ఏది కుట్ర.. ఎవరిది అరాచకం
ఆధ్యాత్మిక నగరం తిరుపతిపై ఎన్టీఆర్ మొదలు ఎందరో నేతలు తమదైన అభివృద్ధి ముద్ర వేశారు.
తిరుపతిలో అధికారపార్టీ కలవరపాటు
దొంగే దొంగ అన్నట్లు విమర్శలు
న్యూస్టుడే, తిరుపతి (నగరపాలిక): ఆధ్యాత్మిక నగరం తిరుపతిపై ఎన్టీఆర్ మొదలు ఎందరో నేతలు తమదైన అభివృద్ధి ముద్ర వేశారు. అయితే ఈ ఐదేళ్లలో అధికార పార్టీ అరాచకాలకు చిరునామాగా మార్చివేశారన్నది బహిరంగ రహస్యం. అయితే అదే అధికార పార్టీ నేతలు రౌడీలు, కుట్రలు, కుతంత్రాలు, మోసాలు అనే పదాలు వల్లెవేయడంపై ఇప్పుడు పెద్దఎత్తున చర్చ జరుగుతోంది. ఆడింది ఆట.. పాడింది పాట అన్నట్లు కుట్రల మీద కుట్రలు, దౌర్జన్యాలు, అరాచకాలు సృష్టించి నగరాన్ని గుప్పిట పట్టిన తండ్రీకుమారులు ప్రస్తుతం ఎదుటివారిని చూసి దొంగే దొంగ అన్నట్లు ఉంది.. ప్రత్యర్థులే తమపై కుట్రలు చేస్తున్నారని, రౌడీయిజం చేస్తున్నారని, ఇతర ప్రాంతాల వారంటూ ఆందోళన వ్యక్తం చేయడం చూసి నగరవాసులు నోరెళ్లబెట్టాల్సి వస్తోంది.
కుట్రల్లో మచ్చుకు కొన్ని
తిరుపతి పార్లమెంట్ ఉపఎన్నిక తిరుపతి చరిత్రలో ఓతరం మరిచిపోలేని అసాధారణ ఎన్నికలు. అధికారులను, ఉద్యోగులను ఏమార్చి దొంగ ఓటరు కార్డులు సృష్టించి ఉమ్మడి జిల్లా నలుమూలల నుంచి బస్సుల్లో వేలాదిమంది బోగస్ ఓటర్లను వందలాది బస్సుల్లో తరలించి ఓట్లు వేయించిన వ్యవహారం జాతీయస్థాయిలో తిరుపతి పరువుతీసింది. చివరకు వారిచేతిలో పావులుగా మారిన 22 మంది ఉన్నతస్థాయి అధికారులు, ప్రభుత్వ ఉద్యోగులు బలైన విషయం విదితమే. తిరుపతి కేంద్రంగా జరిగిన ఇది కుట్ర కాదా? తిరుపతి నగరపాలక సంస్థ హోదా పొందిన తరువాత తొలిసారి ఎన్నికలు జరిగిన తీరు తిరుపతి ఓటర్లందరికీ ఎరుకే. అధికారపార్టీయేతరులను అపహరించడం, వారి నామినేషన్లు చించివేయడం, బెదిరింపులకు పాల్పడి ఏకగ్రీవం చేసుకోవడం వంటి అరాచకాలు తెలియని నగరవాసులున్నారా? ప్రస్తుత వైకాపా అభ్యర్థి భూమన అభినయ్రెడ్డి పోటీచేసిన డివిజన్లో నామినేషన్లు దాఖలు చేసేందుకు వచ్చిన తెదేపా, ఇతర పార్టీల అభ్యర్థులను కనీసం నామినేషన్ల స్వీకరణ కేంద్రం మెట్లు తొక్కకుండా ప్రహరీ ముందు నుంచే పంపివేయడం వంటి కుట్రలను చూసి రాజకీయ ఉద్ధండులు సైతం అప్పట్లో విస్తుపోవాల్సి వచ్చింది.
ఎమ్మెల్సీ, టౌన్ బ్యాంకు ఎన్నికలు పరాకాష్ఠ
గత ఏడాది జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికలు అరాచకానికి పరాకాష్ఠ. పట్టభద్రులు, ఉపాధ్యాయుల ఎన్నికలను ఇంత దౌర్జన్యంగా చేయవచ్చా.. అని ఆయావర్గాలు విస్తుపోవాల్సి వచ్చింది. ఓనామాలు రానివారు కూడా పట్టభద్రులుగా పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరడం, ఆటో డ్రైవర్లు ఉపాధ్యాయులుగా నమోదు కావడం, ఒక్కో కార్పొరేటర్కు దొంగ ఓట్ల లక్ష్యం ఇచ్చి నమోదు చేయించిన వైనంపై అప్పట్లో పెద్దఎత్తున ట్రోల్ అయ్యింది. నకిలీ ఉపాధ్యాయులను, పట్టభద్రులను గుర్తించి ఓటు వేయనీయకుండా అభ్యంతరం చెప్పిన ఎన్నికల అధికారులపై దౌర్జన్యం చేయడం వంటి ఘటనలు సరేసరి.
తిరుపతి టౌన్ బ్యాంకు ఎన్నికల్లో సిరా చుక్కల అవసరమే లేకుండా వాటాదారులైన ఓటర్లకే తెలియకుండా ఎన్నికలను దిగ్విజయంగా పూర్తిచేసిన వైనం విదితమే. పోలీసులు, అధికారులు సాక్షిగా సాగిన తిరుపతి టౌన్ బ్యాంకు ఎన్నికల దందాలో కుట్రకోణం లేదా.. అనే ప్రశ్నకు సమాధానం వారే చెప్పాల్సి ఉంటుంది.
అధికార పార్టీలో ఎందుకీ ఆందోళన
స్థానికేతరుడు తిరుపతి నియోజకవర్గ కూటమి అభ్యర్థిగా ఆరణి శ్రీనివాసులును ప్రకటించడంతో గెలుపు తమదే అని తొలుత భావించిన అధికార పార్టీ నేతల్లో ఎన్నికలు సమీపిస్తున్నకొద్దీ కలవరం పెరిగింది. కూటమి తరఫున జనసేన అభ్యర్థిగా బరిలోకి దిగిన ఆయన బాలారిష్టాలు దాటి తెదేపా, భాజపా, జనసేన నేతల నుంచి సంపూర్ణ సహకారం సాధించడంతో అధికారపార్టీ అంచనాలు తారుమారయ్యాయి. అతితక్కువ సమయంలోనే జనసేన పార్టీ పుంజుకోవడంతో అధికార పార్టీలో వణుకుమొదలైంది. కుట్రలు, కుతంత్రాలు, దౌర్జన్యాలు, రౌడీలంటూ ప్రత్యర్థిని మానసికంగా దెబ్బతీసే కుట్రగా కూటమి గుర్తించింది. అందుకు అనుగుణంగా ఎదురుదాడి చేస్తూ విమర్శల్ని తిప్పికొడుతుండటంతో రోజుకో ఎత్తుగడను తెరమీదికి తెస్తుండగా.. కూటమి తరఫున ఎత్తుకు పైఎత్తులు వేస్తూ దీటుగా నిలబడుతుండటంతో అధికారపార్టీలో ఆందోళన మొదలైందని, అందుకే నోటికి పనిచెబుతున్నారని విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పెళ్లిచూపులకు వస్తూ రోడ్డు ప్రమాదంలో యువకుడి దుర్మరణం
[ 19-05-2024]
పూతలపట్టు-నాయుడుపేట జాతీయ రహదారి ఐతేపల్లి సమీపంలో శనివారం వేకువజామున ముందు వెళ్తున్న ట్రక్కును వెనుక నుంచి ఓ కారు వేగంగా ఢీకొంది. -
ఐదేళ్లు.. రూపాయి విదిల్చితే ఒట్టు!
[ 19-05-2024]
ఉమ్మడి చిత్తూరు జిల్లాలో శరవేగంగా జాతీయ రహదారులు, ఎక్స్ప్రెస్ వేలు నిర్మితమవుతున్నాయి. తక్కువ సమయంలో మహా నగరాలకు చేరుకుంటున్నాం. -
భూమి రాసివ్వకపోతే చంపేస్తామన్నారు.. సినీఫక్కీలో ఆలయ పూజారి కిడ్నాప్
[ 19-05-2024]
భూమి రాసివ్వకపోతే చంపేస్తామంటూ సినీ ఫక్కీలో ఓ ఆలయ పూజారిని అపహరించిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. -
రేణిగుంట సమీపంలో ప్రైవేట్ బస్సుకు మంటలు
[ 19-05-2024]
తిరుపతి జిల్లా రేణిగుంట సమీపంలో మార్నింగ్ స్టార్ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు అనుకోని ప్రమాదంలో మంటల్లో చిక్కుకుంది. -
ఎస్పీగా హర్షవర్ధన్ రాజు నియామకం
[ 19-05-2024]
జిలాలో జరిగిన హింసాత్మక ఘటనలను తీవ్రంగా తీసుకున్న ఎన్నికల సంఘం శాంతిభద్రతల పరిరక్షణకు చర్యలు చేపట్టింది. -
తీపెక్కిన మామిడి
[ 19-05-2024]
బంగారుపాళ్యం మార్కెట్యార్డులో మామిడి కాయల సీజన్ ప్రారంభమైంది. -
228 మందికి షోకాజ్ నోటీసులు
[ 19-05-2024]
ఎన్నికల విధులకు హాజరుకాని వారిపై క్రమశిక్షణ చర్యల్లో భాగంగా కలెక్టర్ షన్మోహన్.. 228 మంది ఉద్యోగులకు శనివారం షోకాజ్ నోటీసులు జారీచేశారు. -
నీరు కావాలంటే.. కొనాల్సిందే
[ 19-05-2024]
మనిషి జీవన ప్రయాణంలో నీటి కోసం ప్రత్యేక బడ్జెట్ కేటాయించుకోవాల్సి వస్తోంది. -
తాగునీటి సమస్య పరిష్కారానికి ప్రాధాన్యం ఇవ్వండి
[ 19-05-2024]
జిల్లాలో తాగునీటి సమస్య తలెత్తితే పరిష్కారానికి అధికారులు ప్రాధాన్యత ఇవ్వాలని జడ్పీ ఛైర్మన్ శ్రీనివాసులు కోరారు. -
వైకాపా నేతల మెడకు బిగుసుకోనున్న ఉచ్చు!
[ 19-05-2024]
పోలింగ్ రోజు, తర్వాత జరిగిన ఘటనలకు వైకాపా నేతలే ప్రధాన కారణమని జిల్లా అధికారులు స్పష్టం చేస్తున్నారు. -
పొంగిపొర్లుతున్న మురుగు
[ 19-05-2024]
తిరుమలలో కొద్దిపాటి వర్షానికే మురుగు పొంగిపొర్లుతోంది. -
తెలంగాణ ఫలితాల్లో వెంగమాంబాపురం విద్యార్థి ప్రతిభ
[ 19-05-2024]
తెలంగాణ ఈఏపీసెట్ ఫలితాల్లో ఏడో ర్యాంకు సాధించి అందరి ప్రశంసలు అందుకున్నాడు తిరుపతి జిల్లా బాలాయపల్లి మండలం వెంగమాంబాపురానికి చెందిన వడ్లపూడి ముకేష్ చౌదరి. -
కారుపై మాత్రమే దాడి చేశారు: భానుకుమార్రెడ్డి భార్య రాణి
[ 19-05-2024]
శ్రీపద్మావతి మహిళా విశ్వవిద్యాలయంలో చంద్రగిరి తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి పులివర్తి నాని వాహనంపై మాత్రమే దాడి జరిగిందని రామచంద్రాపురం మండల జడ్పీటీసీ సభ్యురాలు దిల్లీరాణి పేర్కొన్నారు. -
నగరవాసులే ముందంజ
[ 19-05-2024]
చిత్తూరు నియోజకవర్గంలో మునుపెన్నడూ చూడని విధంగా ఈసారి ఎన్నికలు జరిగాయి. -
అశ్వవాహనంపై శ్రీసదాశివేశ్వరుడి విహారం
[ 19-05-2024]
పట్టణంలోని శ్రీ కామాక్షీ సమేత శ్రీసదాశివేశ్వర ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా శనివారం రాత్రి స్వామి వారు శ్రీకామాక్షీ దేవి సమేతుడైన శ్రీసదాశివేశ్వరుడు అశ్వవాహనంపై ఊరేగుతూ భక్తులను కనువిందు చేశారు. -
‘ఈ ఎన్నికల్లో గెలిచేది తెదేపా కూటమే’
[ 19-05-2024]
రాష్ట్రంలో ఈ నెల 13న జరిగిన పోలింగ్లో ప్రజలు స్వచ్ఛందంగా వచ్చి ఓట్లు వేశారని, గెలిచేది తెదేపా కూటమేనని ఐ తెదేపా రాష్ట్ర కార్యదర్శి గాలి గోపీనాథ్ పేర్కొన్నారు. -
జడ్పీలో నిధుల దుర్వినియోగంపై మొదలైన విచారణ
[ 19-05-2024]
జడ్పీలో గతంలో బీఆర్జీఎఫ్, ఆర్థిక సంఘం నిధుల్లో పెద్దఎత్తున నిధుల దుర్వినియోగంపై వచ్చిన ఆరోపణల నేపథ్యంలో గతేడాది లోకాయుక్తకు పలువురు పూర్వ ఉద్యోగులు ఫిర్యాదు చేశారు. -
సీఎం జగన్ కలలు కంటున్నారు
[ 19-05-2024]
సీఎం జగన్ అధికారంలోకి వస్తామని కలలు కంటున్నారని, ఆయన కల నెరవేరే పరిస్థితి లేదని తెదేపా రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి పోతుగుంట విజయబాబు పేర్కొన్నారు.
తాజా వార్తలు (Latest News)
-
ధోనీని ఔట్ చేయడమే టర్నింగ్ పాయింట్.. యశ్కే ఈ అవార్డు: డుప్లెసిస్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
-
మార్కెట్ కేంద్రంగా మొబైల్ దొంగతనాలు.. పిల్లలైతే అనుమానించరని..!
-
చాట్ జీపీటీ కంటే మెరుగైన తెలుగు సాఫ్ట్వేర్ తీసుకొస్తాం
-
ఏపీ ఎన్నికల్లో విజయంపై రూ.1.75 కోట్ల పందెం
-
పెట్టుబడి అంటే పట్టుబడినట్టే.. లాభాల పేరుతో సైబర్ నేరగాళ్ల దందా