ఓటింగ్ ప్రక్రియ గందరగోళం.. పోస్టల్ బ్యాలట్లు మురిగే ప్రమాదం
గుడివాడ పట్టణంలోని వీకేఆర్, వీఎన్బీ ఇంజినీరింగ్ కళాశాలలో ఏర్పాటు చేసిన పోస్టల్ బ్యాలట్్ ఫెసిలిటేషన్ సెంటర్లో శనివారం ఉదయం 9 గంటలకు ప్రారంభించాల్సిన పోలింగ్ ఒక బూత్లో 9:50కి మరో బూత్లో 10:30 గంటలకు ప్రారంభం
ఆందోళనలో ఉద్యోగులు ఆలస్యంగా ప్రారంభమైన ప్రక్రియ
గుడివాడ గ్రామీణం, న్యూస్టుడే
వీకేఆర్, వీఎన్బీ కళాశాలలో కేంద్రం వద్ద ఓటర్లు
గుడివాడ పట్టణంలోని వీకేఆర్, వీఎన్బీ ఇంజినీరింగ్ కళాశాలలో ఏర్పాటు చేసిన పోస్టల్ బ్యాలట్్ ఫెసిలిటేషన్ సెంటర్లో శనివారం ఉదయం 9 గంటలకు ప్రారంభించాల్సిన పోలింగ్ ఒక బూత్లో 9:50కి మరో బూత్లో 10:30 గంటలకు ప్రారంభం కావడంతో అందరూ ఒకే సారి ఓటు హక్కు వినియోగించుకోవాల్సిన దుస్థితి నెలకొంది. ఈక్రమంలో కంగారులో చాలా తప్పులు దొర్లాయని.. దీనివలన కొందరి ఓట్లు మురిగి పోయే ప్రమాదం ఉందని పలువురు ఉద్యోగ, ఉపాధ్యాయలు భావిస్తున్నారు.
- పోస్టల్ బ్యాలట్్ ఎంపీ అభ్యర్థిది ఒక సారి, ఎమ్మెల్యే అభ్యర్థిది ఒక సారి పోలింగ్ అధికారి ఇవ్వాల్సి ఉండగా ఆలస్యంగా ప్రారంభం కావడంతో రెండూ ఒకే సారి ఇవ్వడంతో అసలు సమస్య మొదలైంది. ఉపాధ్యాయులంతా ఒకే సారి బల్లలపై కూర్చొని ఓటు పత్రాల రాత కోతలు చేయాల్సి వచ్చింది.
- పైగా 56 నుంచి 65 వరకు వరుస సంఖ్య ఓట్లు గల బూత్లో ఉదయం 9:50కు పోలింగ్ ప్రారంభించారని ఉద్యోగులు చెబుతున్నారు. ఇక్కడ పోలింగ్ సిబ్బందికి సరైన అవగాహన లేక చాలా మంది ఓటర్లు గందరగోళానికి గురయ్యారు.
- బీ109 పోలింగ్ బూత్లో ఓటింగ్ 10:30 గంటలకు ప్రారంభమైనట్లు ఉద్యోగులు తెలిపారు. ఆలస్యంగా ఓటింగ్ ప్రారంభించడం వలన ఎంపీ ఓటు కవర్లో ఎమ్మెల్యే ఓటు పత్రం, ఎమ్మెల్యే ఓటు కవర్లో ఎంపీ ఓటు పత్రం పెట్టినట్లు చెబుతున్నారు.
- ధ్రువీకరణ పత్రాలను పోలింగ్ అధికారి సంతకం చేసి ముందు ఇవ్వాలి. కానీ తర్వాత ఇచ్చారని పలువురు తెలిపారు.
- పోలింగ్ కేంద్రంలో ఓటు వేసిన బ్యాలట్్ పేపరు పెట్టి సీల్ చేయడానికి కనీసం జిగురు కూడా లేదని.. చివరికి పెన్నులు కూడా అందుబాటులో లేక పోవడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తాయి.
