జిల్లాతో ఆత్మీయ అనుబంధం
మాజీ ముఖ్యమంత్రి కె.రోశయ్యకు జిల్లాతో, ఇక్కడి నాయకులతోనూ అనుబంధం ఉంది. ఆచార్య ఎన్జీ రంగా స్వతంత్ర పార్టీ పెట్టి 1962లో చిత్తూరు లోక్సభ నుంచి గెలుపొందారు. మాజీ ఎంపీ దివంగత పాటూరు రాజగోపాల్నాయుడు, రోశయ్య
స్వతంత్ర పార్టీ అవిర్భావ సభలో ఎన్జీ రంగా, రాజగోపాల్నాయుడుతో రోశయ్య
ఈనాడు డిజిటల్, తిరుపతి మాజీ ముఖ్యమంత్రి కె.రోశయ్యకు జిల్లాతో, ఇక్కడి నాయకులతోనూ అనుబంధం ఉంది. ఆచార్య ఎన్జీ రంగా స్వతంత్ర పార్టీ పెట్టి 1962లో చిత్తూరు లోక్సభ నుంచి గెలుపొందారు. మాజీ ఎంపీ దివంగత పాటూరు రాజగోపాల్నాయుడు, రోశయ్య రంగాకు మద్దతుగా నిలిచి చిత్తూరు నుంచే కాకుండా రాష్ట్రంలో కీలక పాత్ర పోషించారు. పాటూరు రాజగోపాల్ నాయుడు, రోశయ్య, మాజీ సీఎం చంద్రబాబు రంగా శిష్యులే. రాజగోపాల్నాయుడు ద్వారా రంగాకు చంద్రబాబు దగ్గరయ్యారు. మాజీ ఎంపీ చెంగల్రాయనాయుడుతో ఎంతో అనుబంధం ఉంది. తమిళనాడు గవర్నర్గా పని చేసిన సమయంలో చిత్తూరులో చెంగల్రాయనాయుడు పుస్తకావిష్కరణ కార్యక్రమానికి విచ్చేశారు.
శ్రీకాళహస్తిలో రాజగోపురం 2010 మే 26న నేల కూలింది. పునర్నిర్మాణానికి నవయుగ నిర్మాణ సంస్థ ముందుకు రావడంతో అప్పటి సీఎం రోశయ్య 2010 ఆగస్టు 29న శ్రీకాళహస్తి విచ్చేసి రాజగోపురం నిర్మాణానికి భూమి పూజ చేశారు. సీఎంగా జిల్లాకు పలు వంతెనలు, అతిథి గృహాలు ఆర్అండ్బీ తరఫున నిర్మాణానికి నిధులు మంజూరు చేశారు. తిరుపతి, శ్రీకాళహస్తిలో ఆయనకు పలువురు ఆత్మీయ అనుచరులు ఉన్నారు.
తితిదేలో సంస్కరణలు.. సీఎంగా రోశయ్య బాధ్యతలు స్వీకరించిన సమయంలో అప్పటి తితిదే ధర్మకర్తల మండలి వివాదాల్లో కూరుకుంది. కాలపరిమితి పూర్తికాగానే వెంటనే సీనియర్ ఐఏఎస్ అధికారులు జె.సత్యనారాయణ, నాగిరెడ్డి, ఈవో ఐవైఆర్ కృష్ణారావుతో స్పెసిఫైడ్ అథారిటీని నియమించి పూర్తి స్వేచ్ఛను ఇచ్చారు. ఏడాదికిపైగా ఉన్న కమిటీ దేవస్థానంలో పలు సంస్కరణలు తీసుకువచ్చింది. శ్రీవారి దర్శన, సేవాటికెట్ల జారీకి ఐడీ కార్డులు ప్రామాణికరగా ప్రవేశపెట్టడం వంటి చర్యలు తితిదే తీసుకుంది. నిజాయతీ అధికారిగా ముద్రపడ్డ కాటమనేని భాస్కర్ను జేఈవోగా రోశయ్య నియమించారు. శ్రీవారిని పలుమార్లు దర్శించుకున్నారు. అనారోగ్యం కారణంగా సీఎం హోదాలో బ్రహ్మోత్సవాల్లో శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పించలేకపోయారు.
పలువురి సంతాపం..
రోశయ్య మృతికి మంత్రి పెద్దిరెడ్డి, కేంద్ర మాజీ మంత్రులు చింతా మోహన్, పనబాక లక్ష్మి, మాజీ మంత్రి గల్లా అరుణకుమారి, ఎంపీ గురుమూర్తి, ఎమ్మెల్యేలు భూమన కరుణాకర్రెడ్డి, చెవిరెడ్డి భాస్కర్రెడ్డి, ఎంజీఎం గ్రూప్ ఛైర్మన్ గుండ్లూరు మల్లికార్జుననాయుడు, తితిదే ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, జడ్పీ ఛైర్మన్ శ్రీనివాసులు, ఎమ్మెల్సీ రాజసింహులు, తెదేపా చిత్తూరు పార్లమెంట్ నియోజకవర్గ అధ్యక్షుడు పులివర్తి నాని, ఎమ్మెల్యే ఆదిమూలం, శ్రీసిటీ ఎండీ రవీంద్రసన్నారెడ్డి సంతాపం తెలిపారు.
నాన్నతో శిష్యరికం చేసిన రోశయ్య మంత్రివర్గంలో తాను మంత్రిగా పని చేశానని గల్లా అరుణ గుర్తు చేశారు.
శ్రీకాళహస్తిలో నూతన రాజగోపుర నిర్మాణానికి 2010లో
శంకుస్థాపన చేస్తున్న అప్పటి ముఖ్యమంత్రి రోశయ్య
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రెండు కిలోమీటర్లకే రూ.9 వ్యత్యాసమా..!
[ 27-04-2024]
జగనన్న ఎడాపెడా బాదుతూ అందిన కాడికి దండుకుంటున్నారు. -
ఆయన ‘చె’ప్పింది ‘వి’నాల్సిందే
[ 27-04-2024]
చంద్రగిరి దుర్గానికి చెందిన కీలక వైకాపా నేత దౌర్జన్యాలు, దోపిడీలకు అంతే లేదు. నుదుటిపై బొట్టుతో నవ్వుతూ గంగి గోవులా కనిపించే ఈ నేతను చూస్తే నియోజకవర్గ ప్రజలు వణికిపోయే పరిస్థితికి వచ్చారు. -
‘ఇసుఖ’శాంతులన్నీ వైకాపా మేతలకే
[ 27-04-2024]
ఐదేళ్ల వైకాపా పాలనలో ప్రకృతి సంపద సర్వనాశనమైంది. సామాన్యులు ఇళ్లు కట్టుకోవడానికి అవసరమైన ఇసుకను అందుబాటులో ఉంచడానికి బదులు ముఖ్యమంత్రి మొదలుకుని మంత్రులు, ఎమ్మెల్యేలు, వైకాపా నాయకులు యథేచ్ఛగా దోచేశారు. -
అటవీశాఖ మంత్రి.. ‘పెద్ద’ మనసు లేని వైచిత్రి
[ 27-04-2024]
అడవుల్లో స్వేచ్ఛగా విహరించాల్సిన వన్యప్రాణులు దాహం.. ఆకలి బాధలు తట్టుకోలేక జనారణ్యంలోకి వస్తున్నాయి. ఆహారం, నీటి అన్వేషణలో.. జనావాసాల వైపు వస్తూ ప్రాణాలు కోల్పోతున్నాయి. -
జగన్ జమానా.. ఖర్మ నాయనా..!
[ 27-04-2024]
ఒకప్పుడు ప్రభుత్వ ఉద్యోగం చేసేవారు అప్పు అడిగితే వెతుక్కుని మరీవచ్చి ఇచ్చేవారు.. ఎందుకంటే ప్రతినెలా ఒకటో తేదీన జీతం వస్తుంది కాబట్టి.. ప్రతి నెలా తేదీ తప్పకుండా నగదు వాయిదా పద్ధతిలో చెల్లిస్తారనే నమ్మకంతో.. కానీ వైకాపా హయాంలో ప్రభుత్వ ఉద్యోగుల పరిస్థితి తారుమారైంది.. -
నిజాలు చెబితే తాఖీదులు
[ 27-04-2024]
‘ఎప్పుడూ సత్యం పలుకవలెను, అబద్ధాలు చెప్పరాదు’ అంటూ విద్యార్థులకు చెప్పే ఉపాధ్యాయులు.. తాము నిజాలు అప్లోడ్ చేస్తే షోకాజ్ నోటీసులు అందుకోవాల్సి వచ్చింది. -
వైకాపాకే వంతపాడిన యంత్రాంగం
[ 27-04-2024]
నిష్పక్షపాతంగా ఎన్నికలు నిర్వహిస్తామంటూ ఊదరగొడుతున్న అధికారులు క్షేత్రస్థాయిలో మాత్రం వైకాపాకే వంత పాడుతున్నారు. -
‘వైకాపా పాలనలో అత్యాచారాల్లో ఏపీకి అగ్రస్థానం’
[ 27-04-2024]
తెదేపా పాలనలోనే మహిళా సాధికారత సాధ్యమని ఎంపీ అభ్యర్థి దగ్గుమళ్ల ప్రసాదరావు, ఎమ్మెల్యే అభ్యర్థి గురజాల జగన్మోహన్ అన్నారు. -
నిన్న అనుమతించలేదు.. నేడు తిరస్కరించారు..
[ 27-04-2024]
నామినేషన్ల చివరి రోజు గురువారం చిత్తూరు ఎంపీ అభ్యర్థినిగా పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా పార్టీకి చెందిన భూలక్ష్మి నామినేషన్ దాఖలు చేశారు. -
ఇసుకలో దోచేసి..మట్టితో దండుకుని
[ 27-04-2024]
వైకాపా నేతలకు ఇసుక, మట్టి ఆదాయ వనరులుగా మారాయి.. ఇసుక, చెరువులు, గుట్టల నుంచి మట్టిని దర్జాగా తరలించి జేబులు నింపుకొంటున్నారు.. -
‘తెదేపాను గెలిపించండి.. రాష్ట్రాన్ని రక్షించండి’
[ 27-04-2024]
తెదేపా కూటమిని గెలిపించి రాష్ట్రాన్ని రక్షించాలని తెదేపా కూటమి ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి గురజాల జగన్మోహన్ సతీమణి ప్రతిమ అన్నారు. -
ఎస్బీ కానిస్టేబుళ్లపై చర్యలు తీసుకోండి
[ 27-04-2024]
స్పెషల్ బ్రాంచ్ (ఎస్బీ)లో పనిచేస్తున్న హెడ్ కానిస్టేబుల్ రామకృష్ణ, కానిస్టేబుల్ దాము.. చిత్తూరు వైకాపా అభ్యర్థి విజయానందరెడ్డికి సహకరిస్తున్నారని ఆరోపిస్తూ తెదేపా అభ్యర్థి గురజాల జగన్మోహన్ -
ముగిసిన పరిశీలన.. మిగిలింది ఉపసంహరణ
[ 27-04-2024]
సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఎంపీ, ఎమ్మెల్యే స్థానాలకు సంబంధించి అభ్యర్థుల నామపత్రాల పరిశీలన శుక్రవారం ముగిసింది. -
ఆమోదం 177.. తిరస్కారం 50
[ 27-04-2024]
నామినేషన్ల పరిశీలన కార్యక్రమం శుక్రవారం పూర్తయింది. -
తిరస్కరణ భయం.. బరిలో భార్యలు, వారసులు
[ 27-04-2024]
సార్వత్రిక సమరం 2024లో కీలకమైన నామపత్రాల స్వీకరణ పర్వం ముగిసింది. -
రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి
[ 27-04-2024]
చిత్తూరు పలమనేరు జాతీయ రహదారిలోని గుండ్లకట్టమంచి వద్ద శుక్రవారం రాత్రి గుర్తుతెలియని వాహనం ఢీకొనడంతో మహిళ మృతి చెందిందని ఏఎస్సై రామచంద్రారెడ్డి తెలిపారు.