మరో చెత్త నిర్ణయం!
చెత్త పన్ను వసూలుకు ఏ ఒక్క అవకాశాన్నీ వదులుకొనేలా లేరు. ఇప్పటికే ప్రభుత్వం అనేక మార్గాలను అనుసరించగా తాజాగా సరికొత్త నిర్ణయాన్ని తెరమీదకు తీసుకొచ్చింది. పన్ను వసూలు కోసం పలు రూపాల్లో ప్రజలను ఇబ్బంది పెడుతూ వచ్చినా ససేమిరా అంటున్నారు.
ఇంటి పన్నుతో అనుసంధానం
ప్రజలపై ఆర్థిక భారం
క్లాప్ ఆటోలోకి చెత్త వేస్తున్న ప్రజలు
అనంత నగరపాలక, న్యూస్టుడే: చెత్త పన్ను వసూలుకు ఏ ఒక్క అవకాశాన్నీ వదులుకొనేలా లేరు. ఇప్పటికే ప్రభుత్వం అనేక మార్గాలను అనుసరించగా తాజాగా సరికొత్త నిర్ణయాన్ని తెరమీదకు తీసుకొచ్చింది. పన్ను వసూలు కోసం పలు రూపాల్లో ప్రజలను ఇబ్బంది పెడుతూ వచ్చినా ససేమిరా అంటున్నారు. చెత్తకు పన్ను వసూలు ఏమిటని ప్రశ్నిస్తున్నారు. సచివాలయం, మహిళా సంఘాలకు లక్ష్యాలను నిర్ధేశించినా ఆశించిన మేరకు వసూలు కావడం లేదు. ఉమ్మడి అనంత జిల్లాలో ఇంటి పన్నుకు చెత్త పన్నును అనుసంధానం చేసి పిండుకొనేందుకు సరికొత్త ఉపాయం చేస్తున్నారు. కేవలం అనుసంధానం చేస్తున్నామని చెబుతున్నప్పటికీ ఎప్పుడూ లేని చెత్త పన్నుతో ఎందుకు అనుసంధానం చేస్తున్నారన్నది ప్రశ్నార్థకంగా మారింది. ఇప్పటికిప్పుడు కాకున్నా రాబోయే రోజుల్లో ఇంటి పన్నుతో సహా ప్రతి ఆర్నెల్లకోసారి చెత్త పన్ను కలిపేసేందుకు ప్రక్రియ చేపడుతున్నట్లు అవగతమవుతోంది.
మ్యాపింగ్కు చిక్కులే..
క్లీన్ ఆంధ్రప్రదేశ్ (క్లాప్) ప్రక్రియ గత సంవత్సరం జూన్ నుంచి ప్రారంభించారు. ఇప్పటికే సంవత్సరం దాటినా ఇళ్ల నుంచి ప్రతి నెలా చెత్త పన్ను లక్ష్యం మేరకు వసూలు కావడం లేదు. క్లాప్ పథకం అమలు కింద ఒక్కో ఆటోకు ప్రతినెలా ప్రభుత్వం కొంత సొమ్ము ఏజెన్సీకి చెల్లించాలి. కానీ, చెత్త పన్నులు సక్రమంగా వసూలు కాకపోవడంతో ఒక్క అనంతపురం నగరపాలక పరిధిలోనే రూ.39 లక్షలు సాధారణ నిధుల నుంచి ఏజెన్సీకి చెల్లించారు. ఇదే పరిస్థితి రెండు జిల్లాలోనూ ఉంది. నగరపాలక సంస్థలో కొంత ఆర్థిక వనరులు ఉండటంతో భారమైనా నిధులను సర్దుబాటు చేసి ఆటోలు తిరగడానికి ప్రయత్నిస్తున్నారు. చిన్న చిన్న పట్టణ, పురపాలికల్లో ప్రతినెలా చెత్త పన్నులు ఆయా మున్సిపాలిటీల నుంచి చెల్లించడం సాధ్యం కాదు. ఈ నేపథ్యంలోనే ఇంటి పన్నుతో మ్యాపింగ్ చేపట్టారు. సాధారణంగా ఇంటి యజమాని పేరుతో పన్నులు వసూలు చేస్తారు. కొందరు బహుళ అంతస్థులు, నివాసాలు తదితర ప్రాంతాల్లో అద్దెకు ఉంటారు. అద్దెకు ఉన్నవారు చెత్తను వేస్తే ఇంటి యజమాని పన్ను కట్టాల్సి వస్తుంది. అత్యధికంగా అనంతపురం నగరంలో 89.79 శాతం, అత్యల్పంగా మడకశిరలో 13.52 శాతం నివాసాలను మ్యాపింగ్ చేసే ప్రక్రియ పూర్తయింది. ఈ విధానం రాబోయే రోజుల్లో ఇంటి యజమానులకు సమస్యగా మారనున్నా యంత్రాంగం మాత్రం ఉత్తర్వులు వచ్చిందే తరువాయి మ్యాపింగ్ను మాత్రం చకచకా చేస్తున్నారు. ఈ ప్రక్రియ వల్ల ఇంటి పన్ను కట్టే అంశంలో ప్రతిబంధకంగా మారనుండటంతో పన్నుల వసూళ్లపై ప్రభావం పడే ప్రమాదం ఉంది.
సేకరణ అంతంత మాత్రమే..
ఇంటింటా చెత్తను వేరు చేసి క్లాప్ ఆటోల ద్వారా తరలించాల్సి ఉంటుంది. ప్రతి ఇంటికీ మూడు చెత్త బిన్నులు ఇవ్వడంతో తడి, పొడి, హానికారక వ్యర్థాలను అందులోకి వేయాల్సి ఉంటుంది. ఆటో రాగానే మూడు అరల్లోకి వేయాల్సి ఉంటుంది. వాహనం వద్ద డ్రైవరు ఉండగా ఒక్కోసారి కార్మికులు పట్టించుకోవడం లేదు. చెత్త వేరుచేయాలన్న నిబంధనలున్నా అంతా ఒకే అరలోకే పడేస్తున్నారు. రోజూ వాహనాలు రావడం లేదు. నగరం, పుర, పట్టణాల్లో ఎక్కడపడితే అక్కడ చెత్త దర్శనం ఇస్తుండటంతో క్లీన్ ఆంధ్రప్రదేశ్ లక్ష్యం నెరవేరడం లేదు.
అనుసంధానం చేస్తున్నాం: - భాగ్యలక్ష్మి, అనంత నగర కమిషనరు
ఇంటి పన్నును సచివాలయం వారీగా ఉన్న నివాసాలను గుర్తించి క్లాప్ పరిధిలోకి వచ్చేవాటిని అనుసంధానం చేస్తున్నాం. యూజర్ ఛార్జీలు వసూలు కోసం అని కాదు.. ప్రభుత్వం నుంచి వచ్చిన ఆదేశాలను అమలు చేస్తున్నాం. భవిష్యత్తులో ప్రభుత్వ నిర్ణయం ఎలా ఉంటుందో తెలియదు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అధికారమిచ్చినా.. నిర్లక్ష్యమే అడుగడుగునా..!
[ 27-04-2024]
ఇంట గెలిచి రచ్చ గెలవాలంటారు.. రచ్చ సంగతి దేవుడెరుగు వారు నివాసముంటున్న ప్రాంతాలనూ గాలికొదిలేశారు వైకాపా ఎమ్మెల్యేలు. ఉమ్మడి అనంత జిల్లాలో 14 సీట్లకుగాను 12 స్థానాల్లో విజయం సాధించి అధికారం చేపట్టడంతో ఇక తమ ప్రాంత సమస్యలు పరిష్కారమవుతాయని కలలుగన్న ప్రజల ఆశలు ఐదేళ్లుగా నిరాశలయ్యాయి. -
‘అరాచక పాలన అంతం.. కూటమి పంతం’
[ 27-04-2024]
రాష్ట్రంలో రాక్షస పాలనను సాగనంపేందుకు ప్రజలంతా సిద్ధంగా ఉన్నారని తెదేపా, భాజపా జిల్లా అధ్యక్షులు వెంకట శివుడు యాదవ్, సందిరెడ్డి శ్రీనివాసరెడ్డి, జనసేన జిల్లా ఉపాధ్యక్షుడు అంకె ఈశ్వరయ్య పేర్కొన్నారు. -
రూ.50 లక్షలు.. నీళ్ల పాలు
[ 27-04-2024]
ప్రభుత్వ అధికారులు, ప్రజాప్రతినిధుల నిర్లక్ష్యం బుక్కరాయసముద్రం వాసుల పాలిట శాపంగా మారింది. ఈ మేజరు పంచాయతీలో 35 కాలనీల్లో 30 వేల జనాభా ఉంది. -
లోక్సభకు 21... అసెంబ్లీకి 136
[ 27-04-2024]
సార్వత్రిక ఎన్నికల నామినేషన్ ఘట్టంలో రెండో ప్రక్రియగా భావించే పరిశీలన సజావుగా ముగిసింది. ఎక్కడా పెద్దగా వివాదాలు, అభ్యంతరాలు చోటు చేసుకోలేదు. చిన్నాచితకా మౌఖిక ఫిర్యాదులు మినహా ఏ సమస్య తలెత్తలేదు. -
నెగ్గేందుకు సిగ్గులేకుండా బరితెగింపు
[ 27-04-2024]
ఓటర్లకు డబ్బు చేరవేసేందుకు అధికార వైకాపా ముందస్తుగా బరితెగించింది. తమ పార్టీ నాయకులపై ఎన్నికల యంత్రాంగం పూర్తి నిఘా ఉంటుందన్న అనుమానంతో ప్రత్యామ్నాయ మార్గాలను సిద్ధం చేసుకుంటున్నారు. -
పెద్దలకు తారురోడ్డు.. పేదలకు మోకాలడ్డు!
[ 27-04-2024]
ఇక్కడ కన్పిస్తున్న పై చిత్రంలో పెద్దలు వెళ్లే రాచమార్గం.. దానిపక్కనే పేదలు వెళ్లే దారి ఉంది. నగరంలోని జన్మభూమి రోడ్డు నడిమి వంక నుంచి ప్రారంభమై శింగనమల ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి నివాసం, ఆ తర్వాత మాజీ రాష్ట్రపతి నీలం సంజీవరెడ్డి నివాసం మీదుగా కోవూరునగర్ ప్రధాన రోడ్డులోకి చేరుతుంది. -
భవన నిర్మాణ కార్మిక జీవనం.. జగన్ పాలనలో ఛిద్రం
[ 27-04-2024]
రాష్ట్రంలో సీఎం జగన్ అమలు చేస్తున్న ఆన్లైన్ ఇసుక విధానంతో భవన నిర్మాణ కుటుంబాలను రోడ్డున పడేసింది. ఐదేళ్ల వైకాపా పాలన వారి బతుకులను ఛిద్రం చేసింది. -
చేనేతలను ఆదుకుంటాం: నిమ్మల కిష్టప్ప
[ 27-04-2024]
తెదేపా చేనేతలకు అండగా నిలుస్తోందని ఆ పార్టీ అనంతపురం పార్లమెంట్ నియోజకవర్గ ఎన్నికల సమన్వయకర్త నిమ్మల కిష్టప్ప పేర్కొన్నారు. -
పయ్యావుల కేశవ్ ప్రచారంలో వైకాపా శ్రేణుల కవ్వింపు చర్యలు
[ 27-04-2024]
ప్రశాంతంగా ఉన్న గ్రామాల్లో వైకాపా నాయకులు గొడవలకు తవిచ్చేలా కవ్వింపు చర్యలకు పాల్పడుతున్నారు.ఈ తరహా చర్యలకు మండలంలోని కాలువపల్లిలో శుక్రవారం వైకాపా కార్యకర్తలు పూనుకున్నారు. -
వైకాపా మోసపూరిత మాటలు నమ్మొద్దు: సునీత
[ 27-04-2024]
గత ఎన్నికల్లో వైకాపాకు ఓటు వేసి ఎంత తప్పుచేశారో మీరే ఆలోచించాలి. ఆ తప్పు మళ్లీ చేయొద్దు. ఒక్క ఛాన్స్ అంటూ మళ్లీ మోసం చేసేందుకు మీ ముందుకు వస్తున్నారు. -
సొంత చెల్లి చీరపైనా దిగజారుడు మాటలా?
[ 27-04-2024]
ముఖ్యమంత్రి హోదాలో ఉండి సొంత చెల్లెలు ధరించిన చీర గురించి నోటికొచ్చినట్లు మాట్లాడటం జగన్ దిగుజారుడు తనానికి పరాకాష్ట అని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ వ్యాఖ్యానించారు. -
నిలువ నీడేదీ జగన్?
[ 27-04-2024]
అసలే మండేఎండలు.. పట్టణంలోని బస్టాప్లలో బస్సు షెల్టర్లు లేక ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. పట్టణంలో ఆర్టీసీ బస్టాండు పేరుకు మాత్రమే ఉండగా బస్సులన్నీ పాత బస్టాండు నుంచే రాకపోకలు సాగిస్తున్నాయి. -
‘వైకాపా ప్రభుత్వానికి చరమగీతం పాడదాం’
[ 27-04-2024]
వైకాపా నాయకులు ఐదేళ్లలో బడుగు బలహీన వర్గాల ప్రజలను ఎన్నో రకాలుగా ఇబ్బందులకు గురిచేశారని, వారి అరాచక పాలనకు చరమగీతం పాడుదామని మాజీ మంత్రి, రాయదుర్గం నియోజకవర్గం తెదేపా అభ్యర్థి కాలవ శ్రీనివాసులు పిలుపు నిచ్చారు. -
ఆదర్శ మున్సిపాలిటీగా తీర్చిదిద్దుతాం..
[ 27-04-2024]
ప్రజల నుంచి పన్ను కట్టించుకొంటున్నారే తప్పా అభివృద్ధి చేయలేకపోయారని, తనకు అవకాశం కల్పిస్తే కళ్యాణదుర్గాన్ని ఆదర్శ మున్సిపాలిటీగా తీర్చిదిద్దుతానని తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి అమిలినేని సురేంద్రబాబు అన్నారు. -
బాలకృష్ణకు ఘన స్వాగతం
[ 27-04-2024]
సినీనటుడు, హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ శుక్రవారం పెనుకొండ మండలంలోని కియా పరిశ్రమ సమీపంలోని హెలిప్యాడ్ వద్దకు రావడంతో ఎమ్మెల్యే అభ్యర్థి సవిత ఆయనకు పూలమాలవేసి, శాలువాతో ఘనస్వాగతం పలికారు. -
నిండా మునిగినా.. రైతుకు తప్పని నిరీక్షణ
[ 27-04-2024]
తమది రైతు ప్రభుత్వమని జగన్ ప్రభుత్వం గొప్పలు చెబుతున్నా.. క్షేత్రస్థాయిలో పరిస్థితి ఇందుకు విభిన్నంగా ఉంది. భూగర్భ జలాలు పెంచాలనే లక్ష్యంతో 2018లో అప్పటి తెదేపా ప్రభుత్వం ఉమ్మడి అనంత జిల్లాలోనే అతిపెద్దదైన బుక్కపట్నం చెరువును హంద్రీనీవా నీటితో నింపింది. -
లోక్సభకు 9, అసెంబ్లీకి 45 నామపత్రాల తిరస్కరణ
[ 27-04-2024]
శ్రీసత్యసాయి జిల్లా వ్యాప్తంగా హిందూపురం పార్లమెంటు స్థానంతోపాటు ఏడు అసెంబ్లీ స్థానాలకు దాఖలైన నామపత్రాలను అధికారులు పరిశీలన చేశారు. -
28న ఏపీసెట్
[ 27-04-2024]
సహాచార్య ఉద్యోగ అర్హతకు సంబంధించిన ఏపీ సెట్-2024 ఈ నెల 28న నిర్వహిస్తున్నట్లు ప్రాంతీయ సమన్వయకర్త ఆచార్య వెంకట రమణ తెలిపారు. -
డిగ్రీ పరీక్షల్లో ఒకరు డిబార్
[ 27-04-2024]
ఎస్కేయూ పరిధిలోని డిగ్రీ కళాశాలల్లో నిర్వహిస్తున్న 4వ సెమిస్టర్ పరీక్షల్లో మాస్ కాపీయింగ్కు పాల్పడుతున్న ఓ విద్యార్థిని డిబార్ చేసినట్లు పరీక్షల విభాగం సంచాలకులు ఆచార్య జీవీ రమణ తెలిపారు. -
ఆర్డీటీ సెట్కు దరఖాస్తుల ఆహ్వానం
[ 27-04-2024]
ప్రతిభావంతులైన పేద విద్యార్థులకు ప్రతి ఏటా మాదిరిగానే ఈసారి కూడా ఆర్డీటీ సెట్ నిర్వహిస్తామని ఆ సంస్థ ఎడ్యుకేషన్ డైరెక్టర్ జి.మోహన్ మురళి తెలిపారు.