వైకాపా ప్రజాప్రతినిధుల అనుచరులే.. అసురలై
నిత్యం మూడు కబ్జాలు, ఆరు ఆక్రమణలతో వైకాపా ప్రజాప్రతినిధులు అవినీతి చక్రవర్తుల్లా మారిపోయారు. మేం తక్కువ తిన్నాం అంటూ వారి అనుచరులు మండలాల్లో అరాచకాలకు పాల్పడుతూ సామంతరాజుల్లా వ్యవహరిస్తున్నారు.
ఐదేళ్లలో ఇష్టారాజ్యంగా భూకబ్జా, దందాలు
ఈనాడు డిజిటల్, అనంతపురం
నిత్యం మూడు కబ్జాలు, ఆరు ఆక్రమణలతో వైకాపా ప్రజాప్రతినిధులు అవినీతి చక్రవర్తుల్లా మారిపోయారు. మేం తక్కువ తిన్నాం అంటూ వారి అనుచరులు మండలాల్లో అరాచకాలకు పాల్పడుతూ సామంతరాజుల్లా వ్యవహరిస్తున్నారు. చేసే ప్రతి అవినీతిలో కొంత నియోజకవర్గ ప్రజాప్రతినిధికి కప్పం కడుతున్నారు. మండలాల్లో అన్ని తామై వ్యవహరిస్తున్నారు.మేం ఏం చేసినా ‘మా అన్న’ చూసుకుంటాడులే అనే ధైర్యంతో పేట్రేగిపోతున్నారు. ఖాళీగా కనపడిన భూమి కబ్జా చేస్తున్నారు. నిత్యం భూదందాలు, సెటిల్మెంట్లలో తలదూరుస్తూ కమీషన్లు దండుకుంటున్నారు. అధికారులంతా మా చేతుల్లోనే ఉండాలి.. మేం చెప్పిందే చేయాలంటూ పెత్తనం చెలాయిస్తున్నారు. అసైన్డ్ భూముల్ని అడ్డగోలుగా అమ్మేసుకుంటూ అందులో సగభాగం ప్రజాప్రతినిధులకు కప్పం కడుతున్నారు. పాసుపుస్తకాల జారీ నుంచి పంటనష్ట పరిహారం వరకు ప్రతిదాంట్లోనూ అవినీతికి పాల్పడుతున్నారు. చివరికి పేదల కోసం గత ప్రభుత్వాలు ఇచ్చిన ఇళ్ల స్థలాలను ఆక్రమించి అమ్మేసుకుంటున్నారు. ఇప్పటికే రూ.కోట్లు వెనకేసుకున్నారు.
సర్కారు భూములు స్వాహా
సాగుపట్టాల పంపిణీ కార్యక్రమం మొత్తం మండలాల్లోని వైకాపా కనుసన్నల్లోనే జరిగింది. ఒక్కో అనుచరుడు 10 ఎకరాల వరకు ప్రభుత్వ భూమిని కాజేశారు. కొండలు, గుట్టలకు పాసుపుస్తకాలు సృష్టించి కబ్జా చేశారు. లేఅవుట్లు వేసి అమాయకులకు విక్రయిస్తున్నారు. ఐదేళ్లలో రాప్తాడు, ఉరవకొండ, ధర్మవరం, అనంతపురం, శింగనమల నియోజకవర్గాల్లో వేలాది ఎకరాల ప్రభుత్వ భూమిని వైకాపా ప్రజాప్రతినిధుల అనుచరులు తమ వశం చేసుకున్నారు. ప్రైవేటు భూముల్లోనూ తలదూర్చి ఆక్రమణలకు పాల్పడుతున్నారు. నకిలీ పత్రాలు సృష్టించి పేదల భూముల్ని చెరపడుతున్నారు. ఇదంతా ప్రజాప్రతినిధి లేదా ఆయన కుటుంబ సభ్యులతో సన్నిహితంగా ఉంటూ చేస్తున్నారు. అధికారులు సైతం వారి అక్రమాలను అడ్డుకునే ప్రయత్నం చేయలేదు.
8 ఎకరాలు..రూ.16 కోట్లు
కొత్తచెరువు మండలంలో ప్రజాప్రతినిధి అనుచరులు ప్రైవేటు ఆస్తులను నకిలీ పత్రాలతో కొట్టేశారు. తిరుమలదేవరపల్లిలో పుట్టపర్తికి చెందిన ఓ వ్యక్తి భూమిని నకిలీ ఆధార్ సృష్టించి కాజేశారు. రూ.16 కోట్లు విలువ చేసే 8 ఎకరాల భూమిని యజమానికి తెలియకుండానే కడప జిల్లాకు చెందిన వ్యక్తులకు అమ్మేశారు. బాధితుడు కలెక్టర్, ఎస్పీకి ఫిర్యాదు చేశారు. కేవలం కేసు నమోదు చేసి వదిలేశారు. ప్రజాప్రతినిధి ఒత్తిడితో చర్యలు తీసుకోకపోవడం గమనార్హం. పుట్టపర్తి మున్సిపాలిటీకి చెందిన వైకాపా నాయకుడు ప్రజాప్రతినిధికి అత్యంత సన్నిహితంగా ఉంటూ కబ్జాపర్వాన్ని కొనసాగించారు. పట్టణంలో ఓ వ్యక్తికి చెందిన 30 సెంట్ల స్థలాన్ని ఆక్రమించుకుని రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు.
పరిహారాన్నీ వదల్లేదు
ఉరవకొండ నియోజకవర్గం మాజీ ప్రజాప్రతినిధి అనుచరులు రెచ్చిపోతున్నారు. కూడేరు మండలంలోని ముఖ్య అనుచరుడు గుట్టలను కబ్జా చేసి 10 ఎకరాల వరకు కుటుంబ సభ్యుల పేరుతో ఆన్లైన్లో నమోదు చేయించుకున్నాడు. పంట నష్టపరిహారంలోనూ భారీగా అవినీతికి పాల్పడ్డారు. నిత్యం మండలంలోని అధికారుల్ని బెదిరిస్తూ భూదందాలకు పాల్పడుతున్నారు. గ్యాస్పైపులైన్ పరిహారంలోనూ రూ.లక్షల్లో అవినీతికి పాల్పడ్డారు. మండల కేంద్రానికి ఆనుకుని ఉన్న గుట్టల్లో జూద స్థావరాలు ఏర్పాటు చేసి కమీషన్లు దండుకుంటున్నారు.
ఆక్రమించి.. లేఅవుట్లు వేసి..
ధర్మవరం నియోజకవర్గం ప్రజాప్రతినిధి అండ చూసుకుని ముదిగుబ్బలోని ఆయన అనుచరుడు ప్రభుత్వ భూముల్ని చెరపట్టారు. సుమారు 30 ఎకరాల ప్రభుత్వ భూమిని కబ్జా చేశారు. కొన్నింటిని లేఅవుట్లుగా మార్చి విక్రయిస్తున్నారు. అనంతపురం-కదిరి జాతీయ రహదారికి ఆనుకుని ఉన్న భూముల్ని కొట్టేసి అమ్ముకున్నారు. ఎదురుచెప్పిన ఓ రెవెన్యూ అధికారిని బదిలీ చేయించారు. గత ప్రభుత్వంలో స్టేడియం కోసం కేటాయించిన భూమిని సైతం ఆక్రమించి ప్లాట్లుగా మార్చారు. ముస్లింల శ్మశానవాటికకు కేటాయించిన భూమిని కాజేసి పాసుపుస్తకాలు చేయించుకున్నారు.
అంతటా వసూళ్లే..
కనగానపల్లి మండలంలో ప్రజాప్రతినిధి సొంత సామాజికవర్గానికి చెందిన నాయకుడి అవినీతి, అక్రమాలకు అడ్డుఅదుపు లేకుండా పోతోంది. ప్రజాప్రతినిధి సోదరుడి అండతో మామిళ్లపల్లి, ముక్తాపురం, దాదులూరు, కుర్లపల్లి ప్రాంతాల్లో రియల్టర్ల నుంచి ఎకరాకు రూ.2 లక్షల చొప్పున వసూలు చేశాడు. పెండింగ్లో ఉన్న భూములను ఆన్లైన్ చేయాడానికి పంచాయితీ చేసి కమీషన్లు దండుకున్నాడు. కనగానపల్లి మండలంలోని 44వ జాతీయ రహదారికి ఆనుకొని భూమిలోపల ఏర్పాటు చేసిన కేబుల్ పనులకు సంబంధించి అక్రమ వసూళ్లకు పాల్పడ్డాడు. అక్రమంగా సంపాదించిన డబ్బుతో అనంతపురం హౌసింగ్ బోర్డు కాలనీలో రూ.కోటి వెచ్చించి ఇంటిని కొనుగోలు చేసినట్లు సమాచారం. ఓ కాలనీలో ఐదు సెంట్ల స్థలాన్ని కబ్జా చేసి ఆన్లైన్ చేసుకున్నాడు.
ఇళ్లు.. బిల్లులు బొక్కేశారు
రాప్తాడులో ప్రజాప్రతినిధికి సన్నిహితంగా ఉండే అనుచరులు జగనన్న కాలనీ పేరుతో ఇళ్ల పట్టాలను అమ్మేసుకున్నారు. ఒక్కొక్కరి పేరుతో మూడు, నాలుగు ఇళ్లు మంజూరు చేయించుకుని బిల్లులు బొక్కేశారు. ఇలా జగనన్న కాలనీల్లోనే రూ.5 కోట్ల వరకు కాజేశారు. ప్రసన్నాయపల్లిలో ఏకంగా అనంతపురం నగరపాలక భూమిని ప్లాట్లుగా మార్చి విక్రయించారు. ఉపాధి హామీ పథకం నుంచి పండ్ల తోటల పెంపకం వరకు అన్నింటిలోనూ అవినీతికి పాల్పడి అడ్డంగా సంపాదించారు. రాప్తాడు మండల పరిషత్లో రెండోస్థానంలో ఉండే ఓ ప్రజాప్రతినిధి జగనన్న కాలనీల్లోని ఓపెన్ స్పేస్ స్థలాలను అమాయకులకు విక్రయించారు. ఒక్కో ప్లాటును రూ.2 లక్షల నుంచి రూ.3 వరకు అమ్ముకుని సొమ్ము చేసుకున్నారు. ఇలా ఇప్పటివరకు రూ.3 కోట్లు వెనకేశారు.
నకిలీలు సృష్టించి..
ఉరవకొండ, రాప్తాడు, ధర్మవరం, పుట్టపర్తి నియోజకవర్గాల్లో ప్రజాప్రతినిధులు అనుచరులు ప్రైవేటు స్థలాలనూ వదల్లేదు. నకిలీ ఆధార్కార్డులు సృష్టించి విలువైన భూములు కాజేస్తున్నారు. స్థానికంగా యజమానులు లేని స్థలాలను గుర్తించి స్వాధీనం చేసుకుంటున్నారు. ఏకంగా నకిలీ పత్రాలు సృష్టించి ఇతరులకు విక్రయిస్తున్నారు. కొన్నింటికి డబుల్ రిజిస్రేషన్లు చేసి ప్రైవేటు ఆస్తులను అమ్ముతున్నారు. ప్రజాప్రతినిధికి వాటాలు ఇస్తూ వారిని ప్రసన్నం చేసుకుంటున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
షికారు చేశారు... అద్దె బకాయిలు కట్టేదెవరు?
[ 18-05-2024]
‘శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం ఉపకులపతిగా పని చేసిన రామకృష్ణారెడ్డి.. అధికారిక వాహనాలను (కార్లు) సొంత అవసరాల కోసం ఉపయోగించుకున్నారు. ఆయన కుటుంబ సభ్యులు విహారయాత్రలకు రెక్టార్, రిజిస్ట్రార్లకు కేటాయించిన కార్లను వాడుకున్నారు. -
ఈ నెల 27న వివాహం.. పెళ్లి వస్త్రాల కోసం వెళ్లి తిరిగి వస్తుండగా రోడ్డు ప్రమాదం
[ 18-05-2024]
అనంతపురం జిల్లాలో శనివారం ఉదయం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. -
ఇసుకాసురుల ఆగడాలు ఆగేనా?
[ 18-05-2024]
ఐదేళ్లపాటు ఉమ్మడి జిల్లాలో ఇసుక అక్రమ రవాణా యథేచ్ఛగా కొనసాగింది. నిబంధనలను లెక్కచేయకుండా వైకాపా నాయకులు రెచ్చిపోయారు. అధికారం వారి చేతుల్లో ఉండటంతో అధికారులు సైతం అక్రమ రవాణాను అడ్డుకునే ప్రయత్నం చేయలేదు. -
అంతా.. నిశ్శబ్దం
[ 18-05-2024]
ఎన్నికల తర్వాత జరిగిన అల్లర్లతో రాష్ట్రంలోనే సంచలనాలకు కేంద్ర బిందువుగా నిలిచిన తాడిపత్రిలో నిశబ్ద వాతావరణం నెలకొంది. తాడిపత్రి పట్టణ వాసులకు వైకాపా మూకల అరాచక పర్వాన్ని గుర్తు చేసుకుంటేనే గుండెల్లో వణుకు పుడుతోంది. -
ఉత్తర మండలాల్లో మోస్తరు వర్షం
[ 18-05-2024]
జిల్లాలోని ఉత్తర మండలాల్లో గురువారం రాత్రి తేలికపాటి నుంచి మోస్తరు వర్షం కురిసింది. డి.హీరేహాళ్ మండలంలో 28.8 మి.మీలు అత్యధికంగా వర్షం కురిసింది. -
ఓటర్ల ఓపికకు పరీక్ష
[ 18-05-2024]
సగటున ఒక నిమిషంలోపే లోక్సభ, అసెంబ్లీ అభ్యర్థులకు చెరొక ఓటు వేసే వీలున్నా.. గంటలకొద్దీ క్యూలో నిలబడాల్సిన దయనీయ దుస్థితి ఏర్పడింది. ఓటర్ల సహనానికి, ఓపికగా ఎన్నికల సంఘం పరీక్ష పెట్టింది. -
విద్యుత్తు నియంత్రికల మంజూరులో కీలక అధికారి తీరే వేరప్పా..
[ 18-05-2024]
ఉమ్మడి జిల్లా విద్యుత్తుశాఖలో ఓ కీలక అధికారి అధికార పార్టీ తొత్తుగా మారిపోయారు. వైకాపా ప్రజాప్రతినిధులు సిఫార్సు చేస్తే చాలు.. వెంటనే విద్యుత్తు నియంత్రికలు మంజూరు చేసి తన విధేయతను చాటుకుంటున్నారు.రెండేళ్లలో 300 పైగా 25కేవీ సామర్థ్యంగల నియంత్రికలు మంజూరు చేశారంటే ఆయన వైకాపా నేతలతో ఎంత అంటకాగారో అర్థం చేసుకోవచ్చు. -
బీఎల్ఓలకు రిక్తహస్తం!
[ 18-05-2024]
బూత్ స్థాయి అధికారులపై(బీఎల్ఓ) ఎన్నికల అధికారులు శీతకన్ను ప్రదర్శిస్తున్నారు. పని చేయించుకుని పైసా పారితోషకం ఇవ్వడం లేదు. ఓటరు జాబితా తయారీ, పోలింగ్ కేంద్రాల్లో వసతుల కల్పన, ఓటరు స్లిప్పుల పంపిణీ, ఇంటింటా సర్వే.. ఇలా అనేక కీలక పనులు చేస్తున్న బీఎల్ఓల పట్ల కనికరం చూపడం లేదు. -
అవసరమైతేనే సిజేరియన్ చేయండి
[ 18-05-2024]
పలు ఆసుపత్రుల్లో గర్భిణులకు సిజేరియన్ ఆపరేషన్ చేస్తున్నారని, అవసరమైతే తప్ప చేయకూడదని జిల్లా వైద్యఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ ఈ.బి.దేవి తెలిపారు. శుక్రవారం అనంతపురంలోని వైద్యఆరోగ్యశాఖ కార్యాలయంలో సిజేరియన్ ద్వారా ఎక్కువ ఆపరేషన్లు చేసిన డాక్టర్లతో సమావేశం నిర్వహించారు. -
‘తాడిపత్రిలో అల్లర్లకు ఆజ్యం పోసింది వైకాపా ఎమ్మెల్యేలే’
[ 18-05-2024]
తాడిపత్రి పట్టణంలో జరిగిన దాడులకు తాడిపత్రి, ధర్మవరం ఎమ్మెల్యేలు కేతిరెడ్డి పెద్దారెడ్డి, వెంకట్రామిరెడ్డిలు ముఖ్య కారణమని అనంతపురం జిల్లా తెదేపా అధ్యక్షుడు వెంకటశివుడుయాదవ్ ఆరోపించారు. -
తాగునీటి సరఫరా అధ్వానం.. ఎటు చూసినా అపరిశుభ్రం
[ 18-05-2024]
ఉరవకొండ మండలం పెన్నహోబిలం లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో ఈ నెల 20 నుంచి బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి. రాష్ట్రంతోపాటు కర్ణాటక నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలివస్తారు. -
ఆర్థిక ఇబ్బందులతో ఆటోడ్రైవర్ ఆత్మహత్య
[ 18-05-2024]
ముదిగుబ్బ మండలంలోని గుంజేపల్లి సమీపంలో శుక్రవారం రాత్రి ఓ వ్యక్తి రైలుకింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. బుక్కపట్నం మండలం కృష్ణాపురం గ్రామానికి చెందిన లింగప్ప కుమారుడు రాజు (27) ముదిగుబ్బకు ఆటో నడుపుకొంటూ జీవనం సాగించే వాడు. అతనికి ఐదేళ్ల కిందట వివాహమైంది. -
రేషన్ పంపిణీకి నేడు ఆఖరు
[ 18-05-2024]
శ్రీసత్యసాయి జిల్లాలో నిత్యావసర సరకుల పంపిణీపై ఎన్నికల ప్రభావం పడింది. ఈ నెల 1 నుంచి ఎండీయూ వాహనాల ద్వారా సరకుల పంపిణీ చేపట్టినప్పటికీ అధిక ఉష్ణోగ్రతలు, ఎన్నికల ప్రచారం తదితర కారాణాల వల్ల కార్డుదారులకు సరకులు అందలేదు. -
చెన్నకేశవుడి రాజసం
[ 18-05-2024]
పట్టణంలో జరుగుతున్న లక్ష్మీచెన్నకేశవస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా శుక్రవారం ఉదయం సర్వ భూపాల వాహనం, రాత్రి సింహ వాహనంపై స్వామి వారు పురవీధుల్లో విహరించారు. -
భక్తుల కష్టాలు ఖాద్రీశుడికే ఎరుక!
[ 18-05-2024]
శ్రీఖాద్రీ లక్ష్మీనరసింహస్వామి భక్తులకు కనీస మౌలిక వసతుల కల్పన, పర్యవేక్షణలో నిర్లక్ష్యం ఆవహించింది. పుణ్యక్షేత్రంగా కదిరి ఆలయానికి వేలాది మంది వచ్చే దర్శన భక్తులకు తగిన సదుపాయాలు కలగక అవస్థలతో ప్రశాంత దర్శన భాగ్యం పొందలేకున్నారు. -
ఇదేంది సారూ.. పారితోషికంలో తేడాలా?
[ 18-05-2024]
ఎన్నికల విధులను సమర్థవంతంగా నిర్వహించగల సత్తా ఉపాధ్యాయులకే ఉందని, వారిని తప్పించి, ఇతరులతో ఈ ప్రక్రియను నిర్వహిస్తే అస్తవ్యస్తమవుతుందని, వారు మాత్రమే కచ్చితంగా నిర్వహించగలరని ఎన్నికల సంఘం కితాబు ఇచ్చింది.
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
-
ధోనీ వల్లే.. ఇలాంటి విరాట్ను చూస్తున్నాం: సునీల్ గావస్కర్
-
తనలాంటి వ్యక్తిని వైద్య పరీక్షలకు పంపి.. బెయిల్ కోసం ‘లావా’ బాస్ నిర్వాకం
-
హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో వర్షం
-
టీమ్ఇండియా.. ‘అమెరికా’ విమానం ఎక్కేదప్పుడే!
-
హైదరాబాద్ మెట్రో రైలు ప్రయాణ వేళల్లో మార్పు లేదు