Sankalpa Siddhi: అల్లిబిల్లి పాయింట్లతో టోకరా.. సంకల్ప సిద్ధి మోసంలో కొత్త కోణం
డిపాజిటర్లకు సకాలంలో డబ్బులు చెల్లించకుండా కేవలం రెఫరల్ పాయింట్లనే చూపిస్తూ సంకల్ప సిద్ధి నిర్వాహకులు టోకరా వేశారు.
ఈనాడు - అమరావతి: డిపాజిటర్లకు సకాలంలో డబ్బులు చెల్లించకుండా కేవలం రెఫరల్ పాయింట్లనే చూపిస్తూ సంకల్ప సిద్ధి నిర్వాహకులు టోకరా వేశారు. వీటి కోసం ప్రత్యేకంగా వ్యాలెట్ను రూపొందించారు. అందులో ఇవి జమ అయ్యేవి. ఈ పాయింట్లను ఇతరులకు కూడా బదిలీ చేసే వెసులుబాటు కల్పించారు. ఈ కేసులోని నిందితులు సంస్థ వెబ్సైట్లో తమ బంధువుల పేర్లు పెట్టి లాగిన్ ఐడీలు రూపొందించారు. వాటికి ఈ పాయింట్లను క్రెడిట్ చేశారు. ఎక్కువ మందిని చేర్చిన వారికి మొబైల్, ట్యాబ్లు ఇవ్వనున్నట్లు ఆశచూపారు. దీంతో చాలా మంది పోటీపడి మరీ తెలిసిన వారిని చేర్పించారు. వెబ్సైట్ను పరిశీలిస్తున్న పోలీసులు కుప్పలుతెప్పలుగా ఉన్న ఐడీలను చూసి విస్తుపోయారు..
* మొత్తం 17 బ్యాంకు ఖాతాలను ఇప్పటికే పోలీసులు గుర్తించారు. వీటి ద్వారా అధికశాతం లావాదేవీలు జరిగినట్లు తేలింది. వీటికి సంబంధించిన రికార్డులు సక్రమంగా లేకపోవడమే కారణం. పాయింట్లతో బోగస్ సభ్యులను కుప్పలుతెప్పలుగా నిర్వాహకులు చేర్పించారు. సైట్ సామర్థ్యం తక్కువ కావడంతో క్రాష్ అయింది. అందరి వివరాలను వడపోస్తున్నారు. అసలు డిపాజిటర్ల సంఖ్య 30 నుంచి 35 వేల వరకు ఉంటారని ప్రాథమికంగా అంచనాకు వచ్చారు.
* రూ. వందల కోట్లలో వసూలు చేసిన డిపాజిట్లను ఎక్కడెక్కడ పెట్టుబడులు పెట్టారన్న అంశంపై పోలీసులు ప్రధానంగా దృష్టి సారించారు. ఇప్పటి వరకు గుర్తించిన ప్రకాశం జిల్లా కనిగిరి, నిడమానూరు, తదితర చోట్ల నిర్వాహకుల పేరున స్థిరాస్తులను సీజ్ చేసి, అటాచ్ చేసే ప్రయత్నాల్లో పోలీసులు ఉన్నారు. మరికొన్ని చోట్ల కూడా భూములు కొనుగోలు చేసి ఉంటారని అనుమానిస్తున్నారు. వీటి వివరాల కోసం పోలీసులు రిజిస్ట్రేషన్ల శాఖ ఐజీకి లేఖ రాయనున్నారు. ఇప్పటివరకు ఈ కేసుకు సంబంధించి మొత్తం ఆరుగురిని ఆరెస్టు చేశారు. సంస్థ సీఎండీ వేణుగోపాలకృష్ణ.. పోలీసుల ఇంటరాగేషన్లో పెద్దగా నోరు విప్పడం లేదు. తనకేమీ తెలియదని, కిరణ్కు అన్ని విషయాలూ తెలుసని చెబుతున్నారు.
* ఈ గొలుసుకట్టులో చేరింది ఎక్కువ మంది ప్రభుత్వ ఉద్యోగులే. వీరు తిరిగి తమకు తెలిసిన వారిని, బంధువులను కూడా కమీషన్ కోసం చేర్పించారు. గన్నవరం డిపో పరిధిలో చాలా మంది ఆర్టీసీ ఉద్యోగులు సంకల్ప సిద్ధిలోని వివిధ పథకాల్లో డిపాజిట్ చేయడంతో పాటు మరికొందరిని చేర్పించారు. పోలీసుల్లోనూ పలువురు బాధితులు ఉన్నారు. విద్యుత్తు సౌధలోనూ పెద్ద సంఖ్యలో సభ్యులుగా చేరారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జనం భూమిలో... జగన్ చిచ్చు..!
[ 27-04-2024]
ఉంగుటూరు మండలం ఎలుకపాడులో సర్వే నంబరు 31/1లో 50 మంది దళితులకు అసైన్డ్ భూమి కేటాయించారు. పాసుపుస్తకాలు కూడా అందాయి. వీరిలో నలుగురి వివరాలే ఆన్లైన్ అయ్యాయి. -
113 నామపత్రాలకు ఆమోదం
[ 27-04-2024]
జిల్లాలోని పార్లమెంట్, అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేసేందుకు దాఖలైన వాటిలో 113 నామపత్రాలు సక్రమంగా ఉన్నట్లు ఎన్నికల అధికారులు నిర్ధారించారు. అన్ని రిటర్నింగ్ అధికారుల కార్యాలయాల్లో శుక్రవారం నామపత్రాలు పరిశీలన కార్యక్రమం నిర్వహించారు. -
‘ఏ ముఖం పెట్టుకుని ఓట్లడగడానికి వస్తారు’
[ 27-04-2024]
గన్నవరం నియోజకవర్గానికి చెందిన అంబాపురం పంచాయతీ నగరానికి చేరువుగా ఉన్నా.. అభివృద్ధి జాడ మాత్రం కన్పించడం లేదు. అంతరవలయ రహదారికి ఒకవైపు నగరపాలకసంస్థ అందమైన రహదారులతో, తాగునీరు, కాలువలతో సౌకర్యాలు ఏర్పాటు చేస్తుంటే.. -
తలపడలేక.. తొండాట!
[ 27-04-2024]
సారూప్యం ఉన్న పేర్లతో నామినేషన్ల జిమ్మిక్కులు.. ప్రభుత్వ వ్యతిరేక ఓట్లను చీల్చి ప్రత్యర్థికి నష్టం కలిగించే ఎత్తుగడలు.. అసంబద్ధ ఫిర్యాదులు.. ఇలా ఎన్నో వ్యూహాలు.. ఎత్తుగడల మధ్య నామినేషన్ల పరిశీలన క్రతువు ముగిసింది. -
ఎంపీ బాలశౌరిపై.. పేర్ని కుతంత్రాలు!
[ 27-04-2024]
జనసేన, తెదేపా, భాజపా కూటమి అభ్యర్థిగా.. మచిలీపట్నం లోక్సభ బరిలో దిగిన.. ఎంపీ బాలశౌరికి జనంలో వస్తున్న ఆదరణను చూసి.. వైకాపా జిల్లా అధ్యక్షుడు పేర్ని నానికి ఓటమి భయం పట్టుకుంది. బాలశౌరిని నేరుగా ఢీకొట్టలేక.. అడ్డదారుల్లో ఓడించాలని తీవ్రంగా కుతంత్రాలు ఆరంభించారు. -
బందరులో ఓ తిక్కసన్నాసి ఉన్నారు: బాలశౌరి
[ 27-04-2024]
విజయం అనేది కష్టపడితే వస్తుంది..ప్రజలకు మేలు చేస్తే ఆశీర్వదిస్తారు.. కానీ బందరులో ఓ తిక్కసన్నాసి ఉన్నారు.. ఓటమి భయం పట్టుకుని తన పేరుతో ఉన్న వ్యక్తులతో నామినేషన్లు వేయించారని ఎమ్మెల్యే పేర్ని నానీని ఉద్దేశించి కూటమి మచిలీపట్నం ఎంపీ అభ్యర్థి బాలశౌరి పరోక్షంగా విమర్శించారు. -
మిగులు పనుల పూర్తికి ఐదేళ్లా..!
[ 27-04-2024]
తెదేపా హయాంలో కానూరు వీఆర్ సిద్ధార్థ ఇంజినీరింగ్ కళాశాలలో యాజమాన్యం వారు సొంత నిధులు వెచ్చించి వంతెన నిర్మించారు. కొన్ని పనులు మిగిలిపోయాయి. వాటిని పూర్తి చేయడానికి ఇంకా రూ.2.50 కోట్లు అవసరం. -
కాంగ్రెస్ను గెలిపిస్తే ప్రత్యేక హోదా.. రుణమాఫీ
[ 27-04-2024]
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తేనే రాష్ట్రానికి పదేళ్లు ప్రత్యేకహోదా వస్తుందని, రైతులకు రూ.2 లక్షల వరకు రుణమాఫీ అవుతుందని; పోలవరం, అమరావతి నిర్మాణం శరవేగంగా జరుగుతుందని పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల చెప్పారు. -
గురువులపై కక్షగట్టి
[ 27-04-2024]
వైకాపా పాలనలో గురువులపై ఒత్తిడి పెరిగింది. పాఠాలు చెప్పడంతోనే వారి బాధ్యత తీరిపోలేదు. యాప్లో అటెండెన్స్ ఆలస్యంగా వేసినా, ఏదైనా ప్రధాన కారణం చేత స్పాట్ వాల్యుయేషన్కు హాజరు కాకపోయినా, బయోమెట్రిక్ వాడకపోయినా సంజాయిషీ తాఖీదు తప్పదు. -
సర్వే అన్నారు.. భూవిస్తీర్ణం తగ్గించారు
[ 27-04-2024]
భూ సంబంధిత సమస్యలన్నింటినీ శాశ్వతంగా పరిష్కరించడంతోపాటు వివాదాలు తలెత్తకుండా హద్దులు ఏర్పాటు చేసి అందరికీ మళ్లీ భూహక్కు పత్రాలు అందిస్తాం. దీని కోసం అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని కూడా వినియోగిస్తున్నాం. -
ఒక్క అవకాశం ఇవ్వండి.. అభివృద్ధి చేసి చూపుతా
[ 27-04-2024]
ఇచ్చిన హామీలను అమలు చేయకపోతే ప్రజాప్రతినిధులను రీకాల్ చేసే విధానం రావాలని, పశ్చిమ నియోజకవర్గంలో ముస్లింలకు తాను ఎప్పుడూ అండగా ఉంటానని కేంద్ర మాజీ మంత్రి, ఎన్డీయే కూటమి విజయవాడ పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి సుజనా చౌదరి పేర్కొన్నారు. -
విజయవాడ ఎంపీ బరిలో 19 నామినేషన్ల ఆమోదం
[ 27-04-2024]
విజయవాడ లోక్సభ స్థానానికి సంబంధించి నామినేషన్ల పరిశీలన (స్క్రూటినీ) ప్రక్రియ శుక్రవారం పూర్తయింది. సక్రమంగా ఉన్న 19 నామినేషన్లు చెల్లుబాటయ్యాయి. వివిధ కారణాలతో 15 నామినేషన్లను తిరస్కరించినట్టు రిటర్నింగ్ అధికారి, కలెక్టర్ ఎస్.డిల్లీరావు తెలిపారు.
తాజా వార్తలు (Latest News)
-
ఈ చిట్టితల్లికి కష్టమొచ్చింది!
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (27/04/24)
-
విరాట్ - హార్దిక్కు నో ఛాన్స్.. ఈ లఖ్నవూ స్టార్కు ప్లేస్: భారత మాజీ క్రికెటర్
-
ఏడాదికి ‘రెండు సార్లు’ సీబీఎస్ఈ బోర్డు పరీక్షలు.. 2025 నుంచే!
-
అనుపమ ‘పరదా’.. అదితి ఆన్డ్యూటీ.. భూమీ భలే డ్రెస్సు!
-
బిగ్ సేవింగ్ డేస్ సేల్కు సిద్ధమైన ఫ్లిప్కార్ట్.. ఎప్పటినుంచంటే?