logo

కమనీయం.. తిరుపతమ్మ కల్యాణం

పెనుగంచిప్రోలులో గోపయ్య సమేత తిరుపతమ్మ కల్యాణోత్సవం ఆదివారం రాత్రి అంగరంగ వైభవంగా నిర్వహించారు.

Published : 06 Feb 2023 05:37 IST

అమ్మవారికి తలంబ్రాలు పోస్తున్న విప్‌ ఉదయభాను దంపతులు

పెనుగంచిప్రోలు, న్యూస్‌టుడే: పెనుగంచిప్రోలులో గోపయ్య సమేత తిరుపతమ్మ కల్యాణోత్సవం ఆదివారం రాత్రి అంగరంగ వైభవంగా నిర్వహించారు. అమ్మవారికి ప్రభుత్వ విప్‌ సామినేని ఉదయభాను దంపతులు పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించారు. కొల్లా వంశీయులు రాజశేఖర్‌, అపర్ణ దంపతులు, కాకాని వంశీయులు రంజిత్‌కుమార్‌, నిషిత దంపతులు, ఆలయ ఛైర్మన్‌ యింజం చెన్నకేశవరావు, ఈవో లీలాకుమార్‌, ఆర్‌డీవో రవీంద్రరావు, ఏఎస్పీ నాగేశ్వరరెడ్డి దంపతులు పీఠలపై కూర్చున్నారు. భారీగా తరలివచ్చిన భక్త జనం కల్యాణాన్ని వీక్షించారు.

వేడుకకు హాజరైన భక్తులు

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని