logo

విజయీభవ..

ఉరవకొండ, రాప్తాడు నియోజకవర్గాల్లో వచ్చే ఎన్నికల్లో భారీ మెజార్టీతో విజయం సాధించాలని తెదేపా అధినేత చంద్రబాబు సూచించారు. మంగళవారం విజయనగరం జిల్లా ఎస్‌.కోట పర్యటనలో ఉన్న చంద్రబాబును పయ్యావుల కేశవ్‌, పరిటాల సునీత కలిశారు.

Published : 24 Apr 2024 05:10 IST

చంద్రబాబు నుంచి బీఫాం అందుకుంటున్న పయ్యావుల కేశవ్‌, పరిటాల సునీత

అనంతపురం (కళ్యాణదుర్గంరోడ్డు), న్యూస్‌టుడే : ఉరవకొండ, రాప్తాడు నియోజకవర్గాల్లో వచ్చే ఎన్నికల్లో భారీ మెజార్టీతో విజయం సాధించాలని తెదేపా అధినేత చంద్రబాబు సూచించారు. మంగళవారం విజయనగరం జిల్లా ఎస్‌.కోట పర్యటనలో ఉన్న చంద్రబాబును పయ్యావుల కేశవ్‌, పరిటాల సునీత కలిశారు. ఇరువురికి బీఫాం పత్రాలను చంద్రబాబు అందజేశారు. అనంతరం చంద్రబాబు మాట్లాడుతూ.. రాష్ట్ర భవిష్యత్తు, ప్రజల సంక్షేమం కోసం కష్టపడుతున్నామని, ఈ ఎన్నికల్లో తెదేపా, జనసేన, భాజపా నాయకులు, కార్యకర్తలంతా కలిసి పని చేయండి. కూటమిని గెలిపించి, మీరంతా మళ్లీ విజయంతో తిరిగి రావాలని కోరారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని