పట్టా లేదు... వంశీ.. పత్తా లేరు..
గన్నవరం నియోజకవర్గంలో జగనన్న కాలనీల్లో ఇళ్ల స్థలాలు అర్హులకు అందని ద్రాక్షగానే మారాయి. రాజకీయ అండదండలు ఉన్నవారికే అధిక శాతం పట్టాలు దక్కాయి.
స్థలాలు అందుబాటులో ఉన్నా ఫలితం శూన్యం
11 వేల మందికి మొండిచెయ్యి
హనుమాన్జంక్షన్, న్యూస్టుడే
గతంలో ఏం చేప్పారు?నియోజకవర్గంలో వేల సంఖ్యలో పేదలు ఇళ్ల స్థలాలకు ఎదురు చూస్తున్నారు. అందరికీ మంజూరు చేయాలనే వైకాపాకు మద్దతు తెలిపా. రాజకీయాలకతీతంగా అర్హులందరికీ న్యాయం చేస్తా. ఇంటి స్థలం రాలేదని ఎవరూ బాధపడకూడదు.
ఏం చేశారు?
ఇంటి స్థలాలకు వేలాది మంది నుంచి దరఖాస్తులు స్వీకరించారు. కానీ ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చే నాటికి కూడా చాలా గ్రామాల్లో భూసేకరణ జరపకపోవడం, కొన్నిచోట్ల చేసినా రైతులకు ధర చెల్లించకపోవడం, ప్రభుత్వ స్థలాలు అందుబాటులో ఉన్నా కూడా పట్టాలు తయారు చేయించడంలో జాప్యంతో దాదాపు 11 వేల మంది అర్హులకు నిరాశే మిగిల్చారు.
గన్నవరం నియోజకవర్గంలో జగనన్న కాలనీల్లో ఇళ్ల స్థలాలు అర్హులకు అందని ద్రాక్షగానే మారాయి. రాజకీయ అండదండలు ఉన్నవారికే అధిక శాతం పట్టాలు దక్కాయి. అర్హతే ప్రామాణికంగా ఇళ్ల స్థలాలు కేటాయిస్తామని వైకాపా ప్రభుత్వం చెప్పినా, ఆచరణలో నాయకులు, అధికారుల తీరు ఇందుకు విరుద్ధంగా ఉంది. ఇళ్ల స్థలాల పంపిణీ చేపట్టి మూడేళ్లు దాటినా నేటికీ వేలమందికి స్థలం సమకూరలేదు. కొన్నిచోట్ల చేతికి పట్టాలు ఇచ్చి ‘మమ’ అన్పించారు తప్పితే, స్థలం ఎక్కడో చూపలేదు. మరికొన్ని చోట్ల ఇంకా ప్రతిపాదనలకే పరిమితం చేయడంతో వేల సంఖ్యలో లబ్ధిదారులకు సెంటున్నర జాగా కోసం ఎదురుచూపులే మిగిలాయి.
గ్రామంలో ఒక్కరికీ ఇవ్వలేదు
- సాంబశివరావు, మల్లవల్లి
మా గ్రామంలో ఒక్కరంటే ఒక్కరికీ సెంటున్నర స్థలం దక్కలేదు. 40 ఎకరాల ప్రభుత్వ స్థలం అందుబాటులో ఉండి, లేఔట్ రూపొందించి, అర్హుల జాబితా తయారు చేసిన అధికారులు, ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చే వరకు అదిగో పట్టా, ఇదిగో స్థలమంటూ కాలయాపన చేశారు. తీరా కోడ్కు ముందే పట్టాలు సిద్ధమయ్యాయని నమ్మబలికి, పంపిణీ చేయకపోవడం దారుణం.
స్థలాలిచ్చినా లేఔట్ వేయలేదు
- రంగారావు, పెరికీడు
మా ఊళ్లో 168 మందికి చెరువు భూమిలో స్థలాలిచ్చారు. రెండున్నరేళ్ల కిందటే అందరికి ఆర్భాటంగా పట్టాలిచ్చిన అధికారులు, ఇంతవరకు ప్లాట్లు విభజించి స్థలాలు కేటాయించలేదు. కనీసం లేఔట్ను మెరక చేసి రహదారులు కూడా విభజించలేదు. ఎన్నికల కోడ్కు ముందు పట్టాల్చిన వారి స్థలాలను రిజిస్ట్రేషన్ చేసే ప్రక్రియ నుంచి మా గ్రామాన్ని మినహాయించారు. దీన్నిబట్టి కంటితుడుపు పట్టాలేనన్న సంగతి అర్థమైంది.
భూసేకరణలో తీవ్ర జాప్యం
- కృష్ణారావు, రంగన్నగూడెం
మా గ్రామ పంచాయతీలో 114 మందికి పట్టాలివ్వడానికి అర్హుల జాబితా తయారు చేశారు. ఆర్.ఎస్.నంబరు 56లోని ప్రభుత్వ పోరంబోకు భూమిలో నాలుగెకరాలు ఎంపిక చేశారు. ఇది చెరువు భూమని కొందరు న్యాయస్థానానికి వెళ్లడంతో పట్టాల ప్రక్రియ ఆగిపోయింది. అప్పట్నుంచి ప్రత్యామ్నాయ భూసేకరణ జరపకుండా కాలయాపన చేస్తూ వచ్చారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పాపాలను పాతరేస్తారా.. తోడేళ్లకు తోడవుతారా?
[ 18-05-2024]
కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల పరిధిలో నదీ గర్భాన్ని.. గత ఐదేళ్లలో వైకాపా నేతలు తోడేళ్లలా తోడేశారు. న్యాయస్థానాలు ఆదేశించినా, జాతీయ హరిత ట్రైబ్యునల్ (ఎన్జీటీ) ఆగ్రహం వ్యక్తం చేసినా.. ఇసుకాసురులకు అడ్డుకట్ట పడలేదు. -
తెదేపాకు ఓటేశామని.. ఉపాధి పనులు నిలిపివేశారు
[ 18-05-2024]
సార్వత్రిక ఎన్నికల్లో తెదేపాకు ఓటేశారని వైకాపా నాయకులు ఇద్దరు కూలీలకు ఉపాధి హామీ పనులు నిలిపివేశారు. -
శస్త్రచికిత్సలో అపశ్రుతి.. యువతి చనిపోయినా చెప్పకుండా దాచిన వైద్యులు
[ 18-05-2024]
‘2019లో శస్త్రచికిత్స చేసి కాలిలో పెట్టిన ప్లేట్లు తొలగించుకునేందుకు ఆసుపత్రిలో చేరిందా యువతి. అందరితో నవ్వుతూ రెండు రోజుల్లో తిరిగి వస్తానని చెప్పింది. అలా వెళ్లిన యువతి వైద్యుల నిర్లక్ష్యం కారణంగా విగతజీవిగా మారింది. -
ముంచెత్తిన వర్షం
[ 18-05-2024]
జిల్లాను వర్షం ముంచెత్తింది. శుక్రవారం ఉదయం 4గంటల నుంచి ఎడతెరిపి లేకుండా కురిసిన భారీ వర్షానికి రహదార్లు జలమయమయ్యాయి. -
మరమ్మతులు మమ.. అభివృద్ధి భ్రమ
[ 18-05-2024]
కూచిపూడి నుంచి జాతీయ పతాక రూపకర్త పింగళి వెంకయ్య జన్మస్థలమైన భట్లపెనుమర్రు వరకు రహదారికి తూ..తూ.. మంత్రంగా మరమ్మతులు చేశారు. -
అరటి రైతు విలవిల
[ 18-05-2024]
అరటి సాగు చేసిన రైతులు తీవ్రంగా నష్టపోయారు. రెండు రోజులుగా కురుస్తున్న గాలి, వానకు చెట్లు భారీగా పడిపోయాయి. దీంతో ఒక్కో రైతుకు రూ. లక్షల్లో నష్టం వాటిల్లింది. -
ఎన్నికల్లో జోగి అక్రమాలకు అడ్డేది?
[ 18-05-2024]
‘ఎన్నికల ఫలిలతాల తర్వాత జోగి రమేష్ పెనమలూరులో కనిపించర’ ని పెనమలూరు నియోజకవర్గ తెదేపా అభ్యర్థి బోడే ప్రసాద్ విమర్శించారు. -
వేతన చెల్లింపుల్లో వ్యత్యాసం తగదు
[ 18-05-2024]
ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల విధుల్లో పాల్గొన్న ఉపాధ్యాయులకు రెమ్యునరేషన్ చెల్లింపుల్లో వ్యత్యాసాలు నెలకొన్నాయని, వాటిని సవరించి చెల్లించడంతో పాటు, ఎన్నికల విధులు, శిక్షణ కాల ధ్రువీకరణ పత్రాలు ఇవ్వాలని యూటీఎఫ్ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కె.శ్రీనివాసరావు, సుందరయ్య, కోశాధికారి పి.నాగేశ్వరరావు తదితరులు కలెక్టర్ డిల్లీరావును కోరారు -
హత్య కేసులో నిందితుడికి యావజ్జీవ కారాగారం
[ 18-05-2024]
ఓ వ్యక్తిపై పెట్రోల్ పోసి నిప్పంటించి తగలబెట్టిన ఘటనలో నిందితుడికి న్యాయస్థానం యావజ్జీవ కారాగార శిక్ష విధించింది. -
ట్రాఫిక్ పనులకు రెడ్ సిగ్నల్!
[ 18-05-2024]
విజయవాడ నగర ప్రజల ట్రాఫిక్ కష్టాలను తీరుస్తుందని భావించిన ఐటీఎంఎస్ (ఇంటిగ్రేటెడ్ ట్రాఫిక్ మేనేజ్మెంట్ సిస్టమ్) ప్రాజెక్టు ఎంతకూ పూర్తి కావడం లేదు. -
జిల్లాలో ఖరీఫ్ పంటల సాగుకు సన్నాహాలు
[ 18-05-2024]
ఈ ఏడాది రుతుపవనాలు సకాలంలో రానున్నట్లు సంకేతాలు అందడంతో, జిల్లాలో ఖరీఫ్ సాగుకు వ్యవసాయ శాఖ అధికారులు సన్నాహాలు చేస్తున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
అదృశ్యమైన ఆ నటుడు.. ఎట్టకేలకు 24 రోజుల తర్వాత ఇంటికి
-
ఈఏపీ సెట్ ఫలితాలు.. టాప్ 10 ర్యాంకర్లు వీరే..
-
మాలీవాల్ను బయటకు పంపిన భద్రతా సిబ్బంది.. కేజ్రీవాల్ నివాసం నుంచి మరో వీడియో
-
విచక్షణ మరిచి.. చొక్కాలు పట్టుకుని ఎత్తిపడేసి: తైవాన్ పార్లమెంట్లో ఎంపీల కొట్లాట
-
కేసు పెడితే పెట్టుకోండి.. నా స్థలాన్ని కాపాడుకుంటా: మల్లారెడ్డి
-
ఇక నేను మా మామ ఒకటే జట్టు.. రోహిత్కే మద్దతు: కేఎల్ రాహుల్