logo

అందరి అభ్యున్నతికి చండీ హోమం

దేవీ శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా సకల సర్వ అభ్యున్నతికి చండీ హోమం నిర్వహిస్తున్నట్లు వేదపండితులు తెలిపారు. మండల పరిధిలోని టేకుపల్లి గ్రామ రామేశ్వరస్వామి దేవాలయంలో చండీ హోమం నిర్వహించారు.

Updated : 03 Oct 2022 16:33 IST

మోపిదేవి: దేవీ శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా సకల సర్వ అభ్యున్నతికి చండీ హోమం నిర్వహిస్తున్నట్లు వేదపండితులు తెలిపారు. మండల పరిధిలోని టేకుపల్లి గ్రామ రామేశ్వరస్వామి దేవాలయంలో చండీ హోమం నిర్వహించారు. ఆలయంలో కొలువై ఉన్న బాలాత్రిపుర సుందరీదేవి అమ్మవారు దుర్గాదేవి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. మండలంలోని పలు దేవాలయాల్లో అమ్మవార్లను దుష్టశక్తులను సంహరించే దుర్గగా భక్తులు కొలిచారు. ఈ సందర్భంగా సామూహిక కుంకుమార్చన, లలితాసహస్త్ర పారాయణం నిర్వహించి అమ్మవారిని గాజులతో అలంకరించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని