కొడాలి నానిని నిలదీసిన గ్రామస్థులు
[ 02-05-2024]
వలివర్తిపాడు గ్రామంలో ఎమ్మెల్యే కొడాలి శ్రీవెంకటేశ్వరరావు(నాని) బుధవారం ఎన్నికల ప్రచారం చేస్తుండగా..పలువురు మహిళలు ఆయన్ను తమ గ్రామంలో సమస్యలు పరిష్కరించలేదంటూ నిలదీశారు.
తాజా వార్తలు (Latest News)
-
బ్యాంకు ఖాతాల్లో పింఛన్ జమకాని వారికి.. మే 4న ఇస్తాం: శశి భూషణ్
-
97.76% రూ.2వేల నోట్లు వెనక్కి: ఆర్బీఐ
-
అభిమాని బర్త్డే సెలబ్రేట్ చేసి.. ఖరీదైన గిఫ్ట్ ఇచ్చి.. వీడియో వైరల్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
కిమ్ ‘సుఖం’ కోసం.. ఏడాదికి 25 మంది యువతులు!
-
ఆ క్యారెక్టర్ ప్లే చేయాలంటే భయమేసింది: రాశీఖన్నా