logo

కూటమి అభ్యర్థుల విజయానికి ఎన్నికల ప్రచారం

అవనిగడ్డ నియోజకవర్గం లంకపల్లిలో కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి మండలి బుద్ధ ప్రసాద్, మచిలీపట్నం ఎంపీ అభ్యర్థి వల్లభనేని బాలశౌరీ లను గెలిపించాలని కోరుతూ తెదేపా, జనసేన, భాజపా ఆధ్వర్యంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు.

Published : 09 May 2024 14:07 IST

ఘంటసాల: అవనిగడ్డ నియోజకవర్గం లంకపల్లిలో కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి మండలి బుద్ధ ప్రసాద్, మచిలీపట్నం ఎంపీ అభ్యర్థి వల్లభనేని బాలశౌరీ లను గెలిపించాలని కోరుతూ తెదేపా, జనసేన, భాజపా ఆధ్వర్యంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఇంటింటికి తిరుగుతూ కూటమి అభ్యర్థులను గెలిపించాలని  ఓటర్లను కోరారు.  తెదేపా సూపర్‌ సిక్స్‌ పథకాల కరపత్రాలు పంపిణీ చేశారు. అనంతరం తెదేపా నాయకుడు కుంపటి అరుణ్ కుమార్ ఆధ్వర్యంలో అతిథులను సత్కరించారు. మండలి బుద్ధ ప్రసాద్ కుమార్తె అవనిజ, జడ్పీటీసీ మాజీ సభ్యురాలు తుమ్మల వరలక్ష్మి, కూటమి నాయకులు పరుచూరి సుభాష్ చంద్రబోస్, పరిశే చలపతిరావు, కొమ్మారెడ్డి లీలా కృష్ణయ్య, గువ్వాబత్తిన నాగేశ్వరరావు, నలుకుర్తి సురేష్, తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని