మహిళా మార్టులు ఎక్కడండి?
స్వయం సహాయక సంఘాల మహిళకు ఆర్థిక స్వావలంబన కల్పించేందుకు మండలానికో చేయూత మహిళా మార్టు ఏర్పాటు చేస్తామని ప్రభుత్వం ప్రచారం చేసింది.
గతేడాది నిడదవోలులో ఏర్పాటు చేసిన చేయూత
మహిళా మార్టు (పాత చిత్రం)
న్యూస్టుడే, వి.ఎల్.పురం (రాజమహేంద్రవరం): స్వయం సహాయక సంఘాల మహిళకు ఆర్థిక స్వావలంబన కల్పించేందుకు మండలానికో చేయూత మహిళా మార్టు ఏర్పాటు చేస్తామని ప్రభుత్వం ప్రచారం చేసింది. ఏడాది కావస్తున్నా జిల్లాలో ఒక చోట తప్ప ఇతర మండలంలో మార్టులు ఏర్పాటు కాలేదు. మండలానికి ఒకటన్నది చివరకు... జిల్లాకు కనీసం మరో మూడైనా ఏర్పాటు చేయాలని లక్ష్యంగా నిర్దేశించినా ఆ దిశగా అడుగులు కూడా పడటంలేదు.
జిల్లాలో రాజమహేంద్రవరం అర్బన్ మినహా మిగతా 18 మండలాల్లో కలిపి మొత్తం 31,384 స్వయం సహాయక సంఘాలు(ఎస్హెచ్జీ) ఉన్నాయి. రాజమహేంద్రవరం గ్రామీణంలోని తొమ్మిది గ్రామాల్లోని ఎస్హెచ్జీలు అర్బన్లో కలిసిపోవడంతో కొంతమూరు గ్రామ పరిధిలోని 475 సంఘాలు మాత్రమే గ్రామీణ మండలంలో ఉన్నాయి. మిగతా ప్రతి మండల సమాఖ్యలో 1,300 నుంచి రెండు వేలకుపైగా సంఘాలున్నాయి. గతంలో మండల సమాఖ్యలకు సాధారణ పెట్టుబడి నిధి కింద రూ.40 లక్షల చొప్పున కేటాయించగా వీటిని సంఘాల్లోని సభ్యులకు అంతర్గత అప్పులుగా ఇవ్వడం ద్వారా వచ్చిన వడ్డీతో కలిపి ఒక్కొక్క మండల సమాఖ్య వద్ద సుమారు రూ.40 లక్షల నుంచి రూ.60 లక్షల వరకు సొంతనిధి ఉంది.
ఇదీ ఆలోచన
సొంత నిధిపై వచ్చే వడ్డీ మొత్తాన్ని, స్త్రీనిధి ద్వారా ఏటా వచ్చే డివిడెండ్ను కలిపి వాటాగా పెట్టడంతోపాటు దీనికి అదనంగా బ్యాంకుల నుంచి మరికొంత రుణం మంజూరు చేయించి ఒక్కొక్క మండలంలో రూ.60 లక్షల నుంచి రూ.కోటి పెట్టుబడితో చేయూత మహిళా మార్ట్లు ఏర్పాటు చేయించాలని ఏడాది కిందటే ప్రభుత్వం నిర్ణయించింది. బ్యాంకు లింకేజీ, పొదుపు సొమ్ము, స్త్రీనిధి రుణాలతో చిరు వ్యాపారాలు చేస్తూ ఆర్థికాభివృద్ధి సాధిస్తున్న సంఘాలను పెద్ద వ్యాపార రంగంలోకి తీసుకువస్తామని, గ్రామీణ డ్వాక్రా మహిళలు తయారు చేసే సొంత ఉత్పత్తులతోపాటు ఇతర ఉత్పత్తులను మహిళా మార్టుల్లో విక్రయించుకునే అవకాశం కల్పించి వారి ఆర్థికాభివృద్ధికి, సంఘాల బలోపేతానికి తోడ్పాటు అందిస్తామని చెప్పుకొచ్చింది. ఆ మేరకు గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ ఆధ్వర్యంలో ఎస్హెచ్జీ సంఘాలతో మార్టులు నెలకొల్పేందుకు ఆదేశాలిచ్చింది. మహిళా మార్ట్ల నిర్వహణ ద్వారా వచ్చే నికర లాభంలో సంఘాల వాటా ఆధారంగా డివిడెండ్ కల్పించాల్సి ఉంది. ఇంతవరకు బాగానే ఉన్నా మహిళా మార్ట్లు ఏర్పాటు చేసే విషయంలో మాత్రం ప్రభుత్వం విఫలమవుతోంది.
ప్రయోగాత్మకంగా ఒక మండలంలోనే..
జిల్లాలో చేయూత మహిళా మార్టుల ఏర్పాటుకు పైలట్ ప్రాజెక్టుగా రెండు మండలాలు ఎంపిక చేశారు. ప్రయోగాత్మకంగా నిడదవోలు, కోరుకొండ మండలాల్లో మహిళా మార్టులు ఏర్పాటు చేయాలని నిర్ణయించినా చివరకు గతేడాది నవంబరులో నిడదవోలులో మాత్రమే మహిళా మార్టు ఏర్పాటు చేశారు. ఇక్కడి మండల సమాఖ్యలో 1,727 సంఘాలు ఉండగా 1,600 సంఘాలు వరకు వాటా ధనం పెట్టుబడి పెట్టేందుకు ముందుకొచ్చాయి. ముందు చెప్పినట్లు ప్రభుత్వం బ్యాంకు రుణాలు ఏమీ ఇప్పించలేదు. ఇక్కడ రోజుకు రూ.50 నుంచి రూ.లక్ష వరకు వివిధ ఉత్పత్తుల విక్రయాలు జరుగుతున్నట్లు చెబుతున్నారు. మిగతా మండలాల్లో కూడా దశలవారీగా మహిళా మార్టులు ఏర్పాటు చేస్తామని చెప్పినప్పటికీ అది జరగడంలేదు. కనీసం మరో మూడు మండలాల్లోనైనా మహిళా మార్టులు ఏర్పాటు చేయాలని లక్ష్యంగా నిర్దేశించడంతో గోకవరం, బిక్కవోలు, నల్లజర్లలో ఏర్పాటుకు అధికారులు ప్రయత్నాలు ప్రారంభించినప్పటికీ నెలల తరబడి ఆ ప్రక్రియ ముందుకు సాగడంలేదు.
భవనమే సమస్య
మార్టుల ఏర్పాటుకు అనుకూలమైన ప్రదేశాల్లో భవనాలు సమకూరకపోవడమే దీనికి కారణంగా చెబుతున్నారు. 700 నుంచి వెయ్యి చదరపు గజాల హాలు ఉండే భవనం తక్కువ అద్దెకు దొరకడం లేదు.
గోకవరంలో మార్ట్ ఏర్పాటుకు అనుకూల భవనాన్ని చూసినప్పటికీ నెలకు రూ.40 వేలు అద్దె చెప్పడం వల్ల ముందుకెళ్లలేని పరిస్థితి.
త్వరలో నల్లజర్లలో ఏర్పాటు: డీఆర్డీఏ పీడీ
చేయూత మహిళా మార్టుల ఏర్పాటుకు ఆయా మండలాల్లో అనుకూలమైన భవనాల కోసం అన్వేషిస్తున్నామని డీఆర్డీఏ పీడీ సుభాషిణి చెబుతున్నారు. నల్లజర్ల మండలంలోని సొసైటీ భవనం చూశామని, నెలకు రూ.15 వేలు అద్దె చెల్లించే ఒప్పందంపై ఈ భవనం పైఅంతస్తులో మహిళా మార్టును త్వరలో ఏర్పాటు చేయనున్నామని తెలిపారు. మిగతా మండలాల్లోనూ మార్టుల ఏర్పాటుకు ప్రయత్నాలు చేస్తున్నామన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అక్షరాలా రూ.కోటి.. అక్రమంలో పోటీ!
[ 17-05-2024]
అక్రమంలో పోటీపడ్డారు.. అక్షరాలా కోటి రూపాయల నిధులను హాంఫట్ చేశారు.. అడిగేవారు లేరన్న ధైర్యం, అడిగినా ఏమవుతుందిలే అన్న బరితెగింపు.. కారణాలు ఏవైనా అడ్డదారిలో కథ నడిపించారు. -
పిఠాపురంలో మద్యం ఇవ్వలేదు.. డబ్బు పంచలేదు: మాజీ ఎమ్మెల్యే వర్మ
[ 17-05-2024]
‘పిఠాపురం నియోజకవర్గంలో ఎన్నికలకు సంబంధించి కూటమి నేతలు ప్రజలకు మద్యం ఇవ్వలేదు. డబ్బు పంచలేదు. ఎన్నికల కమిషన్ మార్గదర్శకాల ప్రకారం రూ.45లక్షలు మాత్రమే ఖర్చు చేశాం. -
కదిలారు కడదాక నిలిచారు
[ 17-05-2024]
ఉమ్మడి జిల్లాలోని రెండు నగరాల్లో ఓటు చైతన్యంలో కాకినాడ ముందుంది. రాజమహేంద్రవరం నగరంలో 67.57 శాతం పోలైతే.. కాకినాడలో అత్యధికంగా 72.16 పోలయ్యింది. -
నడుం బిగిస్తారా.. నిద్ర నటిస్తారా!
[ 17-05-2024]
నదీ పరిరక్షణ, వాల్టా ప్రకారం నదుల్లో భారీ యంత్రాలతో ఇసుక తవ్వకాలు చేపట్టకూడదు. ఉపరితలానికి మీటరు లోతుకు మించి వెళ్లకూడదు. -
ఈనెల రేషన్ సరుకులు ఇంకా అందలే
[ 17-05-2024]
జిల్లాలోని అన్ని మండలాల్లో కలిపి మొత్తం 5,74,907 రేషన్ కార్డులున్నాయి. ప్రతి నెల 1 నుంచి 17వ తేదీ వరకు 364 ఎండీయూ వాహనాల ద్వారా కార్డుదారులకు రేషన్ సరకుల పంపిణీ జరుగుతుంది. -
క్రీడా శిబిరాలు ఇంకెప్పుడు?
[ 17-05-2024]
వేసవి శిక్షణ శిబిరాలు ప్రారంభం కాకపోవటంతో నగరంలోని క్రీడాకారుల్లో నిస్తేజం అలముకుంది. -
ఈదురుగాలులకు అరటి రైతు దిగాలు
[ 17-05-2024]
ఇటీవల కురిసిన వర్షాలు, ఈదురుగాలులకు అరటి రైతులు కుదేలయ్యారు. జిల్లాలో పెరవలి, ఉండ్రాజవరం, నిడదవోలు, కొవ్వూరు, చాగల్లు, తాళ్లపూడి మండలాల్లో అరటి ఎక్కువగా సాగు చేస్తారు. -
అయిదు దీవులు.. పర్యాటక సొబగులు
[ 17-05-2024]
యానాం తీర ప్రాంతానికి సహజ రక్షణ కవచంగా ఉన్న మడ అడవుల్ని సంప్రదాయ పర్యాటక అభివృద్ధి కేంద్రంగా మార్చాలని పుదుచ్చేరి ప్రభుత్వం యోచిస్తోంది. -
అవినీతికి నాయకుల అండ
[ 17-05-2024]
రైతు సంక్షేమమే ధ్యేయమన్నారు... వారికి రుణాల అందించే క్రమంలో ఎవరైనా అవినీతి, అక్రమాలకు పాల్పడితే చర్యలు తప్పవని హెచ్చరించారు. జిల్లా కేంద్ర సహకార బ్యాంకును(డీసీసీబీ) సంరక్షించేందుకు అన్ని చర్యలూ తీసుకుంటామంటూ ప్రకటనలు గుప్పించారు. -
ఎమ్మెల్సీ తోట, అనుచరులపై అట్రాసిటీ కేసు
[ 17-05-2024]
డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా కపిలేశ్వరపురం మండలం వల్లూరులో సార్వత్రిక ఎన్నికల సందర్భంగా చోటుచేసుకున్న ఘటనలకు సంబంధించి ఎమ్మెల్సీ, వైకాపా మండపేట నియోజకవర్గ అభ్యర్థి తోట త్రిమూర్తులు -
సచివాలయం ఎదుట స్తంభాలు పాతి నిరసన
[ 17-05-2024]
గ్రామ సచివాలయం ఎదుట సిమెంటు స్తంభాలతో ఫెన్సింగ్ వేసి స్థానికులు ఆందోళనకు దిగిన ఘటన ఇది. వివరాల్లోకి వెళితే.. -
ఖరీఫ్ ఎరువుల ప్రణాళిక ఖరారు..!
[ 17-05-2024]
డా.బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లావ్యాప్తంగా ప్రస్తుత రబీ సీజన్లో 1,69,397 ఎకరాల్లో వరి సాగు చేపట్టారు. రానున్న ఖరీఫ్ సీజన్లో సుమారు 1,68,780 ఎకరాల్లో వరి సాగు చేపట్టే అవకాశం ఉంటుందని వ్యవసాయశాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. -
రౌడీషీటర్లపై ప్రత్యేక నిఘా
[ 17-05-2024]
సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో జిల్లాలో ఉన్న రౌడీషీటర్లపై ప్రత్యేక నిఘా ఉంచినట్లు ఏలూరు రేంజ్ ఐజీ అశోక్కుమార్ తెలిపారు. -
రక్తపోటు.. ఆరోగ్యంపై వేటు
[ 17-05-2024]
ఉరుకుల పరుగుల జీవనశైలి కారణంగా చాలా మంది ఒత్తిడికి చిత్తవుతున్నారు. దీని కారణంగా ఆరోగ్యం గతి తప్పుతోంది. రక్తపోటు(బీపీ), మధుమేహం, ఇతర వ్యాధులబారిన పడుతున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
అతడు నన్ను కాలితో తన్నాడు.. కడుపుపై కొట్టాడు: దాడి ఘటనపై స్వాతి మాలీవాల్
-
ఆ రూమర్స్కు చెక్ పెట్టిన నిర్మాణ సంస్థ.. ‘SSMB29’పై క్లారిటీ
-
నష్టాల్లో దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు.. నిఫ్టీ @ 22,365
-
తెదేపాకు ఓటేశాడని.. కొడవలితో చెవి కోసేశాడు
-
ఊబకాయులకు మూత్రపిండాలకు ముప్పు ఎక్కువే
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9AM