నమ్మి ఓటేస్తే.. ముంచావేం జగన్
సీఎం జగన్ పేరు వింటేనే నిరుద్యోగుల్లో మండిపాటు ధోరణి వ్యక్తమవుతోంది.. ఎందుకంటే ఏటా జాబ్ క్యాలెండర్ ఇస్తామని నాడు ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు మాట ఇచ్చారు జగన్..
ఏటా జాబ్ క్యాలెండర్ ఇస్తామని నిరుద్యోగుల్ని ఏమార్చి
అప్పు చేసి కోచింగ్కు.. వడ్డీలు కట్టలేక అవస్థలు
న్యూస్టుడే, చిత్తూరు కలెక్టరేట్, పుత్తూరు: సీఎం జగన్ పేరు వింటేనే నిరుద్యోగుల్లో మండిపాటు ధోరణి వ్యక్తమవుతోంది.. ఎందుకంటే ఏటా జాబ్ క్యాలెండర్ ఇస్తామని నాడు ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు మాట ఇచ్చారు జగన్.. ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు వస్తాయనే ఆశతో వడ్డీలకు అప్పు చేసి కోచింగ్కు వెళ్లారు నిరుద్యోగులు.. నోటిఫికేషన్లు రాకపోగా.. చేసిన అప్పులకు వడ్డీలు కొండంత పెరిగిపోయింది.. తల్లిదండ్రులకు భారం కాకుండా ఆ అప్పుల్ని తీర్చలేక చిన్నచిన్న ఉద్యోగాలు చేసుకుంటూ అవస్థలు పడుతున్నారు నిరుద్యోగులు.. నోటిఫికేషన్లు ఇవ్వకుండా ఏమారిస్తే మా కడుపు మండదా..! అంటూ ఆవేదనకు లోనవుతోంది నిరుద్యోగ లోకం.
కలెక్టరేట్ ఎదుట ధర్నాలో నిరుద్యోగులు (పాతచిత్రం)
అన్ని శాఖల్లోనూ..: పుర, నగరపాలక సంస్థలో పారిశుద్ధ్య కార్మికులు, ఇంజినీరింగ్ విభాగంలో అనేక ఖాళీలు ఉన్నాయి. పంచాయతీరాజ్ శాఖలో అటెండర్ నుంచి ఏవో హోదా వరకూ 320 ఖాళీలు ఉన్నాయి. ర.భ.శాఖలోనూ ఏఈలు, అటెండర్ల కొరత ఉంది.
ఎన్నికల స్టంట్లా డీఎస్సీ..
జిల్లాలోని జడ్పీ, ప్రభుత్వ పాఠశాలల్లో 2,700కి పైగా ఉద్యోగ ఖాళీలు ఉన్నాయి. అయితే ఎన్నికలకు ముందు హడావుడిగా జిల్లాలో 184 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ఇచ్చింది వైకాపా ప్రభుత్వం. నిరుద్యోగ అభ్యర్థులతో వందలాది రూపాయల్ని రుసుములుగా కట్టించుకుంది. పరీక్ష నిర్వహిస్తామని బీరాలు పలికింది. ఎన్నికల ప్రక్రియతో నోటిఫికేషన్ గాల్లోనే ఉండిపోయింది. ఐదేళ్లూ పట్టించుకోకుండా ఎన్నికలకు రెండు నెలల ముందు నోటిఫికేషన్ ఇవ్వడం మోసం చేయడం కాదా.. మాకు మండదా అని ప్రశ్నిస్తున్నారు డీఎస్సీ అభ్యర్థులు.
సచివాలయాల్లో ఖాళీల భర్తీ మరిచారు..
జిల్లాలో గ్రామ, వార్డు సచివాలయాలు 612 ఉన్నాయి. వీటిలో 6,624 మంది సిబ్బంది ఉండాలి. ప్రస్తుతం 4,920 మంది పనిచేస్తున్నారు. 1,704 ఉద్యోగ ఖాళీలు ఉండగా పక్క సచివాలయాలకు చెందిన సిబ్బందితో పని చేయించుకుంటున్నారు. ఈ ఖాళీలు భర్తీ చేసేందుకు ప్రకటన ఇవ్వని మీ వైఖరిని చూస్తే గుండె మండుతోందని నిరుద్యోగులు వాపోతున్నారు.
నాలుగేళ్లుగా ఎదురుచూస్తున్నా..: 2020లో డీఈడీ పూర్తిచేశా. నాలుగేళ్లుగా ఒక్క నోటిఫికేషన్ రాలేదు. నోటిఫికేషన్ ఇస్తారనే ఉద్దేశంతో రెండేళ్ల క్రితం అప్పు చేసి కోచింగ్కు వెళ్లా. దీంతో చేసేదేమీ లేక బట్టల దుకాణంలో పనిచేస్తున్నా. వచ్చిన అరకొర జీతంలో అప్పు తీర్చి, నా అవసరాలు, కుటుంబానికి వినియోగిస్తున్నా.
గిరి, నగరి
మెగా డీఎస్సీ అంటే నమ్మి మోసపోయా..: మెగా డీఎస్సీ అంటే నమ్మి గత ఎన్నికల్లో నిరుద్యోగులు ఓటు వేశారు. కానీ నాలుగేళ్లలో ఒక్క రోజూ కూడా మా గురించి పట్టించుకోలేదు. కోర్సు పూర్తిచేసిన ఒకటి, రెండేళ్లలో నోటిఫికేషన్ వస్తే అభ్యర్థులకు ఉపయోగకరం.
రవి, వడమాలపేట
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పెళ్లిచూపులకు వస్తూ రోడ్డు ప్రమాదంలో యువకుడి దుర్మరణం
[ 19-05-2024]
పూతలపట్టు-నాయుడుపేట జాతీయ రహదారి ఐతేపల్లి సమీపంలో శనివారం వేకువజామున ముందు వెళ్తున్న ట్రక్కును వెనుక నుంచి ఓ కారు వేగంగా ఢీకొంది. -
ఐదేళ్లు.. రూపాయి విదిల్చితే ఒట్టు!
[ 19-05-2024]
ఉమ్మడి చిత్తూరు జిల్లాలో శరవేగంగా జాతీయ రహదారులు, ఎక్స్ప్రెస్ వేలు నిర్మితమవుతున్నాయి. తక్కువ సమయంలో మహా నగరాలకు చేరుకుంటున్నాం. -
భూమి రాసివ్వకపోతే చంపేస్తామన్నారు.. సినీఫక్కీలో ఆలయ పూజారి కిడ్నాప్
[ 19-05-2024]
భూమి రాసివ్వకపోతే చంపేస్తామంటూ సినీ ఫక్కీలో ఓ ఆలయ పూజారిని అపహరించిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. -
రేణిగుంట సమీపంలో ప్రైవేట్ బస్సుకు మంటలు
[ 19-05-2024]
తిరుపతి జిల్లా రేణిగుంట సమీపంలో మార్నింగ్ స్టార్ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు అనుకోని ప్రమాదంలో మంటల్లో చిక్కుకుంది. -
ఎస్పీగా హర్షవర్ధన్ రాజు నియామకం
[ 19-05-2024]
జిలాలో జరిగిన హింసాత్మక ఘటనలను తీవ్రంగా తీసుకున్న ఎన్నికల సంఘం శాంతిభద్రతల పరిరక్షణకు చర్యలు చేపట్టింది. -
తీపెక్కిన మామిడి
[ 19-05-2024]
బంగారుపాళ్యం మార్కెట్యార్డులో మామిడి కాయల సీజన్ ప్రారంభమైంది. -
228 మందికి షోకాజ్ నోటీసులు
[ 19-05-2024]
ఎన్నికల విధులకు హాజరుకాని వారిపై క్రమశిక్షణ చర్యల్లో భాగంగా కలెక్టర్ షన్మోహన్.. 228 మంది ఉద్యోగులకు శనివారం షోకాజ్ నోటీసులు జారీచేశారు. -
నీరు కావాలంటే.. కొనాల్సిందే
[ 19-05-2024]
మనిషి జీవన ప్రయాణంలో నీటి కోసం ప్రత్యేక బడ్జెట్ కేటాయించుకోవాల్సి వస్తోంది. -
తాగునీటి సమస్య పరిష్కారానికి ప్రాధాన్యం ఇవ్వండి
[ 19-05-2024]
జిల్లాలో తాగునీటి సమస్య తలెత్తితే పరిష్కారానికి అధికారులు ప్రాధాన్యత ఇవ్వాలని జడ్పీ ఛైర్మన్ శ్రీనివాసులు కోరారు. -
వైకాపా నేతల మెడకు బిగుసుకోనున్న ఉచ్చు!
[ 19-05-2024]
పోలింగ్ రోజు, తర్వాత జరిగిన ఘటనలకు వైకాపా నేతలే ప్రధాన కారణమని జిల్లా అధికారులు స్పష్టం చేస్తున్నారు. -
పొంగిపొర్లుతున్న మురుగు
[ 19-05-2024]
తిరుమలలో కొద్దిపాటి వర్షానికే మురుగు పొంగిపొర్లుతోంది. -
తెలంగాణ ఫలితాల్లో వెంగమాంబాపురం విద్యార్థి ప్రతిభ
[ 19-05-2024]
తెలంగాణ ఈఏపీసెట్ ఫలితాల్లో ఏడో ర్యాంకు సాధించి అందరి ప్రశంసలు అందుకున్నాడు తిరుపతి జిల్లా బాలాయపల్లి మండలం వెంగమాంబాపురానికి చెందిన వడ్లపూడి ముకేష్ చౌదరి. -
కారుపై మాత్రమే దాడి చేశారు: భానుకుమార్రెడ్డి భార్య రాణి
[ 19-05-2024]
శ్రీపద్మావతి మహిళా విశ్వవిద్యాలయంలో చంద్రగిరి తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి పులివర్తి నాని వాహనంపై మాత్రమే దాడి జరిగిందని రామచంద్రాపురం మండల జడ్పీటీసీ సభ్యురాలు దిల్లీరాణి పేర్కొన్నారు. -
నగరవాసులే ముందంజ
[ 19-05-2024]
చిత్తూరు నియోజకవర్గంలో మునుపెన్నడూ చూడని విధంగా ఈసారి ఎన్నికలు జరిగాయి. -
అశ్వవాహనంపై శ్రీసదాశివేశ్వరుడి విహారం
[ 19-05-2024]
పట్టణంలోని శ్రీ కామాక్షీ సమేత శ్రీసదాశివేశ్వర ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా శనివారం రాత్రి స్వామి వారు శ్రీకామాక్షీ దేవి సమేతుడైన శ్రీసదాశివేశ్వరుడు అశ్వవాహనంపై ఊరేగుతూ భక్తులను కనువిందు చేశారు. -
‘ఈ ఎన్నికల్లో గెలిచేది తెదేపా కూటమే’
[ 19-05-2024]
రాష్ట్రంలో ఈ నెల 13న జరిగిన పోలింగ్లో ప్రజలు స్వచ్ఛందంగా వచ్చి ఓట్లు వేశారని, గెలిచేది తెదేపా కూటమేనని ఐ తెదేపా రాష్ట్ర కార్యదర్శి గాలి గోపీనాథ్ పేర్కొన్నారు. -
జడ్పీలో నిధుల దుర్వినియోగంపై మొదలైన విచారణ
[ 19-05-2024]
జడ్పీలో గతంలో బీఆర్జీఎఫ్, ఆర్థిక సంఘం నిధుల్లో పెద్దఎత్తున నిధుల దుర్వినియోగంపై వచ్చిన ఆరోపణల నేపథ్యంలో గతేడాది లోకాయుక్తకు పలువురు పూర్వ ఉద్యోగులు ఫిర్యాదు చేశారు. -
సీఎం జగన్ కలలు కంటున్నారు
[ 19-05-2024]
సీఎం జగన్ అధికారంలోకి వస్తామని కలలు కంటున్నారని, ఆయన కల నెరవేరే పరిస్థితి లేదని తెదేపా రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి పోతుగుంట విజయబాబు పేర్కొన్నారు.