logo

‘వైకాపా నీచంగా ప్రవర్తిస్తోంది’

వైకాపా ప్రభుత్వం నీచంగా వ్యవహరిస్తోందని మాజీ మంత్రి అమరనాథరెడ్డి అన్నారు. శనివారం సాయంత్రం చిత్తూరు జైలు నుంచి విడుదలైన తెదేపా నాయకులకు పట్టణంలో ఘనస్వాగతం పలికారు.

Published : 25 Sep 2022 02:31 IST

చిత్తూరు: ప్రదర్శనలో శ్రేణులకు అభివాదం చేస్తున్న మాజీ ఎమ్మెల్సీ గౌనివారి శ్రీనివాసులు, పక్కనే అమరనాథరెడ్డి, పులివర్తి నాని

పలమనేరు, న్యూస్‌టుడే: వైకాపా ప్రభుత్వం నీచంగా వ్యవహరిస్తోందని మాజీ మంత్రి అమరనాథరెడ్డి అన్నారు. శనివారం సాయంత్రం చిత్తూరు జైలు నుంచి విడుదలైన తెదేపా నాయకులకు పట్టణంలో ఘనస్వాగతం పలికారు. మార్కెట్‌ కమిటీ ఆవరణలో ఎన్టీఆర్‌ విగ్రహానికి నివాళులర్పించారు. ఆయన మాట్లాడుతూ తెదేపా నాయకులను జైలులో పెడితే భయపడతామని అనుకుంటున్నారు.. అది మీ పగటి కలగానే ఉంటుందన్నారు. చంద్రబాబునాయుడు అనుభవమంత వయసు లేని జగన్‌ అన్యాయంగా విమర్శిస్తున్నారని అన్నారు. సున్నిత మనస్కులైన గౌనివారి శ్రీనివాసులును ఈ ప్రభుత్వం దుర్మార్గంగా అరెస్టు చేసిందని మండిపడ్డారు. అక్రమ అరెస్టులకు జగన్‌మోహన్‌రెడ్డి మూల్యం చెల్లించక తప్పదని హెచ్చరించారు. తెదేపా నాయకులు, కార్యకర్తలు పెద్దఎత్తున పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని