మా కష్టాలు తీర్చవా స్వామీ!
కోనసీమ తిరుమల వాడపల్లి వేంకటేశ్వరుని దర్శనంలో భక్తులకు అవస్థలు తప్పడం లేదు. వసతులు కల్పించడంలో విఫలమయ్యారనే చెప్పవచ్చు. ఈ క్షేత్రాన్ని ఏడు వారాలు దర్శించుకోవడంతోపాటు ప్రతి వారం ఏడేసి ప్రదక్షిణలు చేస్తే కోర్కెలు తీరుతాయి అన్న నమ్మకంతో
బ్రహ్మోత్సవాలు సమీపిస్తున్నా పూర్తికాని పనులు
మాడ వీధుల్లో చిత్తడిలోనే భక్తుల ప్రదక్షిణలు
న్యూస్టుడే, ఆత్రేయపురం: కోనసీమ తిరుమల వాడపల్లి వేంకటేశ్వరుని దర్శనంలో భక్తులకు అవస్థలు తప్పడం లేదు. వసతులు కల్పించడంలో విఫలమయ్యారనే చెప్పవచ్చు. ఈ క్షేత్రాన్ని ఏడు వారాలు దర్శించుకోవడంతోపాటు ప్రతి వారం ఏడేసి ప్రదక్షిణలు చేస్తే కోర్కెలు తీరుతాయి అన్న నమ్మకంతో వేలాది మంది భక్తులు వస్తుంటారు. అంతటి ప్రాముఖ్యం ఉన్న ఈ ఆలయంలో అడుగడుగునా సమస్యలే. ఈనెల 14 నుంచి 22 వరకు వార్షిక బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. అయినా పనులు పూర్తికాని పరిస్థితి. లోపల క్యూలైన్లు సమస్య పరిష్కారం కాలేదు. ప్రదక్షిణలు చేసే మాడ వీధులు వర్షం వస్తే చిత్తడితో అవస్థలే. రహదారిని అభివృద్ధి చేసేలా చొరవ చూపడం లేదు. పాదరక్షలు భద్రపరచుకునేందుకు సౌకర్యం లేదు. కొందరు భక్తులు విద్యుత్తు ట్రాన్స్ఫార్మర్ చుట్టూ కంచె లేదు. ఇక్కడే పాదరక్షలు విడుస్తున్నారు. ఆలయం ఈశాన్య ప్రదేశంలో స్వామివారికి దీపారాధన చేస్తూ ఉంటారు. అక్కడ వర్షం వస్తే ఇబ్బందే. గోశాల తొలగించిన ప్రదేశంలో ఏర్పాటు చేశారు. అక్కడ వసతుల్లేవు. మాడ వీధుల్లోకి ఒక్కోసారి వాహనాలకు అనుమతి ఇస్తుండటంతో భక్తులు ఇబ్బంది పడుతున్నారు. అన్నప్రసాదానికి కూడా అవస్థలే. ప్రధాన ఆలయం వద్ద కూర, పచ్చడితో ఇచ్చే ప్లేటు అన్నదాన సదనంకు వెళ్లి అన్నం వడ్డించుకోవాలి. ఈ సమయంలో వర్షం వస్తే అవస్థే. కొద్దిపాటి సమయం విశ్రమిద్దామంటే వీలులేని పరిస్థితి. విశ్రాంతి గదులు లేవు. ఇక స్వామివారి రథం భద్రపరిచేందుకు షెడ్డు లేదు. ఇలా అనేక సమస్యలు ఉన్నాయి. ఇప్పటికైనా ఉన్నతాధికారులు వసతుల కల్పనపై దృష్టిసారించాలని భక్తులు కోరుతున్నారు. దీనిపై ఈవో ముదునూరి సత్యనారాయణరాజు మాట్లాడుతూ.. ఆయా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని, ఆందోళన చెందాల్సిన పనిలేదన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పవన్కల్యాణ్కు మద్దతుగా వరుణ్తేజ్ ప్రచారం
[ 27-04-2024]
జనసేనాని పవన్కల్యాణ్కు మద్దతుగా సినీహీరో కొణిదెల వరుణ్తేజ్ శనివారం పిఠాపురం నియోజవర్గంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారని జనసేన జాతీయ మీడియా అధికార ప్రతినిధి వేములపాటి -
ఎవరి చెవిలో పువ్వులు పెడతారు?
[ 27-04-2024]
మాట తప్పను.. మడమ తిప్పనంటూ చెప్పే వైకాపా అధినేత, ముఖ్యమంత్రి జగనే జిల్లాకు ఇచ్చిన హామీలు నెరవేర్చలేకపోయారు. తాజాగా ఎన్నికల ప్రచారానికి వచ్చినా.. -
అన్నదాతకు అండగా ఉంటాం..
[ 27-04-2024]
ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో పంట విరామం అనే మాట వినపడకుండా చేయడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని.. అందుకు తాను బాధ్యత తీసుకుంటానని జనసేన అధినేత పవన్కల్యాణ్ భరోసానిచ్చారు. -
అమ్మ ఒడి.. మామ నిబంధనల ముడి
[ 27-04-2024]
ఆధునిక విద్య అందించే క్రమంలో భాగంగా తొమ్మిదో తరగతి నుంచి ఇంటర్ వరకూ చదువుతున్న వారిలో ఎవరికైనా నగదు స్థానంలో ల్యాప్టాప్ కావాలంటే ఇష్టపూర్వక పత్రాలు ఇవ్వాలని తీసుకున్నారు. -
అధికారమే పెట్టుబడి.. వారి కన్నుపడితే దోపిడీ
[ 27-04-2024]
సమస్యలు పరిష్కరిస్తారని.. తమకు అండగా ఉంటారని ఓట్లేసి గెలిపించారు. అదే జనం పాలిట శాపమైంది. -
రాజానగరంలో ఎత్తుగడ
[ 27-04-2024]
జనసేనాని పవన్కల్యాణ్ అత్యంత ప్రతిష్టాత్మకంగా రాష్ట్రంలోనే తొలిసీటుగా ప్రకటించిన స్థానం రాజానగరం. -
89 ఆమోదం.. 44 తిరస్కరణ
[ 27-04-2024]
సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి జిల్లాలోని రాజమహేంద్రవరం పార్లమెంట్, ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో దాఖలైన నామపత్రాల పరిశీలన ప్రక్రియ శుక్రవారం పూర్తయింది. -
ఆడపడుచుగా వచ్చా.. ఆశీర్వదించండి: పురందేశ్వరి
[ 27-04-2024]
మీ ఇంటి ఆడపడుచుగా వచ్చానని, ఆశీర్వదించి గెలిపించాలని రాజమహేంద్రవరం ఎంపీ కూటమి అభ్యర్థి దగ్గుబాటి పురందేశ్వరి కోరారు. -
అధికారమే లక్ష్యంగా అడ్డదారి..!?
[ 27-04-2024]
ఏది ఏమైనా మళ్లీ అధికారం చేజిక్కించుకోవాలనే ఉద్దేశంలో అధికార పార్టీ కుటిల పన్నాగాలు పన్నుతోందని రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. -
18 ఆమోదం.. 10 తిరస్కరణ..
[ 27-04-2024]
కాకినాడ పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించి దాఖలైన నామినేషన్ల పరిశీలన శుక్రవారం కలెక్టరేట్లో పూర్తి చేశారు. కాకినాడ పార్లమెంట్ రిటర్నింగ్ అధికారి, -
మంత్రి మెప్పు పొందాలని నాయకుల పాట్లు
[ 27-04-2024]
గ్రామీణ నియోజకవర్గంలో వైకాపా కేడర్కు చేరికల పాట్లు తప్పడం లేదు. మంత్రి వేణు మెప్పు పొందేందుకు ద్వితీయశ్రేణి నాయకులు చేస్తున్న ప్రయత్నాలు అన్నీఇన్నీ కావు.
తాజా వార్తలు (Latest News)
-
మా పార్టీ పుట్టుక సంచలనం.. దారి పొడవునా రాజీలేని రణం: కేటీఆర్
-
కిందపడేసి, మోకాలితో అదిమిపెట్టి.. అమెరికాలో పోలీసుల కర్కశత్వం
-
సునీల్ నరైన్కు థ్యాంక్స్.. శశాంక్ ఓ అద్భుతం: బెయిర్స్టో
-
రెచ్చిపోయిన మిలిటెంట్లు.. సీఆర్పీఎఫ్ శిబిరంపై 2 గంటల పాటు కాల్పుల వర్షం
-
పింఛన్ల పంపిణీపై ఏపీ ప్రభుత్వానికి ఈసీ ఆదేశాలు
-
జగనన్న పన్నాగం.. పల్లెలకు పంగనామం..!