logo

రాక్షస సంహారానికే కూటమి : నారా రోహిత్‌

కూటమి అభ్యర్థుల విజయాన్ని కాంక్షిస్తూ సోమవారం సినీ నటుడు నారా రోహిత్‌, హాస్య నటుడు రఘు, ఎంపీ అభ్యర్థి కేశినేని శివనాథ్‌(చిన్ని) కుమారుడు వెంకట్‌, ఎమ్మెల్యే అభ్యర్థిని తంగిరాల సౌమ్యలతో కలిసి ఎన్టీఆర్‌ జిల్లాలోని చందర్లపాడులో రోడ్‌షో నిర్వహించారు.

Published : 07 May 2024 05:28 IST

చందర్లపాడు, న్యూస్‌టుడే: కూటమి అభ్యర్థుల విజయాన్ని కాంక్షిస్తూ సోమవారం సినీ నటుడు నారా రోహిత్‌, హాస్య నటుడు రఘు, ఎంపీ అభ్యర్థి కేశినేని శివనాథ్‌(చిన్ని) కుమారుడు వెంకట్‌, ఎమ్మెల్యే అభ్యర్థిని తంగిరాల సౌమ్యలతో కలిసి ఎన్టీఆర్‌ జిల్లాలోని చందర్లపాడులో రోడ్‌షో నిర్వహించారు. గ్రామంలో మహిళలు, నాయకులు, కార్యకర్తలు వారికి ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా రోహిత్‌ మాట్లాడారు. గత ఎన్నికల్లో రాక్షసుడ్ని ఎన్నుకోవడంతో రాష్ట్రంలో అంధకారం నెలకొందన్నారు. రాక్షస సంహారం కోసం ఈ సారి తెదేపా, జనసేన, భాజపాలు ఉమ్మడిగా పోటీ చేస్తున్నాయన్నారు. రానున్న ఐదు రోజులు కీలకమని ప్రతి ఒక్కరూ ఓటు వేసి కూటమి అభ్యర్థులను గెలిపించాలని కోరారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపడితేనే రాష్ట్ర భవిష్యత్తు బాగుంటుందన్నారు. సూపర్‌- 6 పథకాల ద్వారా అన్ని వర్గాల ప్రజలకు లబ్ధి చేకూరుతుందన్నారు. పలువురు వైకాపా నుంచి తెదేపాలో చేరగా కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. నాయకులు కోట వీరబాబు, వాసిరెడ్డి ప్రసాద్‌, కేవీ.సాంబశివరావు, మేకల సుధాకర్‌ తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని