గులకరాయికి.. రాజకీయ రంగు!
ముఖ్యమంత్రి జగన్పై గులకరాయి కేసు.. కుట్ర కేసుగా మారుతోంది. రాజకీయ రంగు పులుముకునేందుకు రంగం సిద్ధమైంది. తెదేపా నేతలు అనుమానించినట్లే.. మరికొందరు కీలక నేతలను ఇరికించేందుకు ఖాళీ వదిలినట్లు తెలిసింది.
బొండా ఉమా చుట్టూ కేసు
ప్రాణాలు తీసే కుట్ర ఉందంట
ప్రేరేపించిన వారు ఉన్నారంట
ఈనాడు, అమరావతి
‘రాష్ట్ర ముఖ్యమంత్రి జీవితాన్ని తుద ముట్టించేందుకు (ఎలిమినేట్ ద లైఫ్) జరిగిన కుట్రలో మరో నిందితుడు (ఏ2)తో కలిసి ఏ1 (వేముల సతీష్) చాలా చురుకుగా పాల్గొన్నట్లు మా దర్యాప్తులో తేలింది. ఈ కేసులో దర్యాప్తు అసంపూర్తిగా జరిగింది.. ఇంకా మరికొందరు సాక్షులను విచారణ చేయాల్సి ఉంది.. మరికొన్ని సాంకేతిక అంశాలను విశ్లేషణ చేయాల్సి ఉంది.’
- సీఎం జగన్పై రాయి దాడి కేసులో విజయవాడ నార్త్ డివిజను ఏసీపీ న్యాయస్థానానికి సమర్పించిన రిమాండ్ రిపోర్టులో పేర్కొన్న అంశమిది.
ముఖ్యమంత్రి జగన్పై గులకరాయి కేసు.. కుట్ర కేసుగా మారుతోంది. రాజకీయ రంగు పులుముకునేందుకు రంగం సిద్ధమైంది. తెదేపా నేతలు అనుమానించినట్లే.. మరికొందరు కీలక నేతలను ఇరికించేందుకు ఖాళీ వదిలినట్లు తెలిసింది. ముఖ్యమంత్రి ప్రాణాలు తీసేందుకు పక్కాగా ముందస్తు ప్రణాళిక రచించారనీ, కుట్ర కోణం ఉందనీ, మరో నిందితుడి ప్రేరణతోనే మొదటి నిందితుడు రాయి గురి పెట్టి.. ప్రాణాలు తీసేందుకు ఆయువు పట్టుపై తగిలేలా కుట్ర చేశారనేది దర్యాప్తు అధికారి నిగ్గుతేల్చిన అంశం. ఇక్కడ గమనించాల్సిన అంశం ఏంటంటే.. ప్రస్తుతం ఏ1 నిందితుడిగా వేముల సతీష్ (19)ను న్యాయస్థానంలో హాజరు పరిచారు. నిందితుడిని మరో నిందితుడు ప్రేరేపించారని ఏ2గా పేర్కొన్నారు. కానీ అతను ఎవరనేది రిమాండ్ రిపోర్టులో పేర్కొనలేదు. ఏ2 నుంచి ఎంత వరకు సంఖ్య వెళుతుందో తెలియదనీ, కుట్ర కోణం ఉందని దర్యాప్తులో తేలడంతో ఎంతమందిని అయినా చేర్చే అవకాశం ఉందని న్యాయనిపుణులు విశ్లేషిస్తున్నారు.
రాజకీయ నేపథ్యమేనా..?
ఈ కేసు రాజకీయ నేపథ్యంగానే సాగుతున్నట్లు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చినా కొందరు స్వామి భక్తిని వదలడం లేదనే విమర్శలు వస్తున్నాయి. ఈనెల 13న రాత్రి విజయవాడలో సీఎం జగన్ రోడ్షోలో ఘటన జరిగింది. దీనిలో సీఎం ప్రాణాలను తీసేందుకు కుట్ర జరిగితే ముందుగా పోలీసులు నిఘా వర్గాలు ఎందుకు తెలుసుకోలేకపోయాయి.? భద్రత ఏమైంది.? అదృష్టవశాత్తు రాయి సున్నితమైన ప్రాంతంలో (ప్రాణం పోయే) తగల్లేదని పోలీసుల వాదనగా ఉంది. అంటే కచ్చితంగా ప్రాణంపోయే ప్రాంతంలో తగిలేలా గురి చూసి రాయితో కొట్టే అవకాశం రోడ్షోలో ఉంటుందా..? పక్కన జనాలు, పోలీసుల నిఘా.. కట్టుదిట్టమైన భద్రత మధ్య ఒక సిమెంట్ కాంక్రీట్ రాయితో ఒక వ్యక్తిపై గురి చూసి కొట్టి ప్రాణం తీయడం సాధ్యమా? అనే సందేహాలు ఉన్నాయి. ‘నిందితుడు తప్పనిసరిగా ప్రొఫెషనల్ షూటర్ అయి ఉండాలి. మంచి శిక్షణ తీసుకుని ఉండాలి. ఒలింపిక్స్ వంటి క్రీడల్లో పాల్గొంటే బంగారు పతకాలు వచ్చి ఉండాలని’ కొందరు వ్యాఖ్యానిస్తున్నారు. అసలు ఎందుకు కొట్టాడనేది రిమాండ్ రిపోర్టులో పోలీసులు పేర్కొనలేదు. ప్రేరేపితుడు అయ్యాడు.. మరో వ్యక్తి ఉన్నాడని పేర్కొన్నారు. అంత సమూహంలో నిందితుడిని గుర్తించిన పోలీసులు.. ప్రేరేపించిన ఏ2ను గుర్తించలేదు. ఏ2 మరో ప్రేరేపణ ఉండే అవకాశం లేకపోలేదనేదే ప్రధాన అనుమానం.
బొండా ఉమానే లక్ష్యమా?
భూమి గుండ్రంగా ఉన్నట్లు ఈ కేసు తిరిగి తెదేపా నేత బొండా ఉమా చుట్టూ తిరుగుతుందని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం నిందితుడిగా ఒక యువకుడిని అరెస్టు చేశారు. ఏ2గా ఒక వ్యక్తిని ఇప్పటికే అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. దుర్గారావుగా పేరు చెబుతున్నారు. ఆయన తెదేపాలో క్రియాశీలకంగా ఉన్నారు. ఆయన వాంగ్మూలం ప్రకారం మరో నేతకు గురి పెట్టారు. దీనికి కారణం ఫిర్యాదుదారు సెంట్రల్ నియోజకవర్గ వైకాపా అభ్యర్థి వెలంపల్లి శ్రీనివాస్ కావడమే. ఆయన రాజకీయ ప్రత్యర్థి తెదేపా నుంచి బరిలోకి దిగుతున్న బొండా ఉమా. దీంతో ఆయనను కేసులో ఇరికించేందుకు సీఎంపై రాయి విసిరిన కేసు ఏకంగా కుట్ర కోణంగా ఆయన ప్రాణం తీసే హత్యాయత్నం కేసుగా మారింది.
నందిగామ సంఘటన కాదా..?
2022లో నందిగామలో జరిగిన సంఘటన ఇదే తరహాలో ఉంది. అక్కడ మాజీ సీఎం చంద్రబాబును లక్ష్యంగా చేసుకుని విసిరిన రాయి భద్రత అధికారి అప్రమత్తతో చీఫ్ సెక్యూరిటీ అధికారి మధుసూదనరావుకు తగిలింది. గురి తప్పడం వల్ల గడ్డం భాగంలో తీవ్ర గాయమైంది. లేకుంటే.. ప్రాణం తీసే కుట్ర కదా. కానీ అక్కడ పోలీసులు ఐపీసీ 324 ప్రకారం కేసు నమోదు చేశారు. తర్వాత కుట్ర కోణం విచారణ లేదు. అక్కడ వైకాపా నాయకుడు అనుమానితుడిగా ఉన్నా.. కనీసం విచారించలేదు. దాదాపు ఏడాదిన్నర అయింది కేసు అతీగతీ లేదు. పురోగతి లేకుండా వదిలేశారు. చంద్రబాబు ప్రాణాలకు ముప్పుపై నిఘా వర్గాల హెచ్చరిక ఉంది. ఎన్ఎస్జీ భద్రత ఉంది. అంత ఉన్నా.. నందిగామ కేసు చాలా తేలిగ్గా పోలీసులు తీసుకున్నారు. నాడు సీసీ టీవీలు, ఫొటోలు, వీడియోలు అందుబాటులో ఉన్నా.. ఒక్కటంటే ఒక్కటీ పరిశీలించలేదు. నాడు.. నేడు పోలీసు కమిషనర్ కాంతిరాణానే ఉన్నారు. నేడు అయిదు రోజుల్లో బలహీన వర్గాల కుర్రాడిని నిందితుడిని చేసి.. లింకులు వెదుకుతున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కూటమి మ్యానిఫెస్టోపై సందేహాలుంటే నివృత్తి చేస్తాం: యనమల
[ 01-05-2024]
పూర్తిగా అమలు చేయదగ్గ మ్యానిఫెస్టోనే తాము రూపొందించామని తెదేపా పొలిట్ బ్యూరో సభ్యుడు యనమల రామకృష్ణుడు స్పష్టం చేశారు. -
నాన్న రాసిన మరణశాసనం.. ఒత్తిడికి తలొగ్గి కుటుంబాన్ని కడతేర్చి..
[ 01-05-2024]
‘నా మానసిక పరిస్థితి బాగోలేదు. చాలా ఒత్తిడిలో ఉన్నా. అమ్మ, భార్య, పిల్లలంటే నాకు ప్రాణం. నేను చనిపోయాక వారిని ఇబ్బంది పెట్టడం నాకు ఇష్టం లేదు. అందుకే ఇలా చేశానని’’ డాక్టర్ శ్రీనివాస్ తన ఫోన్లో వాయిస్ రికార్డు చేశారు. -
శ్రమజీవికీ ద్రోహ ‘మే’..!
[ 01-05-2024]
తెల్లవారుజామునే నిద్ర లేచి.. ఇంటి పనులన్నీ చక్కదిద్దుకుని... చద్దిబువ్వ మూటకట్టుకుని.. పొట్టకూటి కోసం అడ్డాలకు చేరుకుంటారు వేలాది మంది భవన నిర్మాణ కార్మికులు. ఎవరైనా కాస్త పని ఇప్పించకపోతారా? అని వేయికళ్లతో ఎదురుచూస్తూనే ఉంటారు -
బాబోయ్ అన్నా... బే‘ఖాతా’ర్..!
[ 01-05-2024]
మే.. సామాజిక పింఛన్లను బ్యాంకుల్లో వేయడమంటే.. వృద్ధులు, దివ్యాంగులను ఎండల్లో ముప్పుతిప్పలు పెట్టడమే. కావాలనే... ఎన్నికలకు ముందు వారిని వేధించి.. ప్రాణాలమీదకొచ్చేలా చేయడమే. -
ఉప కారాగారం వార్డర్ ఆత్మహత్య
[ 01-05-2024]
స్థానిక ఉప కారాగారంలో వార్డర్గా పని చేస్తున్న దాసరి నాగ శివకుమార్ (37) ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఆయన స్థానిక ఐదో వార్డులో ఒక భవనం పై అంతస్తులో ఉన్న సింగిల్ పోర్షన్లో అద్దెకు ఉంటున్నారు. -
‘వైకాపా అరాచకాలకు ఓటుతో స్వస్తి పలకాలి’
[ 01-05-2024]
రాష్ట్రంలోనూ, గన్నవరంలోనూ వైకాపా అరాచకాలకు స్వస్తి పలికే సమయం ఆసన్నమైందని, ప్రతి ఒక్కరూ ఓటు హక్కునే ఆయుధంగా మలుచుకోవాలని బాపులపాడు మండలం రంగన్నగూడెం మాజీ సర్పంచి, వైకాపా నాయకురాలు ఆళ్ల నాగమణి పేర్కొన్నారు. -
జ్యోతిర్లింగ యాత్రకు ప్రత్యేక రైలు
[ 01-05-2024]
యాత్రికుల సౌకర్యార్థం ఐఆర్సీటీసీ సంస్థ జ్యోతిర్లింగ దివ్య దక్షిణ యాత్ర పేరుతో ప్రత్యేక రైలు నడపనుంది. -
ల్యాండ్ టైట్లింగ్ చట్టంపై దుష్ప్రచారం : సజ్జల
[ 01-05-2024]
ఆంధ్రప్రదేశ్ ల్యాండ్ టైట్లింగ్ చట్టంపై తెదేపా, జనసేన పార్టీ దుష్ప్రచారం చేస్తున్నాయని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పారు. -
జ్యోతిసురేఖకు ఘన స్వాగతం
[ 01-05-2024]
ప్రపంచ అర్చరీ పోటీల్లో మూడు స్వర్ణ పతకాలు సాధించిన వన్నెం జ్యోతిసురేఖ మంగళవారం ఉదయం దిల్లీ నుంచి విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయం చేరుకున్నారు. -
కూటమితోనే రాజ్యాంగ పరిరక్షణ: బాలశౌరి
[ 01-05-2024]
ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి అధికారంలోకి వచ్చిన నాటి నుంచి రాజ్యాంగం ప్రజలకు కల్పించిన హక్కులను కాలరాస్తూ తన సొంత రాజ్యాంగం అమలు చేశారని, ప్రశ్నించే వారిపై తప్పుడు కేసులు పెట్టి వేధించారని కూటమి అభ్యర్థులు వల్లభనేని బాలశౌరి, కాగిత కృష్ణ ప్రసాద్ అన్నారు. -
పేదలకు పాట్లు.. వైకాపా నాయకులకు రూ.కోట్లు
[ 01-05-2024]
గుడివాడలో ఐదేళ్ల జగన్ ప్రభుత్వ పథకాలతో ప్రజలకు ఒరిగిందేమీ లేదు. కానీ.. ఎమ్మెల్యే నాని అండతో అతని అనుచరులు మాత్రం భారీగానే ఆర్జించారు. -
గుడివాడ కేంద్రంగా క్రికెట్ బెట్టింగ్
[ 01-05-2024]
ఐపీఎల్లో జరిగే బెట్టింగ్ తీరుతెన్నులు ఇది. ఓవర్లో రెండు సిక్స్లు కొడితే పందెం కాసిన బెట్టింగ్రాయుళ్లకు డబ్బులు చెల్లించాలి. అదే కొట్టలేకపోతే బెట్టింగ్ రాయుళ్లు కట్టిన సొమ్ము బుకీలకు పంపాలి. -
ఎన్నికల నిర్వహణకు సహకరించండి: కలెక్టర్
[ 01-05-2024]
జిల్లాలో ప్రశాంతంగా, సజావుగా ఎన్నికల నిర్వహణకు అన్ని రాజకీయ పక్షాలు, ప్రజలు సహకరించాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ డీకే బాలాజీ విజ్ఞప్తి చేశారు.
తాజా వార్తలు (Latest News)
-
డ్రై ఐస్ తిని మూడేళ్ల బాలుడు మృతి
-
ప్రపంచకప్కి రింకూని విస్మరించడమా? ఇదో చెత్త సెలక్షన్!
-
పోలీసుల అదుపులో భారాస నేత క్రిశాంక్
-
మద్యం మత్తులో పైలట్.. విమానాన్ని నిలిపివేసిన ఎయిర్ లైన్స్
-
వరల్డ్ కప్ జట్టులోకి ఎంట్రీ.. సంజూ శాంసన్ ‘మలయాళం’ ట్వీట్ వైరల్
-
సల్మాన్ఖాన్ ఇంటి వద్ద కాల్పుల ఘటన.. కస్టడీలో నిందితుడి ఆత్మహత్య