సార్టెక్సు రకాల విత్తనాలు ఏవీ?
ఖరీఫ్ సాగు ప్రారంభం అయింది. ఎన్టీఆర్ జిల్లాలో వరితో సమానంగా మెట్టపంటలుగా పత్తి, అపరాలు సాగు చేస్తున్నారు. నాగార్జున సాగర్ ఎడమకాలువ ద్వారా ఖరీఫ వరి సాగు చేస్తున్నారు. బోర్లు, బావుల కింద, చెరువుల కింద వరి సాగు అవుతోంది. ఈఏడాది ఇప్పటికి రెండు సార్లు వ్యవసాయ సలహా కమిటీ సమావేశం జరిగింది. అయినా విత్తనాలు మాత్రం ఆర్బీకేలలో అందుబాటులో లేవు. రైతులు ప్రైవేటు వ్యాపారుల చుట్టూ తిరుగుతున్నారు. తొలకరి ప్రారంభం కావడం వర్షాలు కురవడంతో పత్తిచేలు దుక్కులు ప్రారంభించారు. పత్తి గింజల కోసం తిరుగుతున్నారు. నకిలీ పత్తి విత్తనాలు, బీటీ పత్తి విత్తనాలు రైతులు మోసపోతున్నారు.
ప్రైవేటు వ్యాపారులే దిక్కు!
ఎరువులు అందుబాటులో లేవు
ఈనాడు, అమరావతి
ఖరీఫ్ సాగు ప్రారంభం అయింది. ఎన్టీఆర్ జిల్లాలో వరితో సమానంగా మెట్టపంటలుగా పత్తి, అపరాలు సాగు చేస్తున్నారు. నాగార్జున సాగర్ ఎడమకాలువ ద్వారా ఖరీఫ వరి సాగు చేస్తున్నారు. బోర్లు, బావుల కింద, చెరువుల కింద వరి సాగు అవుతోంది. ఈఏడాది ఇప్పటికి రెండు సార్లు వ్యవసాయ సలహా కమిటీ సమావేశం జరిగింది. అయినా విత్తనాలు మాత్రం ఆర్బీకేలలో అందుబాటులో లేవు. రైతులు ప్రైవేటు వ్యాపారుల చుట్టూ తిరుగుతున్నారు. తొలకరి ప్రారంభం కావడం వర్షాలు కురవడంతో పత్తిచేలు దుక్కులు ప్రారంభించారు. పత్తి గింజల కోసం తిరుగుతున్నారు. నకిలీ పత్తి విత్తనాలు, బీటీ పత్తి విత్తనాలు రైతులు మోసపోతున్నారు. ప్రతి ఏడాది నకిలీ పత్తివిత్తనాలను గ్రామాలకు తిరిగి కొంతమంది వ్యాపారులు అంటగడుతున్నారు. ప్రభుత్వం ఎరువులు విత్తనాలు ఆర్బీకేల ద్వారా సరఫరా చేస్తామని ప్రకటించింది. కానీ ఆర్బీలలో ఇంతవరకు అందుబాటులోకి రాలేదు. వరిలో బీపీటీలతో పాటు ఎంటీయూ రకాలను రైతులు సాగు చేస్తున్నారు. ఎంటీయూలో 1061 మినహా ఇతర రకాల ధాన్యం ప్రభుత్వం కొనుగోలు చేయడం లేదు. ఇవి సాగు చేయవద్దని సూచనలు చేస్తున్నారు. ప్రస్తుతం ఈ రెండు రకాల విత్తనాల సమీకరణలో అన్నదాతలు ఉన్నారు. చాలా వరకు రైతులు వరి విత్తనాలు స్వయంగానే సమకూర్చుకుంటారు. కానీ వ్యవసాయ పరిశోధనా క్షేత్రాల ద్వారా వచ్చిన వంగడాలు ఎక్కువ దిగుబడి, తక్కువ చీడలు ఉంటాయని భావించి విత్తనాల కోసం తిరుగుతున్నారు. ప్రస్తుతం కేవలం 4వేల క్వింటాళ్ల విత్తనాలు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. నాన్సార్టెక్స్ రకాలను సాగు చేయవద్దని అధికారులే సూచిస్తున్నారు. ఈ రకాలు నూక, మచ్చ, పాడైన గింజలు ఉండటం, సరిగా ఉడకకపోవడం లాంటి కారణాలు చెబుతున్నారు. కేవలం ఉప్పుడు బియ్యం కోసం మాత్రమే వినియోగిస్తారు. ప్రస్తుతం బీపీటీ, ఎంటీయూ 1061 రకాలు మా~రత్రే ఉన్నాయి. ఇవి కేజీ రూ.5 చొప్పున విక్రయిస్తున్నారు. కొంతమంది రైతులు ప్రైవేటుగా సమకూర్చుకోవాల్సి వస్తోంది. పత్తి విత్తనాలు, మిరప విత్తనాలు ఇంకా ఆర్బీకేలలో లేవు. ఎరువులు మొత్తం 1.04లక్షల టన్నులకు కేవలం 13000 టన్నులు మాత్రమే గోదాముల్లో ఉంది. పత్తి, మిరప విత్తనాలు ఆర్బీకేలలో ప్రీమియం రకాలు లభ్యమవుతాయని అధికారులు చెబుతున్నా అందుబాటులో రాలేదు.
కృష్ణా జిల్లాలో..
కృష్ణా జిల్లాలో ప్రధానంగా డెల్టా కింద వరి సాగు చేస్తారు. చెరుకు, పసుపు, ఉద్యాన పంటలు ఉన్నాయి. ఈ ఖరీఫ్లో 1,64,856 ఎకరాల్లో వరి సాగు చేస్తారని అంచనా. ఈనెల 10నే సాగునీరు విడుదల చేశారు. సార్టెక్సు రకాలైన బీపీటీ5204, ఎంటీయూ 1061 రకాలను సాగు చేయాలని వ్యవసాయ శాఖ అధికారులు సూచనలు చేస్తున్నారు. ఈవిత్తనాలు 52వేల క్విటాళ్లు అవసరం కాగా కృష్ణా జిల్లాలో కేవలం 6,690 కింటాళ్లు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. చెరకు 10,212 ఎకరాలు, పసుపు 1,884 ఎకరాలు సాగువిస్తీర్ణం విత్తనాలు రైతులే సమకూర్చుకోనున్నారు. ఈ విత్తనాలు ప్రభుత్వం సరఫరా లేదు. ఆర్బీకేలలో కేవలం 5వేల క్వింటాళ్ల ఎరువులు మాత్రమే అందుబాటులో ఉన్నాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జనం భూమిలో... జగన్ చిచ్చు..!
[ 27-04-2024]
ఉంగుటూరు మండలం ఎలుకపాడులో సర్వే నంబరు 31/1లో 50 మంది దళితులకు అసైన్డ్ భూమి కేటాయించారు. పాసుపుస్తకాలు కూడా అందాయి. వీరిలో నలుగురి వివరాలే ఆన్లైన్ అయ్యాయి. -
113 నామపత్రాలకు ఆమోదం
[ 27-04-2024]
జిల్లాలోని పార్లమెంట్, అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేసేందుకు దాఖలైన వాటిలో 113 నామపత్రాలు సక్రమంగా ఉన్నట్లు ఎన్నికల అధికారులు నిర్ధారించారు. అన్ని రిటర్నింగ్ అధికారుల కార్యాలయాల్లో శుక్రవారం నామపత్రాలు పరిశీలన కార్యక్రమం నిర్వహించారు. -
ఏ ముఖం పెట్టుకుని ఓట్లడగడానికి వస్తారు
[ 27-04-2024]
గన్నవరం నియోజకవర్గానికి చెందిన అంబాపురం పంచాయతీ నగరానికి చేరువుగా ఉన్నా.. అభివృద్ధి జాడ మాత్రం కన్పించడం లేదు. అంతరవలయ రహదారికి ఒకవైపు నగరపాలకసంస్థ అందమైన రహదారులతో, తాగునీరు, కాలువలతో సౌకర్యాలు ఏర్పాటు చేస్తుంటే.. -
తలపడలేక.. తొండాట!
[ 27-04-2024]
సారూప్యం ఉన్న పేర్లతో నామినేషన్ల జిమ్మిక్కులు.. ప్రభుత్వ వ్యతిరేక ఓట్లను చీల్చి ప్రత్యర్థికి నష్టం కలిగించే ఎత్తుగడలు.. అసంబద్ధ ఫిర్యాదులు.. ఇలా ఎన్నో వ్యూహాలు.. ఎత్తుగడల మధ్య నామినేషన్ల పరిశీలన క్రతువు ముగిసింది. -
ఎంపీ బాలశౌరిపై.. పేర్ని కుతంత్రాలు!
[ 27-04-2024]
జనసేన, తెదేపా, భాజపా కూటమి అభ్యర్థిగా.. మచిలీపట్నం లోక్సభ బరిలో దిగిన.. ఎంపీ బాలశౌరికి జనంలో వస్తున్న ఆదరణను చూసి.. వైకాపా జిల్లా అధ్యక్షుడు పేర్ని నానికి ఓటమి భయం పట్టుకుంది. బాలశౌరిని నేరుగా ఢీకొట్టలేక.. అడ్డదారుల్లో ఓడించాలని తీవ్రంగా కుతంత్రాలు ఆరంభించారు. -
బందరులో ఓ తిక్కసన్నాసి ఉన్నారు: బాలశౌరి
[ 27-04-2024]
విజయం అనేది కష్టపడితే వస్తుంది..ప్రజలకు మేలు చేస్తే ఆశీర్వదిస్తారు.. కానీ బందరులో ఓ తిక్కసన్నాసి ఉన్నారు.. ఓటమి భయం పట్టుకుని తన పేరుతో ఉన్న వ్యక్తులతో నామినేషన్లు వేయించారని ఎమ్మెల్యే పేర్ని నానీని ఉద్దేశించి కూటమి మచిలీపట్నం ఎంపీ అభ్యర్థి బాలశౌరి పరోక్షంగా విమర్శించారు. -
మిగులు పనుల పూర్తికి ఐదేళ్లా..!
[ 27-04-2024]
తెదేపా హయాంలో కానూరు వీఆర్ సిద్ధార్థ ఇంజినీరింగ్ కళాశాలలో యాజమాన్యం వారు సొంత నిధులు వెచ్చించి వంతెన నిర్మించారు. కొన్ని పనులు మిగిలిపోయాయి. వాటిని పూర్తి చేయడానికి ఇంకా రూ.2.50 కోట్లు అవసరం. -
కాంగ్రెస్ను గెలిపిస్తే ప్రత్యేక హోదా.. రుణమాఫీ
[ 27-04-2024]
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తేనే రాష్ట్రానికి పదేళ్లు ప్రత్యేకహోదా వస్తుందని, రైతులకు రూ.2 లక్షల వరకు రుణమాఫీ అవుతుందని; పోలవరం, అమరావతి నిర్మాణం శరవేగంగా జరుగుతుందని పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల చెప్పారు. -
గురువులపై కక్షగట్టి
[ 27-04-2024]
వైకాపా పాలనలో గురువులపై ఒత్తిడి పెరిగింది. పాఠాలు చెప్పడంతోనే వారి బాధ్యత తీరిపోలేదు. యాప్లో అటెండెన్స్ ఆలస్యంగా వేసినా, ఏదైనా ప్రధాన కారణం చేత స్పాట్ వాల్యుయేషన్కు హాజరు కాకపోయినా, బయోమెట్రిక్ వాడకపోయినా సంజాయిషీ తాఖీదు తప్పదు. -
సర్వే అన్నారు.. భూవిస్తీర్ణం తగ్గించారు
[ 27-04-2024]
భూ సంబంధిత సమస్యలన్నింటినీ శాశ్వతంగా పరిష్కరించడంతోపాటు వివాదాలు తలెత్తకుండా హద్దులు ఏర్పాటు చేసి అందరికీ మళ్లీ భూహక్కు పత్రాలు అందిస్తాం. దీని కోసం అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని కూడా వినియోగిస్తున్నాం. -
ఒక్క అవకాశం ఇవ్వండి.. అభివృద్ధి చేసి చూపుతా
[ 27-04-2024]
ఇచ్చిన హామీలను అమలు చేయకపోతే ప్రజాప్రతినిధులను రీకాల్ చేసే విధానం రావాలని, పశ్చిమ నియోజకవర్గంలో ముస్లింలకు తాను ఎప్పుడూ అండగా ఉంటానని కేంద్ర మాజీ మంత్రి, ఎన్డీయే కూటమి విజయవాడ పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి సుజనా చౌదరి పేర్కొన్నారు. -
విజయవాడ ఎంపీ బరిలో 19 నామినేషన్ల ఆమోదం
[ 27-04-2024]
విజయవాడ లోక్సభ స్థానానికి సంబంధించి నామినేషన్ల పరిశీలన (స్క్రూటినీ) ప్రక్రియ శుక్రవారం పూర్తయింది. సక్రమంగా ఉన్న 19 నామినేషన్లు చెల్లుబాటయ్యాయి. వివిధ కారణాలతో 15 నామినేషన్లను తిరస్కరించినట్టు రిటర్నింగ్ అధికారి, కలెక్టర్ ఎస్.డిల్లీరావు తెలిపారు.
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (27/04/24)
-
విరాట్ - హార్దిక్కు నో ఛాన్స్.. ఈ లఖ్నవూ స్టార్కు ప్లేస్: భారత మాజీ క్రికెటర్
-
ఏడాదికి ‘రెండు సార్లు’ సీబీఎస్ఈ బోర్డు పరీక్షలు.. 2025 నుంచే!
-
అనుపమ ‘పరదా’.. అదితి ఆన్డ్యూటీ.. భూమీ భలే డ్రెస్సు!
-
బిగ్ సేవింగ్ డేస్ సేల్కు సిద్ధమైన ఫ్లిప్కార్ట్.. ఎప్పటినుంచంటే?
-
‘పుష్ప’ కేశవ రోల్కు సుహాస్ని అనుకున్నాం.. కానీ!: సుకుమార్