అధికార ఫ్లెక్సీలపై అంతులేని ప్రేమ
‘మా నాయకుడి పుట్టిన రోజని ఫ్లెక్సీలు పెట్టాం.. పూటకూడా గడవకుండా తీసేశారు. మా ఫ్లెక్సీలు ఒక్కరోజు కూడా ఉంచరా..? వైకాపా వాళ్ల ఫ్లెక్సీల జోలికైతే వెళ్లరా..? అధికార పార్టీకో రూలు.. ప్రతిపక్ష పార్టీలకో రూలా..? ఇది కరెక్టు కాదు.. కాకినాడను ప్రశాంతంగా ఉండనివ్వరా’’..? అంటూ తెదేపా నాయకులు కాకినాడ నగర పాలక సంస్థ సిబ్బందిపై ధ్వజమెత్తారు.
ప్రతిపక్షాలు ఏర్పాటు చేస్తే ఆగమేఘాలపై తొలగింపు
ఈనాడు, కాకినాడ
తెదేపా మాజీ ఎమ్మెల్యే పుట్టిన రోజున ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు తొలగించి వాహనంలో వేశారిలా..
వాటి జోలికి వెళ్లరా..?
‘మా నాయకుడి పుట్టిన రోజని ఫ్లెక్సీలు పెట్టాం.. పూటకూడా గడవకుండా తీసేశారు. మా ఫ్లెక్సీలు ఒక్కరోజు కూడా ఉంచరా..? వైకాపా వాళ్ల ఫ్లెక్సీల జోలికైతే వెళ్లరా..? అధికార పార్టీకో రూలు.. ప్రతిపక్ష పార్టీలకో రూలా..? ఇది కరెక్టు కాదు.. కాకినాడను ప్రశాంతంగా ఉండనివ్వరా’’..? అంటూ తెదేపా నాయకులు కాకినాడ నగర పాలక సంస్థ సిబ్బందిపై ధ్వజమెత్తారు. కాకినాడ నగర తెదేపా మాజీ ఎమ్మెల్యే కొండబాబు పుట్టినరోజున నగరంలో ఏర్పాటుచేసిన ఫ్లెక్సీలు ఆరోజు మధ్యాహ్నం నుంచే తొలగించడంపై తెదేపా నాయకులు నిరసన తెలిపారు. ఏకంగా ధర్నాకు దిగారు.
అనుమతిపొందినా అదే తీరు!
తితిదే పాలకవర్గ సభ్యుడు, పుదుచ్ఛేరి ప్రత్యేక ప్రతినిధి మల్లాడి కృష్ణారావు పుట్టినరోజు వేడుకల్లో భాగంగా ఆయన అభిమానులు ఈనెల 6న కాకినాడ నగరంలో ఫ్లెక్సీలు ఏర్పాటుచేశారు. నగర పాలక సంస్థ నుంచి అనుమతి పొంది.. నిర్ణీత రుసుము చెల్లించి ఏర్పాటుచేసినా.. అధికార పక్ష నాయకుడి ఒత్తిళ్లకు తలొగ్గిన యంత్రాంగం వీటిని ఆగమేఘాలపై తొలగించింది. ఈ చర్యలపై గుర్రుగా ఉన్న మల్లాడి ఆధ్వర్యంలోని బీసీ సంఘాల ప్రతినిధులు తితిదే ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డికి ఫిర్యాదుచేశారు. ఈ ‘పంచాయితీ’ ముఖ్యమంత్రి వరకు వెళ్లింది.
రాత్రి ఏర్పాటు.. తెల్లారికి మాయం
జనసేన అధినేత పవన్ కల్యాణ్ గతంలో నిర్వహించిన ప్రజాపోరాట యాత్రలో భాగంగా పార్టీ శ్రేణులు నగరంలో ముందురోజు రాత్రి నుంచి ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. అధినేత ఆగమన వేళ.. తెల్లారే
సరికి ఫ్లెక్సీలు చాలాచోట్ల మాయమయ్యాయి. దీంతో ఆగ్రహించిన జనసేన నాయకులు పంతం నానాజీ ఆధ్వర్యంలో ఆనందభారతి ప్రాంతంలో ఆందోళనకు దిగారు. వెనక్కి తగ్గిన సిబ్బంది... తొలగించిన ఫ్లెక్సీలు తిరిగి ఇవ్వడంతో పరిస్థితి సద్దుమణిగింది. పవన్ కల్యాణ్ వారాహి విజయ యాత్రలో భాగంగా కాకినాడలోని పగడాలపేటలో ఏర్పాటుచేసిన ఫ్లెక్సీలను చించేయడం.. నగరంలో ఏర్పాటుచేసిన కటౌట్లు రాత్రికి రాత్రే తొలగించడం వివాదాస్పదమయ్యింది.
కాకినాడ నగరంలో 50 డివిజన్లు ఉన్నాయి. ఆకర్షణీయ నగరమైన ఇక్కడ ప్రచార పర్వం గతితప్పుతోంది. వాణిజ్య సంస్థలు హోర్డింగుల ఏర్పాటుకు అన్ని అనుమతులు పొందుతూ నిబంధనల ప్రకారం రుసుము చెల్లిస్తున్నా.. రాజకీయ పక్షాలకు లెక్కలేకుండా పోతోంది. క్షేత్రస్థాయిలో ప్రచారాల హోరు చూస్తే కార్పొరేషన్కు రూ.కోట్లలో ఆదాయం సమకూరాలి. కానీ వాణిజ్య సంస్థల హోర్డింగుల ద్వారా ఏటా రూ.70 లక్షలు మాత్రమే ఆదాయం సమకూరుతోంది. రాజకీయ పక్షాల నాయకులు కనీస అనుమతుల్లేకుండానే ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తున్నారని.. చెల్లింపులు జరపడం లేదని పట్టణ ప్రణాళిక విభాగం అధికారి ఒకరు చెప్పారు.
అధికార వైకాపా నాయకుల ఫ్లెక్సీలు, కటౌట్లు.. నెలల తరబడి అలాగే ఉంటాయి. వాటిపై ఈగ వాలనివ్వరు.. అదే ప్రతిపక్షాల నాయకులు ఏర్పాటుచేస్తే మాయమైపోతాయి. నగరపాలక యంత్రాంగం ఆగమేఘాలపై వాహనంతో వచ్చి తొలగిస్తుంది. కాకినాడలో కొన్నేళ్లుగా సాగుతున్న తంతు ఇది. ఫ్లెక్సీలు తొలగించిన ప్రతిసారీ వ్యవహారం వివాదాస్పదమవుతున్నా.. రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గిన అధికారులు ఆ పంథా వీడడంలేదు. అధికారపక్ష కార్యక్రమాలకు అనుమతుల విషయంలో చూసీచూడనట్లు వదిలేస్తూ.. అనుమతులతో ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తున్న ఇతర పార్టీలపై మాత్రం ప్రతాపం చూపిస్తుండడం విమర్శలకు తావిస్తోంది.
* కాకినాడలో ఫ్లెక్సీల ఏర్పాటును రాజకీయ ఒత్తిళ్ల నడుమ చూసీచూడనట్లు వదిలేస్తున్నారు. నగరమంతా మా ఫ్లెక్సీలే ఉండాలి.. మిగిలినవి మచ్చుకైనా కనిపించకూడదన్న అధికార పక్ష విపరీత ధోరణి అధికారులకు ఇబ్బందిగా మారింది. ఇతర పార్టీల కార్యక్రమాలు ఏవి జరిగినా కార్యక్రమం పూర్తికాకుండా.. లేదంటే ఆరోజు రాత్రికే తొలగిస్తున్నారు. వైకాపా విషయంలో మాత్రం పూర్తిగా భిన్నం. ప్రధాన కూడళ్లలో నిలువెత్తు కటౌట్లు దర్శనమిస్తున్నా.. డివైడర్ల మధ్యలో, దారి పొడవున నెలల తరబడి చోటా, బడా నాయకుల పుట్టినరోజు శుభాకాంక్షలు, స్వాగతాల ఫ్లెక్సీలు దర్శనమిస్తున్నా వాటి జోలికి మాత్రం వెళ్లడంలేదు.
* రాజమహేంద్రవరంలోనూ ఇటీవల తెదేపా మహానాడు వేడుకల్లోనూ ఫ్లెక్సీల రగడ వివాదాస్పదం అయ్యింది. తెదేపా ఏర్పాటుచేసిన ఫ్లెక్సీలు, హోర్డింగుల మధ్యలో వైకాపా ఎంపీ ఫ్లెక్సీలు దర్శనమిచ్చాయి. తెదేపా ఫ్లెక్సీలు కొన్ని చోట్ల రాత్రికి రాత్రే ధ్వంసమవ్వడం విమర్శలకు తావిచ్చింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అక్షరాలా రూ.కోటి.. అక్రమంలో పోటీ!
[ 17-05-2024]
అక్రమంలో పోటీపడ్డారు.. అక్షరాలా కోటి రూపాయల నిధులను హాంఫట్ చేశారు.. అడిగేవారు లేరన్న ధైర్యం, అడిగినా ఏమవుతుందిలే అన్న బరితెగింపు.. కారణాలు ఏవైనా అడ్డదారిలో కథ నడిపించారు. -
పిఠాపురంలో మద్యం ఇవ్వలేదు.. డబ్బు పంచలేదు: మాజీ ఎమ్మెల్యే వర్మ
[ 17-05-2024]
‘పిఠాపురం నియోజకవర్గంలో ఎన్నికలకు సంబంధించి కూటమి నేతలు ప్రజలకు మద్యం ఇవ్వలేదు. డబ్బు పంచలేదు. ఎన్నికల కమిషన్ మార్గదర్శకాల ప్రకారం రూ.45లక్షలు మాత్రమే ఖర్చు చేశాం. -
కదిలారు కడదాక నిలిచారు
[ 17-05-2024]
ఉమ్మడి జిల్లాలోని రెండు నగరాల్లో ఓటు చైతన్యంలో కాకినాడ ముందుంది. రాజమహేంద్రవరం నగరంలో 67.57 శాతం పోలైతే.. కాకినాడలో అత్యధికంగా 72.16 పోలయ్యింది. -
నడుం బిగిస్తారా.. నిద్ర నటిస్తారా!
[ 17-05-2024]
నదీ పరిరక్షణ, వాల్టా ప్రకారం నదుల్లో భారీ యంత్రాలతో ఇసుక తవ్వకాలు చేపట్టకూడదు. ఉపరితలానికి మీటరు లోతుకు మించి వెళ్లకూడదు. -
ఈనెల రేషన్ సరుకులు ఇంకా అందలే
[ 17-05-2024]
జిల్లాలోని అన్ని మండలాల్లో కలిపి మొత్తం 5,74,907 రేషన్ కార్డులున్నాయి. ప్రతి నెల 1 నుంచి 17వ తేదీ వరకు 364 ఎండీయూ వాహనాల ద్వారా కార్డుదారులకు రేషన్ సరకుల పంపిణీ జరుగుతుంది. -
క్రీడా శిబిరాలు ఇంకెప్పుడు?
[ 17-05-2024]
వేసవి శిక్షణ శిబిరాలు ప్రారంభం కాకపోవటంతో నగరంలోని క్రీడాకారుల్లో నిస్తేజం అలముకుంది. -
ఈదురుగాలులకు అరటి రైతు దిగాలు
[ 17-05-2024]
ఇటీవల కురిసిన వర్షాలు, ఈదురుగాలులకు అరటి రైతులు కుదేలయ్యారు. జిల్లాలో పెరవలి, ఉండ్రాజవరం, నిడదవోలు, కొవ్వూరు, చాగల్లు, తాళ్లపూడి మండలాల్లో అరటి ఎక్కువగా సాగు చేస్తారు. -
అయిదు దీవులు.. పర్యాటక సొబగులు
[ 17-05-2024]
యానాం తీర ప్రాంతానికి సహజ రక్షణ కవచంగా ఉన్న మడ అడవుల్ని సంప్రదాయ పర్యాటక అభివృద్ధి కేంద్రంగా మార్చాలని పుదుచ్చేరి ప్రభుత్వం యోచిస్తోంది. -
అవినీతికి నాయకుల అండ
[ 17-05-2024]
రైతు సంక్షేమమే ధ్యేయమన్నారు... వారికి రుణాల అందించే క్రమంలో ఎవరైనా అవినీతి, అక్రమాలకు పాల్పడితే చర్యలు తప్పవని హెచ్చరించారు. జిల్లా కేంద్ర సహకార బ్యాంకును(డీసీసీబీ) సంరక్షించేందుకు అన్ని చర్యలూ తీసుకుంటామంటూ ప్రకటనలు గుప్పించారు. -
ఎమ్మెల్సీ తోట, అనుచరులపై అట్రాసిటీ కేసు
[ 17-05-2024]
డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా కపిలేశ్వరపురం మండలం వల్లూరులో సార్వత్రిక ఎన్నికల సందర్భంగా చోటుచేసుకున్న ఘటనలకు సంబంధించి ఎమ్మెల్సీ, వైకాపా మండపేట నియోజకవర్గ అభ్యర్థి తోట త్రిమూర్తులు -
సచివాలయం ఎదుట స్తంభాలు పాతి నిరసన
[ 17-05-2024]
గ్రామ సచివాలయం ఎదుట సిమెంటు స్తంభాలతో ఫెన్సింగ్ వేసి స్థానికులు ఆందోళనకు దిగిన ఘటన ఇది. వివరాల్లోకి వెళితే.. -
ఖరీఫ్ ఎరువుల ప్రణాళిక ఖరారు..!
[ 17-05-2024]
డా.బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లావ్యాప్తంగా ప్రస్తుత రబీ సీజన్లో 1,69,397 ఎకరాల్లో వరి సాగు చేపట్టారు. రానున్న ఖరీఫ్ సీజన్లో సుమారు 1,68,780 ఎకరాల్లో వరి సాగు చేపట్టే అవకాశం ఉంటుందని వ్యవసాయశాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. -
రౌడీషీటర్లపై ప్రత్యేక నిఘా
[ 17-05-2024]
సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో జిల్లాలో ఉన్న రౌడీషీటర్లపై ప్రత్యేక నిఘా ఉంచినట్లు ఏలూరు రేంజ్ ఐజీ అశోక్కుమార్ తెలిపారు. -
రక్తపోటు.. ఆరోగ్యంపై వేటు
[ 17-05-2024]
ఉరుకుల పరుగుల జీవనశైలి కారణంగా చాలా మంది ఒత్తిడికి చిత్తవుతున్నారు. దీని కారణంగా ఆరోగ్యం గతి తప్పుతోంది. రక్తపోటు(బీపీ), మధుమేహం, ఇతర వ్యాధులబారిన పడుతున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
‘అమ్మ’ అంతిమయాత్ర అయినా.. ఆస్తి పంచాకే !
-
ఆంక్షలు విధించిన అమెరికాలోనే.. రహస్యంగా ఉత్తర కొరియన్లు వర్క్ఫ్రమ్ హోం
-
టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా ప్రభాస్ పోస్ట్.. ఆ ప్రత్యేక వ్యక్తి ఎవరు?
-
ఏపీఎల్లో చరిత్ర సృష్టించిన ఎస్ఆర్హెచ్ హీరో
-
భారత వృద్ధిరేటు అంచనాలను గణనీయంగా పెంచిన ఐరాస
-
వివేకా హత్య కేసు.. నాంపల్లి కోర్టులో విచారణకు హాజరైన ఎంపీ అవినాష్రెడ్డి