ఆత్మీయత పంచుతూ.. భరోసానిస్తూ..
ఆత్మీయ పలకరింపులు.. అడుగడుగునా హృదయపూర్వక స్వాగతాలు.. నేనున్నాననే భరోసా.. భావి పౌరులకు ఉపాధి తన బాధ్యత అంటూ హామీ.. ఆడపడుచులకు రక్షణ కల్పించే అన్నగా ఉంటాననే మాట..
ఎమ్మెల్యే శ్రీనివాసులు భూ బకాసురుడు
చిత్తూరులో విశ్వవిద్యాలయం, ఎలక్ట్రానిక్స్ హబ్ ఏర్పాటు చేస్తాం
యువగళం సభలో నారా లోకేశ్
ఈనాడు డిజిటల్ - చిత్తూరు; చిత్తూరు (జిల్లా పంచాయతీ), న్యూస్టుడే
సభకు హాజరైన ప్రజలు
ఆత్మీయ పలకరింపులు.. అడుగడుగునా హృదయపూర్వక స్వాగతాలు.. నేనున్నాననే భరోసా.. భావి పౌరులకు ఉపాధి తన బాధ్యత అంటూ హామీ.. ఆడపడుచులకు రక్షణ కల్పించే అన్నగా ఉంటాననే మాట.. ఇలా అడుగడుగునా యువనేత, తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ 12వ రోజు పాదయాత్ర సాగింది.. మంగళవారం ప్రత్యేకించి మహిళలు.. యువతులు తరలి వచ్చారు. పార్టీ కేడర్లో ధైర్యాన్ని నింపుతూ.. వైకాపా అవినీతిని ఎండగడుతూ యాత్ర సాగింది. తరలివచ్చిన ప్రజలు, తెదేపా శ్రేణుల నడుమ తెదేపా జిల్లా కార్యాలయం నుంచి ఆరంభమైన పాదయాత్ర రాత్రి విడిది దిగువ మాసాపల్లి చేరుకోవడానికి కనీసం నాలుగు గంటలకుపైగా పట్టింది.
చిత్తూరు ఎమ్మెల్యే భూ బకాసురుడని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ విమర్శించారు. చిత్తూరులో మంగళవారం సాయంత్రం నిర్వహించిన యువగళం బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ తనపై ఎన్ని కేసులు పెట్టినా పర్లేదని, తెదేపా కార్యకర్తల జోలికొస్తే సహించేది లేదన్నారు. హంద్రీ-నీవా పనులు పూర్తిగా ఆపేశారన్నారు. రూ.500 కోట్లు ప్రజాధనాన్ని దోచిన ఎమ్మెల్యే శ్రీనివాసులు, గుడిపాల మండలంలో 300 ఎకరాల పశువుల మేత భూమిని మింగేశాడని వెల్లడించారు. ఎమ్మెల్యే, ఆయన అన్న కుమారుడు శివ ఆగడాలకు హద్దు లేకుండా పోయిందని, తచ్చూరు రహదారి నిర్మాణ కాంట్రాక్టర్ను బెదిరించి నగదు తీసుకున్నారన్నారు. చిత్తూరు జిల్లా కేంద్రంగా ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్ ఏర్పాటు చేసి, నిరుద్యోగ సమస్యను పరిష్కారిస్తామని, చిత్తూరులో విశ్వవిద్యాలయం కలను చంద్రబాబు నెరవేరుస్తారని, లోకేశ్ను అడ్డుకుంటే యువగళం ఆగదని స్పష్టం చేశారు. మాజీ మంత్రి అమరనాథరెడ్డి, ఎమ్మెల్సీలు దీపక్రెడ్డి, రాజసింహులు, తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శులు బీద రవిచంద్ర, నల్లారి కిశోర్కుమార్రెడ్డి, చిత్తూరు పార్లమెంటు నియోజకవర్గ అధ్యక్షుడు పులివర్తి నాని, చల్లా రామచంద్రారెడ్డి, మాజీ మేయర్ కఠారి హేమలత, రాష్ట్ర కార్యదర్శి సందీప్, మాజీ కార్పొరేటర్ వసంత్కుమార్, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
‘సైకో జగన్.. ఉద్యోగాలు పీకేస్తాడు’
కొత్త అన్న క్యాంటీన్ను పర్యవేక్షిస్తున్న రాజశేఖర్ను అభినందిస్తున్న లోకేశ్
చిత్తూరు(జిల్లా పంచాయతీ): పాదయాత్ర చేస్తూ కొంగారెడ్డిపల్లిలోని పాత అన్న క్యాంటీన్ భవనంలో నిర్వహిస్తున్న వార్డు సచివాలయాన్ని మంగళవారం రాత్రి నారా లోకేశ్ పరిశీలించారు. అక్కడి సిబ్బంది అనుమతి తీసుకుని లోపలికి వెళ్లిన ఆయన అక్కడి పరిస్థితి చూశారు. సిబ్బందితో మాట్లాడారు. పక్కన ఉన్న నాయకులను మరిన్ని వివరాలు అడిగారు. సిబ్బంది తమతో మాట్లాడితే వారి ఉద్యోగాలను సైకో జగన్ తీసేస్తాడని లోకేశ్ పేర్కొన్నారు. ఎంతోమంది పేదల ఆకలిని తీర్చిన అన్న క్యాంటీన్లను మూసేసిన పాపం జగన్రెడ్డిని వదలదని హెచ్చరించారు. కొత్త అన్న క్యాంటీన్ను పర్యవేక్షిస్తున్న రాజశేఖర్ను ఆయన అభినందించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రెండు కిలోమీటర్లకే రూ.9 వ్యత్యాసమా..!
[ 27-04-2024]
జగనన్న ఎడాపెడా బాదుతూ అందిన కాడికి దండుకుంటున్నారు. -
ఆయన ‘చె’ప్పింది ‘వి’నాల్సిందే
[ 27-04-2024]
చంద్రగిరి దుర్గానికి చెందిన కీలక వైకాపా నేత దౌర్జన్యాలు, దోపిడీలకు అంతే లేదు. నుదుటిపై బొట్టుతో నవ్వుతూ గంగి గోవులా కనిపించే ఈ నేతను చూస్తే నియోజకవర్గ ప్రజలు వణికిపోయే పరిస్థితికి వచ్చారు. -
‘ఇసుఖ’శాంతులన్నీ వైకాపా మేతలకే
[ 27-04-2024]
ఐదేళ్ల వైకాపా పాలనలో ప్రకృతి సంపద సర్వనాశనమైంది. సామాన్యులు ఇళ్లు కట్టుకోవడానికి అవసరమైన ఇసుకను అందుబాటులో ఉంచడానికి బదులు ముఖ్యమంత్రి మొదలుకుని మంత్రులు, ఎమ్మెల్యేలు, వైకాపా నాయకులు యథేచ్ఛగా దోచేశారు. -
అటవీశాఖ మంత్రి.. ‘పెద్ద’ మనసు లేని వైచిత్రి
[ 27-04-2024]
అడవుల్లో స్వేచ్ఛగా విహరించాల్సిన వన్యప్రాణులు దాహం.. ఆకలి బాధలు తట్టుకోలేక జనారణ్యంలోకి వస్తున్నాయి. ఆహారం, నీటి అన్వేషణలో.. జనావాసాల వైపు వస్తూ ప్రాణాలు కోల్పోతున్నాయి. -
జగన్ జమానా.. ఖర్మ నాయనా..!
[ 27-04-2024]
ఒకప్పుడు ప్రభుత్వ ఉద్యోగం చేసేవారు అప్పు అడిగితే వెతుక్కుని మరీవచ్చి ఇచ్చేవారు.. ఎందుకంటే ప్రతినెలా ఒకటో తేదీన జీతం వస్తుంది కాబట్టి.. ప్రతి నెలా తేదీ తప్పకుండా నగదు వాయిదా పద్ధతిలో చెల్లిస్తారనే నమ్మకంతో.. కానీ వైకాపా హయాంలో ప్రభుత్వ ఉద్యోగుల పరిస్థితి తారుమారైంది.. -
నిజాలు చెబితే తాఖీదులు
[ 27-04-2024]
‘ఎప్పుడూ సత్యం పలుకవలెను, అబద్ధాలు చెప్పరాదు’ అంటూ విద్యార్థులకు చెప్పే ఉపాధ్యాయులు.. తాము నిజాలు అప్లోడ్ చేస్తే షోకాజ్ నోటీసులు అందుకోవాల్సి వచ్చింది. -
వైకాపాకే వంతపాడిన యంత్రాంగం
[ 27-04-2024]
నిష్పక్షపాతంగా ఎన్నికలు నిర్వహిస్తామంటూ ఊదరగొడుతున్న అధికారులు క్షేత్రస్థాయిలో మాత్రం వైకాపాకే వంత పాడుతున్నారు. -
‘వైకాపా పాలనలో అత్యాచారాల్లో ఏపీకి అగ్రస్థానం’
[ 27-04-2024]
తెదేపా పాలనలోనే మహిళా సాధికారత సాధ్యమని ఎంపీ అభ్యర్థి దగ్గుమళ్ల ప్రసాదరావు, ఎమ్మెల్యే అభ్యర్థి గురజాల జగన్మోహన్ అన్నారు. -
నిన్న అనుమతించలేదు.. నేడు తిరస్కరించారు..
[ 27-04-2024]
నామినేషన్ల చివరి రోజు గురువారం చిత్తూరు ఎంపీ అభ్యర్థినిగా పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా పార్టీకి చెందిన భూలక్ష్మి నామినేషన్ దాఖలు చేశారు. -
ఇసుకలో దోచేసి..మట్టితో దండుకుని
[ 27-04-2024]
వైకాపా నేతలకు ఇసుక, మట్టి ఆదాయ వనరులుగా మారాయి.. ఇసుక, చెరువులు, గుట్టల నుంచి మట్టిని దర్జాగా తరలించి జేబులు నింపుకొంటున్నారు.. -
‘తెదేపాను గెలిపించండి.. రాష్ట్రాన్ని రక్షించండి’
[ 27-04-2024]
తెదేపా కూటమిని గెలిపించి రాష్ట్రాన్ని రక్షించాలని తెదేపా కూటమి ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి గురజాల జగన్మోహన్ సతీమణి ప్రతిమ అన్నారు. -
ఎస్బీ కానిస్టేబుళ్లపై చర్యలు తీసుకోండి
[ 27-04-2024]
స్పెషల్ బ్రాంచ్ (ఎస్బీ)లో పనిచేస్తున్న హెడ్ కానిస్టేబుల్ రామకృష్ణ, కానిస్టేబుల్ దాము.. చిత్తూరు వైకాపా అభ్యర్థి విజయానందరెడ్డికి సహకరిస్తున్నారని ఆరోపిస్తూ తెదేపా అభ్యర్థి గురజాల జగన్మోహన్ -
ముగిసిన పరిశీలన.. మిగిలింది ఉపసంహరణ
[ 27-04-2024]
సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఎంపీ, ఎమ్మెల్యే స్థానాలకు సంబంధించి అభ్యర్థుల నామపత్రాల పరిశీలన శుక్రవారం ముగిసింది. -
ఆమోదం 177.. తిరస్కారం 50
[ 27-04-2024]
నామినేషన్ల పరిశీలన కార్యక్రమం శుక్రవారం పూర్తయింది. -
తిరస్కరణ భయం.. బరిలో భార్యలు, వారసులు
[ 27-04-2024]
సార్వత్రిక సమరం 2024లో కీలకమైన నామపత్రాల స్వీకరణ పర్వం ముగిసింది. -
రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి
[ 27-04-2024]
చిత్తూరు పలమనేరు జాతీయ రహదారిలోని గుండ్లకట్టమంచి వద్ద శుక్రవారం రాత్రి గుర్తుతెలియని వాహనం ఢీకొనడంతో మహిళ మృతి చెందిందని ఏఎస్సై రామచంద్రారెడ్డి తెలిపారు.
తాజా వార్తలు (Latest News)
-
సునీల్ నరైన్కు థ్యాంక్స్.. శశాంక్ ఓ అద్భుతం: బెయిర్స్టో
-
రెచ్చిపోయిన మిలిటెంట్లు.. సీఆర్పీఎఫ్ శిబిరంపై 2 గంటల పాటు కాల్పుల వర్షం
-
పింఛన్ల పంపిణీపై ఏపీ ప్రభుత్వానికి ఈసీ ఆదేశాలు
-
జగనన్న పన్నాగం.. పల్లెలకు పంగనామం..!
-
అన్నమయ్య జిల్లాలో తెదేపా ప్రచార వాహనానికి నిప్పు
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM