ధరణి.. కాజేసే ధోరణి
చిత్తూరు నగరం తేనెబండ రెవెన్యూలో తిరుపతి- చిత్తూరు జాతీయ రహదారి పక్కన ఉన్న ఎకరా భూమి విలువ రూ.3 కోట్లు ఉంది. ఇది తనదంటూ ఒకరు నకిలీ రికార్డులు సృష్టించారు.
ఏపీ భూ యాజమాన్య హక్కు చట్టం చూసి బెంబేలెత్తుతోన్న పేదలు
న్యాయం జరగాలంటే ఆస్తులు అమ్మాల్సిందే..
లేదంటే అప్పులు చేయాల్సిందే
చిత్తూరు నగరం తేనెబండ రెవెన్యూలో తిరుపతి- చిత్తూరు జాతీయ రహదారి పక్కన ఉన్న ఎకరా భూమి విలువ రూ.3 కోట్లు ఉంది. ఇది తనదంటూ ఒకరు నకిలీ రికార్డులు సృష్టించారు. రెండు ఎకరాలు ఆక్రమించి చదును చేస్తుండటంతో స్థానికులు రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేశారు. సిబ్బంది అక్కడకు రాగా వారినే బెదిరించే ప్రయత్నం చేశారు. యాజమాన్య హక్కు చట్టం ప్రకారం ఇక్కడ ఒకవేళ అధికారులు కబ్జాదారుడికి వంతపాడితే రూ.6 కోట్ల విలువైన భూమిపై ప్రభుత్వమే హక్కులు వదులకోవాల్సి ఉంటుంది.
చిత్తూరు నగరంలోని కట్టమంచికి చెందిన బాలగురునాథానికి చెందిన రూ.10 కోట్ల విలువైన 5.5 ఎకరాల భూమిని యాదమరి మండలం మాధవరం పంచాయతీకి చెందిన ఎబినేజర్, పూపతమ్మ పేరిట ఎలాంటి లింక్ డాక్యుమెంట్లు లేకుండానే రిజిస్ట్రేషన్ చేయించారు. ఇలా చిత్తూరు నగరంలో ఏకంగా రూ.58కోట్ల విలువైన ఎనిమిది స్థలాలను కొందరు వ్యక్తులు ముఠాగా ఏర్పడి నకిలీ పత్రాలతో రిజిస్ట్రేషన్లు చేయించుకున్నారు. ఈ అంశంపై 2022లో గతంలో చిత్తూరు తహసీల్దారుగా పనిచేసిన సుబ్రహ్మణ్యం, సబ్ రిజిస్ట్రార్ శ్రీధరగుప్తా, వేపంజేరి, నందలూరు, ఇరువారం వీఆర్వోలు ధనంజయ, శివనారాయణ, బాబును అరెస్టు చేశారు. భూ యాజమాన్య హక్కు చట్టం ప్రకారం టైటిల్ రిజిస్ట్రేషన్ అధికారి (టీఆర్వో) సహకరిస్తే బాలగురునాథం భూమి కోసం ఎంతో వ్యయప్రయాసలు పడాల్సిందే.
సోమల మండలంలో ఇద్దరు అన్నదమ్ముల మధ్య వారసత్వంగా వచ్చిన నాలుగు ఎకరాల భూమిపై వివాదం కొనసాగుతోంది. మొత్తం నాలుగు ఎకరాలు తనకే చెందుతుందంటూ రెవెన్యూ అధికారులను ప్రలోభపెట్టి తమ్ముడు తన పేరిటే 1-బీ, పాస్ పుస్తకం పొందారు. బెంగళూరులో ఉన్న సోదరుడికి నాలుగేళ్ల తర్వాత వాస్తవం తెలిసింది. ఇప్పటికీ ఆయన తనకు రెండు ఎకరాలు చెందుతుందని పోరాడుతూనే ఉన్నారు. సివిల్ కోర్టులో న్యాయపోరాటం చేస్తున్నారు. అదే ఏపీ భూ యాజమాన్య హక్కు చట్టం అమలులోకి వచ్చి ఉంటే అన్న నేరుగా హైకోర్టుకు వెళ్లాల్సిందే.
ఈనాడు, చిత్తూరు: సీఎం జగన్ తనను పదేపదే రైతు బాంధవుడినని, పేదల పెన్నిధినని అభివర్ణించుకుంటున్నారు. అన్నదాతలకు తాను చేసినంత మేలు ఎవరూ చేయలేదని గొప్పలు పోతారు. ఐదేళ్ల పాలనలో అందిన కాడికి ప్రకృతి వనరులను దోచుకున్న ఆయన ఆరగించడానికి ఇంకేమీ లేవని ప్రైవేటు వ్యక్తుల భూములు, ఆస్తులపై పడ్డారు. ఈ దోపిడీ పర్వాన్ని చట్టబద్ధం చేసేందుకే ఏపీ భూ యాజమాన్య హక్కును తీసుకొచ్చారు. చిన్న, సన్నకారు రైతుల భూములను కొట్టేయాలన్నది సీఎం జగన్ వ్యూహమని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. అందుకే ఎన్ని విమర్శలొచ్చినా ఈ చట్టాన్ని వెనక్కు తీసుకోబోమని జిల్లాకే చెందిన మంత్రి పెద్దిరెడ్డి పుంగనూరులో సెలవివ్వడం గమనార్హం.
జిల్లాలో ఎన్నికల కోడ్ అమలులోకి రాకముందు ప్రతి సోమవారం ‘స్పందన’ కార్యక్రమంలో వచ్చే 140- 160 ఫిర్యాదుల్లో 80 శాతం భూములకు సంబంధించినవే. తనకు తెలియకుండా పాస్ పుస్తకం చేసుకున్నారని, ఆన్లైన్లో వివరాలు ఎక్కించుకున్నారని, ప్రభుత్వ భూములను అన్యాక్రాంతం చేశారని పేదలు గోడు వెళ్లబోసుకునేవారు. వీటిని నిర్ణీత గడువులోపు పరిష్కరించాలని కలెక్టర్ ఆదేశించేవారు. ఎంతకీ వివాదం తెగకుంటే కొందరు సివిల్ కోర్టులను ఆశ్రయించి న్యాయం పొందేవారు. కొంత ఆలస్యమైనా తమ ఆస్తి తమకే వస్తుందని యజమానులకు ఆశ ఉండేది. జగన్ తీసుకువచ్చిన యాజమాన్య హక్కు చట్టంతో పేదలకు న్యాయం జరగాలంటే వారి శక్తికి మించి ఖర్చు చేయాల్సిందే. ఈక్రమంలో వారు మరింత అప్పుల ఊబిలోకి కూరుకుపోవాల్సిందే.
తండ్రి ఆస్తి వారసులకు రాకుండా కొర్రీలు
జిల్లాలో తొలి నుంచీ తండ్రి వారసత్వంగా వచ్చిన భూమి ఎవరెవరికి ఎంతెంత వాటా రావాలనే విషయంలోనూ వివాదాలు తలెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో ఎవరికైనా బలమున్నా, నాయకుల అండ ఉన్నా సులభంగా ఆ వ్యక్తి తన పేరిట టైటిల్ రిజిస్టర్లో భూమిని ఎక్కించుకోవచ్చు. తండ్రి మరణిస్తే భూమిని పొందేందుకు వారసులూ ఇబ్బంది పడొచ్చు. చిత్తూరు నగరంలో రెండేళ్ల కిందట ఒక వ్యక్తి.. మరణించిన ఒకరికి తానే వారసుడినంటూ రెవెన్యూ అధికారుల నుంచి ధ్రువపత్రం పొందాడు. దాన్ని అడ్డుపెట్టుకుని అసలైన వ్యక్తికి బదులు తానే భూమిని రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. దీంతో నిజమైన వారసుడు న్యాయం కోసం హైకోర్టు చుట్టూ తిరగాల్సి వచ్చింది. ః పిల్లల చదువులు, పెళ్లిళ్లు, ఇంటి నిర్మాణానికి బ్యాంకులో అప్పు తీసుకుందామనో, ఇతరులకు అమ్ముదామని వెళ్లినప్పుడు మాత్రమే మన భూముల గురించి ఆలోచిస్తాం. వైకాపా నేతలు ఎవరైనా వీటిని వారి పేరిట మార్చుకుంటే ఇలాంటి సందర్భంలో చూసుకున్నప్పుడే మనకు తెలుస్తుంది. అప్పుడు న్యాయం చేయాలని సివిల్ కోర్టులకు వెళ్లడం కుదరదు. నేరుగా హైకోర్టులో రివిజన్ పిటిషన్ వేసుకోవాలి. చిన్న, సన్నకారు రైతు మారుమూల ఉన్న కుప్పం, చిత్తూరు నుంచి అమరావతిలోని హైకోర్టుకు వాయిదాల కోసం తిరుగుతూనే ఉండాలి. అక్కడి న్యాయవాదులకు వాయిదాకు వాయిదాకు వేల రూపాయలు చెల్లించాలి.
హక్కులకు భంగం కలిగించే చట్టం
- శివకుమార్, విశ్రాంత తహసీల్దారు, చిత్తూరు
రాష్ట్ర ప్రభుత్వం తెచ్చిన కొత్త చట్టం.. రైతులు, భూ యజమానుల హక్కులకు భంగం కలిగించే చట్టం. భూములకు రక్షణ ఉండదు. పూర్తిగా హక్కులు పొందుతామనే అవకాశం లేదు. హక్కులో కోల్పోయి నష్టపోవడమే తప్ప లాభం లేదు. టీఆర్వో రూపొందించే రికార్డు సరైన ప్రామాణికం కాదు.ఈ చట్టాన్ని పునఃపరిశీలించి సవరించాలి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పెళ్లిచూపులకు వస్తూ రోడ్డు ప్రమాదంలో యువకుడి దుర్మరణం
[ 19-05-2024]
పూతలపట్టు-నాయుడుపేట జాతీయ రహదారి ఐతేపల్లి సమీపంలో శనివారం వేకువజామున ముందు వెళ్తున్న ట్రక్కును వెనుక నుంచి ఓ కారు వేగంగా ఢీకొంది. -
తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ.. 3కి.మీ మేర బారులు
[ 19-05-2024]
శ్రీవారి దర్శనానికి తిరుమలలో భక్తుల రద్దీ ఆదివారం కూడా కొనసాగుతోంది. భక్తులతో వైకుంఠం క్యూ కాంప్లెక్స్, నారాయణగిరి షెడ్లు, నిండిపోయాయి. -
ఐదేళ్లు.. రూపాయి విదిల్చితే ఒట్టు!
[ 19-05-2024]
ఉమ్మడి చిత్తూరు జిల్లాలో శరవేగంగా జాతీయ రహదారులు, ఎక్స్ప్రెస్ వేలు నిర్మితమవుతున్నాయి. తక్కువ సమయంలో మహా నగరాలకు చేరుకుంటున్నాం. -
భూమి రాసివ్వకపోతే చంపేస్తామన్నారు.. సినీఫక్కీలో ఆలయ పూజారి కిడ్నాప్
[ 19-05-2024]
భూమి రాసివ్వకపోతే చంపేస్తామంటూ సినీ ఫక్కీలో ఓ ఆలయ పూజారిని అపహరించిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. -
రేణిగుంట సమీపంలో ప్రైవేట్ బస్సుకు మంటలు
[ 19-05-2024]
తిరుపతి జిల్లా రేణిగుంట సమీపంలో మార్నింగ్ స్టార్ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు అనుకోని ప్రమాదంలో మంటల్లో చిక్కుకుంది. -
ఎస్పీగా హర్షవర్ధన్ రాజు నియామకం
[ 19-05-2024]
జిలాలో జరిగిన హింసాత్మక ఘటనలను తీవ్రంగా తీసుకున్న ఎన్నికల సంఘం శాంతిభద్రతల పరిరక్షణకు చర్యలు చేపట్టింది. -
తీపెక్కిన మామిడి
[ 19-05-2024]
బంగారుపాళ్యం మార్కెట్యార్డులో మామిడి కాయల సీజన్ ప్రారంభమైంది. -
228 మందికి షోకాజ్ నోటీసులు
[ 19-05-2024]
ఎన్నికల విధులకు హాజరుకాని వారిపై క్రమశిక్షణ చర్యల్లో భాగంగా కలెక్టర్ షన్మోహన్.. 228 మంది ఉద్యోగులకు శనివారం షోకాజ్ నోటీసులు జారీచేశారు. -
నీరు కావాలంటే.. కొనాల్సిందే
[ 19-05-2024]
మనిషి జీవన ప్రయాణంలో నీటి కోసం ప్రత్యేక బడ్జెట్ కేటాయించుకోవాల్సి వస్తోంది. -
తాగునీటి సమస్య పరిష్కారానికి ప్రాధాన్యం ఇవ్వండి
[ 19-05-2024]
జిల్లాలో తాగునీటి సమస్య తలెత్తితే పరిష్కారానికి అధికారులు ప్రాధాన్యత ఇవ్వాలని జడ్పీ ఛైర్మన్ శ్రీనివాసులు కోరారు. -
వైకాపా నేతల మెడకు బిగుసుకోనున్న ఉచ్చు!
[ 19-05-2024]
పోలింగ్ రోజు, తర్వాత జరిగిన ఘటనలకు వైకాపా నేతలే ప్రధాన కారణమని జిల్లా అధికారులు స్పష్టం చేస్తున్నారు. -
పొంగిపొర్లుతున్న మురుగు
[ 19-05-2024]
తిరుమలలో కొద్దిపాటి వర్షానికే మురుగు పొంగిపొర్లుతోంది. -
తెలంగాణ ఫలితాల్లో వెంగమాంబాపురం విద్యార్థి ప్రతిభ
[ 19-05-2024]
తెలంగాణ ఈఏపీసెట్ ఫలితాల్లో ఏడో ర్యాంకు సాధించి అందరి ప్రశంసలు అందుకున్నాడు తిరుపతి జిల్లా బాలాయపల్లి మండలం వెంగమాంబాపురానికి చెందిన వడ్లపూడి ముకేష్ చౌదరి. -
కారుపై మాత్రమే దాడి చేశారు: భానుకుమార్రెడ్డి భార్య రాణి
[ 19-05-2024]
శ్రీపద్మావతి మహిళా విశ్వవిద్యాలయంలో చంద్రగిరి తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి పులివర్తి నాని వాహనంపై మాత్రమే దాడి జరిగిందని రామచంద్రాపురం మండల జడ్పీటీసీ సభ్యురాలు దిల్లీరాణి పేర్కొన్నారు. -
నగరవాసులే ముందంజ
[ 19-05-2024]
చిత్తూరు నియోజకవర్గంలో మునుపెన్నడూ చూడని విధంగా ఈసారి ఎన్నికలు జరిగాయి. -
అశ్వవాహనంపై శ్రీసదాశివేశ్వరుడి విహారం
[ 19-05-2024]
పట్టణంలోని శ్రీ కామాక్షీ సమేత శ్రీసదాశివేశ్వర ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా శనివారం రాత్రి స్వామి వారు శ్రీకామాక్షీ దేవి సమేతుడైన శ్రీసదాశివేశ్వరుడు అశ్వవాహనంపై ఊరేగుతూ భక్తులను కనువిందు చేశారు. -
‘ఈ ఎన్నికల్లో గెలిచేది తెదేపా కూటమే’
[ 19-05-2024]
రాష్ట్రంలో ఈ నెల 13న జరిగిన పోలింగ్లో ప్రజలు స్వచ్ఛందంగా వచ్చి ఓట్లు వేశారని, గెలిచేది తెదేపా కూటమేనని ఐ తెదేపా రాష్ట్ర కార్యదర్శి గాలి గోపీనాథ్ పేర్కొన్నారు. -
జడ్పీలో నిధుల దుర్వినియోగంపై మొదలైన విచారణ
[ 19-05-2024]
జడ్పీలో గతంలో బీఆర్జీఎఫ్, ఆర్థిక సంఘం నిధుల్లో పెద్దఎత్తున నిధుల దుర్వినియోగంపై వచ్చిన ఆరోపణల నేపథ్యంలో గతేడాది లోకాయుక్తకు పలువురు పూర్వ ఉద్యోగులు ఫిర్యాదు చేశారు. -
సీఎం జగన్ కలలు కంటున్నారు
[ 19-05-2024]
సీఎం జగన్ అధికారంలోకి వస్తామని కలలు కంటున్నారని, ఆయన కల నెరవేరే పరిస్థితి లేదని తెదేపా రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి పోతుగుంట విజయబాబు పేర్కొన్నారు.
తాజా వార్తలు (Latest News)
-
రాజస్థాన్ను ముంచిన వరుణుడు.. హైదరాబాద్ను వరించిన అదృష్టం
-
భాజపాకు యూపీలో ఒక్క సీటు మాత్రమే.. రాహుల్ జోస్యం
-
‘బ్లూ ఆరిజిన్’ ప్రయోగం విజయవంతం.. అంతరిక్షయానం చేసిన తొలి తెలుగు వ్యక్తి
-
‘భారతీయుడు 2’ రిలీజ్ డేట్ ఫిక్స్.. ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ లుక్తో అజిత్
-
పీర్జాదిగూడ మేయర్, కార్పొరేటర్ల కిడ్నాప్నకు కాంగ్రెస్ యత్నం: హరీశ్రావు
-
కిల్లర్ టైగర్ కోసం 150 కెమెరాలతో నిఘా.. 36 గ్రామాల్లో రెడ్ అలర్ట్!