logo

నన్ను చంపేందుకు వైకాపా నేతల కుట్ర

వైకాపా నేతలు తనను చంపేందుకు ప్రయత్నిస్తున్నారని తిరువూరు తెదేపా అభ్యర్థి కొలికపూడి శ్రీనివాసరావు ఆరోపించారు. సోమవారం నామినేషన్‌ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..

Published : 23 Apr 2024 06:06 IST

కొలికపూడి శ్రీనివాసరావు

తిరువూరు: వైకాపా నేతలు తనను చంపేందుకు ప్రయత్నిస్తున్నారని తిరువూరు తెదేపా అభ్యర్థి కొలికపూడి శ్రీనివాసరావు ఆరోపించారు. సోమవారం నామినేషన్‌ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..తిరువూరుకు చెందిన ఓ మహిళా నాయకురాలు, పుట్రేలకు చెందిన రెడ్డి సామాజికవర్గ నేత గత పది రోజులుగా తనను అడ్డు తొలగించాలని ప్రణాళికలు వేస్తున్నారన్నారు. ఇలాంటి కుట్రలకు వెరవనని, ఆఖరి శ్వాస వరకు తిరువూరు గడ్డ మీదే ఉండి ఈ ప్రాంతం అభివృద్ధికి పనిచేస్తానని పేర్కొన్నారు. తిరువూరు నుంచి భారీ మెజార్టీతో విజయం సాధిస్తానని ధీమా వ్యక్తం చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని