logo

మతిభ్రమించే సీఎంపై పవన్‌ వ్యాఖ్యలు: మంత్రి కారుమూరి

సీఎం జగన్‌ మోహన్‌రెడ్డిని ఏకవచనంతో విమర్శించడం, వాలంటీర్ల వ్యవస్థపై నీచమైన వ్యాఖ్యలను చూస్తుంటే.. జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌కు మతిభ్రమించిదనే విషయం అర్థమవుతుందని మంత్రి కారుమూరి వెంకటనాగేశ్వరావు అన్నారు.

Published : 15 Aug 2023 02:19 IST

పుంగనూరు: సీఎం జగన్‌ మోహన్‌రెడ్డిని ఏకవచనంతో విమర్శించడం, వాలంటీర్ల వ్యవస్థపై నీచమైన వ్యాఖ్యలను చూస్తుంటే.. జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌కు మతిభ్రమించిదనే విషయం అర్థమవుతుందని మంత్రి కారుమూరి వెంకటనాగేశ్వరావు అన్నారు. చిత్తూరు జిల్లా పుంగనూరులో జరిగిన యాదవుల ఆత్మీయ సమ్మేళనంలో ఆయన పాల్గొన్నారు. అనంతరం విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. నిత్యం ప్రజా సేవలో ఉంటూ సంక్షేమ ఫలాలు లబ్ధిదారులకు అందడంలో కీలకమైన వాలంటీర్లపై ఇష్టానుసారంగా విమర్శలు చేయడం విడ్డూరంగా ఉందన్నారు. సంక్షేమం, అభివృద్ధి రెండు కళ్లుగా సాగుతున్న జగన్‌ పాలనపై బురద జల్లే ప్రయత్నం సరికాదని హితవు పలికారు. చంద్రబాబుకు సహకరిస్తూ ప్యాకేజీ స్టార్‌గా మారిన పవన్‌కు సేవచేయాలనే ఆలోచన లేదన్నారు. పవన్‌ వ్యాఖ్యలపై సొంత సామాజిక వర్గం నుంచే వ్యతిరేకత వస్తుందన్నారు. ఎంపీ మిథున్‌రెడ్డి, ఎమ్మెల్సీలు రమేష్‌యాదవ్‌, భరత్‌, ఎమ్మెల్యే వెంకటేగౌడ, జడ్పీ ఛైర్మన్‌ శ్రీనివాసులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని