జన సమీకరణకు కుస్తీలురి
మూడు వాయిదాల అనంతరం ఎట్టకేలకు ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి గుడివాడ పర్యటన ఖరారైంది. ఈ నెల 9న ఉదయం 9 గంటలకు సీఎం జగన్ నేరుగా మాల్లాయపాలెంలో నిర్మించిన టిడ్కో కాలనీకి హెలికాప్టర్ ద్వారా చేరుకుంటారు.
మెప్మా, సచివాలయ సిబ్బంది, వాలంటీర్లకు లక్ష్యాలు
9న సీఎం గుడివాడ పర్యటన ఏర్పాట్లపై ఉన్నతస్థాయి సమీక్ష
హెలి ప్యాడ్ను పరిశీలిస్తున్న పురపాలక పరిపాలనా విభాగం ప్రత్యేక ముఖ్య కార్యదర్శి శ్రీలక్ష్మి, మంత్రి ఆదిమూలపు సురేష్, ముఖ్యమంత్రి కార్యక్రమాల సమన్వయకర్త తలశిల రఘురామ్ తదితరులు
గుడివాడ (నెహ్రూచౌక్), గుడివాడ గ్రామీణం, న్యూస్టుడే: మూడు వాయిదాల అనంతరం ఎట్టకేలకు ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి గుడివాడ పర్యటన ఖరారైంది. ఈ నెల 9న ఉదయం 9 గంటలకు సీఎం జగన్ నేరుగా మాల్లాయపాలెంలో నిర్మించిన టిడ్కో కాలనీకి హెలికాప్టర్ ద్వారా చేరుకుంటారు. దీనికి సంబంధించి హెలీప్యాడ్ కూడా టిడ్కో కాలనీలో ఏర్పాటు చేశారు. తొలుత వైఎస్ రాజశేఖర్రెడ్డి విగ్రహాన్ని ఆవిష్కరిస్తారు. అనంతరం టిడ్కో ఇళ్ల పట్టాలను లబ్ధిదారులకు అందించి వారితో కాసేపు మాటామంతి నిర్వహిస్తారు. సీఎం సభను విజయవంతం చేసేందుకు భారీగా జనసమీకరణ చేయాలని ఎమ్మెల్యే కొడాలి నాని ఆధ్వర్యంలో సన్నాహాలు చేస్తున్నారు. ఈ మేరకు మెప్మా, సచివాలయాల సిబ్బంది, వాలంటీర్లకు లక్ష్యాలు విధించారు. ఈ మేరకు వివిధ జిల్లాల నుంచి 400 ఆర్టీసీ, 200 ప్రైవేటు బస్సులు ఏర్పాటు చేయనున్నారు. మండలం నుంచి 10 వేల మంది, గుడివాడ పట్టణం నుంచి దాదాపుగా 30 వేల మంది కచ్ఛితంగా వచ్చేలా చూడాలని వారిపై ఒత్తిడి తీసుకొస్తున్నట్లు సమాచారం. ఒకవైపు ఎండలు మండుతుంటే సభకు జనాలు ఎలా వస్తారని ఉద్యోగులు గగ్గోలు పెడుతున్నారు.
* ముఖ్యమంత్రి పర్యటన ఖరారు కావడంతో రాష్ట్ర పురపాలక పరిపాలనా విభాగం ప్రత్యేక ముఖ్య కార్యదర్శి శ్రీలక్ష్మి, పురపాలక, గృహనిర్మాణ శాఖల మంత్రులు ఆదిమూలపు సురేష్, జోగి రమేష్, ముఖ్యమంత్రి కార్యక్రమాల సమన్వయకర్త తలశిల రఘురామ్, ఎమ్మెల్యేలు కొడాలి నాని, పేర్ని నాని, కలెక్టర్ పి.రాజబాబు, ఎస్పీ పి.జాషువా తదితర అధికారులు సీఎం పర్యటన ఏర్పాట్లను మంగళవారం పరిశీలించారు. జగన్ పరిశీలించనున్న 430, 300 చదరపు అడుగుల ఇళ్లను తనిఖీ చేశారు. గుడివాడ కోతి బొమ్మ సెంటర్ నుంచి టిడ్కో కాలనీ వరకూ మార్గ మధ్యలో టెంట్లు వేసి మంచినీరు సౌకర్యం కల్పించాలని మున్సిపల్ అధికారులను ఆదేశించారు.
గుడివాడలో అడుగు పెట్టకుండానే..
ముఖ్యమంత్రి నేరుగా టిడ్కో కాలనీ ప్రారంభోత్సవంలో పాల్గొని అక్కడి నుంచే హెలికాప్టర్ ద్వారా మంగళగిరి వెళ్లేలా ఏర్పాట్లు చేస్తున్నారు. గుడివాడ పట్టణంలో సీఎం అడుగు పెట్టకుండా ప్లాన్ చేయడంపై ప్రతిపక్షాలు దుమ్మెత్తి పోస్తున్నాయి. గుడివాడలో రోడ్షో నిర్వహిస్తే ఎమ్మెల్యే కొడాలి నాని బండారం బయట పడుతుందని, మరో వైపు రహదారుల దుస్థితి, అధ్వానంగా తయారైన మురుగు కాల్వలు, పడకేసిన పారిశుద్ధ్యం సీఎం కంట పడితే ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందనే ఉద్దేశంతో సీఎంను సభా వేదిక నుంచి నేరుగా పంపించే ప్రయత్నం చేస్తున్నారని తెదేపా, జనసేన నాయకులు ఆరోపిస్తున్నారు. తెదేపా హయాంలో నిర్మించిన టిడ్కో ఇళ్లను జగన్ ప్రారంభోత్సవం చేయడం సిగ్గుచేటని తెదేపా నాయకులు మండిపడుతున్నారు.
ఏర్పాట్లపై సమీక్ష
సీఎం జగన్ పర్యటనకు సంబంధించి ఏర్పాట్లపై వివిధ శాఖల అధికారులతో స్థానిక మున్సిపల్ కార్యాలయంలో కలెక్టరు అధ్యక్షతన మంగళవారం సమీక్షించారు. మంత్రి జోగి రమేష్ మాట్లాడుతూ దాదాపు 30 వేల మందికి ఆవాసం కల్పించే టిడ్కో ఇళ్ల పంపిణీని విజయవంతంగా నిర్వహించే అధికారులు తగిన చర్యలు తీసుకోవాలన్నారు. కలెక్టరు రాజబాబు మాట్లాడుతూ ఎండ తీవ్రంగా ఉన్నందున ఈ సభకు వృద్ధులు, పిల్లలు, గుండె జబ్బులున్నవారిని తీసుకురాకుండా చూడాలన్నారు. అన్ని గ్యాలరీల్లో మంచినీటి ప్యాకెట్లు, మజ్జిగ విరివిగా సరఫరా చేయాలన్నారు. ఎట్టి పరిస్థితుల్లో మధ్యాహ్నం 12.30 కల్లా సమావేశం ముగిసేలా చూడాలన్నారు. ఆర్డీవో పద్మావతి, మున్సిపల్ కమిషనరు మురళీకృష్ణ, ఎస్పీ జాషువా తదితరులు పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
113 నామపత్రాలకు ఆమోదం
[ 27-04-2024]
జిల్లాలోని పార్లమెంట్, అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేసేందుకు దాఖలైన వాటిలో 113 నామపత్రాలు సక్రమంగా ఉన్నట్లు ఎన్నికల అధికారులు నిర్ధారించారు. అన్ని రిటర్నింగ్ అధికారుల కార్యాలయాల్లో శుక్రవారం నామపత్రాలు పరిశీలన కార్యక్రమం నిర్వహించారు. -
ఏ ముఖం పెట్టుకుని ఓట్లడగడానికి వస్తారు
[ 27-04-2024]
గన్నవరం నియోజకవర్గానికి చెందిన అంబాపురం పంచాయతీ నగరానికి చేరువుగా ఉన్నా.. అభివృద్ధి జాడ మాత్రం కన్పించడం లేదు. అంతరవలయ రహదారికి ఒకవైపు నగరపాలకసంస్థ అందమైన రహదారులతో, తాగునీరు, కాలువలతో సౌకర్యాలు ఏర్పాటు చేస్తుంటే.. -
తలపడలేక.. తొండాట!
[ 27-04-2024]
సారూప్యం ఉన్న పేర్లతో నామినేషన్ల జిమ్మిక్కులు.. ప్రభుత్వ వ్యతిరేక ఓట్లను చీల్చి ప్రత్యర్థికి నష్టం కలిగించే ఎత్తుగడలు.. అసంబద్ధ ఫిర్యాదులు.. ఇలా ఎన్నో వ్యూహాలు.. ఎత్తుగడల మధ్య నామినేషన్ల పరిశీలన క్రతువు ముగిసింది. -
ఎంపీ బాలశౌరిపై.. పేర్ని కుతంత్రాలు!
[ 27-04-2024]
జనసేన, తెదేపా, భాజపా కూటమి అభ్యర్థిగా.. మచిలీపట్నం లోక్సభ బరిలో దిగిన.. ఎంపీ బాలశౌరికి జనంలో వస్తున్న ఆదరణను చూసి.. వైకాపా జిల్లా అధ్యక్షుడు పేర్ని నానికి ఓటమి భయం పట్టుకుంది. బాలశౌరిని నేరుగా ఢీకొట్టలేక.. అడ్డదారుల్లో ఓడించాలని తీవ్రంగా కుతంత్రాలు ఆరంభించారు. -
బందరులో ఓ తిక్కసన్నాసి ఉన్నారు: బాలశౌరి
[ 27-04-2024]
విజయం అనేది కష్టపడితే వస్తుంది..ప్రజలకు మేలు చేస్తే ఆశీర్వదిస్తారు.. కానీ బందరులో ఓ తిక్కసన్నాసి ఉన్నారు.. ఓటమి భయం పట్టుకుని తన పేరుతో ఉన్న వ్యక్తులతో నామినేషన్లు వేయించారని ఎమ్మెల్యే పేర్ని నానీని ఉద్దేశించి కూటమి మచిలీపట్నం ఎంపీ అభ్యర్థి బాలశౌరి పరోక్షంగా విమర్శించారు. -
మిగులు పనుల పూర్తికి ఐదేళ్లా..!
[ 27-04-2024]
తెదేపా హయాంలో కానూరు వీఆర్ సిద్ధార్థ ఇంజినీరింగ్ కళాశాలలో యాజమాన్యం వారు సొంత నిధులు వెచ్చించి వంతెన నిర్మించారు. కొన్ని పనులు మిగిలిపోయాయి. వాటిని పూర్తి చేయడానికి ఇంకా రూ.2.50 కోట్లు అవసరం. -
కాంగ్రెస్ను గెలిపిస్తే ప్రత్యేక హోదా.. రుణమాఫీ
[ 27-04-2024]
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తేనే రాష్ట్రానికి పదేళ్లు ప్రత్యేకహోదా వస్తుందని, రైతులకు రూ.2 లక్షల వరకు రుణమాఫీ అవుతుందని; పోలవరం, అమరావతి నిర్మాణం శరవేగంగా జరుగుతుందని పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల చెప్పారు. -
గురువులపై కక్షగట్టి
[ 27-04-2024]
వైకాపా పాలనలో గురువులపై ఒత్తిడి పెరిగింది. పాఠాలు చెప్పడంతోనే వారి బాధ్యత తీరిపోలేదు. యాప్లో అటెండెన్స్ ఆలస్యంగా వేసినా, ఏదైనా ప్రధాన కారణం చేత స్పాట్ వాల్యుయేషన్కు హాజరు కాకపోయినా, బయోమెట్రిక్ వాడకపోయినా సంజాయిషీ తాఖీదు తప్పదు. -
సర్వే అన్నారు.. భూవిస్తీర్ణం తగ్గించారు
[ 27-04-2024]
భూ సంబంధిత సమస్యలన్నింటినీ శాశ్వతంగా పరిష్కరించడంతోపాటు వివాదాలు తలెత్తకుండా హద్దులు ఏర్పాటు చేసి అందరికీ మళ్లీ భూహక్కు పత్రాలు అందిస్తాం. దీని కోసం అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని కూడా వినియోగిస్తున్నాం. -
ఒక్క అవకాశం ఇవ్వండి.. అభివృద్ధి చేసి చూపుతా
[ 27-04-2024]
ఇచ్చిన హామీలను అమలు చేయకపోతే ప్రజాప్రతినిధులను రీకాల్ చేసే విధానం రావాలని, పశ్చిమ నియోజకవర్గంలో ముస్లింలకు తాను ఎప్పుడూ అండగా ఉంటానని కేంద్ర మాజీ మంత్రి, ఎన్డీయే కూటమి విజయవాడ పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి సుజనా చౌదరి పేర్కొన్నారు. -
విజయవాడ ఎంపీ బరిలో 19 నామినేషన్ల ఆమోదం
[ 27-04-2024]
విజయవాడ లోక్సభ స్థానానికి సంబంధించి నామినేషన్ల పరిశీలన (స్క్రూటినీ) ప్రక్రియ శుక్రవారం పూర్తయింది. సక్రమంగా ఉన్న 19 నామినేషన్లు చెల్లుబాటయ్యాయి. వివిధ కారణాలతో 15 నామినేషన్లను తిరస్కరించినట్టు రిటర్నింగ్ అధికారి, కలెక్టర్ ఎస్.డిల్లీరావు తెలిపారు.
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (27/04/24)
-
విరాట్ - హార్దిక్కు నో ఛాన్స్.. ఈ లఖ్నవూ స్టార్కు ప్లేస్: భారత మాజీ క్రికెటర్
-
ఏడాదికి ‘రెండు సార్లు’ సీబీఎస్ఈ బోర్డు పరీక్షలు.. 2025 నుంచే!
-
అనుపమ ‘పరదా’.. అదితి ఆన్డ్యూటీ.. భూమీ భలే డ్రెస్సు!
-
బిగ్ సేవింగ్ డేస్ సేల్కు సిద్ధమైన ఫ్లిప్కార్ట్.. ఎప్పటినుంచంటే?
-
‘పుష్ప’ కేశవ రోల్కు సుహాస్ని అనుకున్నాం.. కానీ!: సుకుమార్