కొన్నే ఉన్నాయ్... కొనుక్కో అన్నాయ్!
ఆటోనగర్కు చెందిన ఓ వృద్ధుడు చర్మ సమస్యలతో ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చాడు. వైద్యుడికి చూపించిన తర్వాత నాలుగు రకాల మందులు రాసి ఇచ్చారు.
విజయవాడ కొత్తాసుపత్రిలో మందుల కొరత
వైద్యులు రాసిన వాటిలో అరకొరగానే లభ్యం
నిరుపేద రోగులకు తప్పని ఆర్థిక భారం
ఈనాడు - అమరావతి
- ఆటోనగర్కు చెందిన ఓ వృద్ధుడు చర్మ సమస్యలతో ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చాడు. వైద్యుడికి చూపించిన తర్వాత నాలుగు రకాల మందులు రాసి ఇచ్చారు. బాధితుడు ఆస్పత్రిలోని మందుల కౌంటర్కు వెళ్తే.. వాటిలో సగం మాత్రమే ఇచ్చి మిగతావి బయట కొనుక్కోమని ఆసుపత్రి సిబ్బంది మందుల చీటీపై టిక్ పెట్టి ఇచ్చారు.
- మంగళగిరి ప్రాంత వృద్ధురాలికి విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో కంటి శస్త్రచికిత్స జరిగింది. ఆసుపత్రిలో రెండు రోజులు ఉన్న తర్వాత గత గురువారం డిశ్చార్జి అయి ఇంటికి వెళ్లేటప్పుడు వైద్యులు అయిదు రకాల మందులు రాసిచ్చారు.ఆమె కౌంటర్ వద్దకు వెళ్లి మందుల చీటీ చూపించగా.. మూడింటినే ఇచ్చారు. మిగతా.. మోక్సీప్రెడ్, నెపాఫెనాక్ అనే ఐడ్రాప్స్ లేవనీ.. బయట కొనుక్కోమని సిబ్బంది సూచించారు. మందుల చీటీలో ఈ రెండు లేవనేలా టిక్ పెట్టి ఇచ్చారు.
- ఆటోనగర్కు చెందిన ఓ మహిళ ఊపిరితిత్తుల సమస్యతో ఆసుపత్రికి వచ్చింది. వైద్యుడిని సంప్రదించిన తర్వాత రెండు రకాల మందులను రాశారు. వాటి కోసం మందుల కౌంటర్కి వెళ్లింది. కానీ.. ఆ రెండూ కౌంటర్లో లేవు. దీంతో ఆసుపత్రి ఆవరణలోనే ఉన్న ప్రైవేటు జనరిక్ మందుల దుకాణంలో వాటిని డబ్బులిచ్చి కొనుక్కుంది.
విజయవాడ కొత్త ప్రభుత్వాసుపత్రిలోని ఓపీకి సోమవారం నుంచి శనివారం వరకు నిత్యం 2,500 మందికి పైగా వస్తున్నారు. ఉమ్మడి కృష్ణా జిల్లాలో అన్ని ప్రాంతాలు, పక్కనే ఉన్న గుంటూరు, ఏలూరు నుంచి కూడా ఓపీకి పెద్దసంఖ్యలో వస్తుంటారు. గ్యాస్ట్రో, ఆర్థో, జనరల్ మెడిసిన్, ఈఎన్టీ, కంటికి సంబంధ సమస్యలతో నిత్యం ఓపీకి వచ్చే రోగులు అత్యధికంగా ఉంటున్నారు. వీరికి వైద్యులు రాసే మందుల్లో ప్రస్తుతం కొన్నే కౌంటర్లలో ఇస్తున్నారు. మిగతావి బయట కొనుక్కోమని చెబుతున్నారు. కొన్నింటినే ఇస్తున్న తీరుపై రోగులు చాలాకాలంగా ఫిర్యాదులు చేస్తున్నా సమస్యను మాత్రం పరిష్కరించడం లేదు. ప్రతి పది మంది రోగుల్లో కనీసం ముగ్గురు నలుగురికి సగం సగమే ఇస్తున్నారు.
ఓపీ కౌంటర్ల వద్ద రద్దీ
రెండు మూడేళ్లుగా ఇంతే..
కొత్తాసుపత్రిలో మందుల కొరత గత రెండుమూడేళ్లుగా వేధిస్తూనే ఉంది. అధికారులు మాత్రం అన్ని మందులూ ఉన్నాయనీ, ఎలాంటి సమస్యా లేదని చెబుతున్నారు. వైద్యులు రాసే కాంబినేషన్ మెడిసిన్లోనూ కొన్ని ఇచ్చి మిగతావి లేవని చెబుతున్నారు. మిగతావి బయట కొనుక్కోండి.. లేదంటే రెండు రోజుల తర్వాత మళ్లీ రమ్మని చెబుతున్నారని పలువురు రోగులు వాపోతున్నారు. ఎక్కువ మంది విజయవాడ నగరంలోని పలు ప్రాంతాలతోపాటు దూరంగా ఉన్న గ్రామాల నుంచి బస్సులు, ఆటోల్లో వస్తుంటారు. వీరు మళ్లీ ఆ రెండు మూడు మందుల కోసం ఆసుపత్రికి వచ్చే పరిస్థితి ఉండదు. వైద్యులు రాసిన మందులన్నీ ఇవ్వాలి కదా.. అని కొందరు రోగులు ప్రశ్నిస్తే.. అన్నీ ఉండవు.. మీరు కొన్ని బయట కొనుక్కోవాల్సిందేనని సిబ్బంది చెబుతున్నారు. పేద రోగులకు మందులు కొనే స్థోమత ఉండదు. అన్ని మందులూ కచ్చితంగా అందుబాటులో ఉంచాలి. ఒకవేళ ఏవైనా లేకపోతే.. వెంటనే కొనైనా ఇవ్వాలి.
జనరిక్ దుకాణం వద్ద కిటకిట..
కొత్తాసుపత్రి ప్రాంగణంలో ఉన్న జనరిక్ మందుల దుకాణం ప్రతిరోజూ కిటకిటలాడుతూనే ఉంటోంది. వైద్యులు రాసిన మందులు ఆసుపత్రి ఉచిత కౌంటర్లో లేక రోగులు జనరిక్లో కొంటున్నారు. సోమవారం నుంచి శనివారం వరకూ ఓపీ వేళల్లో కౌంటర్లో సగం మందులు ఇస్తే.. మిగతావి జనరిక్లో కొనుగోలు చేస్తున్నారు. ఒకవేళ జనరిక్లోనూ కొన్ని లేకపోతే.. బయట మందుల దుకాణాల్లో కొనాల్సి వస్తోందని రోగులు వాపోతున్నారు.
కంటి సమస్యలతో వస్తుంటే..
ప్రస్తుతం కంటి ఇన్ఫెక్షన్తో ఎక్కువ మంది ఆసుపత్రికి వస్తున్నారు. వీరిని వైద్యులు పరీక్షించి మందులు రాస్తుంటే.. కొన్నే ఉన్నాయనీ.. మిగతావి బయట కొనుక్కోమంటూ కౌంటర్లో చెబుతున్నారు. విజయవాడ మహిళలు ఇద్దరు కంటి ఇన్ఫెక్షన్తో రెండు రోజుల కిందట రాగా.. వారికి కూడా వైద్యులు రాసిన మందుల్లో కొన్నే ఇచ్చి.. డ్రాప్స్ లేవని, బయట కొనుక్కోమని కౌంటర్లో సిబ్బంది సూచించారు. ప్రస్తుతం జ్వరాలు, నేత్ర ఇన్ఫెక్షన్లు ఎక్కువగా ఉన్నాయి. వీటి విషయంలో అప్రమత్తమై.. అన్ని రకాల మందులను ఆసుపత్రిలో సిద్ధంగా ఉంచాలి. ఎన్టీఆర్, కృష్ణా జిల్లాల ప్రజలకు విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రే ప్రధానమైన వైద్య కేంద్రం. రోజూ వేల సంఖ్యలో వచ్చే రోగులకు తగ్గట్టుగా మందులు అందుబాటులో ఉంచడంలో అధికారులు విఫలమవుతున్నారు.
రెండు రకాల మందులు లేవని టిక్ పెట్టారిలా..
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నాగులపాడులో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు
[ 17-05-2024]
నాగులపాడులో శ్రీ వల్లీదేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయంలో శుక్రవారం బ్రహ్మోత్సవాలు, కల్యాణ మహోత్సవాలు ప్రారంభమయ్యాయి. -
ఎన్నికల సిబ్బంది పొరపాటు.. పీవోకి గ్రహపాటు
[ 17-05-2024]
సార్వత్రిక ఎన్నికల సందర్భంగా మచిలీపట్నంలోని ఎన్నికల సామగ్రి స్వీకరణ(రిసీవింగ్) సిబ్బంది చేసిన పొరపాటుకు ఓ ఉపాధ్యాయుడి కుడి చేయి విరిగింది. -
ఎన్నికల సిబ్బంది పొరపాటు.. పీవోకి గ్రహపాటు
[ 17-05-2024]
సార్వత్రిక ఎన్నికల సందర్భంగా మచిలీపట్నంలోని ఎన్నికల సామగ్రి స్వీకరణ(రిసీవింగ్) సిబ్బంది చేసిన పొరపాటుకు ఓ ఉపాధ్యాయుడి కుడి చేయి విరిగింది. వివరాల్లోకి వెళ్తే.. గుడివాడ పట్టణానికి చెందిన షేక్.ఇబ్రహీం బేతవోలులోని ఎస్జీవీఎస్జీ మున్సిపల్ ఉన్నత పాఠశాలలో తెలుగు స్కూల్ అసిస్టెంట్గా పని చేస్తున్నారు. -
ఆధిక్యంపైనే అసలు ఆట!
[ 17-05-2024]
ఎన్నికలలో కీలకమైన పోలింగ్ ప్రక్రియ ముగిసింది. ముఖ్యమైన లెక్కింపు ఘట్టం మిగిలే ఉంది. అభ్యర్థుల తలరాతలు, రాష్ట్ర భవితను నిర్దేశించే ఈ ఫలితాలపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. దీనికి ఇంకా 18 రోజులు సమయం ఉంది. -
జగనొస్తే చుక్కలే!
[ 17-05-2024]
సీఎం జగన్ పర్యటన అంటేనే విజయవాడ నగర ప్రజలు హడలెత్తిపోతున్నారు. గురువారం సీఎం జగన్ విజయవాడ బెంజ్సర్కిల్ సమీపంలో ఐ-ప్యాక్ కార్యాలయానికి వచ్చారు. -
రాతిమండపం తొలగించి.. ప్రైవేటు దుకాణాలా?
[ 17-05-2024]
గత అయిదేళ్లుగా దుర్గ గుడిలో ఒక్క నిర్మాణం కట్టింది లేదు.. ఉన్నవాటిని కూల్చేయడమే.. పాలకుల అనాలోచిత నిర్ణయాలు.. అమ్మవారి ఆదాయాన్ని కరిగించేస్తుండగా...దిశా నిర్దేశం లేని ప్రణాళికలతో కాలహరణం చేయడం పరిపాటిగా మారిపోయింది.. -
కొనేవారున్నా.. కాయల్వేవ్!
[ 17-05-2024]
నున్న మార్కెట్ నుంచి నిత్యం ఎగుమతవుతున్న మామిడి దాదాపు 200 టన్నులు.. గతంలో ఇదే సమయంలో ఎగుమతులు 400 నుంచి 500 టన్నుల వరకు ఉండేవి. 2023లో టన్ను ధర రూ. 10 వేల నుంచి రూ. 25 వేల వరకు ఉండగా... ఈ ఏడాది రూ. 25 వేల నుంచి రూ. 35 వేల వరకు పలుకుతోంది. -
అందని వేతనం.. బతుకు భారం
[ 17-05-2024]
ఆరువేల వేతనం ఇస్తాం....ప్రతి నెలా నేరుగా ఖాతాల్లో జమ చేస్తామని పాలకులు చెప్పడంతో జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో అనేకమంది మహిళలు పాఠశాలల్లో ఆయాలుగా చేరారు. -
గాయపర్చిన ఘటనలో కేసు నమోదు
[ 17-05-2024]
పెదపారుపూడి మండలం పాములపాడు శివారు దూళ్లవానిగూడెంలో వ్యక్తిని కొట్టి గాయపర్చిన ఘటనలో కేసు నమోదు చేశామని పెదపారుపూడి ఎస్ఐ రాజు గురువారం తెలిపారు. -
ఓట్ల లెక్కింపునకు పక్కా ఏర్పాట్లు
[ 17-05-2024]
జిల్లాలో పోలింగ్ ప్రక్రియ పూర్తయిన క్రమంలో.. జూన్ 4వ తేదీన ఓట్ల లెక్కింపు చేపట్టనున్నట్లు కలెక్టర్ ఎస్.డిల్లీరావు తెలిపారు. ఏర్పాట్లపై కలెక్టరేట్లో గురువారం అధికారులతో ఆయన సమావేశం నిర్వహించారు. -
మిర్చి వ్యాపారి రూ.1.76 కోట్లకు ఐపీ?
[ 17-05-2024]
కంచికచర్లకు చెందిన ఒక మిర్చి వ్యాపారి ఐపీ దాఖలు చేసినట్లు తెలియడంతో అతడి ఇంటి వద్ద బాధితులు గురువారం ఆందోళనకు దిగారు. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం.. కంచికచర్ల పట్టణానికి చెందిన మిర్చి వ్యాపారి దొడ్డా నరసింహారావు, అతని కుమారుడు వెంకట వాసుదేవకుమార్(వాసు) స్థానిక రైతుల నుంచి మిర్చి కొనుగోలు వ్యాపారం నిర్వహించేవారు. -
ఏళ్ల ఆశ.. నెరవేరక నిరాశ
[ 17-05-2024]
నగర పాలక సంస్థలో ఎన్నో ఏళ్లుగా పని చేస్తున్న టైంస్కేలు వర్కర్లు (గతంలో ఎన్నెమ్మార్లు), ఒప్పంద కార్మికులు, పొరుగు సేవల సిబ్బందిని ప్రభుత్వం నమ్మించి మోసం చేసింది. -
కార్పొరేటర్ భర్త కోసం పోలీసుల గాలింపు
[ 17-05-2024]
విజయవాడ 42వ డివిజన్ కార్పొరేటర్ చైతన్యరెడ్డి భర్త ప్రసాద్రెడ్డి కోసం పోలీసులు గాలిస్తున్నారు. ప్రసాద్రెడ్డి పోలింగ్ రోజున రెండు బూత్ల వద్ద అనుచరులతో కలిసి వీరంగం సృష్టించి..ఒక మహిళతో సహా ముగ్గురిపై దాడులకు పాల్పడ్డారు.
తాజా వార్తలు (Latest News)
-
‘అమ్మ’ అంతిమయాత్ర అయినా.. ఆస్తి పంచాకే !
-
ఆంక్షలు విధించిన అమెరికాలోనే.. రహస్యంగా ఉత్తర కొరియన్లు వర్క్ఫ్రమ్ హోం
-
టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా ప్రభాస్ పోస్ట్.. ఆ ప్రత్యేక వ్యక్తి ఎవరు?
-
ఏపీఎల్లో చరిత్ర సృష్టించిన ఎస్ఆర్హెచ్ హీరో
-
భారత వృద్ధిరేటు అంచనాలను గణనీయంగా పెంచిన ఐరాస
-
వివేకా హత్య కేసు.. నాంపల్లి కోర్టులో విచారణకు హాజరైన ఎంపీ అవినాష్రెడ్డి