తెదేపా హయాంలో ఏర్పాటు.. వైకాపా పాలనలో గ్రహపాటు
సమూల మార్పులతో విద్యాభివృద్ధికి బాటలు వేశామని గొప్పలు చెబుతున్న వైకాపా ప్రభుత్వం గురుకులాలను పూర్తిగా విస్మరించి విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతోంది.
గిరిజన విద్యార్థుల భవిష్యత్తును గాలికొదిలేసిన జగన్
గోరంట్ల, న్యూస్టుడే: సమూల మార్పులతో విద్యాభివృద్ధికి బాటలు వేశామని గొప్పలు చెబుతున్న వైకాపా ప్రభుత్వం గురుకులాలను పూర్తిగా విస్మరించి విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతోంది. వేలాదిమంది గిరిజన విద్యార్థులు అసౌకర్యాల నడుమ చదువుకొనసాగించేలా చేస్తోంది. తెదేపా హయాంలో 2016లో గిరిజనుల ప్రత్యేక అభివృద్ధి కోసం రాష్ట్రవ్యాప్తంగా 80 గిరిజన సంక్షేమ వసతి గృహాలను గురుకుల పాఠశాలలుగా మార్పు చేశారు. అందులో భాగంగా ఉమ్మడి అనంతపురం జిల్లాలో తొమ్మిది వసతి గృహాలు పాఠశాలలుగా రూపాంతరం చెందాయి. ఇందులో అనంతపురం జిల్లాలో 5, శ్రీసత్యసాయి జిల్లాలో 4 (గోరంట్ల, పెనుకొండ, కదిరిలో రెండు) ఉన్నాయి. 2016 - 17 విద్యా సంవత్సరంలో ఒక్కో తరగతికి 40 మంది విద్యార్థుల ప్రకారం 120 మందితో 3, 4, 5 తరగతులతో గురుకుల పాఠశాలల ప్రారంభించారు. మరో అడుగు ముందుకేసి నూతన భవనాలు నిర్మించడానికి స్థలాల ఎంపిక ప్రక్రియ కూడా పూర్తి చేసింది. అంతలో ఎన్నికలు రావడం, ప్రభుత్వం మారడంతో ఈ గురుకులాలకు గ్రహణం పట్టింది. అయిదేళ్లు దాటుతున్నా అది వీడలేదు. ఇంతవరకు భవన నిర్మాణాలు స్థలాల ఎంపిక ప్రక్రియ దాటలేదు. దీంతో అక్కడ పరిస్థితి దారుణంగా ఉంది.
ఒక్క అడుగూ ముందుకు పడలే..
- గోరంట్ల మండలంలో 2018లో తెదేపా హయాంలో పాలసముద్రం రెవెన్యూ గ్రామపరిధిలో 44వ నంబరు జాతీయ రహదారికి ఆనుకుని సర్వేనంబరు 129 - 2బీలో అయిదెకరాల స్థలాన్ని కేటాయించారు. భవన నిర్మాణానికి నిధులు మంజూరు చేశారు. ఎన్నికలు రావడంతో ఆ ప్రక్రియ అంతటితో ఆగిపోయింది. ఆ తరువాత వైకాపా అధికారంలోకి రావడంతో ఇంతవరకు ఈ ఊసేలేదు. ఆ స్థలాన్ని ఇతరత్రా కార్యక్రమాలకు మార్చాలన్న ప్రయత్నాలు జరిగాయి.
- పెనుకొండలో వైద్య కళాశాలకు ఎంపిక చేసిన చోటే గిరిజన గురుకుల బాలికల పాఠశాల నిర్మాణానికి అయిదెకరాల స్థలాన్ని ఎంపిక చేశారు. అయిదేళ్లు దాటినా ఇంతవరకు భవనం నిర్మించాలన్న ఆలోచన ఈ పాలకులకు రాలేదు. ప్రస్తుతం పాత వసతి గృహంలోనే అసౌకర్యాల నడుమ నెట్టుకొస్తున్నారు.
- కదిరి బాలురు, బాలికలకు రెండు గురుకులాలు మంజూరయ్యాయి. ఇక్కడ పరిస్థితి మరీ దారుణంగా ఉంది. గిరిజన బాలుర వసతి గృహంలో పాఠశాల నడుస్తోంది. వర్షాకాలంలో భవనంలోకి నీరొచ్చి తీవ్ర ఇబ్బంది అవుతుండటంతో సమీపంలోనే మైనార్టీల కోసం నిర్మించిన వసతి గృహంలో కొనసాగిస్తున్నారు. ఇక్కడ చిన్నచిన్న గదులు కావడంతో విద్యార్థులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. బాలికల పాఠశాలను తాత్కాలికంగా మరో భవనంలో ఏర్పాటు చేసుకున్నారు. రెండింటికీ స్థలాలు గుర్తించారు. కానీ, భవన నిర్మాణాలు మాత్రం జరగలేదు.
అక్కడే చదువు.. భోజనం
దశాబ్దాల కిందట నిర్మించిన వసతి గృహాల్లోనే చదువుకోవాలి. అక్కడే భోజనం చేయాలి. అదే స్థలంలో పడుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇక రెగ్యులర్ పోస్టులు అసలు మంజూరు కాలేదు. కేవలం పొరుగుసేవల కింద నియమించిన సిబ్బందితో బోధన కొనసాగుతోంది. వారికి కూడా తక్కువ వేతనాలు ఇస్తున్నారని వాపోతున్నారు. ఒక్కో పాఠశాలలో మూడు నుంచి పది వరకు ఎనిమిది తరగతుల్లో 320 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
షికారు చేశారు... అద్దె బకాయిలు కట్టేదెవరు?
[ 18-05-2024]
‘శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం ఉపకులపతిగా పని చేసిన రామకృష్ణారెడ్డి.. అధికారిక వాహనాలను (కార్లు) సొంత అవసరాల కోసం ఉపయోగించుకున్నారు. ఆయన కుటుంబ సభ్యులు విహారయాత్రలకు రెక్టార్, రిజిస్ట్రార్లకు కేటాయించిన కార్లను వాడుకున్నారు. -
ఈ నెల 27న వివాహం.. పెళ్లి వస్త్రాల కోసం వెళ్లి తిరిగి వస్తుండగా రోడ్డు ప్రమాదం
[ 18-05-2024]
అనంతపురం జిల్లాలో శనివారం ఉదయం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. -
ఇసుకాసురుల ఆగడాలు ఆగేనా?
[ 18-05-2024]
ఐదేళ్లపాటు ఉమ్మడి జిల్లాలో ఇసుక అక్రమ రవాణా యథేచ్ఛగా కొనసాగింది. నిబంధనలను లెక్కచేయకుండా వైకాపా నాయకులు రెచ్చిపోయారు. అధికారం వారి చేతుల్లో ఉండటంతో అధికారులు సైతం అక్రమ రవాణాను అడ్డుకునే ప్రయత్నం చేయలేదు. -
అంతా.. నిశ్శబ్దం
[ 18-05-2024]
ఎన్నికల తర్వాత జరిగిన అల్లర్లతో రాష్ట్రంలోనే సంచలనాలకు కేంద్ర బిందువుగా నిలిచిన తాడిపత్రిలో నిశబ్ద వాతావరణం నెలకొంది. తాడిపత్రి పట్టణ వాసులకు వైకాపా మూకల అరాచక పర్వాన్ని గుర్తు చేసుకుంటేనే గుండెల్లో వణుకు పుడుతోంది. -
ఉత్తర మండలాల్లో మోస్తరు వర్షం
[ 18-05-2024]
జిల్లాలోని ఉత్తర మండలాల్లో గురువారం రాత్రి తేలికపాటి నుంచి మోస్తరు వర్షం కురిసింది. డి.హీరేహాళ్ మండలంలో 28.8 మి.మీలు అత్యధికంగా వర్షం కురిసింది. -
ఓటర్ల ఓపికకు పరీక్ష
[ 18-05-2024]
సగటున ఒక నిమిషంలోపే లోక్సభ, అసెంబ్లీ అభ్యర్థులకు చెరొక ఓటు వేసే వీలున్నా.. గంటలకొద్దీ క్యూలో నిలబడాల్సిన దయనీయ దుస్థితి ఏర్పడింది. ఓటర్ల సహనానికి, ఓపికగా ఎన్నికల సంఘం పరీక్ష పెట్టింది. -
విద్యుత్తు నియంత్రికల మంజూరులో కీలక అధికారి తీరే వేరప్పా..
[ 18-05-2024]
ఉమ్మడి జిల్లా విద్యుత్తుశాఖలో ఓ కీలక అధికారి అధికార పార్టీ తొత్తుగా మారిపోయారు. వైకాపా ప్రజాప్రతినిధులు సిఫార్సు చేస్తే చాలు.. వెంటనే విద్యుత్తు నియంత్రికలు మంజూరు చేసి తన విధేయతను చాటుకుంటున్నారు.రెండేళ్లలో 300 పైగా 25కేవీ సామర్థ్యంగల నియంత్రికలు మంజూరు చేశారంటే ఆయన వైకాపా నేతలతో ఎంత అంటకాగారో అర్థం చేసుకోవచ్చు. -
బీఎల్ఓలకు రిక్తహస్తం!
[ 18-05-2024]
బూత్ స్థాయి అధికారులపై(బీఎల్ఓ) ఎన్నికల అధికారులు శీతకన్ను ప్రదర్శిస్తున్నారు. పని చేయించుకుని పైసా పారితోషకం ఇవ్వడం లేదు. ఓటరు జాబితా తయారీ, పోలింగ్ కేంద్రాల్లో వసతుల కల్పన, ఓటరు స్లిప్పుల పంపిణీ, ఇంటింటా సర్వే.. ఇలా అనేక కీలక పనులు చేస్తున్న బీఎల్ఓల పట్ల కనికరం చూపడం లేదు. -
అవసరమైతేనే సిజేరియన్ చేయండి
[ 18-05-2024]
పలు ఆసుపత్రుల్లో గర్భిణులకు సిజేరియన్ ఆపరేషన్ చేస్తున్నారని, అవసరమైతే తప్ప చేయకూడదని జిల్లా వైద్యఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ ఈ.బి.దేవి తెలిపారు. శుక్రవారం అనంతపురంలోని వైద్యఆరోగ్యశాఖ కార్యాలయంలో సిజేరియన్ ద్వారా ఎక్కువ ఆపరేషన్లు చేసిన డాక్టర్లతో సమావేశం నిర్వహించారు. -
‘తాడిపత్రిలో అల్లర్లకు ఆజ్యం పోసింది వైకాపా ఎమ్మెల్యేలే’
[ 18-05-2024]
తాడిపత్రి పట్టణంలో జరిగిన దాడులకు తాడిపత్రి, ధర్మవరం ఎమ్మెల్యేలు కేతిరెడ్డి పెద్దారెడ్డి, వెంకట్రామిరెడ్డిలు ముఖ్య కారణమని అనంతపురం జిల్లా తెదేపా అధ్యక్షుడు వెంకటశివుడుయాదవ్ ఆరోపించారు. -
తాగునీటి సరఫరా అధ్వానం.. ఎటు చూసినా అపరిశుభ్రం
[ 18-05-2024]
ఉరవకొండ మండలం పెన్నహోబిలం లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో ఈ నెల 20 నుంచి బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి. రాష్ట్రంతోపాటు కర్ణాటక నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలివస్తారు. -
ఆర్థిక ఇబ్బందులతో ఆటోడ్రైవర్ ఆత్మహత్య
[ 18-05-2024]
ముదిగుబ్బ మండలంలోని గుంజేపల్లి సమీపంలో శుక్రవారం రాత్రి ఓ వ్యక్తి రైలుకింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. బుక్కపట్నం మండలం కృష్ణాపురం గ్రామానికి చెందిన లింగప్ప కుమారుడు రాజు (27) ముదిగుబ్బకు ఆటో నడుపుకొంటూ జీవనం సాగించే వాడు. అతనికి ఐదేళ్ల కిందట వివాహమైంది. -
రేషన్ పంపిణీకి నేడు ఆఖరు
[ 18-05-2024]
శ్రీసత్యసాయి జిల్లాలో నిత్యావసర సరకుల పంపిణీపై ఎన్నికల ప్రభావం పడింది. ఈ నెల 1 నుంచి ఎండీయూ వాహనాల ద్వారా సరకుల పంపిణీ చేపట్టినప్పటికీ అధిక ఉష్ణోగ్రతలు, ఎన్నికల ప్రచారం తదితర కారాణాల వల్ల కార్డుదారులకు సరకులు అందలేదు. -
చెన్నకేశవుడి రాజసం
[ 18-05-2024]
పట్టణంలో జరుగుతున్న లక్ష్మీచెన్నకేశవస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా శుక్రవారం ఉదయం సర్వ భూపాల వాహనం, రాత్రి సింహ వాహనంపై స్వామి వారు పురవీధుల్లో విహరించారు. -
భక్తుల కష్టాలు ఖాద్రీశుడికే ఎరుక!
[ 18-05-2024]
శ్రీఖాద్రీ లక్ష్మీనరసింహస్వామి భక్తులకు కనీస మౌలిక వసతుల కల్పన, పర్యవేక్షణలో నిర్లక్ష్యం ఆవహించింది. పుణ్యక్షేత్రంగా కదిరి ఆలయానికి వేలాది మంది వచ్చే దర్శన భక్తులకు తగిన సదుపాయాలు కలగక అవస్థలతో ప్రశాంత దర్శన భాగ్యం పొందలేకున్నారు. -
ఇదేంది సారూ.. పారితోషికంలో తేడాలా?
[ 18-05-2024]
ఎన్నికల విధులను సమర్థవంతంగా నిర్వహించగల సత్తా ఉపాధ్యాయులకే ఉందని, వారిని తప్పించి, ఇతరులతో ఈ ప్రక్రియను నిర్వహిస్తే అస్తవ్యస్తమవుతుందని, వారు మాత్రమే కచ్చితంగా నిర్వహించగలరని ఎన్నికల సంఘం కితాబు ఇచ్చింది.
తాజా వార్తలు (Latest News)
-
పెట్స్పై ప్రేమ.. సమంత ఇలా.. జాన్వీ కపూర్ అలా!
-
దీదీతో పొత్తుపై హైకమాండ్ నిర్ణయం తీసుకోవాలి.. అధీర్ కాదు: ఖర్గే
-
కోనసీమ జిల్లాలో విషాదం.. ముగ్గురు యువకులు మృతి
-
కోడ్పై ఈసీకి ‘విజిల్’ వేశారు.. 2 నెలల్లో 4.24 లక్షల ఫిర్యాదులు
-
టీ20 వరల్డ్ కప్ ఫైనల్లో దాయాదుల పోరు చూడాలనుంది: కైఫ్
-
జగన్ విధానాలపై ప్రశ్నిస్తే.. వేధిస్తారా?: ఎన్ఆర్ఐ వైద్యుడు లోకేశ్