ప్రయాణం ప్రాణ సంకటం
జిల్లాలోని పలు ప్రాంతాల్లో గల వంతెనలు శిథిలమై ఎప్పుడు కూలిపోతాయో తెలియని దుస్థితి. కూలేందుకు సిద్ధంగా ఉన్న వాటిపై ప్రయాణించాలంటే ప్రజలకు నిత్యం ప్రాణసంకటంగా మారింది. వాటిలో ఒక వంతెన ఎనిమిదేళ్ల కిందట కూలిపోతుండటంతో పక్కనే బెయిలి బ్రిడ్జి నిర్మించారు.
ప్రతిపాదనలకే పరిమితమవుతున్న వంతెనల నిర్మాణం
న్యూస్టుడే, కూచిపూడి
జిల్లాలోని పలు ప్రాంతాల్లో గల వంతెనలు శిథిలమై ఎప్పుడు కూలిపోతాయో తెలియని దుస్థితి. కూలేందుకు సిద్ధంగా ఉన్న వాటిపై ప్రయాణించాలంటే ప్రజలకు నిత్యం ప్రాణసంకటంగా మారింది. వాటిలో ఒక వంతెన ఎనిమిదేళ్ల కిందట కూలిపోతుండటంతో పక్కనే బెయిలి బ్రిడ్జి నిర్మించారు. అది కూడా పూర్తిగా శిథిలమై కుయ్యో..మొర్రో.. అంటోంది. దీంతో పాత వంతెనపై మీదుగానే వాహనదారులు బిక్కుబిక్కుమంటూ రాకపోకలు సాగిస్తున్నారు. మొవ్వ మండలం చినముత్తేవిలో గేదలకోడు డ్రెయిన్పై నిర్మించిన వంతెన కూడా పూర్తిగా పాడైంది. నేడో..రేపో కూలిపోయేందుకు సిద్ధంగా ఉంది. వివరాల్లోకి వెళ్తే..
మొవ్వ నుంచి మచిలీపట్నం వెళ్లే ప్రధాన మార్గంలోని కాజ శివారు ఐనంపూడి డ్రెయిన్పై ఏడు దశాబ్దాల కిందట నిర్మించిన వంతెన రెయిలింగ్ విరిగిపోయి శ్లాబు కూలిపోతుంది. దీంతో ఆర్ అండ్ బీ శాఖ బెయిలి బ్రిడ్జిని నిర్మించింది. దానిపై భారీ వాహనాలు రాకపోకలు చేస్తుండడంతో మూడేళ్లుగా రేకులు లేచిపోయి ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. ప్రస్తుతం తాత్కాలిక మరమ్మతులు చేస్తున్నారు. బెయిలి బ్రిడ్జికూడా ప్రమాదకరంగా మారడంతో కూలిపోతున్న పాత వంతెనపైనే ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని ప్రయాణిస్తున్నారు. మొవ్వ, ఘంటసాల మండలాల్లోని 15 గ్రామాల ప్రజలు ఈ మార్గంలో నిత్యం మచిలీపట్నం ప్రయాణిస్తుంటారు. ఈ వంతెన కూలిపోతే కూచిపూడి, పామర్రు మీదుగా వ్యయప్రయాసలతో మచిలీపట్నం చేరుకోవాలి. ఇక్కడ వంతెన నిర్మాణానికి ఆర్అండ్బీ శాఖ రూ.6.5 కోట్లతో ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించినా ఇంతవరకూ నిధులు మంజూరు కాలేదు. ఇదిలా ఉండగా కూచిపూడి నుంచి మచిలీపట్నం వెళ్లే ఆర్అండ్బీ దారిలో చినముత్తేవి వద్ద ఐనంపూడి డ్రెయిన్పై వంతెన శ్లాబు కూలిపోవడంతో ప్రస్తుతం బెయిలి వంతెన నిర్మిస్తున్నారు.
చినముత్తేవిలో గేదలకోడు డ్రెయిన్పై పూర్తిగా శిథిలమైన వంతెన
* చినముత్తేవిలో గేదలకోడు డ్రెయిన్పై వంతెన గోడలు పడిపోతున్నాయి. రెయిలింగ్ కూడా లేదు. ఇటీవల ఒక లారీ కూడా వంతెనపై నుంచి కాల్వలోకి పడిపోయింది. ఎప్పుడు కూలుతుందో కూడా తెలియని పరిస్థితి. ఈ వంతెనలపై మొవ్వ మండలంలోని ప్రజలే కాకుండా పమిడిముక్కల, తోట్లవల్లూరు మండలాల్లోని పలు గ్రామాల ప్రజలు, ఇతర ప్రాంతాల ప్రయాణికులు కూచిపూడి మీదుగా చినముత్తేవి, నిడుమోలు నుంచి జిల్లా కేంద్రమైన మచిలీపట్నం రాకపోకలు సాగిస్తుంటారు.
అంచనాలు రూపొందిస్తున్నాం - హరీష్, ఆర్అండ్బీ జేఈ
ఈ వంతెనల నిర్మాణంపై ప్రతిపాదనలు రూపొందిస్తున్నాం. అత్యవసర నిర్మాణాల కింద నిధులు మంజూరు చేయాలని ప్రభుత్వాన్ని కోరతాం. ఐనంపూడి డ్రెయిన్పై వంతెనకు ఎన్డీబీ నిధులు కింద ప్రతిపాదనలు ఉన్నాయి. అయితే ఇంతవరకూ నిధులు మంజూరు కాలేదు
తాత్కాలికంగా బెయిలి బ్రిడ్జి నిర్మించి చేతులు దులిపేసుకున్నారు. దానిపై టీవీఎస్ మోపెడ్తో వెళ్తూ పడిపోయి గాయపడ్డాను. ఇటీవల ఒక ఆటో కూడా రేకుల మధ్య ఇరుక్కుపోయి పెను ప్రమాదం తప్పింది. ద్విచక్రవాహన చోదకులు ఏమాత్రం అదమరచి ప్రయాణిస్తే అనంత లోకాలకు చేరుకోవాల్సిందే. వెంటనే కొత్త వంతెన నిర్మించాలి. వర్షాకాలం కావడంతో ప్రస్తుతం మురుగు కాల్వలోకి వచ్చేస్తుంది.
ప్రమాదకరంగా మారాయి
- మహ్మద్ హుస్సేన్, ప్రయాణికుడు, మచిలీపట్నం
మచిలీపట్నం నుంచి రోజూ కూచిపూడి వచ్చి ఓ రెస్టారెంట్లో పని చేస్తున్నాను. మోటార్ సైకిల్పై ప్రయాణించాలంటే భయంగానే ఉంది. చినముత్తేవిలో ఇటీవల వంతెన శ్లాబు కూలిపోయింది. గేదెలకోడుపై వంతెన రెయిలింగ్ ఊడిపోయి ప్రమాదభరితంగా మారింది. ఏ వంతెన పడిపోయినా కూచిపూడి నుంచి పామర్రు, నిడుమోలు మీదుగా అధిక దూరం ప్రయాణించి మచిలీపట్నం చేరుకోవాలి. ఈ రెండు వంతెనల్ని పూర్తిస్థాయిలో నిర్మించి ప్రజలు, ప్రయాణికుల ఇబ్బందులు తొలగించాలి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
113 నామపత్రాలకు ఆమోదం
[ 27-04-2024]
జిల్లాలోని పార్లమెంట్, అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేసేందుకు దాఖలైన వాటిలో 113 నామపత్రాలు సక్రమంగా ఉన్నట్లు ఎన్నికల అధికారులు నిర్ధారించారు. అన్ని రిటర్నింగ్ అధికారుల కార్యాలయాల్లో శుక్రవారం నామపత్రాలు పరిశీలన కార్యక్రమం నిర్వహించారు. -
ఏ ముఖం పెట్టుకుని ఓట్లడగడానికి వస్తారు
[ 27-04-2024]
గన్నవరం నియోజకవర్గానికి చెందిన అంబాపురం పంచాయతీ నగరానికి చేరువుగా ఉన్నా.. అభివృద్ధి జాడ మాత్రం కన్పించడం లేదు. అంతరవలయ రహదారికి ఒకవైపు నగరపాలకసంస్థ అందమైన రహదారులతో, తాగునీరు, కాలువలతో సౌకర్యాలు ఏర్పాటు చేస్తుంటే.. -
తలపడలేక.. తొండాట!
[ 27-04-2024]
సారూప్యం ఉన్న పేర్లతో నామినేషన్ల జిమ్మిక్కులు.. ప్రభుత్వ వ్యతిరేక ఓట్లను చీల్చి ప్రత్యర్థికి నష్టం కలిగించే ఎత్తుగడలు.. అసంబద్ధ ఫిర్యాదులు.. ఇలా ఎన్నో వ్యూహాలు.. ఎత్తుగడల మధ్య నామినేషన్ల పరిశీలన క్రతువు ముగిసింది. -
ఎంపీ బాలశౌరిపై.. పేర్ని కుతంత్రాలు!
[ 27-04-2024]
జనసేన, తెదేపా, భాజపా కూటమి అభ్యర్థిగా.. మచిలీపట్నం లోక్సభ బరిలో దిగిన.. ఎంపీ బాలశౌరికి జనంలో వస్తున్న ఆదరణను చూసి.. వైకాపా జిల్లా అధ్యక్షుడు పేర్ని నానికి ఓటమి భయం పట్టుకుంది. బాలశౌరిని నేరుగా ఢీకొట్టలేక.. అడ్డదారుల్లో ఓడించాలని తీవ్రంగా కుతంత్రాలు ఆరంభించారు. -
బందరులో ఓ తిక్కసన్నాసి ఉన్నారు: బాలశౌరి
[ 27-04-2024]
విజయం అనేది కష్టపడితే వస్తుంది..ప్రజలకు మేలు చేస్తే ఆశీర్వదిస్తారు.. కానీ బందరులో ఓ తిక్కసన్నాసి ఉన్నారు.. ఓటమి భయం పట్టుకుని తన పేరుతో ఉన్న వ్యక్తులతో నామినేషన్లు వేయించారని ఎమ్మెల్యే పేర్ని నానీని ఉద్దేశించి కూటమి మచిలీపట్నం ఎంపీ అభ్యర్థి బాలశౌరి పరోక్షంగా విమర్శించారు. -
మిగులు పనుల పూర్తికి ఐదేళ్లా..!
[ 27-04-2024]
తెదేపా హయాంలో కానూరు వీఆర్ సిద్ధార్థ ఇంజినీరింగ్ కళాశాలలో యాజమాన్యం వారు సొంత నిధులు వెచ్చించి వంతెన నిర్మించారు. కొన్ని పనులు మిగిలిపోయాయి. వాటిని పూర్తి చేయడానికి ఇంకా రూ.2.50 కోట్లు అవసరం. -
కాంగ్రెస్ను గెలిపిస్తే ప్రత్యేక హోదా.. రుణమాఫీ
[ 27-04-2024]
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తేనే రాష్ట్రానికి పదేళ్లు ప్రత్యేకహోదా వస్తుందని, రైతులకు రూ.2 లక్షల వరకు రుణమాఫీ అవుతుందని; పోలవరం, అమరావతి నిర్మాణం శరవేగంగా జరుగుతుందని పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల చెప్పారు. -
గురువులపై కక్షగట్టి
[ 27-04-2024]
వైకాపా పాలనలో గురువులపై ఒత్తిడి పెరిగింది. పాఠాలు చెప్పడంతోనే వారి బాధ్యత తీరిపోలేదు. యాప్లో అటెండెన్స్ ఆలస్యంగా వేసినా, ఏదైనా ప్రధాన కారణం చేత స్పాట్ వాల్యుయేషన్కు హాజరు కాకపోయినా, బయోమెట్రిక్ వాడకపోయినా సంజాయిషీ తాఖీదు తప్పదు. -
సర్వే అన్నారు.. భూవిస్తీర్ణం తగ్గించారు
[ 27-04-2024]
భూ సంబంధిత సమస్యలన్నింటినీ శాశ్వతంగా పరిష్కరించడంతోపాటు వివాదాలు తలెత్తకుండా హద్దులు ఏర్పాటు చేసి అందరికీ మళ్లీ భూహక్కు పత్రాలు అందిస్తాం. దీని కోసం అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని కూడా వినియోగిస్తున్నాం. -
ఒక్క అవకాశం ఇవ్వండి.. అభివృద్ధి చేసి చూపుతా
[ 27-04-2024]
ఇచ్చిన హామీలను అమలు చేయకపోతే ప్రజాప్రతినిధులను రీకాల్ చేసే విధానం రావాలని, పశ్చిమ నియోజకవర్గంలో ముస్లింలకు తాను ఎప్పుడూ అండగా ఉంటానని కేంద్ర మాజీ మంత్రి, ఎన్డీయే కూటమి విజయవాడ పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి సుజనా చౌదరి పేర్కొన్నారు. -
విజయవాడ ఎంపీ బరిలో 19 నామినేషన్ల ఆమోదం
[ 27-04-2024]
విజయవాడ లోక్సభ స్థానానికి సంబంధించి నామినేషన్ల పరిశీలన (స్క్రూటినీ) ప్రక్రియ శుక్రవారం పూర్తయింది. సక్రమంగా ఉన్న 19 నామినేషన్లు చెల్లుబాటయ్యాయి. వివిధ కారణాలతో 15 నామినేషన్లను తిరస్కరించినట్టు రిటర్నింగ్ అధికారి, కలెక్టర్ ఎస్.డిల్లీరావు తెలిపారు.
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (27/04/24)
-
విరాట్ - హార్దిక్కు నో ఛాన్స్.. ఈ లఖ్నవూ స్టార్కు ప్లేస్: భారత మాజీ క్రికెటర్
-
ఏడాదికి ‘రెండు సార్లు’ సీబీఎస్ఈ బోర్డు పరీక్షలు.. 2025 నుంచే!
-
అనుపమ ‘పరదా’.. అదితి ఆన్డ్యూటీ.. భూమీ భలే డ్రెస్సు!
-
బిగ్ సేవింగ్ డేస్ సేల్కు సిద్ధమైన ఫ్లిప్కార్ట్.. ఎప్పటినుంచంటే?
-
‘పుష్ప’ కేశవ రోల్కు సుహాస్ని అనుకున్నాం.. కానీ!: సుకుమార్