logo

బూతులు తిడుతున్నాడని దారుణ హత్య

నిత్యం బూతులు తిడుతున్నాడన్న కోపంతో నిద్రిస్తున్న వ్యక్తిపై కొడవళ్లతో దాడిచేసి దారుణంగా చంపిన ఘటన కదిరి మండలం జౌకలలో జరిగింది.

Published : 05 May 2024 03:32 IST

భూషణ

కదిరి పట్టణం: నిత్యం బూతులు తిడుతున్నాడన్న కోపంతో నిద్రిస్తున్న వ్యక్తిపై కొడవళ్లతో దాడిచేసి దారుణంగా చంపిన ఘటన కదిరి మండలం జౌకలలో జరిగింది. హతుడి సోదరి పోలీసులకు తెలిపిన మేరకు వివరాలు. కదిరి మండలం జౌకలకు చెందిన భూషణ (38)ను అదే గ్రామానికి చెందిన జయచంద్రనాయుడు, గోవర్ధన్‌నాయుడు కొడవలితో దాడిచేసి నరికి చంపారు. భవన నిర్మాణ కార్మికుడైన భూషణ పని కోసం ఉదయమే గ్రామం నుంచి కదిరికి వెళ్లి తిరిగి రాత్రికి ఇంటికొస్తుంటాడు. గత కొంత కాలంగా భూషణ రోజూ గ్రామస్థులను బూతులు తిడుతున్నాడు. వారించినా వినిపించుకునే వాడు కాదు. ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన భూషణ నిత్యం తిడుతుండటాన్ని జీర్ణించుకోలేని జయచంద్ర, గోవర్ధన్‌ అతన్ని హత్య చేయాలని నిర్ణయించుకున్నారు. శుక్రవారం అర్ధరాత్రి దాటాక ఇంటి ముందు నిద్రిస్తున్న భూషణ ముందస్తు ప్రణాళిక మేరకు సిద్ధంగా ఉంచుకుని కొడవలితో విచక్షణా రహితంగా నరికి హత్య చేశారు. విషయం తెలుసుకున్న స్థానికులు కదిరి గ్రామీణ పోలీసులకు సమాచారం ఇచ్చారు. కదిరి అప్‌గ్రేడ్‌ ఇన్‌ఛార్జి సీఐ పుల్లయ్య, గ్రామీణ ఎస్‌ఐ ఇతిరాజు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. మృతుడి సోదరుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన దర్యాప్తు చేయనున్నట్లు సీఐ తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని