Peddireddy: ఎరవేసి.. సొరకే దొరికి.. బెడిసికొట్టిన మంత్రి పెద్దిరెడ్డి వ్యూహం
ఉమ్మడి జిల్లాలో తమకు అనుకూలంగా పనిచేయాలని తెదేపా ఆశావహులు, ఒక స్థాయి నేతలను ప్రలోభాలకు గురిచేయాలని ఆయన వేసిన వ్యూహం బెడిసికొట్టింది..
అసమ్మతితో వైకాపా సతమతం
ఈనాడు-తిరుపతి, న్యూస్టుడే, సూళ్లూరుపేట
సూళ్లూరుపేటలో శనివారం నిర్వహించిన సమావేశంలో మాట్లాడుతున్న మంత్రి పెద్దిరెడ్డి, పక్కన ఎమ్మెల్యే కిలివేటి
ఉమ్మడి జిల్లాలో తమకు అనుకూలంగా పనిచేయాలని తెదేపా ఆశావహులు, ఒక స్థాయి నేతలను ప్రలోభాలకు గురిచేయాలని ఆయన వేసిన వ్యూహం బెడిసికొట్టింది.. సొంత పార్టీలోని అసమ్మతులు తెదేపా బాట పట్టినా నిలుపుకోలేని దైన్యస్థితికి వచ్చారు. సీఎం చెప్పారని అసమ్మతులను బుజ్జగించాలని చూసినా వారు లక్ష్య పెట్టక.. తెలుగుదేశం పార్టీ బాట పట్టడంతో నిస్సహాయ స్థితికి చేరుకున్నారు. మంత్రి పెద్దిరెడ్డితో సమావేశం ఉందని తెలిసినా పలువురు కీలక నేతలు నెల్లూరులో జరిగిన బహిరంగ సభలో తెదేపా అధినేత చంద్రబాబునాయుడు సమక్షంలో చేరడంతో వైకాపాకు మింగుడు పడటం లేదు.
‘సూళ్లూరుపేట నియోజకవర్గంలో వైకాపా పరిస్థితి బాగాలేదు.. దాన్ని చక్కదిద్దాల్సిన అవసరముంది.. వెంటనే వెళ్లి గాడిన పెట్టాలని నాకు సీఎం జగన్ చెప్పారు.. సీఎం చెప్పిన తర్వాతే ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశా..’
ఇదీ అసమ్మతి నేతలు, కార్యకర్తలతో సూళ్లూరుపేటలో శనివారం నిర్వహించిన సమావేశంలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వ్యాఖ్యలు.
ఆయన మాటలు ఈ నియోజకవర్గంలోనే కాదు.. జిల్లావ్యాప్తంగా వైకాపా దుస్థితిని ప్రస్ఫుటం చేస్తున్నాయి.
జిల్లా పరిధిలో పలువురు నేతలు వైకాపాను వీడుతున్నారు. మంత్రి మంత్రాంగం చేసినా వారు పార్టీలో ఉండేందుకు ససేమిరా అంటున్నారు. నాయుడుపేట పురపాలిక వైస్ ఛైర్మన్ షేక్ రఫీ, వైకాపా ట్రేడ్ యూనియన్ రాష్ట్ర కార్యదర్శి వెంకటరమణారెడ్డి, రాష్ట్ర రెడ్డి కార్పొరేషన్ డైరెక్టర్ కట్టా సురేఖారెడ్డి పార్టీకి, తమ పదవులకు శుక్రవారం రాజీనామా చేశారు. వారి బాటలోనే నాయుడుపేట మండలం మర్లపల్లి గ్రామానికి చెందిన వైకాపా బీసీ సెల్ అధ్యక్షుడు దుప్పల రవీంద్రతోపాటు ఆయన భార్య మర్లపల్లి సర్పంచి మంజుల కూడా పార్టీకి రాజీనామా చేశారు. వీరందరూ తెదేపాలో చేరారు.
అనుచరుడికే టికెట్ ఇప్పించినా..
సత్యవేడు నియోజకవర్గంలో తన అనుచరుడికి టికెట్ ఇప్పించుకున్న ఆనందం మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి ఎంతో సేపు నిలవలేదు. స్థానికులకు టికెట్ ఇవ్వకుండా బయటి వ్యక్తులకు ఎలా ఇస్తారంటూ ఈ నియోజకవర్గంలోనూ పలువురు అసమ్మతి రాగం పెంచారు. కేవీబీపురం మండలానికి చెందిన నేత ఏకంగా తాను ఆత్మహత్యాయత్నం చేసుకుంటున్నట్లుగా ఒక వీడియో విడుదల చేశారు. ఆ తర్వాత ఆయన ఏమయ్యారో తెలియని పరిస్థితి.
మంత్రాంగం చేసినా..
సత్యవేడు నియోజకవర్గంలో తొలుత ప్రస్తుత ఎంపీ గురుమూర్తికి టిక్కెట్ ఇప్పించారు. ఆయన ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలానికి సమాచారం ఇవ్వకుండానే ఆత్మీయ సమావేశాలు నిర్వహించారు. అసహనానికి గురైన ఆదిమూలం.. పెద్దిరెడ్డిపై తీవ్ర వ్యాఖ్యలు చేసి పార్టీని వీడారు. ఎమ్మెల్యేపై దుమ్మెత్తిపోయాలని, వ్యతిరేకంగా ఆందోళనలు చేయాలని చెప్పినా ఎవరూ ముందుకు రాని పరిస్థితి నెలకొంది. తాజాగా సూళ్లూరుపేట పరిధిలోనూ అసమ్మతులను బుజ్జగించేందుకు మంత్రి వస్తున్నట్లు ముందుగానే అందరికీ సమాచారమిచ్చినా నేతలు పట్టించుకోలేదు. దీంతో మంత్రి మంత్రాంగం ఫలించలేదని ఆ పార్టీ నేతలు వ్యాఖ్యానిస్తున్నారు. మొత్తంగా నోటిఫికేషన్ వచ్చే సమయానికి పార్టీలో ఎంతమంది నేతలు పార్టీని వీడతారో అనే ఆందోళన వైకాపా నేతల్లో మొదలైంది.
అన్ని నియోజక వర్గాల్లోనూ అదే పరిస్థితి
- ఒక్కొక్కటిగా అసమ్మతి సెగలు అధికారపార్టీలో పలు నియోజకవర్గాల్లో వెలుగులోకి వస్తున్నాయి.
- శ్రీకాళహస్తి నియోజకవర్గంలోని శ్రీకాళహస్తి, ఏర్పేడు, తొట్టంబేడు జడ్పీటీసీలు వెంకటసుబ్బారెడ్డి, తిరుమలయ్య, అర్చనాదేవీలతోపాటు మాజీ జడ్పీటీసీ వెంకటాచలం సైతం వైకాపాకు రాజీనామా చేసి తెదేపాలో చేరారు.
- గూడూరులోనూ విఘ్నేశ్వరపురం ప్రాంతానికి చెందిన 50 కుటుంబాలు తెదేపాలో చేరాయి. మంత్రి తనకు అనుకూలమైన వ్యక్తికి అక్కడ టికెట్ ఇప్పించుకోగలిగారు. దీంతో అక్కడ అసమ్మతి నేతలు, కార్యకర్తలు ఒక్కొక్కరుగా పార్టీని వీడుతున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఏడుకొండలపై ఎటు చూసినా భక్తజనమే.. 3 కి.మీ మేర క్యూలైను
[ 17-05-2024]
వేసవి సెలవుల దృష్ట్యా తిరుమల(Tirumala)కు భక్తులు పోటెత్తారు. -
గోపాలరావు వంక.. గుటకాయ స్వాహా..!
[ 17-05-2024]
కుప్పం- పలమనేరు జాతీయ రహదారి పక్కన భూములకు విపరీతమైన డిమాండ్ ఉంది. మంచి ధరలు పలుకుతుండటంతో.. ప్రభుత్వ స్థలాలపై అక్రమార్కుల కన్ను పడింది. -
ఎవరి కళ్లకు కడతారు గంతలు?
[ 17-05-2024]
ఎక్కడైనా ప్రకృతి వనరులను అక్రమార్కులు దోచేస్తుంటే బాధ్యతాయుతమైన ప్రభుత్వం రంగంలోకి దిగి తవ్వకాలు, రవాణాను నిలిపేస్తుంది. -
శివయ్యా.. ఇదేం ఘోరమయ్యా
[ 17-05-2024]
శివయ్య సేవలో తరించడానికి వెళ్లిన ఒకే కుటుంబంలోని ముగ్గురు ఆడపిల్లలను మృత్యువు రూపంలో చెరువు మింగేసింది. -
సర్వదర్శనానికి 18 గంటలు
[ 17-05-2024]
శ్రీవారి సర్వదర్శనానికి ఎటువంటి దర్శన టికెట్లు లేకుండా తిరుమలకు వచ్చిన భక్తులు గురువారం సాయంత్రానికి వైకుంఠం క్యూకాంప్లెక్స్, నారాయణగిరి షెడ్లు నిండిపోయి ఏటీజీహెచ్ వరకు క్యూలైన్లో వేచి ఉన్నారు. -
ప్రవేశాల ప్రకటన ఆలస్యమేనా..?
[ 17-05-2024]
పది తర్వాత వ్యవసాయ పాలిటెక్నిక్లో భాగంగా మూడేళ్లు డిప్లమో చదివితే ఉపాధి అవకాశాలు అధికంగా ఉంటాయి. ఆ కోర్సుల్లో చేరేందుకు అవసరమైన ప్రవేశ ప్రకటన ఈ ఏడాది ఆలస్యం కానుంది. -
క్షేత్రస్థాయికి వెళ్తే.. కార్యాలయానికి తాళమే
[ 17-05-2024]
సచివాలయ వ్యవస్థతో గొప్ప మార్పు తెచ్చామని.. ప్రజల ముగింటకే అధికారులను తెచ్చామని వైకాపా ప్రభుత్వం గొప్పలు చెబుతోంది. -
జీతాలు చెల్లించండి.. మహాప్రభో
[ 17-05-2024]
తమకు న్యాయంగా అందాల్సిన జీతభత్యాలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ విజయా డెయిరీ కార్మికులు చేపట్టిన నిరసన దీక్ష ఎనిమిది నెలలుగా కొనసాగుతోంది. -
విచారణకు పిలిచి చితకబాదిన ఎస్సై?
[ 17-05-2024]
సోదరుల ఘర్షణ కేసులో విచారణకు పిలిచిన ఎస్సై కులం పేరుతో దూషించి.. లాఠీతో చితకబాదారని రామకుప్పం మండలం వీర్ణమల తండాకు చెందిన వెంకటేశ్నాయక్ ఆరోపించారు. -
సూత్రదారితెన్నూ లేని దర్యాప్తు
[ 17-05-2024]
తిరుపతిలోని శ్రీపద్మావతి మహిళ విశ్వవిద్యాలయంలో చంద్రగిరి తెదేపా అభ్యర్థి పులివర్తి నానిపై హత్యాయత్నం ఘటనలో పోలీసులు ఇంకా వైకాపా నేతలకు వంత పాడుతూనే ఉన్నారు. -
బండ వేషం.. జాతర విశేషం
[ 17-05-2024]
గంగజాతరలో బండ వేషధారణలు అలరించాయి. తిరుపతి ప్రజల ఇలవేల్పుగా.. పిలిస్తే పలికే దైవంగా విరాజిల్లుతున్న తాతయ్యగుంట గంగమ్మ జాతర రెండోరోజు గురువారం సందడిగా సాగింది. -
వేసవి శిబిరాలు లేనట్టే..!
[ 17-05-2024]
వేసవి సెలవులంటే పాఠశాల విద్యార్థులకు, చిన్నారులకు పండగనే చెప్పాలి. స్నేహితులతో కలిసి ఆటలాడుకుంటూ వినోదం.. ఉల్లాసం.. ఉత్సాహాన్ని పొందుతుంటారు. -
అటకెక్కిన భూసార పరీక్షలు
[ 17-05-2024]
భూసార పరీక్షలు అటకెక్కాయి. సాగులో మట్టి నమూనాలు కీలకం కాగా ప్రభుత్వం వీటిని గాలికి వదిలేసింది. ఎక్కడో ఓ చోట తీసి అయ్యిందనిపిస్తున్నారు. -
చెవికెక్కించుకుంటే ఇంతే..!
[ 17-05-2024]
వైకాపా నేతలతో భుజాలు రాసుకుని వారి చెప్పినట్లు వంతపాడిన అధికారులపై సీఈసీ సస్పెన్షన్ వేటు వేసింది. ఎన్నికల సమయంలోనూ ఆ తర్వాత చంద్రగిరి, తిరుపతి నియోజకవర్గాల్లో శాంతిభద్రతల పరిరక్షణలో పూర్తిగా విఫలమైనట్లు అధికారులు నిర్ధారించారు. -
వీరూ ఆ ఫ్యానుముక్కలే
[ 17-05-2024]
సార్వత్రిక ఎన్నికల అనంతరం చోటు చేసుకున్న హింసాత్మక ఘటనలపై కేంద్ర ఎన్నికల సంఘం సీరియస్ అయ్యింది. అందుకు బాధ్యులైన జిల్లా పోలీసు బాస్ కృష్ణకాంత్ పటేల్పై బదిలీ వేటు వేసింది. -
ముఖ్యమంత్రి జగన్ను అరెస్టు చేయాలి
[ 17-05-2024]
ముఖ్యమంత్రి జగన్ మోహన్రెడ్డి తన ఐదేళ్ల పాలనలో లెక్కకు మిక్కిలి అక్రమాలకు పాల్పడ్డారని, ఆయన్ను వెంటనే అరెస్టు చేయాలని సీపీఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ డిమాండ్ చేశారు. -
మహిళా వర్సిటీకి మాయని మచ్చ
[ 17-05-2024]
శ్రీపద్మావతి మహిళా వర్సిటీ అవరణలో మంగళవారం చోటుచేసుకున్న ఘటన మాయని మచ్చగా మారింది. -
ఆరోగ్య కేంద్రాల సేవలు అరకొరే
[ 17-05-2024]
జిల్లాలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో 24 గంటలూ వైద్య సేవలు గగనంగా మారాయి. కాన్పులు సైతం జరగడం లేదు. పలుచోట్ల వైద్యులు, సిబ్బంది విధులకు డుమ్మా కొట్టి తిరుగుతున్నా.. పట్టించుకునే వారేలేరు. -
ఓటమి భయంతోనే వైకాపా దాడులు
[ 17-05-2024]
వైకాపా ప్రభుత్వం ఓటమి భయంతోనే దాడులకు దిగుతోందని ఎంపీ రఘురామ కృష్ణరాజు విమర్శించారు. ఇటీవల వైకాపా మూకల దాడిలో గాయపడిన తిరుపతి జిల్లా చంద్రగిరి తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి పులివర్తి నానిని తనపల్లిలోని ఆయన నివాసానికి వెళ్లి గురువారం పరామర్శించారు. -
శ్రీవారి సేవలో ప్రముఖులు
[ 17-05-2024]
శ్రీవారిని పలువురు ప్రముఖులు గురువారం దర్శించుకున్నారు. ఉదయం వీఐపీ బ్రేక్ సమయంలో శ్రీవారి మూలమూర్తిని భాజపా నాయకులు... -
తెదేపా ఏజెంట్ల కిడ్నాప్ వ్యవహారంలో పురోగతి
[ 17-05-2024]
మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సొంత మండలంలో వైకాపా నాయకులపై పోలీసులు ఎట్టకేలకు కేసు నమోదు చేశారు. -
ప్రత్యేక తరగతులు ఎక్కడ?
[ 17-05-2024]
పదో తరగతి విద్యార్థులకు ఈ నెల 24 నుంచి సప్లిమెంటరరీ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. రెండు నెలల క్రితం జరిగిన పరీక్షల్లో 2,006 మంది ఫెయిల్ అయ్యారు. -
ఓట్ల లెక్కింపు కేంద్రాల వద్ద ఏర్పాట్లు
[ 17-05-2024]
సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపు నేపథ్యంలో పటిష్ఠ ఏర్పాట్లు చేయాలని జేసీ శ్రీనివాసులు ఆదేశించారు. చిత్తూరు ఎస్వీ సెట్ కళాశాలలో ఓట్ల లెక్కింపు కేంద్రాల వద్ద ఏర్పాట్లను ఆయన గురువారం పరిశీలించారు. -
వేరుసెనగ విత్తన ధర ఖరారు
[ 17-05-2024]
త్వరలో మొదలుకానున్న ఖరీఫ్ సీజన్కు వేరుసెనగ విత్తన కాయల ధరలు ఖరారయ్యాయి. ఈ మేరకు రాష్ట్ర వ్యవసాయ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. -
బీసీజీ టీకా వేయించుకోండి
[ 17-05-2024]
జిల్లాలోని వృద్ధులు, 18 ఏళ్లు నిండిన మధుమేహ, క్షయ వ్యాధిగ్రస్థులు, వారి కుటుంబ సభ్యులందరూ అడల్ట్ బీసీజీ టీకాను వేయించుకుని ఆరోగ్యంగా ఉండాలని డీఎంహెచ్వో ప్రభావతీదేవి కోరారు.
తాజా వార్తలు (Latest News)
-
విమానయానం.. మూడు నెలల్లో 9.7 కోట్ల మంది!
-
ముగ్గురు బందీల మృతదేహాలు లభ్యం.. మృతుల్లో ఆ యువతి కూడా!
-
‘బుజ్జి’ని పరిచయం చేయనున్న ప్రభాస్.. లేటెస్ట్ అప్డేట్ ఇదే
-
నా కుమారున్ని మీకు అప్పగిస్తున్నాను: సోనియాగాంధీ
-
48 గంటల్లో పోలింగ్ శాతాలపై.. ఈసీ స్పందన కోరిన సుప్రీంకోర్టు
-
‘త్రినయని’ సీరియల్ నటుడు చందు ఆత్మహత్య