గెజిటెడ్ అధికారుల స్టాంపులు వేయలేదు
పోస్టల్ బ్యాలట్్ వేసే వారిని ధ్రువీకరించడానికి ఒక గెజిటెడ్ అధికారి అవసరం ఉన్నందున ప్రతీ బూత్లకు అందుబాటులో ఒక గెజిటెడ్ అధికారిని ఆర్వో నియమించారు. కానీ 116 బూత్లో ఓటర్లకు కొందరికి సంతకం చేసి స్టాంపులు వేయలేదని.. ఓటు వేసి వచ్చిన తర్వాత గుర్తించిన ఓటర్లు తమ ఓటు మురుగి పోతుందేమోనని ఆందోళన చెందుతున్నారు.
ఫెసిలిటేషన్ అంటే ఇదేనా..?
ఉద్యోగులు ఎక్కడ ఉద్యోగం చేసినా వారికి ఓటు ఉన్న ప్రాంతంలో నియోజకవర్గ కేంద్రంలోకి వెళ్లి ఓటు వేయాలి. కానీ జిల్లాల పునర్విభజనలో ఉద్యోగం ఒక జిల్లాలో.. ఓటు మరో జిల్లాలో ఉండటం వల్ల ఉద్యోగులు, ఉపాధ్యాయులు పోస్టల్ బ్యాలట్్ వేయడానికి చాలా ఇబ్బందులు ఎదర్కొంటున్నారు. మండుటెండలో 40 నుంచి 50 కిలోమీటర్ల దూరం వెళ్లి ఓటు వేయాలంటే కష్టంగా మారింది. దీని వల్ల వారు ఓటు వినియోగించుకునే అవకాశాలు తక్కువగా ఉన్నాయి. ఉద్యోగులు నివాసం ఉన్న మండల కేంద్రాల్లో ఓటు వేసేలా ఏర్పాట్లు చేయాలని కోరుతున్నారు. ఈ జిల్లాలో పని చేసి వేరే జిల్లాలో నివాసం ఉండే వారికి మరికొన్ని రోజులు ఓటు వేసే అవకాశం కల్పించాలని ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు కోరుతున్నాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పాపాలను పాతరేస్తారా.. తోడేళ్లకు తోడవుతారా?
[ 18-05-2024]
కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల పరిధిలో నదీ గర్భాన్ని.. గత ఐదేళ్లలో వైకాపా నేతలు తోడేళ్లలా తోడేశారు. న్యాయస్థానాలు ఆదేశించినా, జాతీయ హరిత ట్రైబ్యునల్ (ఎన్జీటీ) ఆగ్రహం వ్యక్తం చేసినా.. ఇసుకాసురులకు అడ్డుకట్ట పడలేదు. -
తెదేపాకు ఓటేశామని.. ఉపాధి పనులు నిలిపివేశారు
[ 18-05-2024]
సార్వత్రిక ఎన్నికల్లో తెదేపాకు ఓటేశారని వైకాపా నాయకులు ఇద్దరు కూలీలకు ఉపాధి హామీ పనులు నిలిపివేశారు. -
శస్త్రచికిత్సలో అపశ్రుతి.. యువతి చనిపోయినా చెప్పకుండా దాచిన వైద్యులు
[ 18-05-2024]
‘2019లో శస్త్రచికిత్స చేసి కాలిలో పెట్టిన ప్లేట్లు తొలగించుకునేందుకు ఆసుపత్రిలో చేరిందా యువతి. అందరితో నవ్వుతూ రెండు రోజుల్లో తిరిగి వస్తానని చెప్పింది. అలా వెళ్లిన యువతి వైద్యుల నిర్లక్ష్యం కారణంగా విగతజీవిగా మారింది. -
ముంచెత్తిన వర్షం
[ 18-05-2024]
జిల్లాను వర్షం ముంచెత్తింది. శుక్రవారం ఉదయం 4గంటల నుంచి ఎడతెరిపి లేకుండా కురిసిన భారీ వర్షానికి రహదార్లు జలమయమయ్యాయి. -
మరమ్మతులు మమ.. అభివృద్ధి భ్రమ
[ 18-05-2024]
కూచిపూడి నుంచి జాతీయ పతాక రూపకర్త పింగళి వెంకయ్య జన్మస్థలమైన భట్లపెనుమర్రు వరకు రహదారికి తూ..తూ.. మంత్రంగా మరమ్మతులు చేశారు. -
అరటి రైతు విలవిల
[ 18-05-2024]
అరటి సాగు చేసిన రైతులు తీవ్రంగా నష్టపోయారు. రెండు రోజులుగా కురుస్తున్న గాలి, వానకు చెట్లు భారీగా పడిపోయాయి. దీంతో ఒక్కో రైతుకు రూ. లక్షల్లో నష్టం వాటిల్లింది. -
ఎన్నికల్లో జోగి అక్రమాలకు అడ్డేది?
[ 18-05-2024]
‘ఎన్నికల ఫలిలతాల తర్వాత జోగి రమేష్ పెనమలూరులో కనిపించర’ ని పెనమలూరు నియోజకవర్గ తెదేపా అభ్యర్థి బోడే ప్రసాద్ విమర్శించారు. -
వేతన చెల్లింపుల్లో వ్యత్యాసం తగదు
[ 18-05-2024]
ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల విధుల్లో పాల్గొన్న ఉపాధ్యాయులకు రెమ్యునరేషన్ చెల్లింపుల్లో వ్యత్యాసాలు నెలకొన్నాయని, వాటిని సవరించి చెల్లించడంతో పాటు, ఎన్నికల విధులు, శిక్షణ కాల ధ్రువీకరణ పత్రాలు ఇవ్వాలని యూటీఎఫ్ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కె.శ్రీనివాసరావు, సుందరయ్య, కోశాధికారి పి.నాగేశ్వరరావు తదితరులు కలెక్టర్ డిల్లీరావును కోరారు -
హత్య కేసులో నిందితుడికి యావజ్జీవ కారాగారం
[ 18-05-2024]
ఓ వ్యక్తిపై పెట్రోల్ పోసి నిప్పంటించి తగలబెట్టిన ఘటనలో నిందితుడికి న్యాయస్థానం యావజ్జీవ కారాగార శిక్ష విధించింది. -
ట్రాఫిక్ పనులకు రెడ్ సిగ్నల్!
[ 18-05-2024]
విజయవాడ నగర ప్రజల ట్రాఫిక్ కష్టాలను తీరుస్తుందని భావించిన ఐటీఎంఎస్ (ఇంటిగ్రేటెడ్ ట్రాఫిక్ మేనేజ్మెంట్ సిస్టమ్) ప్రాజెక్టు ఎంతకూ పూర్తి కావడం లేదు. -
జిల్లాలో ఖరీఫ్ పంటల సాగుకు సన్నాహాలు
[ 18-05-2024]
ఈ ఏడాది రుతుపవనాలు సకాలంలో రానున్నట్లు సంకేతాలు అందడంతో, జిల్లాలో ఖరీఫ్ సాగుకు వ్యవసాయ శాఖ అధికారులు సన్నాహాలు చేస్తున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
హామీలను అమలు చేసే శక్తి సీఎం రేవంత్రెడ్డికి లేదు: కిషన్రెడ్డి
-
‘3 ఇడియట్స్’ సీన్తో సాఫ్ట్వేర్ ఇంజినీర్లకు సుందర్ పిచాయ్ సలహా..
-
ధోనీకిదే చివరి సీజనా? విరాట్ కోహ్లీ సంచలన వ్యాఖ్యలు!
-
అయోధ్య రామాలయం గేట్లు తెరిపించిందే కాంగ్రెస్ ప్రభుత్వం: జీవన్రెడ్డి
-
స్వాతి మాలీవాల్పై దాడి ఘటన.. కేజ్రీవాల్ సహాయకుడు బిభవ్ అరెస్ట్
-
మళ్లీ ట్రెండింగ్లోకి రాజమౌళి - మహేశ్ల ప్రాజెక్ట్.. కారణమిదే!