logo

తిరుమల ఘాట్‌ రోడ్డులో ప్రమాదం.. మహిళ మృతి

తిరుమల మొదటి ఘాట్‌ రోడ్డులో ప్రమాదం జరిగింది. 16వ మలుపు వద్ద బైక్‌ అదుపు తప్పడంతో ఓ మహిళ మృతిచెందారు.

Updated : 12 Jan 2024 10:33 IST

తిరుమల: తిరుమల మొదటి ఘాట్‌ రోడ్డులో ప్రమాదం జరిగింది. 16వ మలుపు వద్ద బైక్‌ అదుపు తప్పడంతో ఓ మహిళ మృతిచెందారు. మృతురాలిని విజయవాడకు చెందిన జ్యోతి (18)గా గుర్తించారు. తన భర్త సతీశ్‌తో కలిసి ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. తిరుమల ట్రాఫిక్‌ పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని పరిశీలించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని