ఎన్నికల ముందు హామీలు.. ఆనక నామాలు
ప్రధాన సమస్యలనూ విస్మరించిన వైకాపా ఎమ్మెల్యేలు
ఐదేళ్లలోనూ పరిష్కరించకుండా నిర్లక్ష్యం
న్యూస్టుడే బృందం
ఒక్క ఛాన్స్ అంటూ అధికారంలోకి వచ్చిన వైకాపా నాయకులు.. అవకాశం ఇచ్చాక.. ఓటేసిన ప్రజలకే పంగనామాలు పెట్టేస్తున్నారు. 2019 ఎన్నికలకు ముందు ఆయా నియోజకవర్గాల్లో ప్రచారం సందర్భంగా ప్రజలు దీర్ఘకాలికంగా ఎదుర్కొంటున్న సమస్యలను ప్రస్తావిస్తూ తమను గెలిపిస్తే మొదటి ప్రాధాన్యంగా పరిష్కరిస్తామని హామీల వర్షం కురింపించారు. గెలిచాక ప్రజల సమస్యలు పరిష్కరించకుండా.. వారి స్వప్రయోజనాలపై దృష్టిసారించారు. దీంతో ప్రజలు దీర్ఘకాలిక సమస్యలతో నిత్యం సతమతమవుతూనే ఉన్నారు. మళ్లీ అదే సమస్యలను పరిష్కరిస్తామంటూ నాయకులు ప్రస్తుత ఎన్నికల్లో ప్రస్తావిస్తుండటంతో ప్రజలు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. అవకాశం ఇచ్చిన ఐదేళ్లలో పట్టిం చుకోనివారు.. మరోసారి ఇచ్చినా ఏం పట్టించుకుంటారని అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
మూడేళ్లయినా ఒక్క అడుగూ పడలే..
శింగనమల: శింగనమల శ్రీరంగరాయల చెరువు మరువ ప్రవాహంతో సోదనపల్లి, శింగనమల మరువ వద్ద ప్రయాణం నిలిచిపోతుంది. వాహనాల రాకపోకలతోపాటు, కాలినడకకూ దారి లేకుండాపోతుంది. 2020, 2021లో మరువ ప్రవహించి ఏడాదిలో దాదాపు మూడునెలలపాటు ఈ మార్గంలో రాకపోకలు నిలిచిపోయాయి. మండల ప్రజలందరూ గార్లదిన్నె మీదుగా అనంతపురం, తాడిపత్రికి వెళ్లాల్సి వస్తోంది. మూడేళ్ల కిందట ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి వంతెన నిర్మాణం చేస్తామని హామీ ఇచ్చారు. సోదనపల్లి వద్ద భూమిపూజ చేసి వదిలేశారు.
హామీలకే పరిమితం..
కళ్యాణదుర్గం: బీటీపీ కాలువ పనులు పూర్తి చేసి నీళ్లు తీసుకువస్తానని 2019 ఎన్నికల్లో ఉష శ్రీచరణ్ ప్రజలకు హామీ ఇచ్చి ఎన్నికల్లో గెలుపొందారు. తరువాత కాలువ గురించి పట్టించుకోలేదు. రాయదుర్గం, కళ్యాణదుర్గం నియోజకవర్గాల్లో సభలు జరిగినప్పుడు మాత్రం సమస్యను ఆమె సీఎం దృష్టికి తెచ్చారు. నేటికీ పరిహారం ఇవ్వలేదు. 1,406ఎకరాలకు గాను 789 ఎకరాలకు మాత్రమే పరిహారం ఇచ్చారు. ఇంకా 620 ఎకరాలకు ఇవ్వాల్సి ఉంది. ఐదేళ్లలో కేవలం ఐదు కిలోమీటర్ల మేర మాత్రమే పనులు చేశారు.
కొరవడిన చొరవ
గుంతకల్లు: అధికారంలోకి వస్తే మిల్లులో గార్మెంట్ పరిశ్రమ ఏర్పాటు చేస్తామని ఎమ్మెల్యే వెంకటరామిరెడ్డి ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీని నిలుపుకోలేకపోతున్నారు. మిల్లు తెరిస్తే తమకు ఉపాధి లభిస్తుందని నిరుద్యోగులు ఆశతో ఎదురుచూస్తున్నారు. ఆసియా ఖండంలోనే అతిపెద్దదైన ఆంధ్రా సహకార స్పిన్నింగ్ మిల్లు 1991లో మూతపడింది. దీన్ని తెరిపించాలంటూ దివంగత నటుడు మాదాల రంగారావు 1993లో 12 రోజులు గుంతకల్లులో ఆమరణ నిరాహార దీక్ష చేశారు. అప్పటి ముఖ్యమంత్రి కోట్ల విజయభాస్కర్రెడ్డి మిల్లును తెరవడానికి రూ.5 కోట్లు కేటాయించారు. నాయకులు వినియోగించుకోవడంలో విఫలమయ్యారు.
ఎన్నికల ముందు హడావుడి
పుట్టపర్తి: అసెంబ్లీ ఎన్నికల సమీపిస్తుండటంతో వైకాపా ప్రభుత్వానికి మరోసారి సాగునీటి ప్రాజెక్టులపై ప్రేమ పుట్టుకొచ్చింది. ఎన్నికల్లో ఓట్లు కోసం ఎమ్మెల్యే దుద్దుకుంట శ్రీధర్రెడ్డి పాదయాత్ర చేసి పనులకు భూమిపూజ చేశారు. ప్రజల కోసం పైపులు తీసుకువచ్చి, రహదారి పక్కన దిష్టిబొమ్మల్లా ఉంచారు. 195 చెరువులను హంద్రీనీవా నీటితో నింపేందుకు అవసరమైన పనులు నేటికీ ప్రారంభం కాలేదు. 2021లో ప్రాజెక్టు కోసం రూ.864 కోట్లు కేటాయిస్తూ జీవో జారీ చేశారు. 2022 మార్చిలో టెండర్ ప్రక్రియ పూర్తి చేశారు. ఎన్నికల ముందు హడావుడి చేసి వదిలేశారు.
వాగ్దానం నెరవేరక.. సమస్య తీరక
కదిరి: పట్టణ ప్రజల ప్రధాన సమస్య మురుగు. దీని పరిష్కారానికి భూగర్భ డ్రైనేజీ ఏర్పాటు చేస్తామని గత ఎన్నికల్లో ఎమ్మెల్యే సిద్ధారెడ్డి హామీ ఇచ్చారు. అధికారం చేపట్టి మూడేళ్లు గడిచాక వాగ్దానం గుర్తొచ్చింది. దీంతో రెండేళ్ల కిందట ప్రతిపాదనలు తయారు చేసి డీఎంఏకు పంపారు. అక్కడితో సమస్యను పక్కన పెట్టేశారు. ప్రజలకు మాత్రం సమస్య యథాతథంగా ఉంది. లక్షమంది జనాభా ఉన్న మున్సిపాలిటీలో శివారు కాలనీలు మినహా ప్రజలందరూ మురుగు సమస్యకు బాధితులే.
మురుగు నిలిచింది.. కాలం ముగిసింది
అనంత నగరపాలక: 2005లో అనంతపురం నగరపాలక సంస్థ ఏర్పాటు కాగా అప్పటి నుంచి భూగర్భ డ్రైనేజీ ఏర్పాటు తెరమీదకు వస్తూనే ఉంది. కాంగ్రెస్ హయాంలో ప్రస్తుత ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి ఎంపీగా పనిచేశారు. తెదేపా హయాంలో రూ.440.75 కోట్లతో 80 శాతం నిధులు కేంద్రం హడ్కో ద్వారా, 20 శాతం నిధులు రాష్ట్ర వాటాతో భూగర్భ డ్రైనేజీ నిర్మాణానికి జీఓ ఇచ్చారు. ప్రభుత్వం మారగానే ప్రక్రియ ఆగింది. 2019 ఎన్నికల్లో వైకాపా అధికారంలోకి రాగానే మూడు నెలల్లో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులు ప్రారంభిస్తామన్నారు. ఐదేళ్ల పాలన ముగిసి మళ్లీ ఎన్నికలు వచ్చినా కనీసం దాని గురించి ఎక్కడా మాట్లాడలేకపోతున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
షికారు చేశారు... అద్దె బకాయిలు కట్టేదెవరు?
[ 18-05-2024]
‘శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం ఉపకులపతిగా పని చేసిన రామకృష్ణారెడ్డి.. అధికారిక వాహనాలను (కార్లు) సొంత అవసరాల కోసం ఉపయోగించుకున్నారు. ఆయన కుటుంబ సభ్యులు విహారయాత్రలకు రెక్టార్, రిజిస్ట్రార్లకు కేటాయించిన కార్లను వాడుకున్నారు. -
ఈ నెల 27న వివాహం.. పెళ్లి వస్త్రాల కోసం వెళ్లి తిరిగి వస్తుండగా రోడ్డు ప్రమాదం
[ 18-05-2024]
అనంతపురం జిల్లాలో శనివారం ఉదయం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. -
ఇసుకాసురుల ఆగడాలు ఆగేనా?
[ 18-05-2024]
ఐదేళ్లపాటు ఉమ్మడి జిల్లాలో ఇసుక అక్రమ రవాణా యథేచ్ఛగా కొనసాగింది. నిబంధనలను లెక్కచేయకుండా వైకాపా నాయకులు రెచ్చిపోయారు. అధికారం వారి చేతుల్లో ఉండటంతో అధికారులు సైతం అక్రమ రవాణాను అడ్డుకునే ప్రయత్నం చేయలేదు. -
అంతా.. నిశ్శబ్దం
[ 18-05-2024]
ఎన్నికల తర్వాత జరిగిన అల్లర్లతో రాష్ట్రంలోనే సంచలనాలకు కేంద్ర బిందువుగా నిలిచిన తాడిపత్రిలో నిశబ్ద వాతావరణం నెలకొంది. తాడిపత్రి పట్టణ వాసులకు వైకాపా మూకల అరాచక పర్వాన్ని గుర్తు చేసుకుంటేనే గుండెల్లో వణుకు పుడుతోంది. -
ఉత్తర మండలాల్లో మోస్తరు వర్షం
[ 18-05-2024]
జిల్లాలోని ఉత్తర మండలాల్లో గురువారం రాత్రి తేలికపాటి నుంచి మోస్తరు వర్షం కురిసింది. డి.హీరేహాళ్ మండలంలో 28.8 మి.మీలు అత్యధికంగా వర్షం కురిసింది. -
ఓటర్ల ఓపికకు పరీక్ష
[ 18-05-2024]
సగటున ఒక నిమిషంలోపే లోక్సభ, అసెంబ్లీ అభ్యర్థులకు చెరొక ఓటు వేసే వీలున్నా.. గంటలకొద్దీ క్యూలో నిలబడాల్సిన దయనీయ దుస్థితి ఏర్పడింది. ఓటర్ల సహనానికి, ఓపికగా ఎన్నికల సంఘం పరీక్ష పెట్టింది. -
విద్యుత్తు నియంత్రికల మంజూరులో కీలక అధికారి తీరే వేరప్పా..
[ 18-05-2024]
ఉమ్మడి జిల్లా విద్యుత్తుశాఖలో ఓ కీలక అధికారి అధికార పార్టీ తొత్తుగా మారిపోయారు. వైకాపా ప్రజాప్రతినిధులు సిఫార్సు చేస్తే చాలు.. వెంటనే విద్యుత్తు నియంత్రికలు మంజూరు చేసి తన విధేయతను చాటుకుంటున్నారు.రెండేళ్లలో 300 పైగా 25కేవీ సామర్థ్యంగల నియంత్రికలు మంజూరు చేశారంటే ఆయన వైకాపా నేతలతో ఎంత అంటకాగారో అర్థం చేసుకోవచ్చు. -
బీఎల్ఓలకు రిక్తహస్తం!
[ 18-05-2024]
బూత్ స్థాయి అధికారులపై(బీఎల్ఓ) ఎన్నికల అధికారులు శీతకన్ను ప్రదర్శిస్తున్నారు. పని చేయించుకుని పైసా పారితోషకం ఇవ్వడం లేదు. ఓటరు జాబితా తయారీ, పోలింగ్ కేంద్రాల్లో వసతుల కల్పన, ఓటరు స్లిప్పుల పంపిణీ, ఇంటింటా సర్వే.. ఇలా అనేక కీలక పనులు చేస్తున్న బీఎల్ఓల పట్ల కనికరం చూపడం లేదు. -
అవసరమైతేనే సిజేరియన్ చేయండి
[ 18-05-2024]
పలు ఆసుపత్రుల్లో గర్భిణులకు సిజేరియన్ ఆపరేషన్ చేస్తున్నారని, అవసరమైతే తప్ప చేయకూడదని జిల్లా వైద్యఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ ఈ.బి.దేవి తెలిపారు. శుక్రవారం అనంతపురంలోని వైద్యఆరోగ్యశాఖ కార్యాలయంలో సిజేరియన్ ద్వారా ఎక్కువ ఆపరేషన్లు చేసిన డాక్టర్లతో సమావేశం నిర్వహించారు. -
‘తాడిపత్రిలో అల్లర్లకు ఆజ్యం పోసింది వైకాపా ఎమ్మెల్యేలే’
[ 18-05-2024]
తాడిపత్రి పట్టణంలో జరిగిన దాడులకు తాడిపత్రి, ధర్మవరం ఎమ్మెల్యేలు కేతిరెడ్డి పెద్దారెడ్డి, వెంకట్రామిరెడ్డిలు ముఖ్య కారణమని అనంతపురం జిల్లా తెదేపా అధ్యక్షుడు వెంకటశివుడుయాదవ్ ఆరోపించారు. -
తాగునీటి సరఫరా అధ్వానం.. ఎటు చూసినా అపరిశుభ్రం
[ 18-05-2024]
ఉరవకొండ మండలం పెన్నహోబిలం లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో ఈ నెల 20 నుంచి బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి. రాష్ట్రంతోపాటు కర్ణాటక నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలివస్తారు. -
ఆర్థిక ఇబ్బందులతో ఆటోడ్రైవర్ ఆత్మహత్య
[ 18-05-2024]
ముదిగుబ్బ మండలంలోని గుంజేపల్లి సమీపంలో శుక్రవారం రాత్రి ఓ వ్యక్తి రైలుకింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. బుక్కపట్నం మండలం కృష్ణాపురం గ్రామానికి చెందిన లింగప్ప కుమారుడు రాజు (27) ముదిగుబ్బకు ఆటో నడుపుకొంటూ జీవనం సాగించే వాడు. అతనికి ఐదేళ్ల కిందట వివాహమైంది. -
రేషన్ పంపిణీకి నేడు ఆఖరు
[ 18-05-2024]
శ్రీసత్యసాయి జిల్లాలో నిత్యావసర సరకుల పంపిణీపై ఎన్నికల ప్రభావం పడింది. ఈ నెల 1 నుంచి ఎండీయూ వాహనాల ద్వారా సరకుల పంపిణీ చేపట్టినప్పటికీ అధిక ఉష్ణోగ్రతలు, ఎన్నికల ప్రచారం తదితర కారాణాల వల్ల కార్డుదారులకు సరకులు అందలేదు. -
చెన్నకేశవుడి రాజసం
[ 18-05-2024]
పట్టణంలో జరుగుతున్న లక్ష్మీచెన్నకేశవస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా శుక్రవారం ఉదయం సర్వ భూపాల వాహనం, రాత్రి సింహ వాహనంపై స్వామి వారు పురవీధుల్లో విహరించారు. -
భక్తుల కష్టాలు ఖాద్రీశుడికే ఎరుక!
[ 18-05-2024]
శ్రీఖాద్రీ లక్ష్మీనరసింహస్వామి భక్తులకు కనీస మౌలిక వసతుల కల్పన, పర్యవేక్షణలో నిర్లక్ష్యం ఆవహించింది. పుణ్యక్షేత్రంగా కదిరి ఆలయానికి వేలాది మంది వచ్చే దర్శన భక్తులకు తగిన సదుపాయాలు కలగక అవస్థలతో ప్రశాంత దర్శన భాగ్యం పొందలేకున్నారు. -
ఇదేంది సారూ.. పారితోషికంలో తేడాలా?
[ 18-05-2024]
ఎన్నికల విధులను సమర్థవంతంగా నిర్వహించగల సత్తా ఉపాధ్యాయులకే ఉందని, వారిని తప్పించి, ఇతరులతో ఈ ప్రక్రియను నిర్వహిస్తే అస్తవ్యస్తమవుతుందని, వారు మాత్రమే కచ్చితంగా నిర్వహించగలరని ఎన్నికల సంఘం కితాబు ఇచ్చింది.
తాజా వార్తలు (Latest News)
-
ఈసీ అనుమతి నిరాకరణ.. తెలంగాణ కేబినెట్ భేటీ వాయిదా
-
భారత బలగాలకు ద్రోహం చేసిన చరిత్ర కాంగ్రెస్ది: ప్రధాని మోదీ
-
మీ కార్యాలయానికే వస్తాం.. ధైర్యముంటే అరెస్టు చేసుకోండి: కేజ్రీవాల్ సవాల్
-
కాకతీయ వర్సిటీ వీసీ రమేశ్పై విజిలెన్స్ విచారణకు ఆదేశం
-
ఎన్నికల తనిఖీల్లో.. రూ.8,889 కోట్ల సొత్తు స్వాధీనం: ఈసీ
-
పెట్స్పై ప్రేమ.. సమంత ఇలా.. జాన్వీ కపూర్ అలా!