logo

కల్యాణం.. రమణీయం

తిరుపతిలోని శ్రీ కోదండరామస్వామి వారి ఆలయంలో శ్రీ సీతారాముల కల్యాణం రమణీయంగా సాగింది. శ్రీరామనవమి ఉత్సవాల్లో భాగంగా శుక్రవారం సాయంత్రం కల్యాణోత్సవ ఘటాన్ని చేపట్టారు.

Published : 01 Apr 2023 03:13 IST

- న్యూస్‌టుడే, తిరుపతి(విద్య)

తిరుపతిలోని శ్రీ కోదండరామస్వామి వారి ఆలయంలో శ్రీ సీతారాముల కల్యాణం రమణీయంగా సాగింది. శ్రీరామనవమి ఉత్సవాల్లో భాగంగా శుక్రవారం సాయంత్రం కల్యాణోత్సవ ఘటాన్ని చేపట్టారు. కల్యాణోత్సవం కోసం అంబారీపై తీసుకొచ్చిన ముత్యాలను తలంబ్రాలుగా సమర్పించారు. అనంతరం స్వామి, అమ్మవారు నాలుగు మాడ[ వీధుల్లో ఊరేగి భక్తులను అనుగ్రహించారు. కార్యక్రమంలో తితిదే బోర్డు సభ్యుడు పోకల అశోక్‌కుమార్‌, ఆలయ డిప్యూటీ ఈవో నాగరత్న, ఏఈవో మోహన్‌, సూపరింటెండెంట్ రమేష్‌, టెంపుల్‌   ఇన్‌స్పెక్టర్లు చలపతి, సురేష్‌, భక్తులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని