ఇంటింటికీ బియ్యం కాదు.. నగదే..!
‘అదేంటి కేజీ రూ.10 చొప్పున ఇస్తున్నారు కదా..! నువ్వేంటి రూ7 అంటున్నావు’ ‘చాలా రిస్క్ అవుతుంది. అయినా బియ్యంలో నూక ఎక్కువగా ఉంది. నీ ఇష్టం అయితే ఇవ్వు. లేకపోతే లేదు’
ఎండీయూల వాహనాల్లోనే అక్రమ రవాణా
ఈనాడు, అమరావతి
ఎండీయూల వద్ద బియ్యం బదులు నగదు అందిస్తున్న దృశ్యం
‘అదేంటి కేజీ రూ.10 చొప్పున ఇస్తున్నారు కదా..! నువ్వేంటి రూ7 అంటున్నావు’
‘చాలా రిస్క్ అవుతుంది. అయినా బియ్యంలో నూక ఎక్కువగా ఉంది. నీ ఇష్టం అయితే ఇవ్వు. లేకపోతే లేదు’
ఇదీ ఎండీయూ ఆపరేటర్కు, లబ్ధిదారు రాలకు మధ్య జరిగిన సంభాషణ తరువాత లబ్ధిదారులకు బియ్యం ఇవ్వకుండా వేలిముద్ర వేయించుకుని నగదు ఇచ్చేశారు.
ఇది ఒక చోట జరిగే తంతు కాదు.. రెండు జిల్లాల్లో చాలాచోట్ల జరుగుతోంది. ప్రభుత్వం పేదలకు పనిదినాలు కలిసిరావాలని, ఇంటింటికే బియ్యం పథకం పేరుతో ఎండీయూలను ఏర్పాటు చేసింది. ఈ ఎండీయూలు బియ్యం పంపిణీ చేయకపోగా అదే బియ్యం అక్రమ రవాణాకు ఉపయోగపడుతున్నాయి. లబ్ధిదారులకు నగదు ఇచ్చి అదే వాహనంలో బియ్యం నల్లబజారుకు తరలిస్తున్నారు.\
ఉమ్మడి జిల్లాలో మొత్తం 813 సంచార వాహన యూనిట్లు ఉన్నాయి. ప్రతి ఇంటికి వెళ్లాల్సి ఉండగా.. గ్రామంలో ఒకచోట నిలిపి బియ్యం తీసుకునేవారికి బియ్యం, లేదంటే కేజీకి రూ.7 చొప్పున నగదు ఇచ్చేస్తున్నారు. ఇటీవల కంచికచర్లలో విజిలెన్సుదాడుల్లో బియ్యం భారీగా పట్టుబడింది. తాడేపల్లిలో విజయవాడ నుంచి తరలించే రేషన్ బియ్యం పట్టుకున్నారు. భారీగా రవాణా..!
ఉభయ జిల్లాల నుంచి రేషన్ బియ్యం నేరుగా కాకినాడ పోర్టుకు తరలిస్తున్నారు. సిబ్బంది కొరత, సౌకర్యాల లేమితో విజిలెన్సు విభాగం చేతులెత్తేస్తోంది. గతంలో పౌరసరఫరాల సంస్థకు ప్రత్యేకంగా విజిలెన్సు విభాగం ఉంది. ప్రస్తుతం విజిలెన్సు అండ్ ఎన్ఫోర్సుమెంట్ విభాగం చూస్తోంది. నిఘా విభాగాన్ని ఇంకా విభజించలేదు. రెండు జిల్లాల్లో ఇదే పర్యవేక్షిస్తోంది. ఇటీవల వ్యవసాయ పనులు ముమ్మరం కావడంతో ఎరువుల దుకాణాలపై నిఘా పెంచింది. రెండు జిల్లాల నుంచి నెలకు రూ.200 కోట్ల వ్యాపారం రేషన్ బియ్యంతో జరుగుతోందని అంచనా. ఈ వ్యాపారంలో ఎంతోమంది ప్రముఖులే భాగస్వాములుగా ఉన్నారు. డీలర్ల నుంచి మాత్రమే కాకుండా మండల స్థాయి నిలువ గోదాముల నుంచి నేరుగా వందట టన్నుల బియ్యం లేపేశారు. కరోనా సమయంలో రాష్ట్ర కోటాతో పాటు కేంద్రం కోటా ఉచిత బియ్యం అందించడంతో ఎక్కువగా నల్లబజారుకు తరలించారు. ఈనెల నుంచి కేంద్రం ఆహార భద్రత కింద ఇచ్చే ఉచిత బియ్యం కోటా తగ్గించారు. నిరుపేదల కార్డులకు మాత్రమే అందిస్తున్నారు. ఈ బియ్యం తినేందుకు అనువుగా లేవని డీలర్లవద్దే విక్రయిస్తున్నారు. ఇవే బియ్యాన్ని నల్లబజారులో రూ.25వరకు విక్రయిస్తున్నారు. రొయ్యలు, చేపల చెరువుల వారు ఈ బియ్యాన్ని తక్కువ ధరకు రూ.కేజీ 15 నుంచి రూ.20 చొప్పున కొనుగోలు చేస్తున్నారు. వీటిని నానబెట్టి, ఉడకబెట్టి ఫీడ్గా అందిస్తున్నారు.
మాఫియా ముఠానే..!
రేషన్ బియ్యం అక్రమ రవాణాలోనూ వ్యాపారులు సిండికేట్గా ఉన్నారు. సమాచారం లీక్ కానివ్వరు. ఒకరిపై ఒకరు దాడులు నిషిద్ధం. లంచాలు ఉమ్మడిగానే ఇస్తున్నారు. పశ్చిమకృష్ణా ప్రాంతంలో ఓ మహిళ రింగ్ లీడర్గా వ్యవహరిస్తున్నారు. అధికార పక్షంలో పలుకుబడి ఉండటంతో తను చెప్పిందే అమలు చేయాలి. ఒకవేళ లారీలు, ట్రక్కులు పట్టుబడితే డ్రైవర్లే బాధ్యత వహించాలి. తెరవెనుక పేర్లు బయటకు రావు. అధికారులు కూడా పరిశోధన ముందుకు వెళ్లనీయరు. కొంత రీసైక్లింగ్, మరికొంత కాకినాడ పోర్టుకు, ఇంకొంత ఆక్వా వ్యాపారానికి వెళుతుంది. స్థానికంగా హోటళ్లవారు రేషన్ బియ్యం కొనుగోలు చేస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జనం భూమిలో... జగన్ చిచ్చు..!
[ 27-04-2024]
ఉంగుటూరు మండలం ఎలుకపాడులో సర్వే నంబరు 31/1లో 50 మంది దళితులకు అసైన్డ్ భూమి కేటాయించారు. పాసుపుస్తకాలు కూడా అందాయి. వీరిలో నలుగురి వివరాలే ఆన్లైన్ అయ్యాయి. -
113 నామపత్రాలకు ఆమోదం
[ 27-04-2024]
జిల్లాలోని పార్లమెంట్, అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేసేందుకు దాఖలైన వాటిలో 113 నామపత్రాలు సక్రమంగా ఉన్నట్లు ఎన్నికల అధికారులు నిర్ధారించారు. అన్ని రిటర్నింగ్ అధికారుల కార్యాలయాల్లో శుక్రవారం నామపత్రాలు పరిశీలన కార్యక్రమం నిర్వహించారు. -
ఏ ముఖం పెట్టుకుని ఓట్లడగడానికి వస్తారు
[ 27-04-2024]
గన్నవరం నియోజకవర్గానికి చెందిన అంబాపురం పంచాయతీ నగరానికి చేరువుగా ఉన్నా.. అభివృద్ధి జాడ మాత్రం కన్పించడం లేదు. అంతరవలయ రహదారికి ఒకవైపు నగరపాలకసంస్థ అందమైన రహదారులతో, తాగునీరు, కాలువలతో సౌకర్యాలు ఏర్పాటు చేస్తుంటే.. -
తలపడలేక.. తొండాట!
[ 27-04-2024]
సారూప్యం ఉన్న పేర్లతో నామినేషన్ల జిమ్మిక్కులు.. ప్రభుత్వ వ్యతిరేక ఓట్లను చీల్చి ప్రత్యర్థికి నష్టం కలిగించే ఎత్తుగడలు.. అసంబద్ధ ఫిర్యాదులు.. ఇలా ఎన్నో వ్యూహాలు.. ఎత్తుగడల మధ్య నామినేషన్ల పరిశీలన క్రతువు ముగిసింది. -
ఎంపీ బాలశౌరిపై.. పేర్ని కుతంత్రాలు!
[ 27-04-2024]
జనసేన, తెదేపా, భాజపా కూటమి అభ్యర్థిగా.. మచిలీపట్నం లోక్సభ బరిలో దిగిన.. ఎంపీ బాలశౌరికి జనంలో వస్తున్న ఆదరణను చూసి.. వైకాపా జిల్లా అధ్యక్షుడు పేర్ని నానికి ఓటమి భయం పట్టుకుంది. బాలశౌరిని నేరుగా ఢీకొట్టలేక.. అడ్డదారుల్లో ఓడించాలని తీవ్రంగా కుతంత్రాలు ఆరంభించారు. -
బందరులో ఓ తిక్కసన్నాసి ఉన్నారు: బాలశౌరి
[ 27-04-2024]
విజయం అనేది కష్టపడితే వస్తుంది..ప్రజలకు మేలు చేస్తే ఆశీర్వదిస్తారు.. కానీ బందరులో ఓ తిక్కసన్నాసి ఉన్నారు.. ఓటమి భయం పట్టుకుని తన పేరుతో ఉన్న వ్యక్తులతో నామినేషన్లు వేయించారని ఎమ్మెల్యే పేర్ని నానీని ఉద్దేశించి కూటమి మచిలీపట్నం ఎంపీ అభ్యర్థి బాలశౌరి పరోక్షంగా విమర్శించారు. -
మిగులు పనుల పూర్తికి ఐదేళ్లా..!
[ 27-04-2024]
తెదేపా హయాంలో కానూరు వీఆర్ సిద్ధార్థ ఇంజినీరింగ్ కళాశాలలో యాజమాన్యం వారు సొంత నిధులు వెచ్చించి వంతెన నిర్మించారు. కొన్ని పనులు మిగిలిపోయాయి. వాటిని పూర్తి చేయడానికి ఇంకా రూ.2.50 కోట్లు అవసరం. -
కాంగ్రెస్ను గెలిపిస్తే ప్రత్యేక హోదా.. రుణమాఫీ
[ 27-04-2024]
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తేనే రాష్ట్రానికి పదేళ్లు ప్రత్యేకహోదా వస్తుందని, రైతులకు రూ.2 లక్షల వరకు రుణమాఫీ అవుతుందని; పోలవరం, అమరావతి నిర్మాణం శరవేగంగా జరుగుతుందని పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల చెప్పారు. -
గురువులపై కక్షగట్టి
[ 27-04-2024]
వైకాపా పాలనలో గురువులపై ఒత్తిడి పెరిగింది. పాఠాలు చెప్పడంతోనే వారి బాధ్యత తీరిపోలేదు. యాప్లో అటెండెన్స్ ఆలస్యంగా వేసినా, ఏదైనా ప్రధాన కారణం చేత స్పాట్ వాల్యుయేషన్కు హాజరు కాకపోయినా, బయోమెట్రిక్ వాడకపోయినా సంజాయిషీ తాఖీదు తప్పదు. -
సర్వే అన్నారు.. భూవిస్తీర్ణం తగ్గించారు
[ 27-04-2024]
భూ సంబంధిత సమస్యలన్నింటినీ శాశ్వతంగా పరిష్కరించడంతోపాటు వివాదాలు తలెత్తకుండా హద్దులు ఏర్పాటు చేసి అందరికీ మళ్లీ భూహక్కు పత్రాలు అందిస్తాం. దీని కోసం అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని కూడా వినియోగిస్తున్నాం. -
ఒక్క అవకాశం ఇవ్వండి.. అభివృద్ధి చేసి చూపుతా
[ 27-04-2024]
ఇచ్చిన హామీలను అమలు చేయకపోతే ప్రజాప్రతినిధులను రీకాల్ చేసే విధానం రావాలని, పశ్చిమ నియోజకవర్గంలో ముస్లింలకు తాను ఎప్పుడూ అండగా ఉంటానని కేంద్ర మాజీ మంత్రి, ఎన్డీయే కూటమి విజయవాడ పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి సుజనా చౌదరి పేర్కొన్నారు. -
విజయవాడ ఎంపీ బరిలో 19 నామినేషన్ల ఆమోదం
[ 27-04-2024]
విజయవాడ లోక్సభ స్థానానికి సంబంధించి నామినేషన్ల పరిశీలన (స్క్రూటినీ) ప్రక్రియ శుక్రవారం పూర్తయింది. సక్రమంగా ఉన్న 19 నామినేషన్లు చెల్లుబాటయ్యాయి. వివిధ కారణాలతో 15 నామినేషన్లను తిరస్కరించినట్టు రిటర్నింగ్ అధికారి, కలెక్టర్ ఎస్.డిల్లీరావు తెలిపారు.
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (27/04/24)
-
విరాట్ - హార్దిక్కు నో ఛాన్స్.. ఈ లఖ్నవూ స్టార్కు ప్లేస్: భారత మాజీ క్రికెటర్
-
ఏడాదికి ‘రెండు సార్లు’ సీబీఎస్ఈ బోర్డు పరీక్షలు.. 2025 నుంచే!
-
అనుపమ ‘పరదా’.. అదితి ఆన్డ్యూటీ.. భూమీ భలే డ్రెస్సు!
-
బిగ్ సేవింగ్ డేస్ సేల్కు సిద్ధమైన ఫ్లిప్కార్ట్.. ఎప్పటినుంచంటే?
-
‘పుష్ప’ కేశవ రోల్కు సుహాస్ని అనుకున్నాం.. కానీ!: సుకుమార్