ఉద్యోగులకు ప్రలోభాల ఎర
జిల్లా సచివాలయం, న్యూస్టుడే: ఉద్యోగ, ఉపాధ్యాయ ఓట్లను కొనడానికి వైకాపా బరి తెగించింది. ఓటుకు రూ.5 వేలు ఇస్తామంటూ ప్రలోభాలకు తెరలేపింది. అక్కడ, ఇక్కడ కాదు.. ఏకంగా పోలింగ్ కేంద్రాల (ఫెసిలిటేషన్) వద్దే వైకాపా శ్రేణులు బేరసారాలకు ఒడిగట్టారు.
డబ్బు ఫోన్పే చేస్తామని బేరసారాలు
వైకాపా శ్రేణుల బరితెగింపు
పోలింగ్ కేంద్రం సమీపంలో వైకాపా నాయకులు
జిల్లా సచివాలయం, న్యూస్టుడే: ఉద్యోగ, ఉపాధ్యాయ ఓట్లను కొనడానికి వైకాపా బరి తెగించింది. ఓటుకు రూ.5 వేలు ఇస్తామంటూ ప్రలోభాలకు తెరలేపింది. అక్కడ, ఇక్కడ కాదు.. ఏకంగా పోలింగ్ కేంద్రాల (ఫెసిలిటేషన్) వద్దే వైకాపా శ్రేణులు బేరసారాలకు ఒడిగట్టారు. ఓటు వేసేది లేదని మొహం మీదే ఛీదరించుకుంటున్నా.. డబ్బు ఇస్తామంటూ ఆశ చూపిస్తున్నారు. ఎక్కడికక్కడ పోలింగ్ జరిగే ఫెసిలిటేషన్ కేంద్రాల వద్దే మకాం వేసి ఓట్ల కొనుగోలుకు విశ్వప్రయత్నాలు సాగిస్తున్నారు. అయినా సరే ఉద్యోగ, ఉపాధ్యాయులు నిక్కచ్చిగా తెగేసి చెబుతున్నారు. ఐదేళ్ల వైకాపా పాలనలో ఉద్యోగ, ఉపాధ్యాయులను ముప్పుతిప్పలు పెట్టింది.
- ప్రస్తుత సార్వత్రిక ఎన్నికల్లో జిల్లావ్యాప్తంగా 23,900 మందిని నియమించామని అధికార యంత్రాంగం ప్రకటించింది. కేడర్ల వారీగా ఎంతమంది అన్న వివరాలు మాత్రం బయటకు పొక్కడం లేదు. అయినా సరే.. 23,532 మంది ఎన్నికల సిబ్బంది ఫాం-12 దరఖాస్తు చేసుకున్నారు. ఇందులో చాలా మంది పేర్లు పోస్టల్ బ్యాలెట్ ఓటరు జాబితాలో గల్లంతయ్యాయి. ఈ నెల 3 నుంచి 6 దాకా ఓటు వినియోగం కోసం పోలింగ్ సాగుతోంది. సులువుగా..వేగంగా ఓటు వేసే సదుపాయాన్ని కల్పించలేదు. అయినా సరే..ఓటు వేసి తీరుతామంటూ ఉద్యోగ, ఉపాధ్యాయులు గంటల కొద్దీ నిరీక్షిస్తున్నారు. అధికార వైకాపాకు తగిన బుద్ధి చెప్పాలన్న కసి, పట్టుదల వారిలో కనిపిస్తోంది.
- వైకాపా ఎమ్మెల్యే అభ్యర్థులు తమ శ్రేణుల ద్వారా ఓట్లను పొందడానికి రకరకాల ప్రలోభాలు చేస్తున్నారు. ఒక్క అనంత నగరంలోనే 6 వేల ఓట్లు ఉన్నాయి. శింగనమల, ఉరవకొండ, గుంతకల్లు నియోజకవర్గాల్లో 3 వేల పైచిలుకు ఉన్నాయి. ప్రస్తుతం అనంత నగరం, శింగనమల, తాడిపత్రి, గుంతకల్లు వంటి ప్రాంతాల్లో తాయిలాలు ఎర చూపిస్తున్నారు. ఎలాగైనా సరే ఉద్యోగ, ఉపాధ్యాయుల ఓట్లను పొందడానికి ఫోన్ పే, గూగూల్ పే, పేటీఎం.. వంటి రూపాల్లో డబ్బులు పంపిణీ చేయడానికి యత్నిస్తున్నారు. ప్రతి ఫెసిలిటేషన్ కేంద్రం వద్దే మకాం వేసి.నీళ్ల బాటిళ్లు, బిస్కెట్లు, కూల్ డ్రింకులు, సమోసా.. వంటి వాటిని పంపిణీ చేసి మచ్చిక చేసుకోవడానికి ప్రయత్నాలు సాగిస్తున్నారు. ఆర్ఓ, పోలీసు అధికారుల కళ్లెదుటే ఇవన్నీ కొనసాగిస్తున్నా వైకాపా శ్రేణుల బరితెగింపునకు అడ్డుచెప్పకపోవడం విశేషం.
సార్... ఫ్యాన్ గుర్తుకు ఓటు వేయండి. రూ.5 వేలు తీసుకోండి.. అంటూ శింగనమల నియోజకవర్గ ఫెసిలిటేషన్ కేంద్రం సమీపంలో ఓ ఉద్యోగ సంఘం నాయకుడు హల్చల్ చేస్తుండటం చర్చనీయాంశమైంది.
కొత్తూరు జూనియర్ కళాశాల ఫెసిలిటేషన్ కేంద్రం వద్ద వైకాపా నాయకురాలు, మహిళా టీచరు మధ్య సంభాషణ ఇది
- వైకాపా నాయకురాలు: మేడమ్.. నమేస్తే. ఫ్యాన్ గుర్తుకు ఓటు వేయండి.
- మహిళా టీచరు: ఎవరు మీరు?.
- వైకాపా నాయకురాలు: వైకాపా నాయకురాలిని. ఫ్యాన్ గుర్తుకు ఓటు వేయండి. మీ ఫోన్ నంబరు ఇస్తే.. డబ్బులు ఫోన్పే చేస్తాం.
- మహిళా టీచరు: అసలు.. మీరు ఇక్కడ ఉండటమే తప్పు. ఇక్కడ ప్రచారం ఎలా చేస్తారు.
- వైకాపా నాయకురాలు: ప్లీజ్ మేడమ్.. ఫ్యాన్కు ఓటు వేయండి.
- మహిళా టీచరు: ఒక్కసారి చెబితే అర్థం కాదా. మీ నిర్వాకం చాలు. వెళ్లిపోండి (కోపంగా)
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఉదయాన్నే ‘కారు’ చీకట్లు
[ 19-05-2024]
ఆ ఇంట మరో 8 రోజుల్లో పెళ్లి సంబరం జరగాల్సి ఉంది. వేడుక పనులు చకచకా జరుగుతున్నాయి. వరుడు, వధువు ఇళ్లు ముస్తాబు చేసే పనిలో అందరూ నిమగ్నమయ్యారు. ఇంతలో అనుకోని విషాదం కుటుంబాన్ని ఛిన్నాభిన్నం చేసింది. రోడ్డు ప్రమాదం రూపంలో విధి వెంటాడింది. -
జగనన్న పాపం.. రైతులకు శాపం
[ 19-05-2024]
ప్రభుత్వ ప్రచార పిచ్చి.. అధికారుల నిర్లక్ష్యంతో రీసర్వేలో జరిగిన పొరపాట్లు రైతులకు శాపంగా మారుతున్నాయి. కొత్త పాసుపుస్తకాల్లో తప్పుల కారణంగా పంట రుణాల నవీకరణకు రైతులు అవస్థలు పడుతున్నారు. -
ఓట్ల లెక్కింపునకు ఏర్పాట్లు
[ 19-05-2024]
జూన్ 4న జరిగే ఓట్ల లెక్కింపు కోసం నిర్దేశిత ఏర్పాట్లు వేగంగా చేపట్టాలని కలెక్టర్ డాక్టర్ వినోద్కుమార్ పేర్కొన్నారు. శనివారం జేసీ కేతన్ గార్గ్తో కలిసి ఆయన అనంత జేఎన్టీయూ భవన సముదాయంలో ఏర్పాటు చేసే ఓట్ల లెక్కింపు కేంద్రాలు, స్ట్రాంగు రూంలు, రిసెప్షన్ కేంద్రాలను నిశితంగా పరిశీలించారు. -
జిల్లా నూతన ఎస్పీగా గౌతమిశాలి
[ 19-05-2024]
అనంతపురం జిల్లా నూతన ఎస్పీగా గౌతమి శాలి నియమితులయ్యారు. ఈ మేరకు శనివారం ఎన్నికల కమిషన్ ఉత్తర్వులు జారీ చేసింది. ఈమె ఉమ్మడి చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి ప్రాంతం పెద్దకన్నెళ్లి గ్రామానికి చెందినవారు. -
తెలంగాణ ఈఏపీసెట్లో అనంత ఆణిముత్యాలు
[ 19-05-2024]
ఉమ్మడి అనంత జిల్లా విద్యార్థులు తెలంగాణ రాష్ట్ర ఈఏపీసెట్లో మెరిశారు. కుశాల్కుమార్ ఆరో ర్యాంకు సాధించి సత్తా చాటగా, కదిరికి చెందిన దివ్యతేజ పదో ర్యాంకు సాధించారు. మరో ఇద్దరు విద్యార్థులు వందలోపే ర్యాంకులు దక్కించుకున్నారు. -
అర్జున్ తెందూల్కర్ వీర విహారం..
[ 19-05-2024]
-
సత్యసాయి తాగునీటి పథకం నిర్వహణ అస్తవ్యస్తం
[ 19-05-2024]
భూగర్భ జలాలు అడుగంటిపోవడం, సత్యసాయి తాగునీటి పథకం నిర్వహణను ప్రభుత్వం గాలికి వదిలేయడంతో శ్రీసత్యసాయి జిల్లా ప్రజలకు తాగునీటి కష్టాలు తప్పడం లేదు. -
మొదలైన వజ్రాల వేట
[ 19-05-2024]
వజ్రకరూరులో వజ్రాల వేట మొదలైంది. శుక్రవారం రాత్రి వర్షం కురవడంతో శనివారం ఉదయం పొలాలన్ని వజ్రాలు వెతికే వారితో నిండిపోయాయి. ఇక్కడ దొరికే చిన్న రాయి(వజ్రానికి)కి పెద్ద మొత్తంలో నగదు లభిస్తుంది. -
49 పాఠశాలల్లో సీబీఎస్ఈ సిలబస్
[ 19-05-2024]
జిల్లావ్యాప్తంగా ఎంపిక చేసిన 49 ప్రభుత్వ పాఠశాలల్లో ఈ విద్యా సంవత్సరం నుంచే సీబీఎస్సీఈ సిలబస్ అమలు చేయనున్నట్లు కడప విద్యాశాఖ ప్రాంతీయ సంచాలకుడు రాఘవరెడ్డి పేర్కొన్నారు. -
జూనియర్ ఇంటర్లో మిగులు సీట్లకు ప్రత్యేక కౌన్సెలింగ్
[ 19-05-2024]
డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ గురుకుల విద్యాలయాల్లో ఇంటర్ ప్రథమ సంవత్సరంలో ఖాళీగా ఉన్న సీట్లను భర్తీ చేయడానికి బాలబాలికలకు ప్రత్యేక కౌన్సెలింగ్ నిర్వహించనున్నట్లు ఆ విద్యాలయాల జిల్లా సమన్వయకర్త ఎ.మురళీకృష్ణ తెలిపారు.