బస్సెప్పుడొస్తుందో...!
పల్లెలు అభివృద్ధి బాట పట్టడం మాట అటుంచితే.. కనీస అవసరాలూ తీరని దయనీయ స్థితిలో ఉన్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో సొంత కార్లు, ద్విచక్రవాహనాలు ఉన్న వాళ్ల సంఖ్య గణనీయంగానే ఉన్నప్పటికీ బస్సుల్లో ప్రయాణించేవారి సంఖ్యా అధికమే.
కలిదిండి, కైకలూరు, న్యూస్టుడే : పల్లెలు అభివృద్ధి బాట పట్టడం మాట అటుంచితే.. కనీస అవసరాలూ తీరని దయనీయ స్థితిలో ఉన్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో సొంత కార్లు, ద్విచక్రవాహనాలు ఉన్న వాళ్ల సంఖ్య గణనీయంగానే ఉన్నప్పటికీ బస్సుల్లో ప్రయాణించేవారి సంఖ్యా అధికమే. కొల్లేరు, ఉప్పుటేరు తీర ప్రాంతాలకు ఇప్పటికీ ఆర్టీసీ బస్సు సదుపాయం లేదంటే అతిశయోక్తి ఏమీ కాదు. నిత్యం రద్దీగా ఉండే గ్రామాలకూ బస్సులే నడపడం లేదు. గత్యంతరం లేని పరిస్థితుల్లో చాలా మంది ప్రయాణానికి సరకు తరలించే వాహనాలు, ఆటోలనే ఆశ్రయిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో విద్యార్థులు, ఉద్యోగులు, గర్భిణుల అవస్థలు వర్ణనాతీతం. విద్యాలయం, అత్యవసర సమయంలో ఆసుపత్రి, ఏదైనా కార్యాలయానికి సకాలంలో వెళ్లాలంటే సాధ్యం కావడం లేదని వాపోతున్నారు. కలిదిండి, కైకలూరు మండలాల్లో ప్రధాన గ్రామాల్లో మొత్తం జనాభా, బస్సులు నడపాలనే ప్రతిపాదనలు ఎంతకాలంగా అమలుకు నోచుకోలేదో తెలియచెప్పే ఉదాహరణలివి.
మార్గం కలిదిండి - కైకలూరు
గ్రామాలు : కలిదిండి, వెంకటాపురం, ఆరుతెగలపాడు, వరహాపట్నం, గోపవరం, రాచపట్నం, కైకలూరు
జనాభా : 30వేలు విస్తీర్ణం : 15కి.మీ
పరిస్థితి : ఈ మార్గంలో ఆర్టీసీ బస్సు ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదన చాలాకాలంగా ఉంది. దీనిని ఇప్పటి వరకు ఎవరూ పరిగణనలోకి తీసుకోలేదు.
కోరుకొల్లు - కైకలూరు
గ్రామాలు : కోరుకొల్లు, వేమవరప్పాడు, తామర, కొల్లు వింజరం, ఆచవరం, కైకలూరు
జనాభా : 30వేలు విస్తీర్ణం : 12కిమీ
పరిస్థితి : ఈ మార్గంలో గతంలో ఆర్టీసీ బస్సు సదుపాయం ఉండేది. ఉదయం, సాయంత్రం మాత్రమే నడపడంతో, మిగిలిన సమయాల్లో ప్రయాణ అవసరాల కోసం ఆటో ప్రయాణానికి ప్రజలు మొగ్గుచూపారు. దీంతో అధికారులు ఆర్టీసీ బస్సును రద్దు చేశారు. తిరిగి బస్సు సౌకర్యం పునరుద్ధరించలేదు. ప్రయాణికుల సంఖ్య గణనీయంగా పెరగడంతో బస్సు ఏర్పాటు చేయాలన్న అభ్యర్థనలు ఎక్కువగా వస్తున్నాయి.
కలిదిండి - లోడిదలంక
గ్రామాలు : కలిదిండి, పడమటిపాలెం, లోడిదలంక
జనాభా : 15వేలు విస్తీర్ణం : 10కిమీ
పరిస్థితి : ఈ మార్గంలో ఆర్టీసీ బస్సు తిరిగేది. కొన్నేళ్ల కిందట రోడ్డు దారుణంగా ధ్వంసం కావడంతో నిలిపివేశారు. కొంతకాలం 108 వాహనం కూడా తిరగలేదు. ఇటీవల రోడ్డు అభివృద్ధి చేశారు. అయినా బస్సు సదుపాయాన్ని తిరిగి ప్రారంభించలేదు.
కలిదిండి - గుర్వాయిపాలెం - పెదలంక
గ్రామాలు : కలిదిండి, గుర్వాయిపాలెం, సంతోషపురం, అమరావతి, భాస్కరరావుపేట, మూలలంక, పెదలంక
జనాభా : 25వేలు విస్తీర్ణం : 16కిమీ
పరిస్థితి : విజయవాడ నుంచి రాత్రి 6 గంటలకు వచ్చిన బస్సు ఉదయం 5 గంటలకు తిరిగి వెళ్తుంది. గుడివాడ నుంచి మూలలంక వరకు ఉదయం 9.30గంటలకు, భీమవరం నుంచి సాయంత్రం 6 గంటలకు ఒక బస్సు ఉంది. మధ్యాహ్నం వచ్చే బస్సు రద్దు చేశారు. దీనిని పునరుద్ధరించాలని ఆయా గ్రామాల ప్రజలు కోరుతున్నారు.
కైకలూరు - ఆలపాడు - కొల్లేరు లంక గ్రామాలు
గ్రామాలు : కైకలూరు, ఆటపాక, భుజబలపట్నం, పల్లెవాడ, ఆలపాడు, వడ్లకూటితిప్ప, పెంచికలమర్రు, కొల్లేటికోట, పందిరిపల్లెగూడెం
జనాభా: 35 వేలు
విస్తీర్ణం: 18 కి.మీ
పరిస్థితి: కొల్లేరు లంక గ్రామాల ప్రజలు కైకలూరు చేరాలంటే ప్రైవేటు వాహనాలే దిక్కు. ఎన్నో ఏళ్ల నుంచి బస్సు ఏర్పాటు చేయాలని లంక గ్రామస్ధులు కోరుతున్నా, ఇప్పటి వరకు అటుగా అడుగులు పడలేదు.
రామవరం - కైకలూరు
గ్రామాలు : రామవరం, దొడ్డిపట్ల, సీతనపల్లి, వరహాపట్నం, రాచపట్నం, గోపవరం, కైకలూరు
జనాభా : 20 వేలు
విస్తీర్ణం : 15 కిమీ
పరిస్థితి : గతంలో ఈ మార్గంలోని రామవరంలో ఉదయం 7.45గంటలకు బస్సు బయల్దేరి 9గంటలకు కైకలూరు చేరుకునేది. సాయంత్రం 6గంటలకు కైకలూరు నుంచి రామవరం మీదుగా భీమవరం వెళ్లేది. దీంతో విద్యార్థులు, పనుల నిమిత్తం మండల కేంద్రానికి వెళ్లే ప్రజలకు ఆసరాగా ఉండేది. ప్రస్తుతం ఈ సర్వీసు రద్దు చేయడంతో గ్రామస్థులు అవస్థలు పడుతున్నారు. బస్సు సర్వీసు పునరుద్ధరించే విషయమై గతంలో మంత్రులతో పాటు గుడివాడ డిపో అధికారులకు వినతిపత్రం అందించారు.
కలిదిండి - మద్వానిగూడెం - పెదలంక
గ్రామాలు : కలిదిండి, మద్వానిగూడెం, కొండంగి, యడవల్లి, మట్టగుంట, పెదలంక
జనాభా : 22వేలు విస్తీర్ణం : 20కిమీ
పరిస్థితి : ఉదయం, రాత్రి 7 గంటల సమయంలో బస్సు సదుపాయం ఉండేది. కొన్నాళ్లుగా ఆ బస్సు రావడం లేదు. దీంతో ప్రయాణికులు అవస్థలు పడుతున్నారు. ఆటోలపైనే ఆధారపడాల్సి వస్తోంది. ప్రతి చిన్న అవసరానికీ కలిదిండి, భీమవరం, గుడివాడ వంటి ప్రాంతాలకు వెళ్లాల్సి రావడం వల్ల ఈ మార్గంలో సర్వీసులు పెంచి మరో రెండుసార్లు బస్సు నడిపితే ఉపయుక్తంగా ఉంటుందని స్థానికులు భావిస్తున్నారు.
గుడివాడ - ముదినేపల్లి - చిగురుకోట
గ్రామాలు : ముదినేపల్లి, చినకామనపూడి, పెదకామనపూడి, నరసన్నపాలెం, చిగురుకోట
జనాభా : 15వేలు విస్తీర్ణం : 10కిమీ
పరిస్థితి : రహదారి ధ్వంసం కావడంతో ఈ మార్గంలో బస్సు సదుపాయాన్ని రద్దు చేశారు. ప్రస్తుతం ఆటోల్లోనే ప్రయాణాలు సాగిస్తున్నారు. రోడ్డుకు మరమ్మతులు నిర్వహించి, బస్సు రాకపోకలను ప్రారంభించాలని స్థానికులు కోరుతున్నారు.
కైకలూరు - పెనుమాకలంక - గుడివాడ
గ్రామాలు : కైకలూరు, లోకుమూడి, దెయ్యంపాడు, మనుగునూరు, పెనుమాకలంక, నందిగామలంక, ఉనికిలి
జనాభా : 15 వేలు విస్తీర్ణం : 20 కి..మీ
పరిస్థితి : కైకలూరు నుంచి కొల్లేరు లంక గ్రామాల మీదుగా గుడివాడకు బస్సు సర్వీసు నడిచేది. ఐదేళ్లుగా నిలిపివేశారు. ఈ మార్గంలో బస్సును నడపాలని గ్రామస్థులు ఎన్నోసార్లు కోరుతున్నా అధికారులు స్పందించడం లేదు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మచిలీపట్నంలో వైకాపా అభ్యర్థి పేర్ని కిట్టు అనుచరుల వీరంగం
[ 02-05-2024]
కృష్ణా జిల్లా మచిలీపట్నంలో వైకాపా అభ్యర్థి పేర్ని కిట్టు అనుచరులు వీరంగం సృష్టించారు. -
ఏమైనా ఇచ్చేస్తాం.. ఎంతైనా కొనేస్తాం!.. ఓట్ల కొనుగోలుకు బరితెగించిన వైకాపా
[ 02-05-2024]
ఆ నియోజకవర్గంలో ఓ సామాజిక వర్గం వారు తెదేపాకు మద్దతివ్వాలని నిర్ణయించారు. ఇది తెలిసిన వైకాపా ప్రజాప్రతినిధి అక్కడ వాలిపోయారు. అప్పటికప్పుడు రూ.10 లక్షల చెక్కు, రూ.3 లక్షలు నగదు ఇచ్చారు. తర్వాత ఓటుకు ఇంతని ఇస్తానని హామీ ఇచ్చారు. -
జనం గొంతులో.. జగన్ గరళం..!
[ 02-05-2024]
ప్రజారోగ్యం ప్రమాదంలో పడ్డప్పుడు పాలకులు ఏం చేయాలి? తాగునీరే గరళమై.. జనం ప్రాణాలనే బలి తీసుకుంటుంటే ఏం చర్యలు తీసుకోవాలి? -
నాడు జోరుమీదొచ్చారు.. నేడు జారుకున్నారు
[ 02-05-2024]
ఎన్నిక ప్రకటన ముందు ప్రజలను మభ్యపెట్టేందుకు జోగి రమేష్ పోరంకి ద్వారకా రెసిడెన్సీలో ప్రజాదర్బార్ నిర్వహించారు. ప్రజల నుంచి స్వీకరించిన వినతులు బుట్టదాఖలయ్యాయి. ఆన్లైన్లో నమోదు చేసి రశీదులు ఇచ్చినా ఒక్క సమస్య కూడా పరిష్కారం కాలేదు. -
పేరు రక్షితం.. నీరు కలుషితం
[ 02-05-2024]
ప్రజలకు రోజూ స్వచ్ఛమైన తాగునీరు అందిస్తున్నామని పాలకులు చెబుతున్నా క్షేత్రస్థాయిలో మాత్రం అది అమలు కావడం లేదు. చాలాచోట్ల డ్రెయిన్ల వెంబడి పైపులైన్లు ఉండడం.. లీకైన వాటిని మరమ్మతులు చేపట్టకపోవడంతో మురుగునీరు సరఫరా అవుతుందని ప్రజలు మొరపెట్టుకుంటున్నారు. -
ప్రతి పథకమూ దోపిడీ కోసమే
[ 02-05-2024]
రాష్ట్రంలో ఐదేళ్లలో అమలు చేసిన ప్రతి పథకాన్నీ తన దోపిడీకి అనుగుణంగా మార్చుకున్న జగన్, అతని టీంకు మే 13న జరిగే ఎన్నికల్లో ప్రజలు బుద్ధి చెప్పి ఎన్డీయే కూటమి అభ్యర్థులను గెలిపించాలని ఎన్టీఆర్ తనయుడు నందమూరి రామకృష్ణ కోరారు. -
ఈ ప్రశ్నకు జవాబు చెప్పు?
[ 02-05-2024]
‘నాడు-నేడు కింద ప్రభుత్వ పాఠశాలల్లో అభివృద్ధి చేస్తున్నాం.. విద్యార్థులకు ఆంగ్లమాధ్యమంలో బోధనతో పాటు, టోఫెల్, స్లాష్, క్లాస్రూం ఎస్సెస్మెంట్ పరీక్షలు చేపడుతూ వారి సామర్థ్యాన్ని ఏ ప్రభుత్వం చేయలేని పద్ధతిలో పెంపొందిస్తున్నాం’ -
‘రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిన జగన్’
[ 02-05-2024]
మూడు రాజధానుల పేరుతో రాష్ట్ర అభివృద్ధిని సర్వనాశనం చేసిన ఘనుడు జగన్మోహన్రెడ్డి అని మాజీ మంత్రి, తెదేపా పొలిట్బ్యూరో సభ్యుడు యనమల రామకృష్ణుడు ధ్వజమెత్తారు. -
వైకాపా ప్రభుత్వాన్ని సాగనంపుదాం
[ 02-05-2024]
వైకాపా ప్రభుత్వాన్ని ప్రజలు సాగనంపాలని కూటమి అభ్యర్థి కాగిత కృష్ణప్రసాద్ పిలుపునిచ్చారు. బుధవారం మండలంలోని శింగరాయపాలెం, బల్లిపర్రు, కాకర్లమూడి, మడక, అచ్చయ్యవారిపాలెం, పుల్లపాడు తదితర గ్రామాల్లో ఆయన రోడ్ షో నిర్వహించారు. -
చీకటి పాలన నుంచి విముక్తులవుదాం: కొల్లు
[ 02-05-2024]
ఐదేళ్ల చీకటి పాలన నుంచి విముక్తులయ్యేందుకు అన్ని వర్గాల ప్రజలు సిద్ధంగా ఉండాలని మాజీ మంత్రి, తెదేపా అభ్యర్థి కొల్లు రవీంద్ర కోరారు. -
దళిత వ్యతిరేకి జగన్: జవహర్
[ 02-05-2024]
దళిత వ్యతిరేకి జగన్మోహన్రెడ్డికి తగు రీతిన బుద్ధి చెప్పేందుకు అందరూ సంఘటితం కావాలని మాజీ మంత్రి, తెదేపా నాయకులు కేఎస్ జవహర్ కోరారు. -
సంక్షేమ పాలన తెదేపాతోనే సాధ్యం
[ 02-05-2024]
కూటమి విజయాన్ని ఎవరూ ఆపలేరని ఎన్టీఆర్ తనయుడు నందమూరి రామకృష్ణ అన్నారు. పెడన మండలం నందమూరు, జింజేరు, జింజేరు గౌడపాలెం గ్రామాల్లో బుధవారం -
తెదేపా అభ్యర్థులకు ఘన స్వాగతం
[ 02-05-2024]
పెనమలూరు తెదేపా అభ్యర్థి బోడే ప్రసాద్, బందరు జనసేన ఎంపీ అభ్యర్థి వల్లభనేని బాలశౌరిల విజయాన్ని కాంక్షిస్తూ బుధవారం రాత్రి వరకు ఉయ్యూరులో బైక్ ర్యాలీ జరిగింది. -
వైకాపా కుక్కర్ కూపన్ల కేసు కంచికే..!
[ 02-05-2024]
అజిత్సింగ్నగర్ తోటవారివీధిలోని లక్కీ క్వాలిటీ ప్రింటర్స్లో ఎన్నికల అధికారులు స్వాధీనం చేసుకున్న వైకాపా కుక్కర్ కూపన్ల కేసు.. కంచికి చేరింది. -
వైద్యుడి కుటుంబం మృతి కేసులో విచారణ వేగవంతం
[ 02-05-2024]
పటమట పరిధిలో వైద్యుడు శ్రీనివాస్ కుటుంబం మృతి కేసులో విచారణను పోలీసులు వేగవంతం చేశారు. ఈ కేసును సీపీ స్వయంగా పర్యవేక్షిస్తుండంతో పోలీసులు పలు కోణాల్లో దర్యాప్తును ముమ్మరం చేసి కీలక సమాచారం రాబట్టినట్లు తెలుస్తోంది. -
వెలంపల్లికి చేదు అనుభవం
[ 02-05-2024]
సెంట్రల్ నియోజకవర్గ వైకాపా అభ్యర్థి వెలంపల్లి శ్రీనివాసరావుకు మద్యం మత్తులో ఉన్న వ్యక్తి నుంచి చేదు అనుభవం ఎదురైంది. బుధవారం ఆయన 23, 62 డివిజన్లలో పర్యటించారు. -
కొడాలి నానిని నిలదీసిన గ్రామస్థులు
[ 02-05-2024]
వలివర్తిపాడు గ్రామంలో ఎమ్మెల్యే కొడాలి శ్రీవెంకటేశ్వరరావు(నాని) బుధవారం ఎన్నికల ప్రచారం చేస్తుండగా..పలువురు మహిళలు ఆయన్ను తమ గ్రామంలో సమస్యలు పరిష్కరించలేదంటూ నిలదీశారు.
తాజా వార్తలు (Latest News)
-
బ్యాంకు ఖాతాల్లో పింఛన్ జమకాని వారికి.. మే 4న ఇస్తాం: శశి భూషణ్
-
97.76% రూ.2వేల నోట్లు వెనక్కి: ఆర్బీఐ
-
అభిమాని బర్త్డే సెలబ్రేట్ చేసి.. ఖరీదైన గిఫ్ట్ ఇచ్చి.. వీడియో వైరల్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
కిమ్ ‘సుఖం’ కోసం.. ఏడాదికి 25 మంది యువతులు!
-
ఆ క్యారెక్టర్ ప్లే చేయాలంటే భయమేసింది: రాశీఖన్నా