రెండు కుటుంబాల్లో విషాదం
రంజాన్ మాసం తర్వాత పెళ్లి చేసుకోవాల్సిన ఓ యువకుడు.. కొవిడ్ తండ్రిని మింగేసినా ఇంటి భారాన్ని పెద్ద కొడుకుగా మోస్తున్న మరో యువకుడిని మృత్యువు రోడ్డు ప్రమాద రూపంలో కబళించింది.
పెళ్లి నిశ్చయమై ఒకరు.. కుటుంబ పెద్ద మరొకరు..
కబళించిన మృత్యువు
దినేష్ మృతదేహం కోసం ఎదురు చూస్తున్న గ్రామస్థులు
తిరుపతి(వైద్యవిభాగం), న్యూస్టుడే: రంజాన్ మాసం తర్వాత పెళ్లి చేసుకోవాల్సిన ఓ యువకుడు.. కొవిడ్ తండ్రిని మింగేసినా ఇంటి భారాన్ని పెద్ద కొడుకుగా మోస్తున్న మరో యువకుడిని మృత్యువు రోడ్డు ప్రమాద రూపంలో కబళించింది. చిత్తూరు జిల్లా సదుంలో స్నేహితుడి పెళ్లి వేడుకలకు హాజరై తిరిగి వస్తూ పనబాకం వద్ద గురువారం అర్ధరాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందగా.. ఆరుగురు గాయపడ్డారు. మృతదేహాలకు శవపరీక్ష నిర్వహిస్తున్న ఎస్వీ వైద్య కళాశాల వద్దకు ఆ రెండు కుటుంబాల సభ్యులు చేరుకుని కన్నీరుమున్నీరయ్యారు. ‘స్నేహితుడి పెళ్లికి వెళితే కదా.. మరో రెండు నెలల్లో జరిగే నా పెళ్లికి వస్తారంటూ వెళ్లి అనంత లోకాలకు చేరావా అంటూ’ ఇమ్రాన్ కుటుంబసభ్యులు, బంధువులు కన్నీటి పర్యంతమయ్యారు. తండ్రి లేకపోయినా తల్లి సహకారంతో తమ్ముడికి అండగా ఉంటున్న దినేష్ మృతదేహం చూసి ఆ గ్రామస్థులు తల్లడిల్లిపోయారు.
విలపిస్తున్న ఇమ్రాన్ కుటుంబ సభ్యులు
తండ్రికి చేదోడుగా ఉంటూ..
తిరుపతి కుమ్మరితోపు ప్రాంతానికి చెందిన చాంద్బాషా, కరీమున్నీషా దంపతుల పెద్ద కుమారుడు ఇమ్రాన్ (24) డిగ్రీ వరకు చదువుకుని ప్రైవేటు ఉద్యోగం చేస్తున్నారు. టీవీ మెకానిక్ అయిన తండ్రికి చేదోడుగా ఉంటున్నారు. తిరుపతికి చెందిన యువతితో వివాహం నిశ్చయమైంది. ఈ తరుణంలో స్నేహితుడి పెళ్లికి వెళ్లి వస్తూ ప్రమాదానికి గురై మృతి చెందారు.
కుటుంబ పెద్ద దిక్కును కోల్పోయి..
రేణిగుంట మండలం ఇప్పమానుపేటకు చెందిన హరి, రేణుక దంపతుల పెద్ద కుమారుడు దినేష్ (24) ఓ కంపెనీలో పనిచేస్తున్నారు. కొవిడ్తో తండ్రి మృతి చెందినా కుటుంబానికి అండగా దినేష్ నిలిచారు. రోడ్డు ప్రమాదంలో విగతజీవిగా మారడంతో ఆ కుటుంబం పెద్ద దిక్కును కోల్పోయింది. ప్రమాదంలో గాయపడ్డ శ్రీనివాసులు, పృథ్వీ, జయచంద్రారెడ్డి, తులసి నాయుడు, విశ్వనాథ్, విజయరెడ్డి రుయా ఆస్పత్రికి తరలించారు. అక్కడ నుంచి ఐదుగురు ప్రైవేటు ఆస్పత్రులకు.. ఒకరు ఈఎస్ఐ ఆస్పత్రికి చికిత్స నిమిత్తం వెళ్లారు. శవ పరీక్షల అనంతరం ఇద్దరి మృతదేహాలను కుటుంబ సభ్యులకు శుక్రవారం సాయంత్రం అప్పగించారు.
దినేష్ ఇమ్రాన్ (పాత చిత్రాలు)
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రెండు కిలోమీటర్లకే రూ.9 వ్యత్యాసమా..!
[ 27-04-2024]
జగనన్న ఎడాపెడా బాదుతూ అందిన కాడికి దండుకుంటున్నారు. -
ఆయన ‘చె’ప్పింది ‘వి’నాల్సిందే
[ 27-04-2024]
చంద్రగిరి దుర్గానికి చెందిన కీలక వైకాపా నేత దౌర్జన్యాలు, దోపిడీలకు అంతే లేదు. నుదుటిపై బొట్టుతో నవ్వుతూ గంగి గోవులా కనిపించే ఈ నేతను చూస్తే నియోజకవర్గ ప్రజలు వణికిపోయే పరిస్థితికి వచ్చారు. -
‘ఇసుఖ’శాంతులన్నీ వైకాపా మేతలకే
[ 27-04-2024]
ఐదేళ్ల వైకాపా పాలనలో ప్రకృతి సంపద సర్వనాశనమైంది. సామాన్యులు ఇళ్లు కట్టుకోవడానికి అవసరమైన ఇసుకను అందుబాటులో ఉంచడానికి బదులు ముఖ్యమంత్రి మొదలుకుని మంత్రులు, ఎమ్మెల్యేలు, వైకాపా నాయకులు యథేచ్ఛగా దోచేశారు. -
అటవీశాఖ మంత్రి.. ‘పెద్ద’ మనసు లేని వైచిత్రి
[ 27-04-2024]
అడవుల్లో స్వేచ్ఛగా విహరించాల్సిన వన్యప్రాణులు దాహం.. ఆకలి బాధలు తట్టుకోలేక జనారణ్యంలోకి వస్తున్నాయి. ఆహారం, నీటి అన్వేషణలో.. జనావాసాల వైపు వస్తూ ప్రాణాలు కోల్పోతున్నాయి. -
జగన్ జమానా.. ఖర్మ నాయనా..!
[ 27-04-2024]
ఒకప్పుడు ప్రభుత్వ ఉద్యోగం చేసేవారు అప్పు అడిగితే వెతుక్కుని మరీవచ్చి ఇచ్చేవారు.. ఎందుకంటే ప్రతినెలా ఒకటో తేదీన జీతం వస్తుంది కాబట్టి.. ప్రతి నెలా తేదీ తప్పకుండా నగదు వాయిదా పద్ధతిలో చెల్లిస్తారనే నమ్మకంతో.. కానీ వైకాపా హయాంలో ప్రభుత్వ ఉద్యోగుల పరిస్థితి తారుమారైంది.. -
నిజాలు చెబితే తాఖీదులు
[ 27-04-2024]
‘ఎప్పుడూ సత్యం పలుకవలెను, అబద్ధాలు చెప్పరాదు’ అంటూ విద్యార్థులకు చెప్పే ఉపాధ్యాయులు.. తాము నిజాలు అప్లోడ్ చేస్తే షోకాజ్ నోటీసులు అందుకోవాల్సి వచ్చింది. -
వైకాపాకే వంతపాడిన యంత్రాంగం
[ 27-04-2024]
నిష్పక్షపాతంగా ఎన్నికలు నిర్వహిస్తామంటూ ఊదరగొడుతున్న అధికారులు క్షేత్రస్థాయిలో మాత్రం వైకాపాకే వంత పాడుతున్నారు. -
‘వైకాపా పాలనలో అత్యాచారాల్లో ఏపీకి అగ్రస్థానం’
[ 27-04-2024]
తెదేపా పాలనలోనే మహిళా సాధికారత సాధ్యమని ఎంపీ అభ్యర్థి దగ్గుమళ్ల ప్రసాదరావు, ఎమ్మెల్యే అభ్యర్థి గురజాల జగన్మోహన్ అన్నారు. -
నిన్న అనుమతించలేదు.. నేడు తిరస్కరించారు..
[ 27-04-2024]
నామినేషన్ల చివరి రోజు గురువారం చిత్తూరు ఎంపీ అభ్యర్థినిగా పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా పార్టీకి చెందిన భూలక్ష్మి నామినేషన్ దాఖలు చేశారు. -
ఇసుకలో దోచేసి..మట్టితో దండుకుని
[ 27-04-2024]
వైకాపా నేతలకు ఇసుక, మట్టి ఆదాయ వనరులుగా మారాయి.. ఇసుక, చెరువులు, గుట్టల నుంచి మట్టిని దర్జాగా తరలించి జేబులు నింపుకొంటున్నారు.. -
‘తెదేపాను గెలిపించండి.. రాష్ట్రాన్ని రక్షించండి’
[ 27-04-2024]
తెదేపా కూటమిని గెలిపించి రాష్ట్రాన్ని రక్షించాలని తెదేపా కూటమి ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి గురజాల జగన్మోహన్ సతీమణి ప్రతిమ అన్నారు. -
ఎస్బీ కానిస్టేబుళ్లపై చర్యలు తీసుకోండి
[ 27-04-2024]
స్పెషల్ బ్రాంచ్ (ఎస్బీ)లో పనిచేస్తున్న హెడ్ కానిస్టేబుల్ రామకృష్ణ, కానిస్టేబుల్ దాము.. చిత్తూరు వైకాపా అభ్యర్థి విజయానందరెడ్డికి సహకరిస్తున్నారని ఆరోపిస్తూ తెదేపా అభ్యర్థి గురజాల జగన్మోహన్ -
ముగిసిన పరిశీలన.. మిగిలింది ఉపసంహరణ
[ 27-04-2024]
సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఎంపీ, ఎమ్మెల్యే స్థానాలకు సంబంధించి అభ్యర్థుల నామపత్రాల పరిశీలన శుక్రవారం ముగిసింది. -
ఆమోదం 177.. తిరస్కారం 50
[ 27-04-2024]
నామినేషన్ల పరిశీలన కార్యక్రమం శుక్రవారం పూర్తయింది. -
తిరస్కరణ భయం.. బరిలో భార్యలు, వారసులు
[ 27-04-2024]
సార్వత్రిక సమరం 2024లో కీలకమైన నామపత్రాల స్వీకరణ పర్వం ముగిసింది. -
రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి
[ 27-04-2024]
చిత్తూరు పలమనేరు జాతీయ రహదారిలోని గుండ్లకట్టమంచి వద్ద శుక్రవారం రాత్రి గుర్తుతెలియని వాహనం ఢీకొనడంతో మహిళ మృతి చెందిందని ఏఎస్సై రామచంద్రారెడ్డి తెలిపారు.