నేర వార్తలు
పురపాలక పరిధిలోని ఓ ప్రాంతానికి చెందిన 18 ఏళ్ల యువతి కనిపించడం లేదని తల్లిదండ్రులు శుక్రవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు.
యువతి అదృశ్యం
సూళ్లూరుపేట: పురపాలక పరిధిలోని ఓ ప్రాంతానికి చెందిన 18 ఏళ్ల యువతి కనిపించడం లేదని తల్లిదండ్రులు శుక్రవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. యువతి కొద్ది రోజుల కిందట ద్వితీయ సంవత్సరం ఇంటర్ పరీక్షలు రాసింది. గత రెండు రోజులుగా కనిపించక పోవడంతో తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.
ట్రాక్టర్, ఆటో ఢీ.. పలువురికి గాయాలు
సూళ్లూరుపేట: శ్రీహరికోట రోడ్డులో కేసీఎన్గుంట వద్ద శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ట్రాక్టర్ను ఆటో ఢీకొని పలువురు గాయపడ్డారు. శ్రీహరికోట రోడ్డులో మట్టి ట్రాక్టర్ వెళ్తుండగా దాని వెనుక ప్రయాణికులతో ఆటో బయలుదేరింది. ట్రాక్టర్ డ్రైవర్ ఉన్నట్టుండి బ్రేక్లు వేయడంతో వెనుక వస్తున్న ఆటో ఢీ కొంది. ఈ ప్రమాదంలో ఆటోలోని వారు గాయ పడ్డారు. స్థానికులు వారిని సూళ్లూరుపేట సర్వజన ఆసుపత్రికి తరలించారు.
పోలీసుల అదుపులో చోరీ అనుమానితులు
వాకాడు, న్యూస్టుడే: మండలంలోని బాలిరెడ్డిపాలెంలో రైతుకు చెందిన వ్యవసాయ పరికరాలు చోరీకి గురైయ్యాయి. ఈమేరకు బుధవారం చిట్టమూరు మండలం దరఖాస్తు గ్రామానికి చెందిన ఇద్దరు పాత సామాన్లు కొనుగోలు చేసుకొనే వారిని వాకాడు పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. బాలిరెడ్డిపాలెంలో పొలంలో ఉన్న వ్యవసాయ పరికరాలను చోరీ చేసి చిట్టమూరు మండలం కొత్తగుంటలోని పాత సామాన్లు కొనుగోలు చేసే వ్యాపారికి విక్రయించినట్లు పోలీసులు గుర్తించారు. మరో వ్యక్తి కోసం పోలీసులు గాలింపులు చేపట్టారు. ఈ విషయమై వాకాడు ఎస్ఐ రఘునాథ్ను వివరణ కోరగా పరికరాలు చోరీ విషయమై విచారిస్తూ కోటకు పంపామన్నారు.
రెండు లారీలు ఢీ.. ట్రాఫిక్కు అంతరాయం
తడ, న్యూస్టుడే: మండలంలోని భీములవారిపాళెం తనిఖీ కేంద్రం జాతీయ రహదారిపై గురువారం అర్ధరాత్రి రెండు లారీలు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ముందున్న లారీలోని ఇనుప గడ్డర్లు కింద పడ్డాయి. దీంతో ట్రాఫిక్కు అంతరాయం ఏర్పడింది. గంటకుపైగా వాహనాలు నిలిచిపోయాయి. పోలీసులు రంగప్రవేశం చేసి క్రేన్ల సాయంతో గడ్డర్లను తొలగించి ట్రాఫిక్ను పునరుద్ధరించారు.
మేయరు దంపతుల హత్య కేసు విచారణ 3కు వాయిదా
చిత్తూరు(న్యాయవిభాగం): దివంగత మేయరు దంపతుల హత్య కేసు విచారణను ఈ నెల 3వ తేదీకి వాయిదా వేస్తూ శుక్రవారం స్థానిక ఆరవ అదనపు జిల్లా కోర్టు ఇన్ఛార్జి న్యాయమూర్తి శాంతి ఆదేశాలు జారీ చేశారు. స్థానిక పాత జిల్లా కోర్టు ప్రాంగణంలోని పోక్సో కోర్టులో ఈ కేసులో సాక్షుల విచారణ కొనసాగుతోంది. ఇప్పటి వరకు షెడ్యూల్ ప్రకారం 38మంది సాక్షులు కోర్టుకు హాజరుకాగా..ఇందులో 11 మంది వాంగ్మూలాన్ని కోర్టు నమోదు చేయగా..మరొక సాక్షిని విచారించాల్సి ఉంది. మిగిలిన 26 మందిని విచారించాల్సిన అవసరం లేదని పీపీ పేర్కొనగా.. కోర్టు ఏకీభవించింది.
ఏఎస్సై, కానిస్టేబుల్ బదిలీ
జీడీనెల్లూరు: విశ్రాంత వీఆర్వో రవీంద్రనాథరెడ్డిపై నాకాబందీ నిర్వహిస్తున్న పోలీసులు గురువారం రాత్రి దురుసుగా ప్రవర్తించడంతో వైకాపా నేతలు, గ్రామస్థులు జీడీనెల్లూరులో చేపట్టిన ధర్నాపై పోలీసు ఉన్నతాధికారులు శుక్రవారం చర్యలు చేపట్టారు. నాకాబందీలో పాల్గొన్న ఏఎస్సై గజేంద్ర, కానిస్టేబుల్ వినోద్పై బదిలీ వేటు వేశారు. ఎస్సై శ్రీనివాసరావుపై విచారణ చేస్తామని చిత్తూరు తూర్పు సీఐ గంగిరెడ్డి తెలిపారు.
రోడ్డు ప్రమాదంలో తల్లీకుమార్తె దుర్మరణం
గంగవరం: రోడ్డు ప్రమాదంలో తల్లీకుమార్తె దుర్మరణం చెందిన ఘటన మండలంలో కేంద్రంలో శుక్రవారం జరిగింది. పలమనేరు పట్టణంలోని రఘువీరారెడ్డి కాలనీ సమీపంలో కాపురముంటున్న వనిత (32), ఆమె కుమార్తె చారులత (9) మండలంలోని చీలావారిపల్లెలోని తమ బంధువుల ఇంటికి ద్విచక్రవాహనంపై గురువారం వెళ్లారు. శుక్రవారం ఉదయం తిరిగి పలమనేరుకు వస్తుండగా గంగవరం వంతెన వద్ద కంటైనర్ ఢీకొనడంతో తల్లీకుమార్తె అక్కడికక్కడే మృతిచెందారు. భర్త లేకపోవడంతో కుతుర్ని చదివించుకుంటూ ఉండేది. ఇద్దరూ మృత్యువాత పడటంతో బంధువులు విలపిస్తున్నారు. ఎస్ఐ సుధాకర్రెడ్డి కేసు దర్యాప్తు చేస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రెండు కిలోమీటర్లకే రూ.9 వ్యత్యాసమా..!
[ 27-04-2024]
జగనన్న ఎడాపెడా బాదుతూ అందిన కాడికి దండుకుంటున్నారు. -
ఆయన ‘చె’ప్పింది ‘వి’నాల్సిందే
[ 27-04-2024]
చంద్రగిరి దుర్గానికి చెందిన కీలక వైకాపా నేత దౌర్జన్యాలు, దోపిడీలకు అంతే లేదు. నుదుటిపై బొట్టుతో నవ్వుతూ గంగి గోవులా కనిపించే ఈ నేతను చూస్తే నియోజకవర్గ ప్రజలు వణికిపోయే పరిస్థితికి వచ్చారు. -
‘ఇసుఖ’శాంతులన్నీ వైకాపా మేతలకే
[ 27-04-2024]
ఐదేళ్ల వైకాపా పాలనలో ప్రకృతి సంపద సర్వనాశనమైంది. సామాన్యులు ఇళ్లు కట్టుకోవడానికి అవసరమైన ఇసుకను అందుబాటులో ఉంచడానికి బదులు ముఖ్యమంత్రి మొదలుకుని మంత్రులు, ఎమ్మెల్యేలు, వైకాపా నాయకులు యథేచ్ఛగా దోచేశారు. -
అటవీశాఖ మంత్రి.. ‘పెద్ద’ మనసు లేని వైచిత్రి
[ 27-04-2024]
అడవుల్లో స్వేచ్ఛగా విహరించాల్సిన వన్యప్రాణులు దాహం.. ఆకలి బాధలు తట్టుకోలేక జనారణ్యంలోకి వస్తున్నాయి. ఆహారం, నీటి అన్వేషణలో.. జనావాసాల వైపు వస్తూ ప్రాణాలు కోల్పోతున్నాయి. -
జగన్ జమానా.. ఖర్మ నాయనా..!
[ 27-04-2024]
ఒకప్పుడు ప్రభుత్వ ఉద్యోగం చేసేవారు అప్పు అడిగితే వెతుక్కుని మరీవచ్చి ఇచ్చేవారు.. ఎందుకంటే ప్రతినెలా ఒకటో తేదీన జీతం వస్తుంది కాబట్టి.. ప్రతి నెలా తేదీ తప్పకుండా నగదు వాయిదా పద్ధతిలో చెల్లిస్తారనే నమ్మకంతో.. కానీ వైకాపా హయాంలో ప్రభుత్వ ఉద్యోగుల పరిస్థితి తారుమారైంది.. -
నిజాలు చెబితే తాఖీదులు
[ 27-04-2024]
‘ఎప్పుడూ సత్యం పలుకవలెను, అబద్ధాలు చెప్పరాదు’ అంటూ విద్యార్థులకు చెప్పే ఉపాధ్యాయులు.. తాము నిజాలు అప్లోడ్ చేస్తే షోకాజ్ నోటీసులు అందుకోవాల్సి వచ్చింది. -
వైకాపాకే వంతపాడిన యంత్రాంగం
[ 27-04-2024]
నిష్పక్షపాతంగా ఎన్నికలు నిర్వహిస్తామంటూ ఊదరగొడుతున్న అధికారులు క్షేత్రస్థాయిలో మాత్రం వైకాపాకే వంత పాడుతున్నారు. -
‘వైకాపా పాలనలో అత్యాచారాల్లో ఏపీకి అగ్రస్థానం’
[ 27-04-2024]
తెదేపా పాలనలోనే మహిళా సాధికారత సాధ్యమని ఎంపీ అభ్యర్థి దగ్గుమళ్ల ప్రసాదరావు, ఎమ్మెల్యే అభ్యర్థి గురజాల జగన్మోహన్ అన్నారు. -
నిన్న అనుమతించలేదు.. నేడు తిరస్కరించారు..
[ 27-04-2024]
నామినేషన్ల చివరి రోజు గురువారం చిత్తూరు ఎంపీ అభ్యర్థినిగా పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా పార్టీకి చెందిన భూలక్ష్మి నామినేషన్ దాఖలు చేశారు. -
ఇసుకలో దోచేసి..మట్టితో దండుకుని
[ 27-04-2024]
వైకాపా నేతలకు ఇసుక, మట్టి ఆదాయ వనరులుగా మారాయి.. ఇసుక, చెరువులు, గుట్టల నుంచి మట్టిని దర్జాగా తరలించి జేబులు నింపుకొంటున్నారు.. -
‘తెదేపాను గెలిపించండి.. రాష్ట్రాన్ని రక్షించండి’
[ 27-04-2024]
తెదేపా కూటమిని గెలిపించి రాష్ట్రాన్ని రక్షించాలని తెదేపా కూటమి ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి గురజాల జగన్మోహన్ సతీమణి ప్రతిమ అన్నారు. -
ఎస్బీ కానిస్టేబుళ్లపై చర్యలు తీసుకోండి
[ 27-04-2024]
స్పెషల్ బ్రాంచ్ (ఎస్బీ)లో పనిచేస్తున్న హెడ్ కానిస్టేబుల్ రామకృష్ణ, కానిస్టేబుల్ దాము.. చిత్తూరు వైకాపా అభ్యర్థి విజయానందరెడ్డికి సహకరిస్తున్నారని ఆరోపిస్తూ తెదేపా అభ్యర్థి గురజాల జగన్మోహన్ -
ముగిసిన పరిశీలన.. మిగిలింది ఉపసంహరణ
[ 27-04-2024]
సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఎంపీ, ఎమ్మెల్యే స్థానాలకు సంబంధించి అభ్యర్థుల నామపత్రాల పరిశీలన శుక్రవారం ముగిసింది. -
ఆమోదం 177.. తిరస్కారం 50
[ 27-04-2024]
నామినేషన్ల పరిశీలన కార్యక్రమం శుక్రవారం పూర్తయింది. -
తిరస్కరణ భయం.. బరిలో భార్యలు, వారసులు
[ 27-04-2024]
సార్వత్రిక సమరం 2024లో కీలకమైన నామపత్రాల స్వీకరణ పర్వం ముగిసింది. -
రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి
[ 27-04-2024]
చిత్తూరు పలమనేరు జాతీయ రహదారిలోని గుండ్లకట్టమంచి వద్ద శుక్రవారం రాత్రి గుర్తుతెలియని వాహనం ఢీకొనడంతో మహిళ మృతి చెందిందని ఏఎస్సై రామచంద్రారెడ్డి తెలిపారు.