జగన్మోసం.. ప్రశ్నించలేని వారిపై ప్రతాపం
అభాగ్యులు, అవ్వాతాతలకు జరుగుతోన్న జగన్మోసం అంతాఇంతా కాదు.. ఓట్ల రాజకీయం కోసం ముఖ్యమంత్రి జగన్రెడ్డి వృద్ధులు, దివ్యాంగులతో చెలగాటమాడుతున్నారు.. ఒకటో తేదీన ఇంటి వద్ద ఇచ్చే పింఛను రెండు నెలలుగా సచివాలయాలు, బ్యాంకులంటూ మండే ఎండల్లో అమాయకులను ముప్పతిప్పలు పెడుతున్నారు.
సాంకేతిక లోపంతో పలువురి ఖాతాల్లోనే సొమ్ము
పండుటాకులపై విభిన్న కోణాల్లో కక్ష సాధింపు
పంతం వీడని వైకాపా సర్కార్
శాంతిపురంలో బ్యాంకు వద్ద లబ్ధిదారుల అవస్థలు
చిత్తూరు(జిల్లా పంచాయతీ), న్యూస్టుడే: అభాగ్యులు, అవ్వాతాతలకు జరుగుతోన్న జగన్మోసం అంతాఇంతా కాదు.. ఓట్ల రాజకీయం కోసం ముఖ్యమంత్రి జగన్రెడ్డి వృద్ధులు, దివ్యాంగులతో చెలగాటమాడుతున్నారు.. ఒకటో తేదీన ఇంటి వద్ద ఇచ్చే పింఛను రెండు నెలలుగా సచివాలయాలు, బ్యాంకులంటూ మండే ఎండల్లో అమాయకులను ముప్పతిప్పలు పెడుతున్నారు.. స్థానికంగా పింఛను ఇచ్చేందుకు సరిపడా సిబ్బంది ఉన్నా జగన్నాటకాలాడుతున్నారు. కొందరికి ఇంటి వద్ద అని, మరి కొందరికి బ్యాంకు ఖాతాల్లో అని తికమక పెడుతూ ఇబ్బంది పెడుతున్నారు.. ప్రశ్నిస్తే పింఛను పోతుందన్న భయంతో ఎవరూ నోరుమెదపకుండా అష్టకష్టాలు పడి బ్యాంకులకెళ్లి తెచ్చుకుంటున్నారు.. రానుపోను దారి ఖర్చులు, ఆటోలు, వాహనాల ఛార్జీలకు వచ్చే పింఛనులో కొంత మొత్తాన్ని ఖర్చు చేస్తున్నారు. ఖాతాల్లో పింఛను జమ చేసినా, ఏళ్ల తరబడి లావాదేవీలు లేని కారణంగా పలువురి ఖాతాలు ఇన్యాక్టివ్ కావడంతో అందులో సొమ్ము డ్రా చేయలేక పోతున్నారు. దీంతో చేసిది లేక కొత్తగా అర్జీ రాసిచ్చి, అదనంగా రూ.100 చెల్లిస్తే నాలుగు రోజుల అనంతరం బ్యాంకు సిబ్బం ది రమ్మంటున్నారు. ఇలా అడుగడుగునా పండుటాకులపై జగన్ సర్కార్ విభిన్న కోణాల్లో కక్ష సాధిస్తుండటం గమనార్హం.
పంపిణీ పూర్తి అని వెబ్సైట్లో..
జిల్లా వ్యాప్తంగా 1,89,497 మందికి రూ.56.84 కోట్లు బ్యాంకు ఖాతాల్లో పింఛను జమ చేసి వంద శాతం పూర్తి చేసినట్లు అధికారిక వెబ్సైట్లో చూపించారు. అయితే మూడు వేల మందికి పైగా సాంకేతిక లోపంతో బ్యాంకు ఖాతాల్లో నగదు జమ కాలేదు. ఇటు ఇంటి వద్దా ఇవ్వలేదు. వృద్ధులు, దివ్యాంగులు, వితంతువులు, ఒంటరి మహిళలు మూడ్రోజులుగా బ్యాంకుల చుట్టూ తిరిగినా పింఛను అందకపోగా, అసలు విషయం ఆలస్యంగా తెలుసుకున్నా రు. మళ్లీ సచివాలయాలకు వెళ్లి తమ గోడు వెళ్లబోసుకున్నారు. దీంతో అప్పటికప్పుడు విషయాన్ని ఉన్నతాధికారులకు తెలియజేసి ఖాతాల్లో జమకాని వారికి పింఛను సొమ్మును సచివాలయ సిబ్బంది ఖాతాల నుంచి డ్రా చేసి స్థానికంగా పంపిణీ చేశారు.
ఖాతాకు చేరినా చేతికందలేదు..
జిల్లాలో 2,739 ఇన్యాక్టివ్ బ్యాంకు ఖాతాల్లో పింఛను జమైనట్లు గుర్తించారు. ఆఖాతాల్లో పింఛను సొమ్ము నిల్వ చూపుతున్నా, డ్రా చేసుకునేందుకు వీలు కాలేదు. రెండు, మూడ్రోజుల తర్వాత ఖాతాదారుల వినతులు స్వీకరించి బ్యాంకు సిబ్బంది మరో మూడు నాలుగు రోజుల తరవాత రావాలని చెప్పడంతో వారు నిరాశగా వెనుదిరిగారు.
- పలమనేరులోని ఇండియన్ బ్యాంకులో పలువురికి పింఛను జమ అయింది. అయితే 30 మంది ఖాతా లు ఇన్యాక్టివ్లో ఉండటంతో రెండ్రోజులుగా వారు బ్యాంకుల చుట్టూ తిరిగినా నగదు డ్రా చేసుకునే అవకాశం లేకుండా పోయింది. దీంతో బ్యాంకు సిబ్బంది సూచనలతో తమ ఖాతాలను యాక్టివ్ చేయాలని అర్జీలు రాసిచ్చి, రూ.100 చెల్లించారు. అయినా వారికి బుధవారం రమ్మని చెప్పారు. బ్యాంకులకు రావడానికి ఆటో ఖర్చులు, అర్జీలు రాసుకునేందుకు వారు చేతి నుంచి నగదు చెల్లించు కోవాల్సి వచ్చినట్లు బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు.
- పెనుమూరు మండలంలో 54 మంది పింఛనుదారులకు బ్యాంకు ఖాతాల్లో నగదు జమ అయినట్లు సచివాలయ సిబ్బంది చెప్పారు. బ్యాంకుకెళ్లి చూస్తే ఖాతాలు ఖాళీ. సాంకేతిక కారణాలతో పింఛను సొమ్ము జమ కాలేదని తెలుసుకుని అధికారులకు ఫిర్యాదు చేస్తే, ఉన్న పళంగా అలాంటి వారి వివరాలను సేకరించి శనివారం స్థానికంగా వారికి పింఛను పంపిణీ చేశారు.
- శాంతిపురం మండలం, కొత్తూరు గ్రామానికి చెందిన వృద్ధుడు గంట్లప్పకు రెండేళ్ల క్రితం రోడ్డు ప్రమాదంలో కాళ్లు దెబ్బతిన్నాయి. వాకర్ సాయం లేనిదే ఆయన లేవలేడు. అలాంటి ఆయనకు ఇంటి వద్దే పింఛను ఇవ్వాల్సి ఉన్నా బ్యాంకు ఖాతాలో జమ చేశారు. శనివారం ఆటోలో కుటుంబ సభ్యుల సాయంతో 6 కిలోమీటర్లు ప్రయాణం చేసి శాంతిపురంలోని ఇండియన్ బ్యాంకుకెళ్లి నిరీక్షించి పింఛను డ్రా చేసుకున్నాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
దిగుబడులు పెరిగి.. ధరలు పతనమై
[ 18-05-2024]
వాతావరణం అనుకూలించడంతో ఈ సంవత్సరం టమాటా దిగుబడులు గణనీయంగా పెరిగాయి. ఇలాంటి పరిస్థితే దక్షిణాది రాష్ట్రాల్లోనూ కనిపిస్తోంది. ఫలితంగా టమాటా దిగుబడులు మార్కెట్లకు తరలివస్తున్నాయి. -
వైద్యులు ఉండరు.. సేవలు అందవు
[ 18-05-2024]
జిల్లాలోని 50 పీహెచ్Âసీల తోపాటు నాలుగు సీహెచ్సీల్లో 24 గంటల వైద్య సేవలను అందించాల్సి ఉండగా.. చాలాచోట్ల పగటి వేళల్లో మాత్రమే వైద్యులు అందుబాటులో ఉంటారని.. రాత్రుల్లో వారి సేవలు నామమాత్రమే అని ఆరోపణలు చోటు చేసుకొంటున్నాయి. -
మనోళ్లే ఇచ్చేయండి..!
[ 18-05-2024]
పెండింగ్ బిల్లులు చెల్లించేందుకు వడివడిగా అడుగులు పడుతున్నాయి.. ఎన్నికల నియమావళి అమల్లోకి రాకముందు ఉపాధి హామీ పథకం కింద చేపట్టిన వివిధ పనుల్లో కొన్నింటికి బిల్లులు మంజూరయ్యాయి.. -
నేడు సైన్స్ సెంటర్ ప్రవేశం ఉచితం
[ 18-05-2024]
అంతర్జాతీయ మ్యూజియం దినోత్సవం సందర్భంగా తిరుపతి ప్రాంతీయ విజ్ఞాన కేంద్రంలోకి సందర్శకులకు ఉచిత ప్రవేశం కల్పిస్తున్నామని సైన్స్ సెంటర్ ప్రాజెక్టు కోఆర్డినేటర్ శ్రీనివాస నెహ్రూ శుక్రవారం ప్రకటనలో తెలిపారు. -
భూసారం.. లక్ష్యం నిస్సారం
[ 18-05-2024]
భూమిలో సూక్ష్మ పోషకాల లోపాన్ని తెలుసుకుని.. తదనుగుణంగా చర్యలు చేపడితే అన్నదాతలు అధిక దిగుబడులు సాధించి అప్పుల ఊబి నుంచి బయట పడతారన్నది ఉద్దేశం.. అందుకు భూసార పరీక్షలు తప్పనిసరి.. -
తెదేపాకు 125-150 సీట్లు
[ 18-05-2024]
రాష్ట్రంలో జరిగిన శాసన సభ ఎన్నికల్లో తెదేపాకు 125 నుంచి 150 సీట్లు వస్తాయని తెదేపా ఉండి ఎమ్మెల్యే అభ్యర్థి రఘురామకృష్ణరాజు ధీమా వ్యక్తం చేశారు. శుక్రవారం తెల్లవారుజామున శ్రీవారిని అభిషేక సేవలో ఆయన దర్శించుకున్నారు. -
శ్రీవారిని దర్శించుకున్న తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి
[ 18-05-2024]
శ్రీవారిని తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ జువ్వాది శ్రీదేవి కుటుంబసభ్యులతో కలిసి శుక్రవారం దర్శించుకున్నారు. ఉదయం వీఐపీ బ్రేక్ దర్శన సమయంలో ఆలయం వద్దకు చేరుకున్న న్యాయమూర్తికి తితిదే అధికారులు స్వాగతం పలికి శ్రీవారి మూలమూర్తి దర్శనం చేయించారు. -
శ్రీపద్మావతి పరిణయోత్సవాలు ప్రారంభం
[ 18-05-2024]
తిరుమల నారాయణగిరి ఉద్యానవనాల్లో వివిధ సువాసనలు వెదజల్లే రంగురంగుల పుష్పాలతో భూలోక వైకుంఠాన్ని తలపించేలా ఏర్పాటు చేసిన మండపంలో శుక్రవారం శ్రీపద్మావతి పరిణయోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. -
రోడ్డు ప్రమాదంలో ఇద్దరు తమిళనాడు యువకుల మృతి
[ 18-05-2024]
తిరుపతి-చెన్నై జాతీయ రహదారిలోని నగరి మండలం తడుకుపేట వద్ద గురువారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో తమిళనాడుకు చెందిన ఇలంకన్నన్(26), కన్నన్(28) మృతిచెందారు. -
శోకసంద్రంలో ఎస్బీఆర్పురం
[ 18-05-2024]
వడమాలపేట మండలం ఎస్బీఆర్పురం చెరువులో నీటి మునిగి మృతి చెందిన ముగ్గురు ఆడబిడ్డల మృతదేహాలకు పలువురు శుక్రవారం నివాళులర్పించారు. ముగ్గురు కుమార్తెలు విగతజీవులుగా పడిఉండటాన్ని చూసి ఆ తల్లిదండ్రులు విలపించిన తీరు వర్ణనాతీతం. -
అడ్డగోలు తవ్వకం.. లేదంటూ నాటకం
[ 18-05-2024]
శ్రీకాళహస్తి మండలం సుబ్బనాయుడు కండ్రిగ, పుల్లారెడ్డి కండ్రిగ, రామలింగాపురం, చుక్కలనిడిగల్లు ప్రాంతాల్లోనూ ఇదే పరిస్థితి. ఇసుక అక్రమ రవాణా జోరుగా సాగుతోంది. -
స్ట్రాంగ్రూంల వద్ద మూడంచెల భద్రత
[ 18-05-2024]
మహిళా వర్సిటీలోని ఈవీఎంలు భద్రపరిచిన స్ట్రాంగ్రూంల వద్ద మూడంచెల కట్టుదిట్టమైన భద్రత, అనుక్షణం సీసీ కెమెరాల నిఘా పర్యవేక్షణ ఉన్నట్లు కలెక్టర్ ప్రవీణ్కుమార్ తెలిపారు. -
భక్తితోటి వేషాలు
[ 18-05-2024]
తాతయ్యగుంట గంగమ్మ జాతరలో మూడో రోజు శుక్రవారం భక్తులు తోటి వేషాలతో సందడి చేశారు. గర్భాలయంలోని గంగమ్మ తల్లికి ప్రత్యేక అభిషేకం, అలంకరణ నిర్వహించారు. -
రక్తపోటు నియంత్రణతో వ్యాధులు దూరం
[ 18-05-2024]
ప్రతి ఒక్కరూ విధిగా బీపీ తనిఖీ చేసుకుంటూ రక్తపోటును నియంత్రణలో ఉంచుకోవాలని డీఎంహెచ్వో యు.శ్రీహరి, రుయా సూపరింటెండెంట్ రవిప్రభు పేర్కొన్నారు. -
విపంచి ధరించి.. విహరించి
[ 18-05-2024]
శ్రీగోవిందరాజస్వామి బ్రహ్మోత్సవాల్లో శుక్రవారం ఉదయం చిన్నశేష వాహనంపై, రాత్రి హంస వాహనంపై గోవిందరాజస్వామి భక్తులకు అభయమిచ్చారు.
తాజా వార్తలు (Latest News)
-
నిండు గర్భిణికి పురిటి నొప్పులు.. దారి లేక 6 కిలోమీటర్లు డోలీలోనే!
-
పేదింటి ఉత్తమ విద్యార్థులకు విమాన ప్రయాణం
-
విడాకుల్లో ఎవరి జోక్యం లేదు: గాయని సైంధవి
-
రద్దయిన క్రికెట్ మ్యాచ్కు టికెట్ల డబ్బు వాపసు
-
సవాల్ స్వీకరించి.. స్పందనగా ఆచరించి
-
కియా కార్లు అద్దెకూ తీసుకోవచ్చు.. హైదరాబాద్ సహా 6 నగరాల్లో