బహిరంగంగా డబ్బు పంపిణీ
అధికార వైకాపాకు ఓటమి భయం పట్టుకుంది. ఎలాగైనా ఓట్లను కొనేసి గెలవడానికి అడ్డదారులను ఎంచుకుంటోంది.
పోస్టల్ బ్యాలెట్ ఓట్ల కొనుగోలు
అనంతలో వైకాపా బరితెగింపు
డబ్బు పంపిణీ చేస్తున్న వైకాపా నాయకులు
జిల్లా సచివాలయం, న్యూస్టుడే: అధికార వైకాపాకు ఓటమి భయం పట్టుకుంది. ఎలాగైనా ఓట్లను కొనేసి గెలవడానికి అడ్డదారులను ఎంచుకుంటోంది. సోమవారం అనంత ప్రభుత్వ జూనియర్ కళాశాల ఆవరణలో ఏర్పాటు చేసిన ఫెసిలిటేషన్ కేంద్రం వద్దే ఈ బాగోతం నడవటం విశేషం. ఓటు వేసేందుకు వచ్చిన ఉద్యోగ, ఉపాధ్యాయులకు బలవంతంగా కవర్లో డబ్బు పెట్టి ఇస్తున్నారు. రూ.3 వేల నుంచి రూ.5 వేలు మధ్యలో కవర్లో పెట్టి ఇస్తున్నారు. కొందరికి నేరుగా నోట్లనే ఇచ్చారు. అత్యధిక శాతం మంది వైకాపా నాయకుల ప్రలోభాలకు లొంగలేదు. ఫెసిలిటేషన్ కేంద్రం వద్దే బరితెగించి డబ్బు పంపిణీ చేసినా పోలీసులు ఏమాత్రం పట్టించుకోలేదు. డబ్బు పంపిణీ వ్యవహారం వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ప్రధాన రహదారి పక్కనే ప్రత్యేక టెంటులోనూ ఈ తరహా బాగోతం చోటు చేసుకుంది. తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి దగ్గుపాటి ప్రసాద్ అక్కడికి చేరుకోవడంతో వైకాపా నాయకులు జారుకున్నారు.
పోటెత్తిన ఉద్యోగులు
నాలుగో రోజైన సోమవారం పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు వేసేందుకు ఉద్యోగ, ఉపాధ్యాయులు పోటెత్తారు. భారీ సంఖ్యలో తరలివచ్చారు. సోమవారంతో పీఓ, ఏపీఓ, పీఓపీల ఓటింగ్ ముగిసింది. ఇతర విధులు నిర్వర్తించే ఉద్యోగులు, పోలీసు, అంగన్వాడీ కార్యకర్తలు.. వంటి వారు సోమవారం నుంచే ఓటు వేస్తున్నారు. ఈ నెల 8 వరకూ వీరికి అవకాశం ఉంటుంది. అనంత ఫెసిలిటేషన్ కేంద్రం నిర్వహణ, ఏర్పాట్లపై తీవ్ర విమర్శలు వచ్చిన నేపథ్యంలో కలెక్టర్ డాక్టర్ వినోద్కుమార్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఓటింగ్ సరళిపై ఆరా తీశారు.
ఆ ఓట్లు చెల్లనట్లేనా!
పోస్టల్ బ్యాలెట్ ఓట్ల బాగోతం ఆరంభం నుంచి విమర్శల పాలవుతోంది. ఫాం-12 దరఖాస్తుల స్వీకరణ నుంచి ఓటు వేసే దాకా అనేక అవకతవకలు, బాధ్యతారాహిత్యం, నిర్లక్ష్యం కొట్టుకొచ్చినట్లు బహిర్గతం అవుతోంది. కొంతమంది అసెంబ్లీ నియోజకవర్గ రిటర్నింగ్ అధికారులు(ఆర్ఓ) పెద్ద తప్పు చేస్తున్నారు. ఉద్యోగ, ఉపాధ్యాయులకు ఇచ్చే డిక్లరేషన్ ఫాంపై అక్కడే ఉన్న గెజిటెడ్ అధికారి ఓటర్ల వివరాలు ధ్రువీకరిస్తూ సంతకం చేసి, స్టాంపు వేయాల్సి ఉంటుంది. లేదంటే... అనర్హత కింద పక్కన పెడతారు. చాలామంది ఉద్యోగ, ఉపాధ్యాయుల డిక్లరేషన్ ఫారాలపై సంతకాలు చేసి.. స్టాంపు వేయలేదు. ఈ తరహా ఓట్లు వందల్లోనే ఉంటాయని అంచనా.
వివాదంలో అనంత ఆర్వో
ఈనెల 3న రాప్తాడు ఫెసిలిటేషన్ కేంద్రంలో తొలి పది మందికిపైగా గెజిటెడ్ సంతకం, స్టాంపు లేకుండానే ఓట్లు వేసినట్లు తేలింది. ఓ పది ఓట్లు చెల్లకపోతే ఏమవుతుందిలే అంటూ అక్కడి ఆర్ఓ ఉద్యోగ, ఉపాధ్యాయులతో వాదనకు దిగారు. ఈ విషయాన్ని కలెక్టర్కు కూడా ఫిర్యాదు చేశారు. అనంత ఆర్ఓ వ్యవహారం వివాదం అవుతోంది. తొలి రోజు కూడా ఇక్కడ సంతకాలు చేసి.. స్టాంపు లేకుండానే కొందరు ఓట్లు వేశారు. ఇక 5న మూడో బూత్లో ఓ వంద మందికిపైగా డిక్లరేషన్ ఫాంలపై స్టాంపు వేయనట్లు తెలుస్తోంది. స్వయాన ఆర్ఓ/ఆర్డీఓనే సంతకం చేసి.. స్టాంపు వేయలేదు. స్టాంపు వేయకపోయినా ఓట్లు చెల్లుతాయంటూ ఆ ఆర్ఓ బుకాయించారు. ఏం చర్య తీసుకుంటారో చూడాలి.
ఫెసిలిటేషన్ కేంద్రాన్ని పరిశీలిస్తున్న కలెక్టర్ డాక్టర్ వినోద్కుమార్
10,499 మంది ఓటేశారు!
పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఈ నెల 5 వరకూ జిల్లా, ఇతర జిల్లాల వారు కలిపి మొత్తం 26,150 మంది ఉండగా 10,499 మంది ఓటేశారన్నారు. అత్యధికంగా అనంత నగరంలో 2773 మంది, రాయదుర్గంలో 579 మంది మాత్రమే ఓటేశారు. మొత్తంగా 40.15 శాతం మంది ఓట్లు వేసినట్లు చెప్పారు. ఈ నెల 8వ తేదీ దాకా గడువు ఉందన్నారు. హోం ఓటింగ్ కోసం 1247 మంది దరఖాస్తు చేసుకోగా.. ఇప్పటి దాకా 296 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారని పేర్కొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మొదలైన వజ్రాల వేట
[ 19-05-2024]
వజ్రకరూరులో వజ్రాల వేట మొదలైంది. శుక్రవారం రాత్రి వర్షం కురవడంతో శనివారం ఉదయం పొలాలన్ని వజ్రాలు వెతికే వారితో నిండిపోయాయి. ఇక్కడ దొరికే చిన్న రాయి(వజ్రానికి)కి పెద్ద మొత్తంలో నగదు లభిస్తుంది. -
ఉదయాన్నే ‘కారు’ చీకట్లు
[ 19-05-2024]
ఆ ఇంట మరో 8 రోజుల్లో పెళ్లి సంబరం జరగాల్సి ఉంది. వేడుక పనులు చకచకా జరుగుతున్నాయి. వరుడు, వధువు ఇళ్లు ముస్తాబు చేసే పనిలో అందరూ నిమగ్నమయ్యారు. ఇంతలో అనుకోని విషాదం కుటుంబాన్ని ఛిన్నాభిన్నం చేసింది. రోడ్డు ప్రమాదం రూపంలో విధి వెంటాడింది. -
జగనన్న పాపం.. రైతులకు శాపం
[ 19-05-2024]
ప్రభుత్వ ప్రచార పిచ్చి.. అధికారుల నిర్లక్ష్యంతో రీసర్వేలో జరిగిన పొరపాట్లు రైతులకు శాపంగా మారుతున్నాయి. కొత్త పాసుపుస్తకాల్లో తప్పుల కారణంగా పంట రుణాల నవీకరణకు రైతులు అవస్థలు పడుతున్నారు. -
ఓట్ల లెక్కింపునకు ఏర్పాట్లు
[ 19-05-2024]
జూన్ 4న జరిగే ఓట్ల లెక్కింపు కోసం నిర్దేశిత ఏర్పాట్లు వేగంగా చేపట్టాలని కలెక్టర్ డాక్టర్ వినోద్కుమార్ పేర్కొన్నారు. శనివారం జేసీ కేతన్ గార్గ్తో కలిసి ఆయన అనంత జేఎన్టీయూ భవన సముదాయంలో ఏర్పాటు చేసే ఓట్ల లెక్కింపు కేంద్రాలు, స్ట్రాంగు రూంలు, రిసెప్షన్ కేంద్రాలను నిశితంగా పరిశీలించారు. -
జిల్లా నూతన ఎస్పీగా గౌతమిశాలి
[ 19-05-2024]
అనంతపురం జిల్లా నూతన ఎస్పీగా గౌతమి శాలి నియమితులయ్యారు. ఈ మేరకు శనివారం ఎన్నికల కమిషన్ ఉత్తర్వులు జారీ చేసింది. ఈమె ఉమ్మడి చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి ప్రాంతం పెద్దకన్నెళ్లి గ్రామానికి చెందినవారు. -
తెలంగాణ ఈఏపీసెట్లో అనంత ఆణిముత్యాలు
[ 19-05-2024]
ఉమ్మడి అనంత జిల్లా విద్యార్థులు తెలంగాణ రాష్ట్ర ఈఏపీసెట్లో మెరిశారు. కుశాల్కుమార్ ఆరో ర్యాంకు సాధించి సత్తా చాటగా, కదిరికి చెందిన దివ్యతేజ పదో ర్యాంకు సాధించారు. మరో ఇద్దరు విద్యార్థులు వందలోపే ర్యాంకులు దక్కించుకున్నారు. -
అర్జున్ తెందూల్కర్ వీర విహారం..
[ 19-05-2024]
-
సత్యసాయి తాగునీటి పథకం నిర్వహణ అస్తవ్యస్తం
[ 19-05-2024]
భూగర్భ జలాలు అడుగంటిపోవడం, సత్యసాయి తాగునీటి పథకం నిర్వహణను ప్రభుత్వం గాలికి వదిలేయడంతో శ్రీసత్యసాయి జిల్లా ప్రజలకు తాగునీటి కష్టాలు తప్పడం లేదు. -
49 పాఠశాలల్లో సీబీఎస్ఈ సిలబస్
[ 19-05-2024]
జిల్లావ్యాప్తంగా ఎంపిక చేసిన 49 ప్రభుత్వ పాఠశాలల్లో ఈ విద్యా సంవత్సరం నుంచే సీబీఎస్సీఈ సిలబస్ అమలు చేయనున్నట్లు కడప విద్యాశాఖ ప్రాంతీయ సంచాలకుడు రాఘవరెడ్డి పేర్కొన్నారు. -
జూనియర్ ఇంటర్లో మిగులు సీట్లకు ప్రత్యేక కౌన్సెలింగ్
[ 19-05-2024]
డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ గురుకుల విద్యాలయాల్లో ఇంటర్ ప్రథమ సంవత్సరంలో ఖాళీగా ఉన్న సీట్లను భర్తీ చేయడానికి బాలబాలికలకు ప్రత్యేక కౌన్సెలింగ్ నిర్వహించనున్నట్లు ఆ విద్యాలయాల జిల్లా సమన్వయకర్త ఎ.మురళీకృష్ణ తెలిపారు.
తాజా వార్తలు (Latest News)
-
అప్పుడు.. ఒక్కసారి కూడా స్కోరు బోర్డు చూడలేదు: యశ్ దయాళ్
-
సీసీ ఫుటేజీని, సాక్ష్యాలను బిభవ్ ధ్వంసం చేసుండొచ్చు: దిల్లీ పోలీసులు
-
ఆప్ అంతానికి భాజపా ‘ఆపరేషన్ ఝాడు’: కేజ్రీవాల్
-
ధోనీకి ఎప్పుడేం చేయాలో తెలుసు: చెన్నై కోచ్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
ఒకప్పుడు న్యాయం కోసం వీధుల్లోకి వచ్చాం.. ఇప్పుడు?.. ఆప్ నిరసనపై మాలీవాల్