జలదిగ్బంధంలో లంకలు
వారం క్రితం వరకు ప్రశాంతంగా ఉన్న గోదావరి.. ఇప్పుడు భారీ వరద ప్రవాహంతో కనిపిస్తోంది. ఎగువ, పరీవాహక ప్రాంతాల్లో విస్తృత వర్షాల నేపథ్యంలో ధవళేశ్వరం బ్యారేజీ వద్ద భారీగా నీరు చేరుతోంది.
వరదతో ఉక్కిరిబిక్కిరి
రాజమహేంద్రవరంలోని సరస్వతీఘాట్ వద్ద..
ఈనాడు, రాజమహేంద్రవరం; న్యూస్టుడే, పి.గన్నవరం: వారం క్రితం వరకు ప్రశాంతంగా ఉన్న గోదావరి.. ఇప్పుడు భారీ వరద ప్రవాహంతో కనిపిస్తోంది. ఎగువ, పరీవాహక ప్రాంతాల్లో విస్తృత వర్షాల నేపథ్యంలో ధవళేశ్వరం బ్యారేజీ వద్ద భారీగా నీరు చేరుతోంది. శుక్రవారం రాత్రి 8 గంటలకు ఇక్కడ 11.70 అడుగుల నీటిమట్టం నమోదవగా 9,73,870 క్యూసెక్కుల జలాలు సముద్రంలోకి విడిచిపెట్టారు. రాత్రి 10 గంటలకు కూడా ఇదే నిలకడ కనిపిస్తోంది. బ్యారేజీ 175 గేట్లను ఎత్తేసి వచ్చిన ఇన్ఫ్లోలను సముద్రంలోకి విడిచిపెడుతున్నారు. మొదటి ప్రమాద హెచ్చరిక స్థాయిలో వరద రావడంతో రెవెన్యూ, పోలీసు, జలవనరుల శాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. 11.75 అడుగుల నీటిమట్టం, 10 లక్షల క్యూసెక్కుల జలాలు వస్తే హెచ్చరిక జారీ చేస్తారని తెలిపారు. భద్రాచలం వద్ద ఉదయం 6 గంటలకు 43.90 అడుగుల నీటిమట్టం ఉండగా.. క్రమేపీ తగ్గుతూ రాత్రి 8 గంటలకు 41.10 అడుగులకు చేరింది. ఈ ప్రభావం వల్ల శనివారం నాటికి బ్యారేజీ వద్ద వరద కొంత మేర తగ్గే సూచనలున్నాయి. తూర్పుగోదావరి, డా.బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాల కలెక్టర్లు యంత్రాంగాన్ని అప్రమత్తం చేశారు. కలెక్టరేట్లు, ఆర్డీవో కార్యాలయాల్లో కంట్రోల్ రూంలు సిద్ధం చేసి 24 గంటలూ సిబ్బంది అప్రమత్తంగా ఉండేలా ఆదేశాలు జారీ చేశారు. ధవళేశ్వరం బ్యారేజీ, రాజమహేంద్రవరం పుష్కరాలరేవు, గౌతమీ ఘాట్ వద్ద పోలీసులు అప్రమత్తమయ్యారు. ఘాట్ల లోపలికి ఎవర్నీ అనుమతించకుండా గేట్లు వేసేశారు. సరస్వతీఘాట్ వద్ద సందర్శకుల తాకిడి కనిపించింది.
ఐ.పోలవరం: జి.మూలపొలం-కాట్రేనికోన మండలం రామాలయంపేట రేవులో విద్యార్థుల పడవ ప్రయాణం. పదమూడేళ్లుగా వీరు వంతెనకు నోచుకోలేదు
ఎన్నెన్నో అవస్థలు
వశిష్ఠ గోదావరి నదికి మధ్యలో ఉన్న పి.గన్నవరం మండలం బూరుగులంక, ఊడిమూడిలంక, అరిగెలవారిపేట, జి.పెదపూడిలంక గ్రామాల ప్రజలు బూరుగులంక రేవులో మర పడవలను ఆశ్రయించి రాకపోకలు సాగిస్తున్నారు. తహసీల్దార్ జి.రవీంద్రనాధ్ఠాగూర్, ఎస్సై హరికోటి శాస్త్రి ఈ రేవు వద్దకు వెళ్లి సిబ్బందికి సూచనలు చేశారు. రేవులు దాటే ప్రజలు తప్పనిసరిగా లైఫ్జాకెట్లు ధరించాలని స్పష్టం చేశారు. ప్రజలు ద్విచక్ర వాహనాలను ఇళ్లకు తీసుకెళ్లేందుకు వీలు లేకపోవడంతో బూరుగులంక రేవు ఇవతల వాటిని భద్రపర్చారు. ఊడిమూడి వద్ద వశిష్ఠ ఎడమ ఏటిగట్టు దిగువన సుమారు 20 నిరుపేద కుటుంబాలు జీవిస్తున్నాయి. వరద పెరుగుతున్న క్రమంలో వారంతా ఏటిగట్టుమీద ప్లాస్టిక్ బరకాలు ఏర్పాటు చేసుకున్నారు. లంక గ్రామాల రైతులు విద్యుత్తు మోటార్లను ముందుజాగ్రత్తతో సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు.
* మామిడికుదురు పరిధి పాశర్లపూడిలోని కరకట్ట దిగువలో ఉన్న పాటురేవులోకి వరద నీరు ముంచెత్తుతోంది. అప్పనపల్లి బాలబాలాజీస్వామి ఆలయ సమీపంలోని స్నానఘట్టం వద్ద ప్రవాహం పోటెత్తింది.
ఊడిమూడి ఏటిగట్టుకు దిగువన ఉన్న నిరుపేదలు బరకాలు వేసుకొని నివాసం
సీతానగరం: లంకగ్రామాల్లో వరద ఉద్ధృతిపై రాకపోకలు నిలిపివేసినట్లు ఏర్పాటు చేసిన సూచిక
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అక్షరాలా రూ.కోటి.. అక్రమంలో పోటీ!
[ 17-05-2024]
అక్రమంలో పోటీపడ్డారు.. అక్షరాలా కోటి రూపాయల నిధులను హాంఫట్ చేశారు.. అడిగేవారు లేరన్న ధైర్యం, అడిగినా ఏమవుతుందిలే అన్న బరితెగింపు.. కారణాలు ఏవైనా అడ్డదారిలో కథ నడిపించారు. -
పిఠాపురంలో మద్యం ఇవ్వలేదు.. డబ్బు పంచలేదు: మాజీ ఎమ్మెల్యే వర్మ
[ 17-05-2024]
‘పిఠాపురం నియోజకవర్గంలో ఎన్నికలకు సంబంధించి కూటమి నేతలు ప్రజలకు మద్యం ఇవ్వలేదు. డబ్బు పంచలేదు. ఎన్నికల కమిషన్ మార్గదర్శకాల ప్రకారం రూ.45లక్షలు మాత్రమే ఖర్చు చేశాం. -
కదిలారు కడదాక నిలిచారు
[ 17-05-2024]
ఉమ్మడి జిల్లాలోని రెండు నగరాల్లో ఓటు చైతన్యంలో కాకినాడ ముందుంది. రాజమహేంద్రవరం నగరంలో 67.57 శాతం పోలైతే.. కాకినాడలో అత్యధికంగా 72.16 పోలయ్యింది. -
నడుం బిగిస్తారా.. నిద్ర నటిస్తారా!
[ 17-05-2024]
నదీ పరిరక్షణ, వాల్టా ప్రకారం నదుల్లో భారీ యంత్రాలతో ఇసుక తవ్వకాలు చేపట్టకూడదు. ఉపరితలానికి మీటరు లోతుకు మించి వెళ్లకూడదు. -
ఈనెల రేషన్ సరుకులు ఇంకా అందలే
[ 17-05-2024]
జిల్లాలోని అన్ని మండలాల్లో కలిపి మొత్తం 5,74,907 రేషన్ కార్డులున్నాయి. ప్రతి నెల 1 నుంచి 17వ తేదీ వరకు 364 ఎండీయూ వాహనాల ద్వారా కార్డుదారులకు రేషన్ సరకుల పంపిణీ జరుగుతుంది. -
క్రీడా శిబిరాలు ఇంకెప్పుడు?
[ 17-05-2024]
వేసవి శిక్షణ శిబిరాలు ప్రారంభం కాకపోవటంతో నగరంలోని క్రీడాకారుల్లో నిస్తేజం అలముకుంది. -
ఈదురుగాలులకు అరటి రైతు దిగాలు
[ 17-05-2024]
ఇటీవల కురిసిన వర్షాలు, ఈదురుగాలులకు అరటి రైతులు కుదేలయ్యారు. జిల్లాలో పెరవలి, ఉండ్రాజవరం, నిడదవోలు, కొవ్వూరు, చాగల్లు, తాళ్లపూడి మండలాల్లో అరటి ఎక్కువగా సాగు చేస్తారు. -
అయిదు దీవులు.. పర్యాటక సొబగులు
[ 17-05-2024]
యానాం తీర ప్రాంతానికి సహజ రక్షణ కవచంగా ఉన్న మడ అడవుల్ని సంప్రదాయ పర్యాటక అభివృద్ధి కేంద్రంగా మార్చాలని పుదుచ్చేరి ప్రభుత్వం యోచిస్తోంది. -
అవినీతికి నాయకుల అండ
[ 17-05-2024]
రైతు సంక్షేమమే ధ్యేయమన్నారు... వారికి రుణాల అందించే క్రమంలో ఎవరైనా అవినీతి, అక్రమాలకు పాల్పడితే చర్యలు తప్పవని హెచ్చరించారు. జిల్లా కేంద్ర సహకార బ్యాంకును(డీసీసీబీ) సంరక్షించేందుకు అన్ని చర్యలూ తీసుకుంటామంటూ ప్రకటనలు గుప్పించారు. -
ఎమ్మెల్సీ తోట, అనుచరులపై అట్రాసిటీ కేసు
[ 17-05-2024]
డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా కపిలేశ్వరపురం మండలం వల్లూరులో సార్వత్రిక ఎన్నికల సందర్భంగా చోటుచేసుకున్న ఘటనలకు సంబంధించి ఎమ్మెల్సీ, వైకాపా మండపేట నియోజకవర్గ అభ్యర్థి తోట త్రిమూర్తులు -
సచివాలయం ఎదుట స్తంభాలు పాతి నిరసన
[ 17-05-2024]
గ్రామ సచివాలయం ఎదుట సిమెంటు స్తంభాలతో ఫెన్సింగ్ వేసి స్థానికులు ఆందోళనకు దిగిన ఘటన ఇది. వివరాల్లోకి వెళితే.. -
ఖరీఫ్ ఎరువుల ప్రణాళిక ఖరారు..!
[ 17-05-2024]
డా.బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లావ్యాప్తంగా ప్రస్తుత రబీ సీజన్లో 1,69,397 ఎకరాల్లో వరి సాగు చేపట్టారు. రానున్న ఖరీఫ్ సీజన్లో సుమారు 1,68,780 ఎకరాల్లో వరి సాగు చేపట్టే అవకాశం ఉంటుందని వ్యవసాయశాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. -
రౌడీషీటర్లపై ప్రత్యేక నిఘా
[ 17-05-2024]
సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో జిల్లాలో ఉన్న రౌడీషీటర్లపై ప్రత్యేక నిఘా ఉంచినట్లు ఏలూరు రేంజ్ ఐజీ అశోక్కుమార్ తెలిపారు. -
రక్తపోటు.. ఆరోగ్యంపై వేటు
[ 17-05-2024]
ఉరుకుల పరుగుల జీవనశైలి కారణంగా చాలా మంది ఒత్తిడికి చిత్తవుతున్నారు. దీని కారణంగా ఆరోగ్యం గతి తప్పుతోంది. రక్తపోటు(బీపీ), మధుమేహం, ఇతర వ్యాధులబారిన పడుతున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
అతడు నన్ను కాలితో తన్నాడు.. కడుపుపై కొట్టాడు: దాడి ఘటనపై స్వాతి మాలీవాల్
-
ఆ రూమర్స్కు చెక్ పెట్టిన నిర్మాణ సంస్థ.. ‘SSMB29’పై క్లారిటీ
-
నష్టాల్లో దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు.. నిఫ్టీ @ 22,365
-
తెదేపాకు ఓటేశాడని.. కొడవలితో చెవి కోసేశాడు
-
ఊబకాయులకు మూత్రపిండాలకు ముప్పు ఎక్కువే
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9AM